ఈ పురస్కారం సావిత్రికి అంకితం
జీవితంలో మరిచిపోలేని సన్నివేశం ఇది. సినీ రంగంలో సావిత్రి లాంటి నటీమణి పుట్టరు. ఆమె లోని నటన అమోఘం. అలాంటి గొప్ప నటి పాత్రకు నన్ను ఎంపిక చేయడం, పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా. ఇలాంటి అదృష్టం ఎందరికి వస్తుంది. అదే నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆమె పై నుంచి నన్ను దీవించారు. అందుకే నేను ఆ మహానటి పాత్రలో లీనమయ్యా. నన్ను దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంపిక చేసినప్పుడు చాలా మంది పలు రకాలుగా విమర్శలు చేశారు. కానీ నేను వాటిని ఏవీ పట్టించు కోలేదు. కేవలం పాత్రలో జీవించేందుకు కష్టపడ్డా. ఇందులో నా పాత్రంటూ ఏమీ లేదు. ఇదంతా ఆ మహానుభావురాలుకు మాత్రమే దక్కుతుంది. అంతకంటే ఎక్కువగా ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ నాగ్ దేనంటూ స్పష్టం చేసింది ప్రముఖ నటి కీర్తి సురేష్.
ఈ బ్యూటీ చాలా తక్కువ వ్యవధిలోనే అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకుంది. అన్ని సినిమాలు ఒక ఎట్టు. ఈ మహానటి సినిమా మరో ఎత్తు. ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ మహానటి సావిత్రి పాత్రలో నటించిందనడం కంటే జీవించిందని చెప్పడం కరెక్ట్. మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తీసురేశ్ను ఎంపిక చేశారనగానే విమర్శించిన వారే గానీ, ప్రోత్సహించిన వారు లేరనే చెప్పాలి. అయినా అలాంటి వాటిని అస్సలు పట్టించు కోకుండా తనలోని నటనకు సాన పెట్టి సావిత్రి పాత్రకు కీర్తీ సురేశ్ జీవం పోసింది. ఫలితం అభినందనల పరంపరతోపాటు జాతీయ ఉత్తమ నటి అవార్డు కీర్తీ సురేశ్ ముంగిట వాలింది. జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. ఈ ఆనందాన్ని కీర్తీసురేశ్ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. అందరికీ ధన్యవాదాలు.
ఈ ఆనందానుభూతి వ్యక్తం చేయలేనిది. అయినా ప్రయత్నిస్తాను. ఈ అవార్డు నా కల కాదు లక్ష్య సాధనకు పయనం. నా ఈ పయనంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.ఈ అవార్డును నన్ను ఈ స్థాయికి చేరేలా తయారు పరిచిన నా తల్లికి సమర్పిస్తున్నాను. అదే విధంగా మహానటి చిత్రంలో నటించడానికి ప్రోద్బలం ఇచ్చిన అంకుల్ గోవింద్కు, అంతకంటే ఆ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన, చిత్రానికి మెదడు లాంటి దర్శకుడు నాగ్అశ్విన్కు ధన్యవాదాలు. మహానటి చిత్రానికి సమస్తం ఆయనే. అదే విధంగా ఇదంతా చూస్తున్న మహానటి సావిత్రి నన్ను ఆశీర్వదిస్తారు అని కీర్తీసురేశ్ పేర్కొంది.
కాగా తాజాగా ఈ చిన్నది సూపర్స్టార్ రజనీకాంత్తో కలిసి నటించే మరో లక్కీచాన్స్ను అందుకున్న విషయం తెలిసిందే. ఆయన శివ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రంలో నటి కుష్భూ, మీనాలతో పాటు కీర్తీసురేశ్ కూడా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ చిత్ర షూటింగ్లో పాల్గొనడానికి వెళ్లిన నటి కీర్తీసురేశ్కు అందమైన స్వాగతం లభించింది. నటుడు రజనీకాంత్, దర్శకుడు శివ చిత్ర యూనిట్ కీర్తీసురేశ్కు కేక్ తినిపించి అభినందించారు. ఆ ఫొటోలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఈ బ్యూటీ చాలా తక్కువ వ్యవధిలోనే అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకుంది. అన్ని సినిమాలు ఒక ఎట్టు. ఈ మహానటి సినిమా మరో ఎత్తు. ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ మహానటి సావిత్రి పాత్రలో నటించిందనడం కంటే జీవించిందని చెప్పడం కరెక్ట్. మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తీసురేశ్ను ఎంపిక చేశారనగానే విమర్శించిన వారే గానీ, ప్రోత్సహించిన వారు లేరనే చెప్పాలి. అయినా అలాంటి వాటిని అస్సలు పట్టించు కోకుండా తనలోని నటనకు సాన పెట్టి సావిత్రి పాత్రకు కీర్తీ సురేశ్ జీవం పోసింది. ఫలితం అభినందనల పరంపరతోపాటు జాతీయ ఉత్తమ నటి అవార్డు కీర్తీ సురేశ్ ముంగిట వాలింది. జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. ఈ ఆనందాన్ని కీర్తీసురేశ్ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. అందరికీ ధన్యవాదాలు.
ఈ ఆనందానుభూతి వ్యక్తం చేయలేనిది. అయినా ప్రయత్నిస్తాను. ఈ అవార్డు నా కల కాదు లక్ష్య సాధనకు పయనం. నా ఈ పయనంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.ఈ అవార్డును నన్ను ఈ స్థాయికి చేరేలా తయారు పరిచిన నా తల్లికి సమర్పిస్తున్నాను. అదే విధంగా మహానటి చిత్రంలో నటించడానికి ప్రోద్బలం ఇచ్చిన అంకుల్ గోవింద్కు, అంతకంటే ఆ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన, చిత్రానికి మెదడు లాంటి దర్శకుడు నాగ్అశ్విన్కు ధన్యవాదాలు. మహానటి చిత్రానికి సమస్తం ఆయనే. అదే విధంగా ఇదంతా చూస్తున్న మహానటి సావిత్రి నన్ను ఆశీర్వదిస్తారు అని కీర్తీసురేశ్ పేర్కొంది.
కాగా తాజాగా ఈ చిన్నది సూపర్స్టార్ రజనీకాంత్తో కలిసి నటించే మరో లక్కీచాన్స్ను అందుకున్న విషయం తెలిసిందే. ఆయన శివ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రంలో నటి కుష్భూ, మీనాలతో పాటు కీర్తీసురేశ్ కూడా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ చిత్ర షూటింగ్లో పాల్గొనడానికి వెళ్లిన నటి కీర్తీసురేశ్కు అందమైన స్వాగతం లభించింది. నటుడు రజనీకాంత్, దర్శకుడు శివ చిత్ర యూనిట్ కీర్తీసురేశ్కు కేక్ తినిపించి అభినందించారు. ఆ ఫొటోలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి