పోస్ట్‌లు

నవంబర్ 4, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

సేవకు ప్రతిరూపం..అడ్వొకేట్ ఔదార్యం

చిత్రం
అందరూ వెళ్లిన దారుల్లో వెళితే మజా ఏముంటుంది. భిన్నంగా వెళితేనే సక్సెస్ దక్కుతుంది. సమాజంలో మైనార్టీలు అంటేనే చులకన భావన. తెలంగాణాలో ఏ చిన్న సంఘటన జరిగినా ముందుగా హైదరాబాద్ వైపు చూస్తారు. అంతలా అతలాకుతలమై పోయిన సమయంలో, ఉన్నతమైన చదువులు చదువుకుని సమాజంలో గ్రేట్ పొజిషన్ లో  కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారిలో ఒకరు ఎం.ఏ.ముజీబ్ సాహబ్. రాష్ట్ర అత్యున్నతమైన హైకోర్టులో అడ్వొకేట్ గా అనతి కాలంలోనే పేరు తెచ్చుకున్నాడు. స్వస్థలం నల్లగొండ జిల్లా. తండ్రి వృత్తి రీత్యా బదిలీ కావడంతో ఉమ్మడి పాలమూరు జిలాల్లో ఎక్కువ కాలం గడిపారు. అక్కడ చదువుకుని, నిజాం కాలేజీలో ఉన్నత విద్య అభ్యసించాడు.   విద్యార్ధి దశ నుంచే ప్రగతిశీల భావాలు కలిగి ఉన్నారు. ప్రతి నిత్యం సమస్యలపై నిలదీయడం, ఎక్కడ అన్యాయం జరిగినా వారి తరపున మాట్లాడటం, ప్రశ్నించడం చేస్తూ వచ్చారు. తాను ఎదుగుతూ పది మందికి ఉపాధి కల్పిస్తూ, చేతనైనంత సహాయం చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. మనుషులే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని నమ్మే ఈ లాయర్ కు రాష్ట్ర, దేశ, అంతర్జాతీయంగా మంచి పట్టుంది. అటు తెలుగు, ఇంల్జిష్, ఉర్దూ, హిందీ భాషల్లో మంచి ప్రావీణ్యం ...

దుమ్ము రేపారు..రఫ్ఫాడించారు

చిత్రం
ఇండియన్ విమెన్స్ క్రికెట్ జట్టు కోలుకుంది. విండీస్ విమెన్స్ జట్టుపై అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో తొలి వన్డేలో భారత మహిళల జట్టు ఓడి పోయింది. తిరిగి రెండో వన్డే మ్యాచ్ లో ప్రతీకారం తీర్చుకుంది. భారత్‌ మహిళల జట్టు 53 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. పూనమ్‌ రౌత్‌ 128 బంతుల్లో 77 పరుగులు చేయగా, కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ 67 బంతుల్లో 40, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ 52 బంతుల్లో 46 పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్‌ మహిళల జట్టు 47.2 ఓవర్లలో 138 పరుగులకే కుప్ప కూలింది. ఆ జట్టులో క్యాంప్‌బెల్‌ 90 బంతుల్లో 39 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌ గా నిలిచింది. భారత స్పిన్నర్లు దీప్తి శర్మ, పూనమ్‌ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్‌ తలా 2 వికెట్లు తీసి విండీస్ జట్టు ఆటగాళ్లను కట్టడి చేశారు. ఇదిలా ఉండగా భారత్‌ 17 పరుగులకే ఓపెనర్లు పూనియా 5, జెమీమా సున్నాకే పెవిలీయన్ దారి పట్టారు. వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పూనమ్‌ రౌత్,...

