పోస్ట్‌లు

సెప్టెంబర్ 13, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

నల్లమల కోసం సినీ జనం

చిత్రం
ప్రకృతి రమణీయతకు ఆలవాలంగా నిలుస్తూ, వేలాది మంది అడవి బిడ్డలకు నీడనిస్తూ , అపారమైన వనరులు కలిగిన నల్లమలలో యురేనియం తవ్వకాలపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ఇప్పటికే చెంచు పెంటల్లో , గిరిజనులు, చెంచులు, ఇతర సమూహమంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా యురేనియం వ్యతిరేక కమిటీగా ఏర్పడ్డారు. అన్ని పార్టీలు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, ప్రజలతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డారు. ఇప్పటికే తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం, మహిళా నాయకురాలు భవాని రెడ్డిని నాగర్ కర్నూల్ లోనే అరెస్ట్ చేశారు. మరో వైపు ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి నల్లమలను సందర్శించి బాధితులకు భరోసా ఇచ్చారు. నల్లమల ఏపీ, తెలంగాణాలో విస్తరించి ఉన్నది. అపారమైన అటవీ ప్రాంతం, జీవరాసులు, టైగర్ ప్రాజెక్టు , ఔషదాలు, ఖనిజ నిక్షేపాలు నిక్షిప్తమై ఉన్నవి. ఇక్కడ యురేనియం త్రవ్వకాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా గతంలో  కడపలో ఏర్పాటు చేసిన యురేనియం త్రవ్వకాలు తమకు వద్దంటూ అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దీంతో సీఎం జగన్ ప్రత్యేక కమిటీని నియమించారు. మరో వైపు యురే...

ఉగ్రవాదం నిజం..జిహాదీలకు శిక్షణ వాస్తవం - ఒప్పుకున్న పాక్

చిత్రం
కుక్క తోక వంకర అన్నట్టు దాయాది పాకిస్తాన్ తన తీరును మార్చు కోవడం లేదు. జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో లేని రాద్ధాంతం సృష్టిస్తూ భారత దేశంపై లేని పోని ఆరోపణలు చేస్తూనే మరో వైపు తీవ్రవాదులకు, ఉగ్ర మూకలకు పరోక్షంగా మద్దతునిస్తూ కవ్వింపులకు దిగుతోంది. కయ్యానికి సై అంటోంది. అంతర్జాతీయ వేదికపై ఇప్పటికే తన వితండ వాదనను వినిపించింది. ఇదే సమయంలో అగ్ర రాజ్యాలు అమెరికా, రష్యాతో పాటు ప్రతి దేశమూ ఇండియా వైపు నిలిచాయి. ఒక్క చైనా దేశం మాత్రం పాకిస్తాన్ కు వంత పాడింది. దీంతో ఎంతో నమ్మకం పెట్టుకున్న పాకిస్తాన్ ఒంటరిగా వుండి పోయింది. పాలుపోని పరిస్థితుల్లో ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాత్రం తన నోటికి పని చెబుతూనే ఉన్నారు. అరబ్ దేశాల అధిపతులను కలిశారు. ఇతర దేశాల ప్రెసిడెంట్స్, ప్రధానులను ఇండియా మోసం చేసిందంటూ విన్నవించారు. అయినా ఏ ఒక్క కంట్రీ పాకిస్తాన్ కు మద్దతు పలక లేదు. అంతే కాకుండా జమ్మూ, కాశ్మీర్ ముమ్మాటికీ భారత దేశం లో అంతర్భాగమేనని స్పష్టం చేశాయి. యుద్దానికి తమ దేశం సిద్ధంగా ఉండాలని ఇమ్రాన్ పిలుపు ఇచ్చారు. ఇటీవల  పీఎం అమెరికా పర్యటించారు. కాశ్మీర్ విషయంలో జోక్యం చేసు కోవాలని కోరారు. దీనికి...

మోస్ట్ సక్సెస్ ఫుల్ సీఇఓలు వీరే..హ్యాట్స్ ఆఫ్ మనోజ్ జైన్..!

చిత్రం
భారత దేశం ఆర్ధిక సంక్షోభంలో కూరుకు పోయినా వివిధ రంగాలకు చెందిన కంపెనీలు సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. దీనికంతటికి కారణం ఆయా కంపెనీలకు సీఇవోలుగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ గా ఉండటమే. తాము కష్టపడుతూ తమతోటి ఉద్యోగులు, సిబ్బందిలో స్ఫూర్తి నింపుతూ విజయ పథంలో తీసుకు వెళుతున్నారు. అంతే కాకుండా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రయత్నం చేస్తున్నారు. తోటి వారితో కలిసి విస్తరిలో పాల్గొంటూ తాము కూడా మీలాంటి వారమని చెప్పకనే చెబుతున్నారు. అలాంటి సీఇఓ లలో షావో మీ స్మార్ట్ మొబైల్స్ కంపెనీ ఇండియా హెడ్ మనోజ్ కుమార్ జైన్ మొదటి వరుసలో నిలుస్తున్నారు. ఆయన ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్ గా మారారు. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా షావో మీ మొబైల్స్, యాక్ససరీస్ అందుబాటులో ఉండేలా చేశారు. మిగతా దిగ్గజ మొబైల్స్ కంపెనీలకు షాక్ ఇచ్చారు. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ లింక్డ్ ఇన్ మోస్ట్ పేవరబుల్ సీయిలను వెల్లడించింది. టెక్నాలజీ, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సస్, ఇంటర్ నెట్ , మార్కెటింగ్ రంగాలలో ఎనిమిది మందిని ఎంపిక చేసింది. వారిలో కస్టమర్ సపోర్ట్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ ఫ్రెష్ డెస్క్ సీఇఓ గిరీష్ మాతృభూతం, గూగుల్ సౌత...

