పోస్ట్‌లు

జనవరి 4, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

తలైవాతో తీరిన కల

చిత్రం
తమిళ సినీ అభిమానులు ప్రేమగా పిలుచుకునే తలైవా రజనీకాంత్ నటించిన దర్బార్ సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఈ మూవీని పాన్ డైరెక్టర్ మురుగదాస్ తెలుగు, తమిళ్, హిందీలలో తీశాడు. తాను అందరి లాగే రజనీకాంత్ ను చూసి పెరిగా. ఆయనతో సినిమా తీయాలన్న కోరిక అలాగే ఉండి పోయింది. ఇప్పుడు దర్బార్ తో తీరింది. దీని కోసం దాదాపు 15 ఏళ్ళు వేచి చూసా అని చెప్పారు డైరెక్టర్ మురుగదాస్. ఒకే కథతో వెళితే ఏం బావుంటుంది. అందుకే పలు కథలతో రజనీకాంత్ సర్ ఇంటికి వెళ్ళా. ఆయన ఒకే చెప్పారు. నాలో ఆనందం రెట్టింప్పయింది. అంతకు ముందు తలైవాతో సినిమాకు కాల్ రావడం నా జీవితంలో మరిచి పోలేను. ఇదే విషయం సినీ ఇండస్ట్రీలో వైరల్ అయ్యింది. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అభినందించారు. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు. తుది నరేషన్‌లోనూ సినిమా కుదరక పోవచ్చు. అలా జరగ కూడదనుకున్నాను. అందుకే ఏ మార్పు సూచించినా నాలుగైదు అషన్స్ ఉండేట్టు కథ తయారు చేసుకుని రజనీ సార్‌ దగ్గరకు వెళ్లాను అని మురుగదాస్‌ వెల్లడించారు. రజనీకాంత్, నయనతార జంటగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్బార్‌ పేరుతో సినిమా తీశాడు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్‌ తెలుగులో రిలీజ్‌...

విశాల్ కు ప్రియా గ్రీన్ సిగ్నల్

చిత్రం
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ప్రియుడు, యువ తమిళ నటుడు విష్ణు విశాల్ మరోసారి వైరల్ గా మారాడు. ఎప్పుడూ సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియా లో చురుకుగా ఉండటం ఈ నటుడికి అలవాటు. ఇంతకు ముందు వరకూ తన చిత్రాలకు సంబంధించిన వార్తలో ఉండేవారు. ఇప్పుడు ప్రియురాలు, ప్రేమ అంటూ వార్తలో నానుతున్నారు. గుత్తా జ్వాల ప్రేమలో మునిగి తేలుగున్నట్లు సోషల్ మీడియాలో అవుతోంది. నటుడిగా మాత్రం బిజీగానే ఉన్నారు. ప్రస్తుతం జగజ్జాల కిల్లాడి, ఎఫైఆర్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా విష్ణు విశాల్‌ ఇంతకు ముందు సిలుక్కువార్‌ పట్టి సింగం చిత్రంలో నటించడంతో పాటు దాని నిర్మాణ బాధ్యతలను చేపట్టారు. దీనికి సెల్లా ఆయ్యావు  దర్శకుడు. ఈ చిత్రం 2018 డిసెంబర్‌లో విడుదలయ్యింది. చిత్రం ఆశించిన విజయాన్ని అందు కోలేదు. అయినా విష్ణువిశాల్‌ ఈ దర్శకుడికి తాజాగా మరో ఛాన్స్ ఇచ్చారు. వీరి కాంబినేషన్‌లో కొత్త చిత్రానికి సంబంధించిన ఫ్రీ పొడక్షన్‌ కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయ్యాయి. కాగా ఇందులో విష్ణు విశాల్‌కు జంటగా నటి ప్రియా భవానీ శంకర్‌ను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మకు కథ వినిపించినట్లు...

అనిల్ కు పుత్రోత్సాహం

చిత్రం
ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావిపూడికి కొత్త ఏడాది కలిసి వచ్చినట్టుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా తీసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ ప్రిన్స్ తో తీసిన సినిమా సరిలేరు నీకెవ్వరు రిలీజ్ కు రెడీ అయ్యింది. సాంగ్స్, పోస్టర్స్, ట్రైలర్స్ కు భారీ ఆదరణ లభించింది. కాగా డైరెక్టర్ అనిల్ కు కుమారుడు పుట్టాడు. ఇది వరకు రావిపూడి.. పటాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌, ఎఫ్‌2 లాంటి హిట్‌ సినిమాలను అందించాడు. అతని సినిమా వస్తుందంటే చాలు ఒక్కసారైనా చూడాల్సిందే అనుకునే అభిమానులు చాలా మందే ఉన్నారు. ఓటమి చవి చూడని దర్శకుడిగా అనిల్‌ రావిపూడికి టాలీవుడ్‌లో ముద్ర పడి పోయింది. వినూత్న కామెడీతో థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించే శక్తి అనిల్‌ రావిపూడి సొంతం. గతేడాది ఎఫ్‌2తో బాక్సాఫీస్‌ దగ్గర నవ్వులు కురిపించన అనిల్‌ ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాకు పని చేస్తున్నారు. అనిల్‌ రావిపూడికి కొడుకు పుట్టడంతో కుటుంబంలో సంతోషం నెలకొంది. దీంతో అనిల్‌ ఇంట్లో సంక్రాంతి పండగ ముందుగానే వచ్చినట్టయింది. కాగా అనిల్‌, భావనల జంటకు శ్రేయాస్వి అనే కూతురు ఉంది. కూతురుతో ఆడుకోడానికి మరో బుడతడు వచ్చేయడంతో ఆ ఇంట్...

