మనీ వద్దు..మీ అభిమానం చాలు

బిగ్ బాస్ రియాల్టీ షోతో టాప్ రేంజ్ లోకి చేరుకున్న యాంకర్ శ్రీముఖి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. అవార్డు, మనీ నాకేమీ వద్దు. మీ ఆదరాభిమానాలు నాకు చాలు అని ఈ ముద్దుగుమ్మ తెలిపింది. అయితే నిజమైన విజేత మాత్రం బాబా భాస్కర్ అని కుండా బద్దలు కొట్టింది. అయితే విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అయినా.. ప్రేక్షకుల మనసు గెలిచింది మాత్రం బుల్లితెర రాములమ్మే నంటూ శ్రీముఖి అభిమానులు చెప్పుకొచ్చారు. బిగ్బాస్ పూర్తవగానే మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ తన ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసింది. ఈ క్రమంలో అభిమానులతో మొదటిసారి లైవ్లోకి వచ్చింది. ఈ సందర్భంగా బిగ్బాస్ షో గురించి పలు ఆసక్తికర అంశాలను పంచుకుంది. తనకు ఎంతగానో మద్దతు తెలిపిన ఝాన్సీ, రష్మీ, ముక్కు అవినాష్, ఆటో రాంప్రసాద్లకు కృతజ్ఞతలు తెలిపింది. నామినేషన్లోకి వచ్చినప్పుడు భయపడ లేదని, ఎందుకంటే తానే తప్పూ చేయలేదని, పైగా అభిమానులు సేవ్ చేస్తారన్న నమ్మకముండేదని చెప్పుకొచ్చింది. ట్రెడిషనల్గా, మోడ్రన్గా, మేకప్తో, మేకప్ లేకుండా అన్ని రకాలుగా చూశారు. నన్ను మీ ఇంట్లో అమ్మాయిగా ఆదరించారు. నువ్వే మాకు రియల్ విన్నర్ అని చాలా విషె...