భయం..ప్రభుత్వంపై ఆగ్రహం

చిత్రం
తెలంగాణాలో పట్టపగలే ఓ మహిళాధికారి దారుణ హత్యకు గురి కావడం రాష్ట్ర ప్రజలను ఉలికి పాటుకు గురి చేసింది. తహసీల్దార్‌ విజయారెడ్డిని ఆమె పని చేస్తున్న చోటే సజీవ దహనం చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు కారణం ఏదైనా రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం మాత్రం తీవ్ర ఆందోళనకు గురైంది. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం రెవెన్యూ వ్యవస్థపై వస్తున్న ఆరోపణలు, నిందలతో సతమతమవుతున్న రెవెన్యూ యంత్రాంగం తాజా ఘటనతో మరింత టెన్షన్ కు లోనవుతోంది. విషయం తెలుసుకున్న వెంటనే రెవెన్యూ సంఘాల నేతలు ఘటనను తీవ్రంగా ఖండించడంతో పాటు విధులను కూడా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం రెవెన్యూ ఉద్యోగులను వెంటా డుతోంది. రెవెన్యూ వ్యవస్థలో ఉన్న తీవ్ర ఒత్తిడితో పాటు బదిలీపై వెళ్లి కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తోందన్న మనస్తాపంతో నెల కిందట నిజామాబాద్‌ తహసీల్దార్‌ జ్వాలా గిరి రావు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఉద్యోగ వర్గాలను కలవర పరిచింది. ఈ ఘటన మరువక ముందే తాజగా మహిళా తహసీల్దార్‌ను ఏకంగా సజీవ దహనం చేయడం రెవెన్యూ వర్గాలను ఉలికి పడేలా చేసింది. మండలాల పునర్విభజనలో భాగంగా అబ్దుల్లాపూర్‌మెట్...

అంతటా భయం భయం..ప్రభుత్వంపై ఆగ్రహం

చిత్రం
తెలంగాణాలో పట్టపగలే ఓ మహిళాధికారి దారుణ హత్యకు గురి కావడం రాష్ట్ర ప్రజలను ఉలికి పాటుకు గురి చేసింది. తహసీల్దార్‌ విజయారెడ్డిని ఆమె పని చేస్తున్న చోటే సజీవ దహనం చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు కారణం ఏదైనా రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం మాత్రం తీవ్ర ఆందోళనకు గురైంది. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం రెవెన్యూ వ్యవస్థపై వస్తున్న ఆరోపణలు, నిందలతో సతమతమవుతున్న రెవెన్యూ యంత్రాంగం తాజా ఘటనతో మరింత టెన్షన్ కు లోనవుతోంది. విషయం తెలుసుకున్న వెంటనే రెవెన్యూ సంఘాల నేతలు ఘటనను తీవ్రంగా ఖండించడంతో పాటు విధులను కూడా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం రెవెన్యూ ఉద్యోగులను వెంటా డుతోంది. రెవెన్యూ వ్యవస్థలో ఉన్న తీవ్ర ఒత్తిడితో పాటు బదిలీపై వెళ్లి కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తోందన్న మనస్తాపంతో నెల కిందట నిజామాబాద్‌ తహసీల్దార్‌ జ్వాలా గిరి రావు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఉద్యోగ వర్గాలను కలవర పరిచింది. ఈ ఘటన మరువక ముందే తాజగా మహిళా తహసీల్దార్‌ను ఏకంగా సజీవ దహనం చేయడం రెవెన్యూ వర్గాలను ఉలికి పడేలా చేసింది. మండలాల పునర్విభజనలో భాగంగా అబ్దుల్లాపూర్‌మెట్...

హెచ్‌డీఎఫ్‌సీ ఖుష్ ఖబర్

చిత్రం
ఇండియాలో అతి పెద్ద నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో  10,749 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో 6,097 కోట్లుతో పోల్చితే 76 శాతం వృద్ధి రేటు పెరిగింది. గృహ్‌ ఫైనాన్స్‌లో వాటా విక్రయం, అనుబంధ కంపెనీల నుంచి డివిడెండ్‌ ఆదాయం బాగా పెరగడం, పన్ను భారం తగ్గడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరగడానికి కారణం. ఆదాయం 22,951 కోట్ల నుంచి  32,851 కోట్లకు పెరిగిందని కంపెనీ వెల్లడించింది. పన్ను భారం 1,022 కోట్ల నుంచి 569 కోట్లకు తగ్గింది. గత క్యూ2లో  6 కోట్లుగా ఉన్న డివిడెండ్‌ ఆదాయం ఈ క్యూ2లో 186 రెట్లు ఎగసి 1,074 కోట్లకు పెరిగింది. 18 శాతం రుణ వృద్ధి సాధించామని తెలిపింది. నికర వడ్డీ ఆదాయం 16 శాతం వృద్ధితో 3,078 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌లో ఎలాంటి మార్పు లేక పోగా 3.3 శాతం దాట లేదు. స్థూల మొండి బకాయిలు సీక్వెన్షియల్‌గా 1.29 శాతం నుంచి స్వల్పంగా 1.33 శాతానికి పెరిగాయని వివరించింది. కేటాయింపులు గత క్యూ2లో 890 కోట్లుగా ఉండగా, ఈ క్యూ2లో  754 కోట్లకు తగ్గాయని పేర్కొంది.  స్టాండ్‌ అలోన్‌ పరంగా...

