పోస్ట్‌లు

ఆగస్టు 4, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

వెంటాడే జ్ఞాపకం..అల్లుకున్న పాటల పరిమళం..!

చిత్రం
ఎన్ని సార్లు విన్నా అదే గొంతు మళ్ళీ మళ్ళీ వెంటాడుతూ ...మనసును తరుముతోంది. మల్లెలా ..గులాబీలా..గూడు కట్టుకున్న గుండెలోకి కిషోర్ గాత్రం చేరుతోంది ..మెల్లగా తాకుతోంది. ఊహ తెలిసినప్పటి నుంచి అతడి పాటలు వింటూ సాగింది జీవితం. లైఫ్ బోర్ గా మారినప్పుడు..జేబు ఖాళీగా ఉన్నప్పుడు . రోడ్డు వెంట ఒక్కడినే నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆ మహోన్నత గాయకుడి మాధుర్యాన్ని తలుచుకుంటూ ..కిషోర్ దా  పాటలు వింటూ గడిపా. ఖాదర్ మొహియుద్దీన్ రాసిన ప్రత్యేక స్టోరీ చూసాక అతడిపై అభిమానం మరింత పెరిగింది . 1929 ఆగస్టు 4 న జన్మించిన కిషోర్ అసలు పేరు ..అభాస్ కుమార్ గంగూలీ. ఆయన గాయకుడే కాదు సంగీత దర్శకుడు.రచయిత . నటుడు . నిర్మాత . డైరెక్టర్ కూడా. ఏది పాడినా అది ఆకట్టుకునేలా .. వెంటాడేలా ..మనసుకు  జోల పాడేలా చేస్తుంది. పాటల రచయితగా కిషోర్ పేరు పొందారు. కిషోర్ కుమార్ లో లెక్కలేనన్ని కళలు ఉన్నాయి. నవ్వించడం ..నటించడం ఆయనకు మాత్రమే చెల్లింది. వందలాది పాటలు పాడారు.మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచి  పోయేలా జ్ఞాపకానికి వస్తూనే ఉన్నాయి . హిందీ లో పేరున్న గాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.  'ట్రాజెడీ కింగ్' గా కిష...

పల్లెలు పచ్చగుండాలె ..లేకుంటే చర్యలే..!

చిత్రం
నో కాంప్రమైస్ .. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. తెలంగాణలోని పల్లెలు పచ్చగా ఉండాలంతే. అన్ని గ్రామాలలో అరవై రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకారం అమలు చేయాల్సిందే..లేకపోతే కఠిన చర్యలు తప్పవు . ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదు. సంబంధిత అధికారులు , సర్పంచుల సంఘం ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.  ప్రతి ఒక్కరికి టార్గెట్ ఉంటుంది . దానిని రీచ్ కావాల్సిందే. అప్పుడే గ్రామాలు బాగు పడతాయి .స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మిగిలి పోయిన పన్నులతో పాటు అన్ని పన్నులను వసూలు చేయాల్సిన పూర్తి భాద్యత అంతా విలేజ్ సెక్రెటరీలదేనని స్పష్టం చేశారు .  పచ్చదనం, పరిశుభ్రత వెల్లి విరిసేలా యుద్ధ ప్రాతిపదికన అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ ప్రణాలికను తప్పక అమలు చేయాల్సిందేనని , లేకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు. ఇందు కోసం అధికారులతో పాటు .. ప్రజా ప్రతినిధులు సిద్ధంగా ఉండాలన్నారు . విద్యుత్ వారోత్సవాలు , హరిత హారం ప్రధానంగా ఉంటాయన్నారు . ఆయా గ్రామ పంచాయితీలలో ఎవరికి ఎలాంటి అధికారాలు, విధులు , భాద్యతలు ఉంటాయో ..ఏ విధంగా నిధులు గ్రామాలక...

కంపెనీలు ఇలా .. భాగ్యనగరం భళా..!

చిత్రం
మెరుగైన సౌకర్యాలు ..అద్భుతమైన అవకాశాలు ఉండడంతో భాగ్యనగరం వెలిగి పోతోంది . ఏ ముహూర్తాన కులీకుతుబ్ షా ఈ సుందర నగరాన్ని నిర్మించాడో ఇక అప్పటి నుంచి హైదరాబాద్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఐటీ , ఫార్మా , ఆటోమొబైల్ , లాజిస్టిక్ , తదితర రంగాలకు ఈ సిటీ కేరాఫ్ గా మారింది . ఎక్కడ చూసినా మాల్స్ , నగల దుకాణాలు దర్శనమిస్తున్నాయి. ఓ వైపు ఇండియా ఆర్ధిక మంద గమనంతో కొట్టుమిట్టాడుతుంటే మరో వైపు తెలంగాణ అన్ని రంగాలలో దూసుకు వెళుతోంది . ఇది మార్కెట్ వర్గాలను విస్తు పోయేలా చేస్తోంది. ఇది మంచి పరిణామం. ఇప్పటికే ఐటి పరంగా బెంగళూర్ టాప్ రేంజ్ లో వుంటే, ఇప్పుడు హైదరాబాద్ దాని సరసన వచ్చి చేరింది. వివిధ దేశాలకు చెందిన ప్రధాన కంపెనీలన్నీ ఈ నగరానికి క్యూ కడుతున్నాయి. ఇక మెజారిటీ కంపెనీలు మొదటి ప్రయారిటీ దీనికే టిక్ పెడుతున్నాయి  .తెలంగాణ సర్కార్ నూతన పారిశ్రామిక పాలసీని తీసుకు వచ్చింది . వ్యాపారులకు , పారిశ్రామికవేత్తలకు దరఖాస్తు చేసుకున్న వెంటనే అంటే ఏడు రోజుల్లో అనుమతి ఇస్తోంది. దీంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పాలసీ ఉండడంతో అంతా ఇటు వైపు మొగ్గుచూపుతున్నారు . మిగతా నగరాలకంటే ఇ...