పోస్ట్‌లు

డిసెంబర్ 26, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఈ పురస్కారం సావిత్రికి అంకితం

చిత్రం
జీవితంలో మరిచిపోలేని సన్నివేశం ఇది. సినీ రంగంలో సావిత్రి లాంటి నటీమణి పుట్టరు. ఆమె లోని నటన అమోఘం. అలాంటి గొప్ప నటి పాత్రకు నన్ను ఎంపిక చేయడం, పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా. ఇలాంటి అదృష్టం ఎందరికి వస్తుంది. అదే నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆమె పై నుంచి నన్ను దీవించారు. అందుకే నేను ఆ మహానటి పాత్రలో లీనమయ్యా. నన్ను దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంపిక చేసినప్పుడు చాలా మంది పలు రకాలుగా విమర్శలు చేశారు. కానీ నేను వాటిని ఏవీ పట్టించు కోలేదు. కేవలం పాత్రలో జీవించేందుకు కష్టపడ్డా. ఇందులో నా పాత్రంటూ ఏమీ లేదు. ఇదంతా ఆ మహానుభావురాలుకు మాత్రమే దక్కుతుంది. అంతకంటే ఎక్కువగా ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ నాగ్ దేనంటూ స్పష్టం చేసింది ప్రముఖ నటి కీర్తి సురేష్. ఈ బ్యూటీ చాలా తక్కువ వ్యవధిలోనే అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకుంది. అన్ని సినిమాలు ఒక ఎట్టు. ఈ మహానటి సినిమా మరో ఎత్తు. ఈ చిత్రంలో కీర్తీ సురేశ్‌ మహానటి సావిత్రి పాత్రలో నటించిందనడం కంటే జీవించిందని చెప్పడం కరెక్ట్‌. మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తీసురేశ్‌ను ఎంపిక చేశారనగానే విమర్శించిన వారే గానీ, ప్రోత్సహించిన వారు లేరనే చెప్పాలి. అయినా అలాంటి వ...

పెరిగిన ఆర్ఆర్ వాల్యూ

చిత్రం
భారతీయ వ్యాపార, వాణిజ్య రంగాలపై పట్టు సాధిస్తూ, తనకు ఎదురే లేకుండా చేసుకుంటూ వెళుతున్న రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మరోసారి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. ఆయిల్, టెలికాం, ఎలక్ట్రానిక్స్ , ఫ్యాషన్ , టాయిస్, డిజిటల్, ఆర్నమెంట్స్, తదితర రంగాలకు విస్తరించిన రిలయన్స్ మరోసారి రిటైల్ రంగంలో కూడా దుమ్ము రేపుతోంది. తాజాగా మార్కెట్ అంచనాల ప్రకారం చూస్తే గనుక రిలయన్స్‌ రిటైల్‌ విలువ 2.4 లక్షల కోట్లు గా ఉంది. రిటైల్‌ వాటాదారుల కోసం రిలయన్స్‌ గ్రూప్‌ ప్రతిపాదించిన షేర్ల మార్పిడి స్కీమ్‌ ఆధారంగా చూస్తే ఈ విలువ మరింత పెరిగింది. ఇండియాలో అతి పెద్ద సూపర్‌ మార్కెట్‌ చెయిన్ గా రిలయన్స్ ఇప్పటికే రికార్డ్ బ్రేక్ చేసింది. మరో వైపు డిమార్ట్ కూడా రిలయన్స్ రిటైల్ కు గట్టి పోటీదారుగా ఉంటోంది. దీని అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ మార్కెట్‌ విలువ దాదాపు 1.20 లక్షల కోట్లు గా ఉంది. డిమార్ట్ కంటే రిలయన్స్ మార్కెట్ వాల్యూ రెట్టింపుగా ఉంది. ఇంగ్లాండ్‌లో అతి పెద్ద సూపర్‌ మార్కెట్‌ చెయిన్‌ టెస్కో విలువ 3,200 కోట్ల డాలర్లు కంటే కూడా అధికం కావడం విశేషం. షేర్ల మార్పిడి స్కీమ్‌లో భాగంగా ప్రతి నాలుగు రిలయన్స్‌ రిటైల్‌ ...

కుర్రాళ్ళ ఆట అదుర్స్

చిత్రం
ఈసారి మన క్రికెట్ ఆట మెరిసింది. ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంట్ లో సెమీ ఫైనల్ లో చతికిల పడిన టీమిండియా ఆ తర్వాత జతన ఆట తీరును మరింత మెరుగు పరుచుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తమ బ్యాటింగ్ తో దుమ్ము రేపారు. టీమిండియా తన జైత్ర యాత్రను కొనసాగించింది. ప్రధానంగా టెస్టుల్లో సత్తాను చాటింది. ఇతర జట్లను మట్టి కరిపించింది. ఐసీసీ టెస్టు చాంపియన్‌లో భాగంగా పలు సిరీస్‌లను ఆడిన టీమిండియా ఒక్క సిరీస్‌ను కూడా కోల్పోలేదు. అసలు ఏ ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి చవి చూడ లేదు. వెస్టిండీస్‌ టూర్ లో టీమిండియా కరీబియన్లను క్లీన్‌ స్వీప్‌ చేసింది. టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌..ఆపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. అదే ఊపును రెండు టెస్టుల సిరీస్‌లో కూడా కొనసాగించింది. 120 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను గెలుపొందింది. హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసింది. మ్యాచ్‌కు 40 పాయింట్లు చొప్పున భారత్‌ మరో 120 పాయింట్లను సాధించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-1 గెలవగా, రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌ ...

హక్కుల నేత అరెస్ట్

చిత్రం
పౌరసత్వ సవరణ చట్టం దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ఈ చట్ట సవరణ భారత రాజ్యాంగానికి గొడ్డలి పెట్టు లాంటిదంటూ విద్యార్థులు, పౌర సమాజం, మేధావులు, కళాకారులు, ప్రజాస్వామికవాదులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి. మరో వైపు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని హోమ్ శాఖ దీనిని సీరియస్ గా తీసుకుంది. ఇండియాలో ఎక్కువగా ఉత్తర్ ప్రదేశ్, అస్సోమ్ రాష్ట్రాల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. తాజాగా గువాహటి లో ప్రముఖ సమాచార హక్కు కార్యకర్త అఖిల్‌ గొగోయ్‌ ఇంట్లో  జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. తనిఖీల సందర్భంగా ల్యాప్‌ టాప్‌తో పాటు వివిధ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఎన్‌ఐఏ అతన్ని అదుపులోకి తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అస్సాంలో నిరసనల నేపథ్యంలో అనేక రైతు సంఘాలకు సలహాదారుగా ఉన్న గొగోయ్‌ను ప్రభుత్వం అరెస్టు చేసింది. గువాహటిలోని నిజరపరా ప్రాంతంలోని గొగోయ్‌ నివాసంలో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. అతని పాన్‌ కార్డు, ఎస్బీఐ డెబిట్‌ కార్డు, ఎన్నికల గుర్తింపు కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌ కాపీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ...

