పోస్ట్‌లు

ఆగస్టు 19, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

మోడీ జోష్ .. ట్రంప్ ఖుష్..!

చిత్రం
పెద్దన్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు..చిన్నన్న ఇండియా పీఎం నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. దక్షిణాషియా ప్రాంతంలో శాంతి నెలకొల్పే విషయంలో భారతదేశం ఎల్లప్పుడూ ముందే ఉంటుందని మోడీ స్పష్టం చేశారు. యుఎస్ అధ్యక్షుడితో పీఎం ఫోన్ చేసి మాట్లాడారు. వీరిద్దరి మధ్య దాదాపు అరగంటకు పైగా సంభాషణ జరిగింది. ఈ ప్రాంతంలో ఇండియాకు వ్యతిరేకంగా, కొంత మంది నేతలు అవాకులు పేలడం గురించి తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై తమ వాక్ చాతుర్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారి వల్లనే, శాంతి ప్రక్రియకు విఘాతం కలుగుతోందని స్పష్టం చేశారు. సరిహద్దు రేఖల వెంట పేట్రేగిపోతున్న ఉగ్ర మూకలను తుద ముట్టించడంతో పాటు తీవ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలని పిలుపునిచ్చారు. పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ పై మోడీ పరోక్షంగా కామెంట్లు చేశారు. ఇద్దరి మధ్యన ద్వైపాక్షిక అంశాలతో పాటు సౌత్ ఏషియా వ్యవహారాలపై కూడా పలు అంశాలు చర్చకు వచ్చాయని భారత ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. వందేళ్ల స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఆఘానిస్థాన్ కు ,  పూర్తి ప్రజాస్వామ్య దేశంగా ఎదిగేందుకు ఇండియా తమ వంతు సహకారం అందిస్తుందని మోడీ పునరుద్ఘటి...

ముఖేష్ అభయం..జియోకు లాభం

చిత్రం
రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఏ ముహూర్తం లో జియో ను స్టార్ట్ చేశాడో ఇక అది అంతకంతకు పెరుగుతూ పోతోంది. భారతీయ టెలికం రంగాన్ని జియో షేక్ చేస్తోంది. ప్రభుత్వ అధీనంలో ఉన్న, అతిపెద్ద బ్యాండ్ విడ్త్ నెట్ వర్క్ కలిగిన భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ (బీఎస్ ఎన్ ఎల్ ) తో పాటు ఇతర ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు జియో దెబ్బకు అబ్బా అంటున్నాయి. దాని మార్కెట్ స్ట్రాటజీని తట్టుకోలేక పక్క చూపులు చూస్తున్నాయి. త్వరలో తక్కువ ధరకే డేటా, టీవీ, మూవీస్ కనెక్షన్ ఇస్తున్నట్టు ప్రకటించారు ముంబైలో ముకేశ్ అంబానీ. దీంతో ఒక్కసారిగా పడిపోయిన షేర్లు అమాంతం పెరిగాయి. తమ కంపెనీ పేరుమీదున్న అప్పులన్నీ వచ్చే ఏడాది లోపే తీర్చేస్తామని, ఇక వెనుతిరిగి చూసే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేశారు. ఇంకేం ఇండియన్ మార్కెట్ ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. టెలికం రంగంలో జియో సంచలనం రేపింది. దాని దూకుడుకు  అడ్డే లేకుండా పోయింది. ఒకే ఒక్క ప్రకటనతో గత జూన్ నెలలో 33 కోట్ల మందితో ఉన్నకస్టమర్లు ఏకంగా ఒక్క రోజులోనే మరో 82 లక్షల మంది జియో కనెక్షన్ కొత్తగా తీసుకున్నారు. ఇది ఓ రికార్డ్ . ఇదే సమయంలో ఇప్పటి దాకా టాప్ పొజిషన్ లో ఉ...

లేటు వయసులో ఘాటు ప్రేమ..మన్మధా ఎందుకిలా..?

చిత్రం
సభ్య సమాజం మెచ్చుకోలేదంటే అందులో ఏదో ఉన్నట్టే. అందుకే ఏముందో చూద్దామనే క్యూరియాసిటీ ఎక్కువగా కలుగుతుంది అప్పుడప్పుడు. అక్కినేని కుటుంబంలో హీరోలు ఎందరున్నా..నాగార్జున మాత్రం వెరీ డిఫరెంట్. నటుడిగా, ప్రయోక్తగా, బిజినెస్ మెన్ గా ఆయన సక్సెస్ అయ్యారు. ఏళ్ళు గడిచినా నాగ్ నటించిన మన్మధుడు ఇప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమలో టాప్. ఆ సినిమాకు డైలాగ్స్ ఎంత హిట్ అయ్యాయో సోనాలి, నాగ్, బ్రహ్మానందం , సునీల్ నటన మెప్పించింది. దేవి అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. దానికి కొనసాగింపుగా మన్మధుడు-2 సినిమా రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి తమిళ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. మహిళలు, పిల్లలకు నాగ్ అంటే కొంచం ప్రేమ. ఈ మధ్యన మా టీవీలో బిగ్ బాస్ ప్రోగ్రాం తో మరింత పాపులర్ అయ్యాడు . ఎక్కువఅంచనాలతో వెళ్లిన సగటు తెలుగు ప్రేక్షకులు మన్మధుడు -2 సినిమా చూసి అవాక్కయ్యారు. కానీ వెళ్లలేక ఉండి పోయారు. కాదనుకుంటూనే సినిమాను ఎంజాయ్ చేశారు. సెలెబ్రెటీగా ఉన్న నాగార్జున బోల్డ్ గా నటించేందుకు ఎందుకు ఒప్పుకున్నారో అర్థం కాలేదంటూ కామెంట్స్ వచ్చినా, సినిమాను మాత్రం రిచ్ గా ఉండేలా తీశాడు రాహుల్. పోర్చుగల్ అందాలు. నాగ్ ...

దివి కేగిన సంగీత శిఖరం..ఖయ్యం సాబ్ అల్విదా

చిత్రం
కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై ..అంటూ ఖయ్యం జహూర్ సాబ్ ఇక సెలవంటూ సంగీతపు అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తి వెళ్లి పోయారు. బాలీవుడ్ లో మరిచి పోలేని సంగీత దర్శకుడిగా నిలిచి పోయారు. ఎన్నో విజయవంతమైన సినిమాలకు ఆయన సంగీతాన్ని అందించారు. గుండెల్ని పిండేసే సాహిత్యాన్ని తన పాటల్లోకి ఒలికించిన ఖయ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. 92 ఏళ్ళ వయసున్న ఆయన గుండె పోటుతో మృతి చెందడంతో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ను కోల్పోయింది ఈ దేశం. 1972 లో ఖయ్యం సాబ్ సంగీత దర్శకత్వం వహించిన కభీ కభీ సినిమా సంగీత పరంగా దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. అభిమానులు లెక్కలేనంత మంది అతడు సృజియించిన పాటల జలపాతంలో ఓలలాడారు. ముఖేష్ , లతా మంగేష్కర్ ల గొంతులోని మాధుర్యాన్ని ఖయ్యం ఒడిసి పట్టుకున్నారు. జీవితాంతం గుర్తుంచుకునేలా పాటలకు ప్రాణం పోశాడు. కొన్నేళ్లయినా ఇప్పటికీ ఆయన అందించిన సినిమాల్లోని పాటలు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. 1979 లో వచ్చిన నూరి సినిమా బిగ్ హిట్. రేఖ నటించిన ఉమ్రావ్ జాన్ , రజియా సుల్తాన్ , బజార్ లాంటి సినిమాలు ఖయ్యం సాబ్ అందించిన సంగీతం కారణంగా సక్సెస్ అయ్యాయి. ఇది అతడి సంగీతానికి ఉన్న మహత్త...

పది కోట్ల ఆఫర్ ను కాదనుకున్న శిల్పా

చిత్రం
ఒక్కసారి సినిమా రంగంలో పేరొస్తే చాలు కోట్లాది రూపాయలు కొల్లగొడతారు. షాప్స్ ఓపెనింగ్స్, కార్పొరేట్ కంపెనీలకు ప్రచారంతో పాటు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండటం ఆనవాయితీగా వస్తోంది. అంతే కాకుండా యాడ్స్ లలో నటిస్తూ అందినంత మేరకు ఆదాయం గడిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటుంటున్నారు. ఒక్కో నటుడు, నటీమణుల వార్షిక ఆదాయం సినిమాలలో కాకుండా ఎక్కువగా ప్రకటనలతోనే  భారీగా వెనకేసుకుంటున్నారు. బాలీవుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ , తమిళ సినిమా రంగాలకు చెందిన వారిలో ఎక్కువ శాతం ఆయా కంపెనీల యాడ్స్ లలో నటిస్తున్నారు. ఈ సెలెబ్రెటీల వల్ల కంపెనీలకు పెద్ద ఎత్తున ప్రచారం లభిస్తోంది. కొందరు భామలు కండోమ్స్ లాంటి కంపెనీలకు కూడా పని చేయడంపై ఆ మధ్యన వ్యతిరేకత ఎదురైంది. అయినా నటించడం మాను కోవడం లేదు. ఇది తమ వ్యక్తిగత విషయమంటూ దాట వేస్తున్నారు. ఒక్కో నటికి కనీసం ఎంత లేదన్నా కోటి రూపాయలకు పైగానే ముట్టచెబుతున్నట్లు సినీ వర్గాల అంచనా. సినిమాల్లో రొమాన్స్ ను పండించే వీరు యాడ్స్ లలో కూడా రెచ్చి పోతున్నారు. యూత్ వీరిని చూసి కొనేందుకు సై అంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 కోట్లు వస్తాయని అనుకుంటే ఎవరైనా యెగ...

మారని పాకిస్తాన్..మండిపడ్డ ఆఫ్ఘాన్..శివమెత్తిన శివసేన

చిత్రం
ఇండియాపై అవాకులు చెవాకులు పేలుతూ వస్తున్న పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మరోసారి రెచ్చి పోయారు ఎలాంటి అవగాహన లేకుండానే నిరాధార విమర్శలకు దిగారు. కశ్మీర్ విషయంలో నోరు జారారు. అంతర్జాతీయ వేదికలపై దాని గురించి ప్రస్తావించి, సమస్యను మరింత జఠిలం చేయాలని అనుకుని అభాసు పాలయ్యారు. ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఇదే అంశాన్ని లేవనెత్తేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ ఒక్క చైనా తప్పా ఏ దేశం పాకిస్థాన్ కు మద్దతు తెలపలేదు. ఈ సందర్బంగా భారత శాశ్వత ప్రతినిది సయ్యద్ అక్బరుద్దీన్ ఘాటుగా సమాధానం చెప్పారు. ఏ దేశానికి తమ దేశంలో కల్పించుకునే హక్కు లేదని స్పష్టం చేసారు. కశ్మీర్ తమ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పారు. దీంతో తనకు వంత పాడుతూ వస్తున్న అమెరికా తాను ఏమీ చేయలేనని చేతులెత్తేసింది. ముందు మీ దేశంలో ఉన్న ఉగ్రవాద మూకల్ని వెళ్లగొట్టమని హెచ్చరించింది. అంతే కాకుండా ఆర్ధిక సాయంపై కోత విధించింది. ఇక రష్యా కశ్మీర్ విషయం ఇండియాకు చెందినదని పుతిన్ తెలిపారు. ఏ కంట్రీ పాక్ కు మద్దతు ఇవ్వక పోగా కశ్మీర్ భారత్ దేనని , తమకు సంబంధం లేదన్నారు. దీంతో కక్కలేక మింగ లేక ఇమ్రాన్ ఖాన్ కారాలు మిరియాలు...

చిన్న వయసు..పెద్ద మనసు ..చిన్నారికి దేశం సలాం..!

చిత్రం
పక్కనే వున్నా, ఆకలి కేకలతో అలమటిస్తున్నా పట్టించుకోని ప్రబుద్దులున్న ఈ దేశంలో పట్టుమని 12 ఏళ్ళు నిండని పోరడు పెద్దలు చేయని పనిని చేశాడు. సాటి మనుషుల్ని కాపాడాలంటే, కష్టాల్లో ఉన్న బాధితులను ఆదు కోవాలంటే వయసు అక్కర లేదని, గుండె నిండా ప్రేమ ఉంటే చాలని నిరూపించాడు. చుట్టూ వరద ముంచెత్తుతున్నా ప్రాణాలను పణంగా పెట్టాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారిని రక్షించాడు. ఇదేదో సినిమా కాదు...వాస్తవం. కళ్ళ ముందు జరిగిన నిజం. ఈ అరుదైన..స్ఫూర్తి దాయకమైన కథ తెలుసు కోవాలంటే, అతడి గురించి చదవాల్సిందే . కర్ణాటక రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే వున్నాయి. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. పంటలు నీటి పాలయ్యాయి. చాలా గ్రామాలలోకి నీళ్లు వచ్చి చేరాయి. రాయచూరు జిల్లా హిరేరాయనకుంపి గ్రామానికి కూడా వరద వచ్చింది. ఇదే సమయంలో ఆరు మంది బాధితులతో ఉన్న అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. కానీ వెళ్లలేని పరిస్థితి. ఆస్పత్రికి తీసుకు వెళ్లాలంటే ఊరు దాటాలి. భారీ వర్షం, కదలలేకుండా వరద ఉధృతి. ఈ సమయంలో వెళ్లేందుకు అంబులెన్స్ డ్రైవర్ భయపడ్డాడు. ఆలశ్యం చేస్తే ప్రాణాలు గాల్లో కలిసి పోతాయి. ఇదే...