పోస్ట్‌లు

సెప్టెంబర్ 16, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

భవిష్యత్తు ఆవసరం.. గతం కాదనలేం..స్పష్టం చేసిన ధర్మాసనం..!

చిత్రం
గత కొంత కాలంగా రాష్ట్ర  సర్కారుకు హైకోర్టు లో ప్రతిదీ చుక్కెదురవుతోంది. తాజాగా ఎర్రమంజిల్ ను కూల్చాలన్న ప్రతిపాదనను విరమించు కోవాలని ధర్మాసనం స్పష్టమైన తీర్పు చెప్పింది. రూల్స్ ను, ఆదేశాలను ఎంత మాత్రం ఖాతరు చేయడం లేదంటూ నిలదీసింది. భవిష్యత్తు ముఖ్యమే కాదనలేం, కానీ గతం కూడా అవసరమే ఎందుకంటె గతం అన్నది లేకపోతే ఫ్యూచర్ మరింత అంధకారమవుతుంది. నరుక్కుంటూ పోతే చెట్లు, కూల్చుకుంటూ పోతే కట్టడాలు మిగలవు. ఆనవాళ్లు మాత్రమే మిగిలి పోతాయి. ఇందు కోసం కాదు మిమ్మల్ని ఎన్నుకున్నది అంటూ మంది పడింది. ఎర్రమంజిల్​లోని భవనాలను కూల్చి కొత్త గా అసెంబ్లీని కట్టాలనుకున్న ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. కేబినెట్​ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టి వేస్తూ కీలక తీర్పు వెలువరించింది. కేబినెట్​ నిర్ణయం చట్ట పరిధిలో లేదని, ప్రత్యక్షంగా చేయలేని దాన్ని పరోక్షంగా చేసే ప్రయత్నం ఇందులో కనిపించిందని ఘాటుగా వ్యాఖ్యానించింది. అసెంబ్లీ కోసం హెరిటేజ్‌ భవనాల్ని కూల్చేస్తే ప్రజల చిరకాల చారిత్రక సంస్కృతులు భూస్థాపితం అవుతాయని పేర్కొంది. కీలకమైన రూల్స్​ను, ప్రొసీజర్​ను, హైకోర్టు ఆదేశాలను సర్కారు పట్టించు కోలేదు. అందు...

నమో నమామి ..మోదీ సునామి..ఒకే ఒక్కడు..దమ్మున్నోడు..!

చిత్రం
సమున్నత భారతావనిలో ఇప్పుడు వినిపిస్తున్న ఒకే ఒక్క పదం మోదీ. ఆసేతు హిమాచలం నుంచి కన్యాకుమారి దాకా మోదీ..మోదీ అంటూ కోట్లాది గొంతుకలు దద్దరిల్లేలా వినిపిస్తున్నాయి. ఈ 69 ఏళ్ళ సామాన్యుడు అసాధారణమైన రీతిలో 130 కోట్ల జనాభా కలిగిన, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవిని చేపట్టిన ఏకైక చాయ్ వాలా నరేంద్ర దామోదర దాస్ మోదీ ఒక్కరే. ఒకప్పుడు రైల్వే స్టేషన్ లో టీ అమ్మిన అతి సాధారణమైన వ్యక్తి అంచెలంచెలుగా ముఖ్యమంత్రిగా, దేశానికి నాయకత్వం వహించే పీఎం గా ఎదిగారు. ఇలాంటి అరుదైన సన్నివేశాలు ఒక్క ఇండియాలోనే చోటు చేసుకుంటాయి. ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా, విమర్శలు చెలరేగినా పట్టించు కోకుండా దేశానికి దిశా నిర్దేశనం చేస్తూ ఉక్కు సంకల్పంతో దాయాది దేశాలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఒకే ఒక్క డైనమిక్ లీడర్ మోదీనే. ఆయన ఒక్క సారి డిసైడ్ అయ్యాడంటే ఇక వార్ వన్ సైడ్ కావాల్సిందే. లేకపోతే అక్కడ సునామీ చోటు చేసుకుంటుంది. వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ , ప్రత్యర్థుల్లో భయాన్ని కలుగ చేస్తూ ప్రపంచం విస్తు పోయేలా దేశాధి నేతలతో కరచాలనం చేస్తూ, మేరా...

ధరాభారం ఇండియాకు కష్ట కాలం..!