జోరు మీదున్న మార్కెట్..ఖుషీ మీదున్న ఇన్వెస్టర్స్

చిత్రం
స్టాక్‌ మార్కెట్లో రికార్డుల మోత మోగుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇంట్రాడే లోనూ, ముగింపు లోనూ కొత్త రికార్డ్‌లను నెలకొల్పింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన స్థాయి,11,900 పాయింట్ల ఎగువకు ఎగబాకింది. కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు అంచనాలను మించి పోతుండటం, సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు..ఏడో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ లాభాల్లోనే ముగిశాయి. మార్చి తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా ఇన్ని రోజులు లాభపడటం ఇదే మొదటిసారి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు పుంజుకొని 70.77 కు చేరడం సానుకూల ప్రభావం చూపించింది. మెటల్, టెలికం, ఐటీ షేర్లు లాభపడగా, వాహన షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 137 పాయింట్ల లాభంతో 40,302 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది జూన్‌ 3 నాటి ఆల్‌టైమ్‌ క్లోజింగ్‌ రికార్డ్, 40,268 పాయింట్ల రికార్డ్‌ బద్దలైంది. ఇక ఇంట్రాడేలో కూడా సెన్సెక్స్‌ జీవిత కాల గరిష్ట స్థాయి, 40,483 పాయింట్లను తాకింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 51 పాయింట్లు పెరిగి 11,941 పాయింట్ల వద్ద ముగిసింది. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్‌ అదే జోరు చూపించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 318...

మెరుగైన జీవితం భీమాతోనే సాధ్యం

చిత్రం
కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేది బంగారం, భూమి తో పాటు జీవిత భీమా కూడా ఒకటి. చాలా మంది ఇన్సూరెన్స్ చేయాలంటే జడుసుకుంటారు. ప్రతి రోజు తినేందుకు, తాగి తందానాలు ఆడేందుకు లక్షలు ఖర్చు చేస్తారు. కానీ ఒక్క పాలసీ చేయమంటే మాత్రం వెనుకడుగు వేస్తారు. జీవితానికి మెరుగైన భద్రత ఇచ్చేది భీమానే. అందుకే భవిష్యత్తు తరాలు బాగు పడాలంటే సంపాదించిన దాంట్లో నుంచి కొంత మొత్తం తీసి ఖర్చు చేయకుండా పొదుపు చేయాలి. సంపాదనను దాచుకునేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు పోస్టాఫీసులు, ఇతర సంస్థలు, మార్గాలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ దేశంలో 130 కోట్ల మందికి పైగా జనాభా ఉంది. వీరిలో 70 శాతానికి పైగా జనం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. 20 కోట్లకు పైగా జనానికి రెండు పూటలు కూడా భోజనం అందడం లేదు. చాలా మంది అష్ట కష్టాలు పడుతున్నారు. కానీ ఉన్నదంతా మద్యానికి ఖర్చు పెడుతున్నారు. వళ్ళు గుల్ల చేసుకుంటున్నారు. కాపురాలు కూల్చేసు కుంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా ఏం లాభం కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవు. కానీ ఏదైనా అపాయం జరిగినా లేదా ప్రమాదం సంభవించినా ఇప్పుడు లక్షల్లో ఖర్చవుతోంది. వీటిని భరించాలంటే తలకు మిం...

