ఆర్ధిక పరిస్థితిపై ఆందోళన

దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన గతంలో కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి ఇలాగే వుంటే గనుక బతకడం కష్టమవుతుందని హెచ్చరించారు. మరోసారి ప్రపంచం మెచ్చిన ఈ ఆర్థికవేత్త, మేధావి రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం ప్రస్తుతం తీవ్ర సంక్షోభం దిశగా పయనిస్తోందని హెచ్చరించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభాలను ఎదుర్కోనున్నాయని హెచ్చరించారు. ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టానికి చేరిన విషయాన్ని గుర్తు చేశారు. నిరుద్యోగిత రేటు తీవ్ర స్థాయిలో ఉందని తెలిపారు. రియల్టీ, కన్స్ట్రక్షన్, మాన్యుఫాక్చర్ కంపెనీలకు పెద్ద మొత్తంలో రుణాలిచ్చే ఎన్బీఎఫ్సీల ఆస్తుల నాణ్యతను పరిశీలించాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర బ్యాంకు టాప్ 50 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల పనితీరును సమీక్షిస్తుందన్న ఆయన ఆర్బీఐ వాటి పనితీరును, ...