సామాన్య జీవితం..అసాధారణ విజయం.!

చిత్రం
అమెరికా వెళ్లడం, డాలర్లు సంపాదించడం, ఐటీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిర పడడం ప్రతి ఒక్కరి కల. అందరి లాగా రవి కిరణ్ కోగంటి కూడా కల కన్నారు..దానిని నిజం చేశారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేశాడు ఏడేళ్ల పాటు పని చేసిన ఆయన తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశారు. ఇంకొకరు అయితే ఉన్న జాబ్ వదిలి వేసుకోడానికి ఇష్ట పడరు. ప్రతి ఒక్కరు భద్రమైన జీవితం కోరుకుంటారు. జేబు నిండా, బ్యాంక్ అక్కౌంట్ నిండా డబ్బులు ఉండేలా చూసు కుంటారు. కానీ కోగంటి డోంట్ కేర్ అన్నారు. అంతేనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తెలుగు వెలుగులు ప్రసరింప చేస్తున్నారు. అదే స్మార్ట్ తెలుగు. ఎలాంటి లాభా పేక్ష లేకుండా, ఒక్క పైసా తీసుకోకుండా ఏకంగా ట్రైనర్ గా, మెంటార్ గా సేవలు అందజేస్తున్నారు. తెలుగులో బ్లాగర్స్ ను రాసేలా ప్రోత్సహిస్తున్నారు. అంతే కాకుండా సాహిత్యం పట్ల మక్కువ కలిగిన కోగంటి ఇప్పుడు హైటెక్ సిటీలో తన లాంటి వారి కోసం ఓ గ్రూప్ ఏర్పాటు చేశాడు. ఐటి,  ఎంసీఏ వరకు చదివారు. స్మార్ట్ లి వెబ్ టెక్నాలజీ కంపెనీకి రవి కిరణ్ సీఇఓ గా వున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా, ఐటీ ఎక్స్ పర్ట్ గా ఉన్న కోగంటి హెచ్ సి ఎల్, టీ సి ఎస్, ప్రై ఎస్ ఇన్ఫో టెక్ ఐ...

చతికిల పడిన గృహ రంగం..ఆదుకునేనా ప్రభుత్వం

చిత్రం
డీమానిటరైజేషన్ దెబ్బకు భారత దేశంలోని అన్ని రంగాలు డీలా పడ్డాయి. నోట్ల రద్దు వ్యాపారుల పాలిట శాపంగా మారింది. దిగ్గజ కంపెనీలు ఆఫ్ లైన్ లో కాకుండా ఆన్ లైన్ లోకి ఎంటర్ అయ్యాయి. ఆయిల్, ఫ్యాషన్, జ్యుయలరీ , గోల్డ్, డైమండ్స్, ప్లాట్లు , ఫ్లాట్స్, కాంప్లెక్స్ లు , వాహనాలు, పొలాలు, గృహ రుణాలు, ఫుడ్ ఐటమ్స్, దుస్తులు, ఆభరణాలు, కార్ల బుకింగ్, టాయిస్ , ఫ్లైట్స్, ట్రైన్స్, బస్సులు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ఇంటి వద్ద నుంచే ఒకే ఒక్క క్లిక్ తో అన్నీ లభిస్తున్నాయి. దీంతో పాటు ఆయా కంపెనీలు భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్స్థ గాడి తప్పింది. విత్త మంత్రి ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. ఉద్దేపన చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఉన్న బ్యాంకులను మెర్జ్ చేసే పనిలో పడింది. దీని వల్ల ప్రజలకు మరిన్ని కస్టాలు ఎదురవుతాయే తప్పా ఒరిగేది ఏమీ ఉండదు. దేశంలో అతి పెద్ద బ్యాంక్ గా పేరున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రోజుకో కొత్త నిర్ణయంతో ఇందు కోసం ప్రత్యేకంగా హోసింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో సామాన్యులు సైతం గృహాలు కొనుగోలు చేసుకోవచ్చు. ఇదంతా చతికిలపడిన హోసింగ్ రంగానికి మరింత బలం చే...