పోస్ట్‌లు

జనవరి 18, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

లెండింగ్ సెక్టార్ లోకి రియల్ మి

చిత్రం
చైనా మొబైల్‌ దిగ్గజం షావోమికి షాకిచ్చేలా మరో చైనా మొబైల్‌  మేకర్‌ ఒప్పో రంగం సిద్ధం చేసింది.  భారత వినియోగదారులకు చిన్న చిన్న అప్పు లిచ్చేందుకు షావోమి తీసుకొచ్చిన ‘ఎంఐ క్రెడిట్‌‌‌‌’ మాదిరిగా ఆర్థిక సేవల ప్లాట్‌ఫాంను రియల్‌మి తాజాగా లాంచ్‌ చేసింది. రియల్‌ మి పేసా పేరుతో భారత మార్కెట్లో రుణాల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందుకోసం ఫిన్‌టెక్ స్టార్టప్ఫిన్‌షెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా దేశంలోని వినియోగదారులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు లావాదేవీలను సులభతరం చేయడంతోపాటు, తమ వృద్ధిని బలపేతం చేసుకోవాలనేది రియల్‌మి లక్ష్యం. కస్టమర్లకు ఆర్థిక సేవలను సులభతరం చేయడమే తమ లక్ష్యమని రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్‌ సేత్‌ ప్రకటించారు. టైర్-1, టైర్- 2 పట్టణాలను మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నామని  క్రమంగా ఇతర పట్టణాలకు విస‍్తరిస్తామన్నారు. రియల్‌మి పేసా వ్యక్తులు, సంస్థలకు అనేక రకాల ఆర్థిక సేవలను అందిస్తుంది. చిన్న వ్యాపారాలు భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగమనే విషయాన్ని గుర్తించిన తాము తొలిసారిగా ఇలాంటి సదుపాయాన్ని తీసుకొచ్చిన మొబైల్‌ సంస్థతామేనని రియల్‌మి వెల్లడించి...

ధోనీకి రిటైర్మెంట్ లేదు

చిత్రం
దేశం గర్వించే అద్భుతమైన ఆటగాళ్లలో ఝార్ఖండ్ కు చెందిన మహేంద్ర సింగ్ ధోని ఒకరు. ఇప్పటికే ఎన్నో అపురూపమైన విజయాలను భరత్ కు అందించిన ఈ ఆటగాడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇదిలా ఉండగా ఇటీవల ధోనీ ఇక తాను ఆడే క్రికెట్ కు గుడ్ బై చెప్పేస్తాడంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కోట్లాది క్రికెట్ అభిమానులు బిసిసిఐ మీద నిప్పులు కురిపిస్తున్నారు. చాలా కాలంగా భారత క్రికెట్‌లో ఎక్కువగా చర్చకు దారి తీసిన అంశం ఏదైనా ఉందంటే అది ఎంఎస్‌ ధోని రిటైర్మెంట్‌పైనే. మళ్లీ భారత క్రికెట్‌ జట్టు తరఫున ఆడతాడా..లేదా అనే విషయంపై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు వినిపిస్తుంటే ఇటీవల ధోనిని ఆటగాళ్ల కాంట్రాక్ట్‌ జాబితాను తొలగించారు.  2019 అక్టోబర్‌ నుంచి 2020 సెప్టెంబర్‌ వరకూ భారత క్రికెటర్ల కాంట్రాక్ట్‌ జాబితాను ప్రకటించిన బీసీసీఐ అందులో ధోనికి అవకాశం ఇవ్వలేదు. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ జరుగనున్న తరుణంలో ధోని పేరు కాంట్రాక్ట్‌ లిస్టులో లేక పోవడం విస్మయానికి గురి చేసింది. ధోని శకం ముగిసిందంటూ వార్తలు కూడా వచ్చాయి. దీనిపై ధోనికి సమాచారం ఇచ్చిన తర్వాత అతన్ని తొలగించినట్లు బీసీసీఐలోని సీనియర్‌ అధికారి ఒకర...