ఏపీలో రహదారులకు మహర్దశ

చిత్రం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి. పనితీరు బాగా లేని అధికారులకు అప్రాధాన్య పోస్టుల్లోకి మార్చేస్తూ, సమర్ధవంతమైన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. నిన్నటి దాకా సీఎస్ గా ఉన్న ఎల్.వి.సుబ్రహ్మణ్యం ను బదిలీ చేశారు. భూ పరిపాలన శాఖా కమిషనర్ కు అప్పగించారు. మరో వైపు రహదారుల నిర్మాణం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు అందించే రుణ సాయంతో రాష్ట్రంలో రహదారుల రూపు రేఖలు మార్చాలని జగన్‌ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందిస్తున్న రుణ సాయం 6,400 కోట్ల నుంచి 8,800 కోట్లకు పెంచేలా కోరాలని నిర్ణయించామన్నారు. రహదారులు, భవనాల శాఖపై సమీక్ష నిర్వహించారు. 3,100 కిలోమీటర్లకు పైగా ఉన్న రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు, అవసరమైన చోట కొత్త వంతెనల నిర్మాణం చేపట్టాలని సూచించారు. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకున్న రోడ్లకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలని, ఒకవేళ ఇప్పుడున్న రోడ్లు బాగుంటే, మండల కేంద్రం నుంచి మరో మండల కేం...

తప్పని తిప్పలు..కార్మికుల అవస్థలు

చిత్రం
నేతలు పట్టు వీడడం లేదు..ప్రభుత్వం మెట్టు దిగడం లేదు. ఇరువురి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు కార్మికులకు చుక్కలు చూపిస్తోంది. ఓ వైపు కోట్లాది విలువ గలిగిన ఆస్తులను దారాదత్తం చేసేందుకు లైన్ క్లియర్ చేసుకుంటూ పోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కార్మికులకు డెడ్ లైన్ విధించారు. ఇప్పటికే పలువురు కార్మికులు తట్టు కోలేక, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకొందరు గుండెపోటుతో మృతి చెందారు. సీఎం చేసిన సెల్ఫ్ డిస్మిస్ అనే కామెంట్స్ ఆందోళనకు మరింత ఆజ్యం పోసింది. కార్మికులు చేస్తున్న సమ్మె నెల రోజులకు చేరుకుంది. కేసీఆర్ డెడ్ లైన్ ను డోంట్ కేర్ అంటున్నారు కార్మికులు. సమ్మె కొనసాగింపుపై పట్టు వీడట్లేదు. ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాతే విధుల్లో చేరాలనే డిమాండ్‌ నుంచి తగ్గడం లేదు. డెడ్‌లైన్‌ దగ్గర పడటంతో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలా, వద్దా అనే నిర్ణయంపై ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు కార్మికులెవరూ విధుల్లో చేరకుండా వారికి ధైర్యం చేప్పేందుకు ఉపక్రమించారు. ఆర్టీసీ జేఏసీలో టీఎంయూ, ఈయూ సంఘాలుండగా, వేరుగా ఉన్న ఎన్‌ఎంయూ నేతలు సైతం మద్దతు పలికారు. ఆయా సంఘాల నేతలు కార్మికుల అ...

కార్మికులకు మంగళం..ప్రైవేట్ కు అందలం

చిత్రం
ఘనమైన చరిత్ర కలిగిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇప్పుడు దిశమొలతో నిలబడ్డది. గత పాలకుల దోపిడీ, ప్రస్తుత ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం శ్రమజీవులైన కార్మికుల పాలిట శాపంగా మారింది. త్యాగాల, పోరాటాల, బలిదానాల సాక్షిగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కన్నీళ్లు తప్ప పన్నీరు అందడం లేదు. అయితే ఎన్నికలు లేదంటే రియల్ దందాలకు ఈ ప్రాంతం అడ్డాగా మారి పోయింది. కొన్ని తరాల నుండి కాపాడుకుంటూ వస్తున్న ఆర్టీసీ సంస్థకు చెందిన ఆస్తులన్నీ ఇప్పుడు ప్రైవేట్ పరం కాబోతున్నాయి. దీనిని నిరసిస్తూ కార్మికులు, ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. గత 30 రోజులుగా, శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. అయినా సర్కారు ఇటు వైపు చూడడం లేదు. పోలీసులు అరెస్టులు ఆపడం లేదు. రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న సీఎం కేసీఆర్ సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ చేసిన వ్యాఖ్యలు కార్మికులను ఆందోళనకు గురి చేశాయి. 22 మంది ఇప్పటికే చని పోయారు. మరికొందరు విధుల్లోకి చేరమంటూ అల్టిమేటం ఇస్తున్నారు. ముఖ్యమంత్రి విధించిన డెడ్ లైన్ ముగిసింది. మరోసారి కార్మికులకు ఛాన్స్ ఇచ్చారు. అయినా కార్మికులు ససేమిరా అన్నారు. కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ లోపు గడువు లోగా చేరన...