చిత్రం
ఇప్పటికే భారత ఆర్ధిక వ్యవస్థ అష్ట వ్యస్తంగా తయారైన సమయంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఆయిల్ ధరలు అమాంతం పెరిగాయి. చమురు లేకుండా ఏపనీ జరగని పరిస్థితి నెలకొన్నది. తీవ్ర మంద గమనంతో కొట్టు మిట్టాడుతున్న ఇండియాకు ముడి చమురు రూపంలో మరో ముప్పు ముంచు కొచ్చింది. సౌదీలో చమురు బావులపై దాడులు జరుగుతూనే వున్నాయి.  దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావం మనపై ఎక్కువగా ఉంటోంది. దేశీయ ఇంధన అవసరాల్లో 80 శాతానికి పైగా చమురును మనం దిగుమతి చేసుకుంటున్నాం.ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఇంధన దిగుమతిదారుగా ఉన్నది. ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్న కరెంట్‌ ఖాతా లోటు ముడి చమురు ధరల పెరుగుదలతో మళ్లీ అదుపు తప్పే ప్రమాదం ఉంది. అలాగే ద్రవ్య లోటు టార్గెట్స్ పైనా ప్రభావం చూపనుంది. మొత్తంగా వృద్ధికి మరింత గండి పడే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా రేట్స్ పెరిగి పోయాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో చమురును కొనక తప్పని పరిస్థితి. దీని కారణంగా ఇంధన దిగుమతులపై భారం మరింత పెరగనుంది. బ్రెంట్‌ రకం ముడి చమురు పీపా ధర ఒక్కో డాలర్‌ పెరిగిన క...

గాత్ర మాధుర్యానికి అరుదైన గౌరవం..!

చిత్రం
సినీ జగత్తులో తన గాత్ర మాధుర్యాన్ని పంచుతూ తనకంటూ ఓ ఇమేజ్ స్వంతం చేసుకున్న గాయకురాలు కె.ఎస్.చిత్రకు అరుదైన పురస్కారం లభించింది. ప్రముఖ, దివంగత నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు పేరుతో ఏర్పాటు చేసిన స్వర్ణ కంకణం పురస్కారం ఈసారి చిత్రను వరించింది. దేశంలో పేరున్న గాయనీమణుల్లో ఆమె ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో కొన్నేళ్ల పాటు టాప్ పొజిషన్ లో ఉన్నారు. టి. సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్‌ ఆధ్వర్యంలో ‘రాగ సప్త స్వరం’ సంస్థ రవీంద్రభారతిలో నిర్వహించే కార్యక్రమంలో చిత్రకు అందజేయనున్నారు. ఇప్పటికే ఎన్నో భాషల్లో చిత్ర తన గాత్ర మాధుర్యంతో అలరించారు. 1963 జూలై 27 కేరళలోని తిరువనంతపురంలో చిత్ర జన్మించారు. ఇప్పుడు ఆమెకు 56 ఏళ్ళు. చిత్ర అసలు పేరు చిత్రా కృష్ణన్ నాయర్. చిత్రకు "దక్షిణ భారత నైటింగేల్" అనే పేరుంది. ఇప్పటి దాకా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ  బెంగాలీ భాషలలో వేలాది పాటలు పాడింది. మొదటి నుంచి సంగీత కారుల కుటుంబం కావడంతో ఆమెకు స్వతహాగా కర్ణాటక సంగీతంపై పట్టు కలిగి ఉన్నది. చిన్నతనంలో ఆమె ప్రతిభను తండ్రి  కృష్ణన్ నాయర్ గుర్తించి ప్రోత్సహించాడు. చిత్ర తొలి ...

హిందీని రుద్దితే యుద్ధమే..పెత్తనం చెలాయిస్తే అగ్ని గుండమే..?

చిత్రం
దేశంలో రెండవ సారి కేంద్రంలో కొలువు దీరిన భారత జాతీయ జనతా పార్టీ తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటుందోనన్న ఆరోపణలు ఎదుర్కుంటోంది. ఓ వైపు ఎన్నడూ లేనంతగా దేశ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దిగజారి పోయింది. ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషించే ప్రధాన రంగాలన్నీ కునారిల్లి పోయాయి. ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. నిరుద్యోగం పెరిగి పోయింది. స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో కాలయాపన చేస్తోంది. నోట్ల రద్దు దెబ్బకు ప్రభుత్వ రంగ బ్యాంకులు పూర్తిగా దివాళా తీసే స్థితికి దగ్గరగా వున్నాయి. ఇదే సమయంలో ఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే భాష పేరుతో ఉండాలని మోడీ, అమిత్ షా డిసైడ్ అయ్యారు. తాజాగా జమ్మూ, కాశ్మీర్ విషయంలో 370 ఆర్టికల్ ను రద్దు చేయడంతో బీజేపీ సర్కార్ గ్రాఫ్ ఒక్క సారిగా పెరిగి పోయింది. దేశమంతటా హిందీని తప్పనిసరిగా వాడాలని ఇటీవల కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ చంద్ర షా స్పష్టం చేశారు. దీంతో మాపై బలవంతంగా రుద్దితే ఒప్పుకునే ప్రసక్తి లేదు అంటూ ఆయా రాష్ట్రాలలో ఇప్పటికే మాటలు మంటలు రేపుతున్నాయి. కేవలం భాష పేరు మీద తమిళనాడు, ఆంద్ర రాష్ట్రాలు ఏర్పాటు అయ్యాయి. భారత రాజ్యాంగంలో ప్రజలు మాట్లాడే భాషలకు అత్యంత ...