పింక్ స్లీప్పులు రెడీ

చిత్రం
నిన్నటి దాకా బీరాలు పలికిన కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి చేతులెత్తేయడంతో దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఆయా కంపెనీలు, స్టార్ట్ అప్ లు పొదుపు మంత్రం జపిస్తున్నాయి. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు నష్టాలను అదుపులో ఉంచుకునేందుకు గాను ఇప్పటి నుంచే కాస్ట్ కట్టింగ్ అమలు చేస్తున్నాయి. దీంతో భారీ ఎత్తున ఉద్యోగాలకు కొత్త పెడుతున్నాయి. ఇంకో వైపు ఎంతో ఆర్భాటంగా స్టార్ట్ చేసిన పలు స్టార్టప్‌ కంపెనీలు మూత పడుతుండగా, మరో వైపు కార్పొరేట్, ఐటీ కంపెనీలు మనుగడ కోసం ఉద్యోగుల సంఖ్యను కత్తిరిస్తున్నాయి. వాటిల్లో శ్యామ్‌సంగ్‌ ఇండియా లాంటి దిగ్గజ ఎలక్ట్రానిక్‌ కంపెనీల నుంచి పేటీఎం లాంటి డిజటల్‌ కంపెనీ, అనతి కాలంలోనే అనూహ్యంగా విస్తరించిన హోటల్‌ నెట్‌వర్కింగ్‌ కంపెనీ ‘ఓయో’ వరకు ఉన్నాయి. రిటేల్‌ దిగ్గజ సంస్థ వాల్‌మార్ట్‌ ఇండియా గురుగావ్‌లోని తన ప్రధాన కార్యాలయంలో 56 మంది టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లను వదులుకొంది. వారిలో ఎనిమిది మంది సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయిలో ఉండగా, మిగతా 48 మంది మధ్య, దిగువ మేనేజ్‌మెంట్‌ క్యాడర్‌కు చెందిన వారున్నారు. శ్యామ్‌సంగ్‌ ఇండియా 150 మంది ఉద్యోగులను ఇంటికి పంపించినట్టు సమా...

మెరిసిన భాగ్యనగరం

చిత్రం
సమున్నతమైన చారిత్రిక సంపదత్వంతో అలరారుతున్న భాగ్యనగరం మరోసారి తన చరిత్రను తానే అధిగమించింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ క్రియాశీల నగరాల జాబితాలో వరుసగా మూడో ఏడాది అగ్ర స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 130 నగరాలపై అధ్యయనం జరిపిన ప్రముఖ స్థిరాస్తి అధ్యయన సంస్థ ‘జేఎల్‌ఎల్‌’ ఈ మేరకు రూపొందించిన సిటీ మూమెంటమ్‌ ఇండెక్స్‌–2020ను విడుదల చేసింది.ప్రత్యేకించి ఈ సంవత్సరానికి గాను మోస్ట్‌ పవర్ ఫుల్ సిటీగా హైదరాబాద్‌ ప్రథమ  స్థానంలో నిలవడం పట్ల ఐటీ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ జాబితాలోని మొదటి 20 స్థానాల్లో మనదేశానికి చెందిన 7 నగరాలు చోటు సంపాదించాయి. వరుసగా 2, 5, 7, 12, 16, 20 స్థానాల్లో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, పూణె, కోల్‌కతా, ముంబై నగరాలు నిలిచాయి. హైదరాబాద్‌ నగరం వరుసగా మూడోసారి అగ్రస్థానంలో నిలవడం రాష్ట్రానికి గర్వకారణమని కేటీఆర్‌ పేర్కొన్నారు. 2014లో హైదరాబాద్‌ టాప్‌–20 నగరాల జాబితాలో సైతం చోటు సంపాదించలేక పోయిందన్నారు. 2015లో 28, 2016లో 5, 2017లో 3వ స్థానం సంపాదించిన హైదరాబాద్‌ 2018లో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. 2019లో బెంగ...