టబు లుక్స్ అదుర్స్

చిత్రం
చాన్నాళ్లకు లవ్లీ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్న టబు మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ప్రముఖ, దిగ్గజ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాతలు డిసైడ్ అయ్యారు. జూనియర్ ఎన్ఠీఆర్ తో త్రివిక్రమ్ అరవింద సామెత సినిమా చేశాడు. ఇది భారీ సక్సెస్ అయ్యింది. ఇదిలా ఉండగా బన్నీకి మాత్రం బిగ్ హిట్ రాలేదు. దీంతో తాను నటిస్తున్న అల వైకుంఠపురం లో సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఎలాగైనా సరే బిగ్గెస్ట్ సక్సెస్ కావాలనే కసితో నటిస్తున్నాడు అల్లు అర్జున్. దీంతో పాటు త్రివిక్రమ్ కు కూడా ఈ సినిమా హిట్ కావాల్సిందే. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేశారు. యూట్యూబ్ లో హయ్యెస్ట్ వ్యూయర్షిప్ సాధించాయి ఈ సాంగ్స్. అన్ని చోట్లా ఈ సినిమా సాంగ్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఒక దానిని సిరివెన్నెల రాయగా, మరో పాటను కాసర్ల శ్యామ్ రాశారు. ఇదే సమయంలో కొన్నేళ్ల గ్యాప్ తర్వాత తెలుగు సినీ రంగంలో మళ్ళీ రెండోసారి అడుగు పెట...

ఏపీ సీఎస్ పై బదిలీ వేటు

చిత్రం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రమణ్యంపై బదిలీ వేటు పడింది. భూ పరిపాలన శాఖాధికారి నీరబ్ కుమార్ ను ఇంచార్జ్ సీఎస్ గా నియమించింది. గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా బదిలీ చేస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎస్ బదిలీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉన్నపళంగా ఇలా బదిలీ వేటు వేయడంపై ఉన్నతాధికారులు షాక్ కు గురయ్యారు. సీనియర్ ఐఏఎస్ ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరులో ఈ బదిలీ జరిగిందనే వార్తలు గుప్పుమన్నాయి. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో ఎల్.వి.సుబ్రహ్మణ్యం అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. పరిపాలనను గాడిలో పెట్టే పని చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఏపీ సీఎం కు తలలో నాలుకలా ఉన్నారు. అన్నింటిని చక్క బెట్టారు. మరో ఐదు నెలలు సర్వీస్ ఉండగానే బదిలీ చేయడాన్ని, అధికార యంత్రాంగంలో కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే ప్రిన్స్‌పల్ సెక్రటరీ, జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్‌ ప్రకాష్‌‌కు ఎల్వీ సుబ్రహ్మణ్యం షోకాజ్ నోటీస్ జారీ చేశారు. దీనికి 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. కేబ...

దారుణం..సజీవ దహనం

చిత్రం
సభ్య సమాజం తల దించుకునే సంఘటనలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా దారుణాలను ఆపలేక పోతున్నారు. పటిష్టమైన భద్రత ఉన్నా అల్లరి మూకలు, దుండగులు మాత్రం ఆగడం లేదు. హత్యలు, మానభంగాలు, దోపిడీలు, రియల్ దందాలు, దాడులు, వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలోనే కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని చెపుతున్నా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మానవ సమూహం తల దించుకునే దారుణం చోటు చేసుకుంది. అది తెలంగాణ రాష్ట్ర కేపిటల్ , ఐటీ హబ్ గా పేరొందిన హైదరాబాద్ నగరం, రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటనతో ఒక్కసారిగా రాష్ట్రం ఉలిక్కి పడింది. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్‌ విజయ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తహశీల్దార్‌ తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. ఆమె ను కాపాడేందుకు ప్రయత్నించిన పలువురు కూడా గాయాల పాలయ్యారు. కార్యాలయంలో ఆమె విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే ఈ దారుణమైన ఘటన చోటు చేసుకోవడం సంచలనం రేపింది. తొలుత తహశీల్దార్‌తో మాట్లాడటానికి లోపలికి వెళ్లిన దుండుగుడు ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పం...

