పోస్ట్‌లు

డిసెంబర్ 14, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

అతడే మ్యాచ్ డిసైడర్

చిత్రం
వరుస వైఫల్యాలతో తీవ్ర నిరాశ పరుస్తున్న రిషబ్ పంత్ పై మాజీ క్రికెటర్ విక్రమ్ రాథోడ్ మాత్రం పూర్తి నమ్మకాన్ని ప్రకటించాడు. ఇంకో వైపు టీమిండియా సారధి కోహ్లీ మాత్రం పంత్ కు బాసటగా నిలిచాడు. అయినా రిషబ్ మాత్రం ఇంకా మైదానంలో ఆశించిన మేర రాణించడం లేదు. కాగా గత చివరి 15 ఇన్నింగ్స్‌ల్లో ఒక అర్ద సెంచరీ.. ఎనిమిది మ్యాచ్‌ల్లో సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌ మాత్రమే చేశాడు. ఇది టీమిండియా యువ సంచలనం రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌ పరిస్థితి. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల్లో వరుసగా 18, 33 నాటౌట్‌, 0 పరుగులతో తీవ్రంగా నిరాశ పరిచాడు. దీంతో పంత్‌పై అటు క్రికెట్‌ అభిమానులతో పాటు, క్రీడా పండితులు దుమ్మెత్తి పోస్తున్నారు. అంతే కాకుండా పంత్‌ను తప్పించి కేరళ క్రికెటర్‌ సంజూ శాంసన్‌ను తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ తరుణంలో రిషభ్‌ పంత్‌పై టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత కొద్ది నెలలుగా అతడి బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌ తీరును టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిశితంగా పరిశీలిస్తోంది. అతడిలో అపారమైన ప్రతిభ దాగుంది. అతడు టీమిండియాలో లేక ఏ జట్టులో ఉన్నా ఎక్స్‌ ఫ్యాక్టర్...

తప్పుడు నిర్ణయాలు..బలవుతున్న ఆటగాళ్లు

చిత్రం
ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న ఆటల్లో క్రికెట్ కూడా ఒకటి. బంతికీ బ్యాట్ కు మధ్య జరిగే పోరాటం నరాలు తెగిపోయేలా చేస్తుంది. టీ-20 , వన్డే మ్యాచుల్లో ఈ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. టార్గెట్ ను ఛేదించే క్రమంలో కొందరు విజేతలుగా నిలుస్తారు. మరికొందరు నిమిషాల్లో పాపులర్ అవుతారు. ఇదే సమయంలో జరిగే ప్రతి మ్యాచులో అంపైర్ డిసిషన్ కీలకంగా ఉంటుంది. దీంతో ఒక్కోసారి వీరు తీసుకునే నిర్ణయాలు క్రికెటర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గత కొంత కాలంగా క్రికెట్‌లో అంపైరింగ్‌ ప్రమాణాలు రోజురోజుకి దిగజారి పోతున్నాయి. పదే పదే తప్పుడు నిర్ణయాలతో అటు ఆటగాళ్లకు.. ఇటు అభిమానులకు విసుగు తెప్పిస్తున్నారు. తాజాగా రంజీ ట్రోఫీలో భాగంగా ముంబైతో మ్యాచ్‌ సందర్భంగా బరోడా ఆల్‌రౌండర్‌ యూసుఫ్‌ పఠాన్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. ముంబై నిర్దేశించిన 533 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా 169 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలుచుంది. ఈ క్రమంలో దీపక్‌ హుడాతో కలిసి పఠాన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ 48 ఓవర్‌లో ముంబై స్పిన్నర్‌ శశాంక్‌ వేసిన బంతిని పఠాన్‌ డిఫెన్స్‌ ఆడే ...

లారెన్స్ క్షణాల్లో వైరల్

చిత్రం
ప్రముఖ నటుడు, డైరెక్టర్, కొరియో గ్రాఫర్ లారెన్స్ వైరల్ గా మారారు. ఆయనపై కమల్ హాసన్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నటుడికి తమిళ తలైవా రజనీకాంత్ అంటే విపరీత అభిమానం. ఇదిలా ఉండగా చెన్నైలో రజని నటించిన దర్బార్ ఆడియో లంచ్ ప్రోగ్రాం జరిగింది. ఈ సందర్బంగా లారెన్స్ ప్రముఖ నటుడు కమల్ హాసన్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. దీంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నతనంలో కమల్‌ హాసన్‌ పోస్టర్లపై పేడ విసిరాను అని చెప్పడంతో కమల్‌ అభిమానులు రాఘవను దారుణంగా ట్రోల్‌ చేయడం మొదలు పెట్టారు. దీంతో రాఘవ ఈ విమర్శలకు ఫుల్‌స్టాప్‌ పెట్టడానికి ప్రయత్నించాడు. అందులో భాగంగా ఆయన కమల్‌ హాసన్‌ను కలిసి ఈ విషయంపై వివరణ ఇచ్చుకున్నాడు. అనంతరం వీరిద్దరూ ఆత్మీయంగా కలిసి దిగిన ఫొటోను రాఘవ ట్విటర్‌లో షేర్‌ చేశారు. రాఘవ లారెన్స్‌ మాట్లాడుతూ.. నన్ను ట్రోల్‌ చేసే ముందు పూర్తి వీడియో చూడాలని కోరారు. చిన్నతనంలో తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై ఉన్న ప్రేమతో ఇతర నటుడైన కమల్‌ హాసన్‌ పోస్టర్లపై పేడ విసిరానన్నారు. కానీ పెద్దయ్యాక రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ కలిసి నడుస్తుంటే సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. దయచేసి తన ...