కోడెల ఇక లేరు..శోక సంద్రంలో పల్నాడు

చిత్రం
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు కోడెల శివ ప్రసాద్ రావు ఆకస్మికంగా మృతి చెందారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన ఆయనపై వైసీపీ ప్రభుత్వం లేనిపోని కేసులు నమోదు చేయడంతో తీవ్ర వత్తిడికి లోనయ్యారు. దీంతో దివంగత ఎన్ఠీఆర్ పిలుపుతో టీడీపీలో కోడెల చేరారు. ముందు నుంచి పార్టీకి పెద్ద దిక్కుగా వున్నారు. పల్నాడులో పులిగా పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేశారు. రాష్ట్రం విడి పోయాక ఏపీకి సభాపతిగా పని చేశారు. ఉన్నతమైన పదవులు సమర్థవంతంగా పని చేసి పేరు తెచ్చుకున్నారు. వృత్తి రీత్యా ఆయన వైద్యుడిగా పని చేశారు. గుంటూరు జిల్లాలో గొప్ప వైద్యుడిగా మన్ననలు అందుకున్నారు. వ్యక్తిగా అత్యంత ధైర్యం కలిగిన కోడెల శివ ప్రసాద్ రావు బలవన్మరణానికి పాల్పడటంపై పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. వేలాది మంది కార్యకర్తలు, నాయకులకు భరోసా కల్పించిన ఆయన చివరకు ఇలా వెళ్లి పోవడం బాధాకరం. హోమ్ శాఖా మంత్రిగా, పంచాయతీరాజ్, నీటి పారుదల , ఆరోగ్య , పౌరసరఫరాల శాఖా మంత్రిగా పని చేశారు. కోడెల వ్యక్తిగతంగా తన ఇమేజ్ డామేజ్ కావడాన్ని జీర్ణించుకోలేక పోయారు. పలువురు సీనియర్ నేతలు ఇది రాజకీ...

ఐడియా అదుర్స్..లోన్స్ ఈజీ బాస్

చిత్రం
ఒకప్పుడు అప్పు కావాలన్నా, తీసుకోవాలంటే నానా ఇబ్బందులు. చెప్పలేనంత కష్టాలు. కానీ లోకం మారింది. టెక్నాలజీ రోజు రోజుకు అప్ డేట్ అవుతోంది. డబ్బులు లేకుండా ఇప్పుడు బతక లేని పరిస్థితి. డబ్బే లోకం లేకపోతే జీవితం పరమ బోర్. అన్ని దేశాలు, అధిపతులు పొద్దస్తమానం మనీ జపం చేస్తున్నారు. అర్జెంటు గా డబ్బులు అవసరం పడితే ఎవరినీ దేబరించాల్సిన పని లేదు. ఎంచక్కా మీ స్మార్ట్ ఫోన్ మీ చేతిలో వుంటే చాలు . అదే మీకు క్షణాల్లో మీ అకౌంట్ లోకి ఎన్ని డబ్బులైనా జమ చేసేస్తోంది. ఒకప్పుడు బ్యాంకుల మీదే ఆధార పడే వాళ్ళం. ఇప్పుడు ఆ బాధ తప్పింది జనాలకు. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ జనం చేతుల్లో ఫుల్ గా మనీ సర్క్యులేట్ అవుతోంది. ప్రతి ఒక్కరికి కోరుకున్న సమయంలో అప్పు కావాలంటే ఇచ్చే వాళ్ళుండాలి. దానికి దమ్ముండాలి లేదంటే దాతృత్వమైనా ఉండాలి. రుణాలు ఇచ్చే వారు ..అప్పులు కావాలనుకునే వారి మధ్య కనెక్టివిటీ ఉండేలా ఓ ప్లాట్ ఫార్మ్ ఉంటే ఎలా ఉంటుందో అనే ఆలోచనలో పుట్టిందే లెన్‌డెన్‌క్లబ్‌. ఇప్పటికే ఈ కంపెనీలో 10 వేల మంది దాతలు, 51 వేల మంది రుణం కావాల్సిన వాళ్ళు నమోదు చేసుకున్నారు. ఈ సంస్థకు డిమాండ్ పెరగడం, నియమ నిబంధనలకు లోబడి , సేవలు...