పోస్ట్‌లు

ఏప్రిల్ 19, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ర‌స‌వ‌త్త‌రం ..క‌ర్ణాట‌కం ..వేడెక్కిన రాజ‌కీయం

చిత్రం
క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. ఒక‌రిపై మ‌రొక‌రు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈసారి ఎలాగైనా త‌మ ప్ర‌తాపం చూపించాల‌ని కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ ప‌ట్టుద‌ల‌తో ఉంది. గ‌తంలో రాష్ట్రంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చివ‌రి వ‌ర‌కు అధికారాన్ని చేజిక్కించుకునే ద‌శ‌లో బోల్తా ప‌డింది. రాజ‌కీయ రంగంలో అప‌ర చాణుక్యులుగా పేరొందిన దేవ‌గౌడ‌, చంద్ర‌బాబు నాయుడులు ఈసారి మిత్ర‌ప‌క్షాలుగా రంగంలోకి దిగారు. ఏపీలో ఎన్నిక‌లు ముగియ‌డంతో దేశ‌వ్యాప్తంగా ఆయా భావ‌సారూప్య‌త క‌లిగిన పార్టీల‌కు మ‌ద్ధ‌తుగా బాబు, గౌడ‌లు ప్ర‌చారం చేస్తున్నారు. కాంగ్రెస్ మ‌ద్ధతుతో ప‌వ‌ర్‌లో కొన‌సాగుతున్న గౌడ ప‌రివారం మ‌రోసారి త‌మ సత్తా చాటేందుకు య‌త్నిస్తోంది. పార్ల‌మెంట్ స్థానాల‌ను పూర్తిగా మిత్ర‌ప‌క్షం గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ప‌ర్య‌టించారు. వీరికి మ‌ద్ధ‌తుగా కాంగ్రెస్ పార్టీ దేశాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ విస్తృతంగా ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో పాల్గొన్నారు. రాయిచూర్‌లో జ‌రిగిన స‌భ‌లో దేవ‌గౌడ‌, చంద్ర‌బాబు, రాహుల్‌లు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. వీరంతా బీజేపీ స‌ర్కార్‌పై..మోదీపై నిప్పులు చెరిగారు. ఎన్డీఏ స‌ర్కార్ ఓడిపోత...

బెంగ‌ళూరే బాద్‌షా..మెరిసిన కోహ్లి..ర‌ఫ్ఫాడించిన ర‌సెల్

చిత్రం
ఐపీఎల్ టోర్నీలో వ‌రుస ఓట‌ముల నుండి నేర్చుకున్న గుణ‌పాఠం బాగా అచ్చొచ్చిన‌ట్టుంది కోహ్లికి. కోల్‌కతా నైట్ రైడ‌ర్స్‌తో హోరాహోరీగా జ‌రిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఛాలెంజ‌ర్స్ జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని సాధించింది. కెప్టెన్ కు కోపం వ‌చ్చిన‌ట్టుందేమో ..ఫోర్లు, సిక్స‌ర్ల‌తో చెల‌రేగి పోయాడు విరాట్. మ‌రో వైపు కోల్‌క‌తా తానేమీ తీసిపోనంటూ ఆ జ‌ట్టు ఆట‌గాళ్లు ర‌సెల్ ఆండ్రి, రాణా అద్భుతంగా రాణించారు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. అనూహ్య‌మైన ప‌రిణామాలతో కోహ్లిసేన గెలుపొందింది. ఇంకో వైపు ఆలీ విధ్వంస‌క‌ర‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. మైదానంలో ఇరు జ‌ట్లు ప‌రుగులు సాధిస్తూ, వికెట్లు తీస్తూ అభిమానుల‌కు మంచి కిక్కు ఇచ్చారు. మ్యాచ్‌లో మొద‌టి 10 ఓవ‌ర్ల‌లో బెంగ‌ళూరు కేవ‌లం 70 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఒకానొక ద‌శ‌లో 150 ప‌రుగులు చేస్తుందో లేదోన‌ని ఆ జ‌ట్టు ఫ్యాన్స్ ఆందోళ‌న చెందారు. దానిని ప‌టాపంచ‌లు చేస్తూ గ్రౌండ్‌లోకి వ‌చ్చిన కోహ్లి సెంచ‌రీ కొట్టాడు. 213 ప‌రుగులు చేసింది. దీనిని ఛేదించేందుకు రంగంలోకి దిగిన కోల్ కోతా ఏ కోశాన ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు అవ‌కాశ‌మే ఇవ్వ‌లేదు. ఆఖ‌రు ఓవ‌ర్ వ‌ర‌కు పోరాడింది. ఊహి...

స‌మీక్ష‌ల తతంగం..ముదిరిన వివాదం

చిత్రం
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎన్నిక‌ల సంఘం సీఎం చంద్ర‌బాబుకు అడుగ‌డుగునా మోకాల‌డ్డుతోంది. ఎలాంటి స‌మీక్ష‌లు..స‌మావేశాలు నిర్వ‌హించ‌రాదంటూ ఈసీ నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల పోలింగ్ పూర్త‌వ‌డంతో టీడీపీ, వైసీపీ పార్టీల మ‌ధ్య మాట‌ల వార్ న‌డుస్తోంది. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. ప్రాధాన్య శాఖ‌ల‌కు సంబంధించి ఉన్న‌తాధికారుల‌పై ఈసీ సీరియ‌స్ గా దృష్టి సారించింది. ఎన్నిక‌ల వేళ‌..ఫ‌లితాలు వ‌చ్చేంత వ‌ర‌కు ఎన్నిక‌ల సంఘంకు అన్ని శాఖ‌లకు సంబంధించి కింది స్థాయి నుండి పై స్థాయి అధికారుల దాకా ప్ర‌తి ఒక్క‌రు క‌మిష‌న‌ర్‌కు జ‌వాబుదారీగా ఉండాలి. ఎప్ప‌టిక‌ప్పుడు పూర్తి వివ‌రాల‌ను..ఏమేం చేస్తున్నార‌నే దానిపై రిపోర్టు ఇవ్వాల్సి స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. రిజ‌ల్ట్స్ వ‌చ్చాక‌..కొత్త ప్ర‌భుత్వం కొలువు తీరేంత వ‌ర‌కు ప్ర‌స్తుత ప్ర‌భుత్వం త‌ప్ప‌క ఉండి వుంటుంది. ఇది భార‌త రాజ్యాంగం ఈ స‌ర్కార్‌కు వెస‌లుబాటు క‌ల్పించింది. ఎలాంటి స‌మీక్ష‌లు, మీటింగ్స్ ను నిర్వ‌హించ‌రాదంటూ ఆల్ రెడీ స్ప‌ష్టం చేసింది. తాము ఎలాంటి స‌మీక్ష‌లు నిర్వ‌హించ‌లేద‌ని..ప్ర‌భుత్వం ప‌నిచేయాలంటే అధికారుల‌...