మొబైల్ లవర్స్ కు భలే ఆఫర్స్
ఇండియన్ మార్కెట్ లో ఇప్పుడు మొబైల్స్ హవా నడుస్తోంది. లెక్కలేనన్ని ఆఫర్స్ తో పాటు కళ్ళు చెదిరేలా బహుమతులు ఇస్తుండడంతో స్మార్ట్ ఫోన్స్ యూసర్లు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. అటు ఆఫ్ లైన్ లో ఇటు ఆన్ లైన్ లో లెక్కకు మించి వాటిని తీసేసుకుంటున్నారు. ఇప్పటికే దిగ్గజ మొబైల్స్ కంపెనీలకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చాయి చైనాకు చెందిన షావోమి, లెనోవో, మోటరోలా, వివో కంపెనీలు. అమ్మకాల్లో ఐదో ప్లేస్ లో ఉన్న చైనా మొబైల్ కంపెనీ వివో తాజగా ఐదేళ్లు ముచ్చటగా పూర్తి చేసుకుంది.
ఈ సందర్బంగా వినియోగ దారులకు ఆఫర్లు ప్రకటించింది. క్యాష్బ్యాక్ డీల్స్, నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్లు, ఉచిత యాక్సెసరీలు వంటి మరెన్నో ఆఫర్లను ఇవ్వనున్నట్లు తెలిపింది. వివో వి, ఎస్, వై సిరీస్లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని తెలిపింది. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్కార్డులపై కొనుగోలు చేసే వారికి 10 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుందని, అలాగే, జీరో డౌన్ పేమెంట్తో నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉందని వెల్లడించింది.
బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ వినియోగదారులకు అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తున్నట్టు పేర్కొంది. ఈ ఆఫర్లతో పాటు బ్లూటూత్ ఇయర్ ప్లగ్స్, ఇయర్ ఫోన్స్, నెక్ బ్యాండ్స్ వంటివి ఉచితంగా అందించనున్నట్టు వివో తెలిపింది. ఎంపిక చేసిన డివైజ్లపై బై బ్యాక్ కూడా ఇవ్వనున్నట్టు పేర్కొంది. వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా వివో జడ్1 ఎక్స్ 4జీబీ ర్యామ్+128 జీబీ వేరియంట్ను లాంచ్ చేయనున్నట్టు వెల్లడించింది . ఫ్లిప్కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్ ద్వారా వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. ధర 15,990 రూపాయలు మాత్రమే.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి