పోస్ట్‌లు

ఆగస్టు 24, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆశలు ఫలించేనా..సింధు సాధించేనా..?

చిత్రం
పూసర్ల వెంకట సింధు మరోసారి వార్తల్లో నిలిచారు. అంతర్జాతీయంగా బ్యాడ్మింటన్ లో మరో మెయిలు రాయి చేరుకునేందుకు ఆమె కొద్ది దూరంలో నిలిచి ఉన్నారు. వరల్డ్ ఛాంపియన్ షిప్ లో తనను ఎంతో కాలం నుంచి ఊరిస్తూ వస్తున్న బంగారు పతాకాన్ని అందుకునే అరుదైన అవకాశం ఆమెను వరించింది. గత రెండు సెషన్లలో సిల్వర్ తో సరి పెట్టుకుంది సింధు. తాను కన్న కలల్ని నిజం చేసుకునే ఛాన్స్ ఇప్పుడు దొరికింది. పసిడిని దక్కించుకునేందుకు మరోసారి రెడీ అయ్యింది. మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ లో మూడో స్థానంలో ఉన్న చైనాకు చెందిన క్రీడాకారిణి చెన్ యుఫెను సింధు ఓడించింది. ఫైనల్ పోరుకు రెడీ అయ్యింది. ఆమె ఆట తీరుతో అభిమానులను అలరించింది. కేవలం 40 నిమిషాల లోపే సింధు ఆట కట్టించింది. అంతిమ పోరులో నోజామి తో తలపడనుంది. ఇదిలా ఉండగా ఆమె వరుసగా మూడో సారి ఫైనల్లోకి దూసుకు వెళ్ళింది. మరో వైపు ప్రణీత్ ఓడి పోవడంతో కాంస్యం మాత్రమే దక్కింది. కొంత కాలంగా తనతో పాటు టాప్ షట్టర్లకు కొరకొర రాని కొయ్యగా మారిన వరల్డ్ ప్లేయర్ థై జూయింగ్ ను క్వార్ట్రర్స్ లోనే ఓడించింది సింధు. ఈ టోర్నీలో మొదటి నుంచి అద్భుతమైన రీతిలో ప్రతిభ కనబర్చింది. ఇప్పుడు సింధుకు 24 ఏళ్ళు. ...

!..వరికుప్పల..గలగల..!

చిత్రం
మనుషులన్నాక కలలు ఉంటాయి..కన్నీళ్లు పలకరిస్తాయి. మానవ జీవితమే అంత. ఆవేదనలు ..ఆలోచనలు ..పలకరింపులు..చూపులు ..గుండెల్ని కదిలించే మాటలు ..మైమరిచి పోయేలా పాటలు..ఇవ్వన్నీ ఉండటం మామూలే. వీటిని దాటి వెళ్లిన వాళ్ళు పిచ్చోల్లైనా కావాలి లేదా యోగులైనా అయి ఉండాలి. జీవితంలో గొప్ప అనుభవం ఏదన్నా ఉందంటే అది సినిమా ఒక్కటే. అందుకే దాని కోసం ఇంతలా వెంపర్లాడుతాం. కుప్పలు తెప్పలుగా మాట్లాడుకుంటాం. కానీ పాటలు అలా కాదు. పదాల కలబోత. గుండెల్లో గుబులు రేపుతూ..మౌనాన్ని ఆశ్రయించే హృదయాలను కదిలేచేలా చేయటం ఒక్క పాటకు మాత్రమే ఉన్నది. అందుకే చాలా మంది కవులుగా రాణిస్తున్నారు. గొప్పగా రాస్తున్నారు. కానీ సినిమాల్లో సక్సెస్ కాలేక పోతున్నారు. ఎందుకంటే కవిత్వం రాసినంత ఈజీ కాదు సాంగ్స్ రాయడం అంటే. సిట్యుయేషన్ కు తగ్గట్టు పాటలు రాయడం కత్తి మీద సాము చేయడం లాంటిది. అందుకే గేయ రచయితలకు భారీ డిమాండ్ ఉంటోంది. అప్పట్లో టాలీవుడ్ లో ఓ పాట జనాన్ని మెస్మరైజ్ చేసింది. అదే తెలంగాణకు చెందిన వరికుప్పల రాసిన అందమైన కుందనాల బొమ్మరా అనే పాట. కళాకారుడిగా పేరు తెచ్చుకున్న ఇతగాడు ఇప్పటి దాకా 200 కు పైగా పాటలు రాశాడు. కొన్నేళ్ల పాటు ...

టాలీవుడ్.లో..తెలంగాణ డైరెక్టర్ల హవా..!

చిత్రం
తెలుగు సినిమా అనే సరికల్లా టక్కున గుర్తుకు వచ్చేది హీరో, హీరోయిన్లు. ఒకప్పుడు వీరి గురించే చర్చ అంతా జరిగేది. వీరికే ప్రయారిటీ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. సినిమా అన్నది విజయవంతం కావాలంటే దమ్మున్న డైరెక్టర్ కావాలి. . అంతకంటే ఎక్కువగా ప్రేక్షకులకు కావాల్సిన, మాస్ మాసాలతో పాటు పవర్ ఫుల్ మాటలు ఉండాలి. అందుకే ఇప్పుడు డైరెక్టర్లు రియల్ హీరోలుగా మారి పోయారు. ఒక్కో దర్శకుడి రేంజ్ హీరోకు మించి పోయిందంటే నమ్మగలమా. ఒకప్పుడు ఇతర సినిమా డైరెక్టర్ల డామినేషన్ ఎక్కువగా ఉండేది .ఇప్పుడు సీన్ పూర్తిగా మారి పోయింది. ప్రస్తుతం తెలుగు సినిమా రంగాన్ని మనోళ్లే ఏలుతున్నారు. డైరెక్టర్ల పరంగా చూస్తే ఒకే ఒక్క అర్జున్ రెడ్డి సినిమాతో టాప్ పొజిషన్ లోకి దూసుకు వెళ్ళాడు వంగా సందీప్ రెడ్డి. మహేష్ బాబు తో సినిమా చేస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఎందుకనో అది మధ్యలోనే ఆగి పోయింది. ఇదే సందీప్ రెడ్డి షాహిద్ కపూర్ తో హిందీలో తీశాడు. అది బ్లాక్ బ్లస్టర్ గా రికార్డ్ బ్రేక్ చేసింది.మొత్తంలో ఓ 10 మందిని చూస్తే అందులో మనోళ్లే ముందు వరుసలో ఉన్నారు. వారిలో తరుణ్ భాస్కర్ కూడా బాగా పేరు సంపా...

!సినిమా జూదంలో కొందరే హీరోలు .!

చిత్రం
                           బతుకును, ఈ ప్రపంచాన్ని ఆవిష్కరించే పనిముట్లలో ఒకే ఒక్క సాధనం కెమేరా. ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటూ వెంటాడేది మాత్రం ఛాయా చిత్రం. అంతకంటే దృశ్యం కూడా. ఎవ్వరూ ఊహించని అద్భుతం సినిమా. అది చేసే మాయాజాలం ఇంకేదీ చెయ్యదు. అందుకే దాని కోసం వెంపర్లాడేది. పస్తులు ఉండేది. కోట్లాది మంది ఇప్పటికీ దానితో కనెక్ట్ అయి ఉన్నారు. దానిని చూడకుండా, దానితో అనుసంధానమై లేకుండా ఉండలేక పోతున్నారు. వేలాది మందికి సినిమా ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో బతుకునిస్తోంది. క్రియేటివిటీ కలిగిన వాళ్ళు లెక్కించ లేనంత మంది ఉన్నారు. ఒక్కొరొక్కరు ఒక్కో సునామి. అందుకే ఇన్ని విజయవంతమైన మూవీస్ మన ముందుకు వస్తున్నాయి. తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. అది తన దారిని మరింతగా విస్తృతం చేసుకుంటోంది.  సినిమా అంటేనే ఓ జూదం లాంటిది. దానిహో ఒక్కసారి కమ్మిత్ అయ్యామా ఇక అంతే సంగతి. తినబుద్ది కాదు. ఒకటే కల దానితోనే బతుకు. ప్రతి సినిమాకు మాటలే కాదు అంతకంటే ఎక్కువగా పాటలు , నేపధ్య సంగీతం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి లేకుండా మూవీస్ స...

ఆధిపత్యం కోసం ఆరాటం..తారా స్థాయికి చేరిన యుద్ధం..!

చిత్రం
ప్రపంచంలో నువ్వా నేనా అన్న రీతిలో ఆధిపత్యం కోసం  అగ్ర రాజ్యాలు అమెరికా ..చైనా లు ఢీ  అంటే ఢీ  అంటున్నాయి. దీంతో వరల్డ్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థలుగా వీటికి పేరున్నది. ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతోంది. నిన్నటి దాకా అంతర్గతంగా ఉన్న ఈ యుద్ధం ఇప్పుడు పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనే స్థాయికి చేరుకుంది. అమెరికా చైనా వస్తువులపై అదనపు సుంకాలు విధించింది. ప్రతిగా డ్రాగన్ చైనా యుఎస్ కు చెందిన 75 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై  సుంకాలు పెంచింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ..సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనాలో ఉన్న తమ దేశానికి చెందిన అన్ని కంపెనీలన్నీ తిరిగి రావాలని ఆదేశించారు. ఈ ఒక్క డెషిషన్ తో ట్రేడ్ వార్ మరింత ఉగ్ర రూపం దాల్చింది. చైనా తాజాగా విధించిన సుంకాలపై స్పందిస్తానంటూ ట్విట్టర్లో తెలిపారు. మాకు చైనా అక్కర్లేదు. మాకు వాళ్ళతో సంబంధం లేకుంటేనే మంచిది. అమెరికా నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కొల్లగొడుతున్నాయిని ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కంట్రీకి చెందిన కంపెనీలన్నీ వెంటనే వదిలి రావాలి. ప్రత్యామ్నాయ మార్గ...

సీతమ్మ వరం .. మార్కెట్ కు ఊతం..!

చిత్రం
మందగమనం లో చిక్కుకున్న భారతీయ మార్కెట్ రంగానికి మరింత ఊతం ఇచ్చేలా విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. అధిక సంపన్న వర్గాలకు మేలు చేకూర్చేలా సర్ చార్జీ ఇక ఉండబోదంటూ వెల్లడించారు. వాహన రంగం కుదేలైంది. ఎక్కువగా అమ్ముడు పోవడం లేదు. ప్రభుత్వం ఎడాపెడా పన్నుల మోత మోగిస్తుంటే ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో తయారీదారులు, కంపెనీలు కొనుగోలుదారులపై అధిక భారం వేస్తున్నాయి. దీంతో కొనుగోళ్లు ఆశించినంతగా జరగలేదు. బ్యాంకులు, ఎంబిఎఫ్సీలకు మద్దతు ప్రకటించారు. సాటర్ట్ అప్ లకు పన్నులు లేకుండా చేస్తున్నట్లు తెలిపారు. రేపో రేట్ కే ఇల్లు, వాహన వడ్డీ ధరలను అనుసంధానం చేయనున్నట్లు నిర్మల ప్రకటించారు. కేవలం రెండు నెలల లోపే ఎంఎస్ ఎంఈ లకు జీఎస్టీ తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపారు. మొత్తం మీద గాడి తప్పిన ఆర్ధిక రంగానికి ఊతం ఇచ్చేలా నిర్ణయాలు తీసుకున్నారు మంత్రి. దేశీయ పరంగా అన్ని వర్గాల వారికి మేలు జరిగేలా చూసారు. విదేశీ పోర్ట్ ఫోలియో మదుపర్ల పై విధించిన అధిక పన్నులను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆర్ధిక మంత్రి తీసుకున్న ఈ కీలక నిర్ణయాలపై కార్పొరేట్ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. బడ్జెట్ ప...

దేనికైనా సిద్ధమంటున్న సీఎండీ

చిత్రం
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు , రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని , ఇందులో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, ఎలాంటి ఆరోపణలపైనా సీబీఐ లేదా సుప్రీం కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ తో విచారణకైనా సిద్ధంగా ఉన్నామని ట్రాన్స్ కో, జెన్ కో విదుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. ఎవరైనా ఎలాంటి ఎంక్వయిరీ చేయించు కోవచ్చని చెప్పారు. ప్రజలు, ప్రభుత్వం తమపై పూర్తి నమ్మకాన్ని , విశ్వాసాన్ని ఉంచిందని ..దానిని ఎలా పోగొట్టుకుంటామని అన్నారు. దక్షిణ , ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు రఘుమా రెడ్డి , ఏ. గోపాల రావ్ , ట్రాన్స్ కో జీఎం డి శ్రీనివాస రావ్ తో కలిసి హైదరాబాద్ లోని విద్యుత్ సౌధ లో మాట్లాడారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ రెండు రోజుల కిందట విద్యుత్ కొనుగోళ్ల పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని , నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. దీంతో విద్యుత్ సంస్థ బాధ్యులు లక్ష్మణ్ చేసిన విమర్శల్లో పస లేదని, అన్నీ సక్రమంగానే ఉన్నాయని, దేనికైనా నిరూపించేందుకు రెడీగా ఉన్నామని సవాల్ విసిరారు. తాము రేయింబవళ్లు కష్టపడుతూ కరెంట్ సరఫరా చేస్తున్నామని ...

సెలవంటూ వెళ్లి పోయిన జైట్లీ

చిత్రం
భారతీయ జనతా పార్టీ మరో నిబద్దత కలిగిన , అపార అనుభవం కలిగిన నాయకుడిని కోల్పోయింది. ఓ రకంగా పార్టీకి తీరని నష్టం. మోడీకి అండగా ఉంటూ వచ్చిన అరుణ్ జైట్లీ తరలి రాని లోకానికి వెళ్లి పోయారు. గత కొంత కాలంగా మూత్ర పిండాలు, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. 2014 నుంచి జైట్లీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మోడీ మంత్రివర్గంలో కీలకమైన ఆర్ధిక , కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 2017 లో రక్షణ మంత్రిగా ఉన్న పారికర్ గోవా సీఎం గా వెళ్లడంతో ఆ శాఖ బాధ్యతలు చూశారు. 2016 లో సమాచార ప్రసార శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. తాజగా దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించినా , ఆరోగ్య పరిస్థితి కారణంగా కేంద్ర మంత్రివర్గంలో చేరలేదు. ఆరోగ్య రీత్యా అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఎంపీగా ఉంటూనే ఇంటికే పరిమితమై పోయారు. ఢిల్లీలో చదువుకున్నారు. యూనివర్సిటీ విద్యార్ధి సంఘానికి  అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రం పట్టా అందుకున్నారు. ఏబీవీపీ లో ఉంటూ కీలక నేతగా ఎదిగారు. ఉద్యమకారుగిగా పని చేశారు. లా చ...