ఇదేమి నగరం..ప్రియాంక అసహనం

చిత్రం
భారత దేశ రాజధాని ఢిల్లీ అంటేనే జనం జడుసుకుంటున్నారు. భయాందోళనకు లోనవుతున్నారు. కాలుష్య భూతం కమ్ము కోవడంతో స్థానికులు ఊపిరి ఆడక తల్లడిలి పోతున్నారు. ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పర్యావరణ కాలుష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ఈ రోజు వరకు పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించే లేదు. తాజగా కాలుష్యం దెబ్బకు ఆప్ ప్రభుత్వం కొన్ని రోజుల పాటు సెలవు ప్రకటించింది. మరో వైపు ఇండియా, బాంగ్లాదేశ్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు భారీగా తరలి వచ్చారు ఫ్యాన్స్. వారంతా మాస్క్ లు ధరించి స్టేడియం కు వచ్చారు. వీరితో పాటు ఆటగాళ్లు సైతం మాస్క్ లు ధరించి ఆడారు. ఇదే సమయంలో ఇండియన్ బ్యూటీ, ప్రముఖ బాలీవుడ్ నటీమణి ప్రియాంక చోప్రా కాలుష్య కోరల్లో చిక్కు కున్నారు. దీని వల్ల సినిమా షూటింగ్ లో పాల్గొనడం చాలా కష్టంగా ఉందన్నారు ఈ గ్లోబల్ స్టార్. ప్రస్తుతం ఆమె ‘ది వైట్‌ టైగర్‌ ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత అరవింద్‌ అడిగా ఇదే పేరుతో నవల రాశారు. ఈ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే ఢిల్లీలో ప్రారంభమైంది. షూటింగ్‌లో పాల్గొన్న ప్రియాంక.. కాలుష్యం నుంచి కాపాడు కోవడానికి మాస్...

గ్రేట్ సక్సెస్..గ్రాండ్ వెల్‌కమ్‌

చిత్రం
కోట్లాది జనాన్ని ఉర్రూతలూగించిన బిగ్ బాస్ సీజన్ - 3 ఫైనల్ లో విన్నర్ గా నిలిచిన, పక్కా లోకల్ అయిన ధూల్ పేట కుర్రాడు, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు అపూర్వమైన రీతిలో స్వాగతం లభించింది. ఈ రియాల్టీ షో 105 రోజుల పాటు సక్సెస్ ఫుల్ గా కొనసాగింది. మొత్తం ఐదు మంది బరిలో నిలవగా, ఇద్దరు ఫైనల్ కు పోటీ పడ్డారు. వీరిలో అంతిమంగా రాహుల్ విజేతగా నిలువగా, యాంకర్ శ్రీ ముఖి రన్నర్ అప్ గా నిలిచింది. ప్రముఖ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ ట్రోఫీని అందుకున్నాడు. షో ముగిసిన అనంతరం బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు ఇంటి బాట పట్టారు. వారికి కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. విన్నర్ గా నిలిచిన రాహుల్‌, రన్నరప్‌తో సరిపెట్టుకున్న శ్రీముఖికి దారి పొడవునా జనాలు నీరాజనం పలికారు. వారితో ఫొటోలు తీసుకోడానికి ఎగబడ్డారు. పాతబస్తీ పోరడు రాహుల్‌  గెలుపుతో అభిమానులు రాత్రంతా తీన్మార్‌ డాన్సులతో అదర గొట్టారు. షో నుంచి బయటకు వచ్చిన రాహుల్‌ మాట్లాడారు. ఇద్దరు లెజెండ్స్‌ చేతుల మీదుగా టైటిల్‌ తీసుకోవడం లక్ గా భావిస్తున్నా. నా లైఫ్‌ చేంజ్‌ ఇక నుంచి మారబోతుందని అనుకుంటున్నా. కోట్లాది మంది ఓట్లేసి గెలిపించిన  ప్రతి ...