టాప్ 100 లో మన విమెన్స్

చిత్రం
ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ రూపొందించిన ఈ ఏడాది అగ్రశ్రేణి వంద అత్యంత శక్తి వంతమైన మహిళల్లో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చోటు దక్కించుకున్నారు. అంతర్జాతీయంగా శక్తివంతమైన 100 మంది మహిళల 2019 జాబితాను ఫోర్బ్స్‌ తాజాగా విడుదల చేసింది. ఇందులో మన దేశ ఆర్థిక మంత్రి 34వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. గతంలో భారత రక్షణ రంగానికి సారథ్యం వహించిన ఆమె.. ప్రస్తుతం మొత్తం భారత ఆర్థిక వ్యవస్థకు పూర్తి స్థాయి బాధ్యతలు వహిస్తున్నారు. దేశ తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్ణయాత్మక పాత్ర పోసిస్తున్నారు. కార్పొరేట్‌ పన్నుల తగ్గింపు వంటి వ్యూహాత్మక నిర్ణయాలతో సత్తా చాటుతోన్న నిర్మలా సీతారామన్‌ ప్రతిభకు నిదర్శనంగా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు దక్కింది. ఇక మన దేశం నుంచి మరో ఇద్దరు మహిళలకు కూడా ఈ  జాబితాలో స్థానం దక్కింది. హెచ్‌సీఎల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఎగ్జిక్యూ టివ్‌ డైరెక్టర్, సీఈఓ రోష్ని నాడార్‌ మల్హోత్రా 54వ స్థానంలో నిలిచారు. బయోకాన్‌ చీఫ్‌  కిరణ్‌ మజుందార్‌ షా 65వ స్థానాన్ని దక్కించుకున్నారు. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బయోకాన్‌ చైర్మన్, ఎండీ కిరణ్‌ మజ...

ఫ్యూచర్ దే ఇండియా

చిత్రం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్ లో ఇండియా దూసుకెళుతోంది. కంపెనీలు అన్నీ ఇప్పుడు ఇండియా జపం చేస్తున్నాయి. అమెరికాలో దాదాపు 30 శాతానికి పైగా భారత ఐటీ నిపుణులు తమవంతు సేవలు అందజేస్తున్నారు. అంతే కాకుండా ఇండియన్స్ పెద్ద ఎత్తున ప్రతిభ పాటవాలతో టాప్ పొజిషన్స్ లలో బిగ్గెస్ట్ పోస్టు లలో కొనసాగుతున్నారు. మనోళ్లు ఏకంగా ముఖ్య కార్యనిర్వహణ అధికారులుగా, చైర్మన్లుగా, మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్నారు. దీంతో మన వాళ్ళ సత్తా ఏమిటో ఈపాటికే అర్థమై ఉంటుంది. చాలా కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి. దిగ్గజ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలకు మన దేశానికి చెందిన సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సిఇఓలుగా ఉన్నారు. వీరిద్దరూ నువ్వా నేనా అన్న రీతిలో పోటీపడి పని చేస్తున్నారు. తాజాగా మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ఇండియా గురించి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రానున్న దశాబ్ధంలో భారత్‌ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధించి ప్రజలను పేదరికం నుంచి బయట పడేస్తుందని బిల్‌ గేట్స్‌ అన్నారు. దేశం అనుసరిస్తున్న ఆధార్‌ వ్యవస్థ, ఆర్థిక సేవలు, ఫార్మా రంగాల్లో కనబరుస్తున్న సామర్ధ్య...