ఆర్థికం ఆందోళనకరం

చిత్రం
ఈ దేశం ఎటు పోతోందో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు భారత మాజీ ప్రధాని, జగమెరిగిన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్. దేశ వృద్ధి రేటు క్షీణత ప్రమాదాన్ని సూచిస్తోందన్నారు. ఇప్పటికే చాలా సార్లు దేశ స్థూల జాతీయోత్పత్తి పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన మాజీ ఆర్థిక మంత్రి కూడా అయిన మన్మోహన్‌ మరోసారి క్యూ2 జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి పడి పోవడంపై స్పందించారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం క్యూ2లో జీడీపీ 4.5 శాతానికి పడి పోవడం ఏ మాత్రం సమర్థనీయం కాదన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ ఆందోళనకర స్థాయిలో ఉందన్నారు.   వృద్ధి రేటు తగ్గుదల కేవలం ఆర్థిక వ్యవస్థకే కాకుండా సమాజానికి ఎంతో నష్టం చేకూరుస్తుందంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. దేశంలో 8 నుంచి 9 శాతం వృద్ధి రేటు నమోదు కావాల్సి ఉండగా 4.5 శాతానికి పడి పోవడం విచారించ దగ్గ విషయమన్నారు. ఆర్థిక విధానాల మార్పు ఏ విధంగాను సానుకూల ఫలితాలు ఇవ్వ లేదన్నారు. అంతే కాదు ఈ సందర్భంగా కేంద్రానికి ఆయన కొన్ని సూచనలు కూడా చేశారు. ఆర్థిక వ్యవస్థ పుంజు కోవాలన్నా, ప్రస్తుత సమాజంలో ఆర్థిక వ్యవస్థపై నమ్మకం కలగాలంటే 8 శాతం వృద్ధి రేటు నమోదు కావాల్సిన అవస...

వారెవ్వా..తలైవా

చిత్రం
తమిళనాడులో సూపర్ స్టార్, ఇండియాలో రైజింగ్ స్టార్ గా ఇప్పటికే తనకంటూ ఓ రేంజ్ ఏర్పాటు చేసుకున్న ఎదురైనా హీరో రజనీకాంత్. కోట్లాది మంది అభిమానులు ఈ నటుడిని ప్రేమగా తలైవా అని పిలుచుకుంటారు. తాజాగా పాన్ ఇండియా డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్ లో రజనీకాంత్, నయనతార కలిసి దర్బార్ సినిమా తీశారు. ఇప్పటికే సినిమా పూర్తయింది. సినిమాకు సంబంధించి మూవీ ట్రైలర్ కూడా వచ్చేసింది. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ.సుభాస్కరన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్‌ కానుంది. ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్‌ తెలుగులో విడుదల చేయనున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో రజనీ ఇంట్రడక్షన్ సాంగ్ 'దుమ్ము ధూళి' విడుదలైంది. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకు వెళుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాటకి అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందిచగా, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. డుమ్ డుమ్ అంటూ సాగే ఈ పాట రజనీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. పెళ్లికి ముందు, తర్వాత భార్య భర్తలు ఎలా ఉండాలి అనే అంశాన్ని పాట రూపంలో చక్కగా తెలియ జేశారు. పెళ్లి ...

ఆండర్సన్ వరల్డ్ రికార్డ్

చిత్రం
ప్రపంచ క్రికెట్ కప్ గెలిచాక ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ మరింత దూకుడు పెంచింది. ఓ వైపు ప్రధాన పేసర్ గా ఉన్న బ్రాడ్ 400 వికెట్ల క్లబ్ లో చేరితే, ఇదే కంట్రీకి చెందిన మరో క్రికెట్ దిగ్గజం జేమ్స్‌ అండర్సన్‌ క్రికెట్‌ చరిత్రలోనే నూతన అధ్యాయాన్ని లిఖించాడు. ఇప్పటి వరకూ ఏ బౌలర్‌కు సాధ్యం కాని ఘనతను సాధించాడు. ఒక బౌలర్‌ క్రికెట్‌లో సుదీర్ఘ కాలం కొనసాగడమే చాలా కష్టం. ఎందుకంటే ఎక్కువ కాలం ఆడాలంటే పూర్తి ఫిట్ నెస్ తో ఉండాల్సిందే. ఇక అరుదైన ఘనతను సాధించడం చిరస్మరణీయంగా మిగిలి పోతుంది. ఇప్పటి దాకా కేవలం బ్యాట్స్‌మెన్‌లు మాత్రమే ఉన్న ఈ జాబితాలో మొదటిసారిగా అండర్సన్‌ స్థానం సంపాదించాడు. టెస్టు కెరీర్‌లో 150 అంతకంటే మ్యాచ్‌లు ఆడిన జాబితాలో ఈ క్రికెటర్ దక్కించు కోవడం విశేషం. దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌లో ఆరంభమైన తొలి టెస్టు ద్వారా అండర్సన్‌ ఈ ఫార్మాట్‌లో 150 మ్యాచ్‌ను చేరుకున్నాడు. ఫలితంగా 150 టెస్టు మ్యాచ్‌లు ఆడి తొలి బౌలర్‌గా నయా రికార్డును నమోదు చేశాడు. ఓవరాల్‌గా తొమ్మిదో క్రికెటర్‌గా నిలిచాడు. అండర్సన్‌ కంటే ముందు 150, అంత కంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడిన జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌ 200 మ్యాచులు ఆ...

బ్రాడ్ బ్యాండ్ బాజా

చిత్రం
వరల్డ్ క్రికెట్ లో మరో అరుదైన రికార్డు నమోదైంది. క్రికెట్ ఆటకు ఉన్నంత క్రేజ్ ఇంకే ఆటకు లేక పోవడంతో ఇదే ఆటలో టాప్ రేంజ్ లో ప్రతిభ చూపే ఆటగాళ్ల పంట పండుతోంది. ఊహించని రీతిలో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోతున్నారు. ఇటీవలే ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తూ తన దరిదాపుల్లోకి ఎవరూ రాకుండా రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వెళుతున్నాడు. మరో వైపు ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ తాజాగా సెన్సేషనల్‌ రికార్డు సృష్టించాడు. ఈ దశాబ్దంలో నాలుగు వందల వికెట్లను సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. సహచర బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ తర్వాత స్థానాన్ని ఆక్రమించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టు మ్యాచ్‌లో భాగంగా ఆ జట్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌ వికెట్‌ను తీసిన తర్వాత బ్రాడ్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో అండర్సన్‌ 428 వికెట్లతో టాప్‌లో నిలవగా, ఆ తర్వాత బ్రాడ్‌ నిలిచాడు. ఓవరాల్‌గా తమ టెస్టు  కెరీర్‌లో అండర్సన్‌ ఇప్పటివరకూ 576 వికెట్లు సాధించగా, బ్రాడ్‌ 473 వికెట్లు తీశాడు. కాగా, అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన జాబితాలో అండర్సన్‌, బ్రాడ్‌ల తర్వాత స్థాన...

షాకిచ్చిన ఎయిరిండియా

చిత్రం
భారతీయ విమానయాన రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుని, ఒక బ్రాండ్ ను స్వంతం చేసుకుని, విశిష్టమైన సేవలు అందించి ప్రయాణీకుల మన్ననలు పొందిన ఎయిరిండియా విస్తు పోయేలా షాక్ ఇచ్చింది. ఇప్పటికే దివాళా తీసేందుకు రెడీగా ఉంది ఈ సంస్థ. రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఎయిరిండియా దిద్దుబాటు చర్యలకు తెరలేపింది. ఇక నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు తమ సేవలను నిలిపి వేస్తున్నట్లు స్పష్టం చేసింది. తమకు భారీగా బకాయి పడ్డ సంస్థలకు ఇకపై అధికారికంగా ప్రయాణించేందుకు విమాన టికెట్లను ఇవ్వ బోమని తేల్చి చెప్పింది. ఎయిరిండియా చరిత్రలో ఇలాంటి నిర్ణయం తీసు కోవడం ఇదే మొదటిసారి. ఇప్పటికే 10 లక్షలకు పైగా బకాయి పడిన సంస్థలకు టికెట్లను ఎయిర్ ఇండియా నిరాకరించాలని నిర్ణయించింది. బకాయిల ఎగవేతదారుల జాబితాను వైమానిక సంస్థ రూపొందించింది. ఈ జాబితాలో సీబీఐ, ఐబీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇండియన్ ఆడిట్ బోర్డ్, కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ లేబర్ ఇనిస్టిట్యూట్ అండ్‌ స్టమ్స్ కమిషనర్‌ ఉన్నాయి. ఈ సంస్థల అధికారులు అధికారిక ప్రయాణాలకు ఎయిరిండియా టికెట్లు కొనుగోలు ద్వారా  వివిధ ప్రభుత్వ సంస్థ...