మోదీపై గాంధీ గరం గరం

చిత్రం
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దేశమంతటా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కమల దళం ఫైర్ అవుతోంది. ఈ జాతికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ ఊపందు కుంటోంది. ఇదిలా ఉండగా దేశంలో అత్యాచారాల గురించి తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కు తగ్గబోనని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. రాహుల్‌ ‘రేప్‌ ఇన్‌ ఇండియా’ అంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. ఈ విషయంపై మరింత రాద్ధాంతం పెరగడంతో రాహుల్ మరింత సీరియస్ అయ్యారు. నా పేరు రాహుల్‌ గాంధీ. నేను సావర్కర్‌ కాదు. నేను నిజమే మాట్లాడాను. చావనైనా చస్తాను కానీ క్షమాపణ మాత్రం చెప్పను అంటూ స్పష్టం చేశారు. ఈ దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్న అమిత్ షా, ఆర్ధిక వ్యవస్థను సర్వ నాశనం చేసిన ప్రధాని నరేంద్ర మోదీజీ ఈ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు రాహుల్ గాంధీ. ఈ సందర్బంగా మోదీని టార్గెట్ చేశారు. నిప్పులు చెరిగారు. తనకు తానుగా దేశభక్తుడిగా అభివర్ణించుకునే ప్రధాని.. ఒంటి చేత్తో ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ సైతం కొడుక్కి సపోర్ట్ గా నిలిచ...

దుమ్ము రేపిన కుర్రాళ్ళు

చిత్రం
నిన్నటి దాకా కుర్రాళ్లే అని తీసి పారేసిన వాళ్లంతా విస్తు పోయేలా ఉన్నట్టుండి భారీ వేతనాలతో ఆఫర్ లెటర్స్ తీసేసుకుంటున్నారు. ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ల్లో మన పిల్లల కోసం విదేశీ కంపెనీలు క్యూ కట్టాయి. ఉత్తర అమెరికా, యూరప్, సింగపూర్, జర్మనీ, జపాన్‌ వంటి దేశాలు ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల విద్యార్థులను నియమించుకునేందుకు పోటీ పడ్డాయి. ఐఐటీ ఖరగ్‌పూర్‌ విద్యార్థుల కోసం గత ఏడాది 26 విదేశీ కంపెనీలు బారులు తీరగా ఈ సీజన్‌లో ఏకంగా 51 విదేశీ కంపెనీలు నియామకాలు చేపట్టాయి. ఐఐటీ కాన్పూర్, ఐఐటీ బీహెచ్‌యూ, ఐఐటీ గువాహటిలలో ఒక్కో విద్యార్థికి సగటున ఐదు ఆఫర్లు లభించాయి. ఇదిలా ఉండగా ఐఐటీ హైదరాబాద్‌ ఉద్యోగ నియామకాల్లో కొన్ని ఐఐటీలను దాటి పోయింది. ఈ విద్యా సంవత్సరం బీటెక్‌ పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులను నియమించు కునేందుకు 38 అంతర్జాతీయ కంపెనీలు అడుగుపెట్టాయి. ఐఐటీ మద్రాస్‌లో 34 , ఐఐటీ కాన్పూర్‌ లో 22, ఐఐటీ వారణాసిలో 11, ఐఐటీ గువాహటి లో 25 మంది ఎంపిక కాగా అన్ని ఐఐటీల కంటే హైదరాబాద్‌ ఐఐటీ ఇంటర్ నేషనల్ కంపెనీలను ఆకర్షించడంలో టాప్ పొజిషన్ లో ఉంది. అయితే ఈ...

సిటిజన్షిప్ బిల్లుపై ధిక్కార స్వరం

చిత్రం
దేశమంతటా ఆందోళనలు కొనసాగుతున్నాయి. చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాన నగరాలు, పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. జామియా మిలియా విశ్వవిద్యాలయం రణరంగంగా మారింది. పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్‌ జిల్లాలో ఉన్న బెల్డాంగ రైల్వే స్టేషన్‌ కాంప్లెక్స్‌ను ఆందోళనకారులు తగల బెట్టారు. అస్సాంలోని డిబ్రూగఢ్‌లో, మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ల్లో కొద్దిసేపు కర్ఫ్యూ సడలించారు. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా కనిపిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పార్లమెంట్‌కు ర్యాలీగా వెళ్లాలనుకున్న జామియా మిలియా వర్సిటీ విద్యార్థులను పోలీసులు వర్సిటీ గేటు వద్దే అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల పైకి విద్యార్థులు రాళ్లు రువ్వడంతో, ప్రతిగా పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. టియర్‌ గ్యాస్‌ కూడా ప్రయోగించారని, రాళ్లు కూడా మొదట పోలీసులే రువ్వారని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థులే బారికేడ్లను ధ్వంసం చేసి తమపైకి దూసుకువచ్చారని పోలీసులు వివరణ ఇచ్చారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు  గాయాలయ్యారు. దాదాపు 50 మంది విద్యార్థులను అరెస్ట్‌ ...