ఇరాన్ పై పెద్దన్న కన్నెర్ర

చిత్రం
అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమ దేశ పౌరులపై గానీ, ఆస్తులపై గానీ దాడులు జరిగితే చూస్తు ఊరు కోబోమని స్పష్టం చేశారు. చాలా వేగంగా..తీవ్రంగా స్పందిస్తామని తెలిపారు. ఇరాన్‌లోని 52 ప్రదేశాలను లక్ష్యంగా ఎంచుకున్నామని వెల్లడించారు. ఆ లక్ష్యాల్లో ఇరాన్‌లోని ముఖ్య ప్రదేశాలు, సాంస్కృతిక కేంద్రాలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇరాన్‌ సహా తమను బెదిరించే వారిపై ఎలాంటి చర్య అయినా తీసుకునేంతటి శక్తి అమెరికాకు ఉందన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న ఒక ఉగ్రవాద నాయకుడిని చంపితే..ఇరాన్‌ అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడం, ప్రతీకారం తీర్చుకోవడం గురించి మాట్లాడుతోంది. ఇప్పటికే ఖాసీం సులేమాని మా రాయబార కార్యాలయంపై దాడి చేశాడు. అలాగే తమకు చెందిన ప్రాంతాలపై, ఆస్తులపై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. విదేశాల్లోని అమెరికా ప్రజలకు గానీ, ఆస్తులను తాకాలని ఇరాన్‌ భావిస్తే ఇది వారికి ఒక హెచ్చరిక అవుతుందని ట్రంప్‌ పేర్కొన్నారు. బాగ్దాద్‌ విమానాశ్రయం వద్ద అమెరికా డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ సైనిక జనరల్‌ ఖాసీం సులేమాని, ఇరాకీ పా...

ఎన్సీపీకి ముఖ్య పదవులు

చిత్రం
మరాఠాలో కొత్తగా కొలువుతీరిన సంకీర్ణ సర్కారులో కీలక మంత్రి పదవులన్నీ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అభ్యర్థులకే లభించాయి. ఒఊహించని రీతిలో బీజేపీకి గుడ్ బై చెప్పిన శివసేన తో బద్ద శత్రువులైన కాంగ్రెస్ పార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా పావులు కదిపారు పవార్. అంతే కాదు ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలు కలిసేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇది దేశ రాజకీయాల్లో ఓ చరిత్రకు నంది పలికిందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఓ వైపు దేశంలో అత్యంత బలీయమైన శక్తులుగా అవతరించారు ప్రధాని నరేంద్ర మోదీజీ, హోమ్ శాఖా మంత్రి అమిత్ చంద్ర షా. వీరిద్దరిని ఎదుర్కొని నిలబడటం, రాజకీయంగా పోరాడటం కష్టం. కానీ అసాధ్యమనుకున్న దానిని సుసాధ్యం చేశారు శరద్ పవార్. మహారాష్ట్రలో మొదటి సారిగా ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ అధికారంలోకి వచ్చేలా చేసిన ఘనత మాత్రం ఈ రాజకీయ చాణిక్యుడిదే. అప్పుడో ఇప్పుడో అంటూ నెట్టుకుంటూ వస్తున్న ఈ సంకీర్ణ సర్కార్ ఐదేళ్లు పాలన సాగిస్తుందా అన్నది ఇప్పుడు చర్చకు దారితీసింది. అయినా ఎప్పుడూ కూల్ గా పాజిటివ్ దృక్పథంతో ఉండే ఉద్దవ్ సీఎం గా ఉంటారని శివసేన నాయకులూ, కార్యకర్తలు నమ్మకాన్ని వ్యక్తం చ...

సర్వ దర్శనం కోసం తిరుమల సిద్ధం

చిత్రం
కోట్లాది భక్తుల కొంగు బంగారంగా భావించే తిరుమల వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధమైంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనాలకు లక్షలాదిగా విచ్చేసే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. వేంకటేశ్వరుడికి  ఏకాంతంగా పూజాది  కైంకర్యాలు నిర్వహించిన అనంతరం 2 గంటలకే దర్శనాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏటా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో మాత్రమే తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనానికి సామాన్యులు, వీఐపీలు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. మహావిష్ణువుకు ఏకాదశి, ద్వాదశి అతి ముఖ్యమైనవి. ధనుర్మాస నెలలో వచ్చే ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో దేవతల ద్వారంగా పేర్కొనే ఉత్తర ద్వారాన్ని వైష్ణవ ఆలయాల్లో తెరిచి ఉంచుతారు. ఆ రోజున స్వామి వారు ప్రత్యేకంగా ఉత్తర ద్వారం ద్వారా వెలుపలికి వచ్చి భక్తులకు దర్శమిస్తారు. ఇదే సమయంలో  భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. వైకుంఠ ద్వార ప్రవేశంతో పాటు స్వామి వారి గర్భాలయ ప్రాకారాన్ని స్పృశించే భాగ్యం భక్తులకు కలుగుతుంది. ఇదే పర్వదిన సమయంలో శ్రీవారు ప్రత్...

రియల్ బూమ్ రయ్ రయ్

చిత్రం
ఓ వైపు ఆర్థిక మందగమనం భారత దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. మరో వైపు అమెరికా ఇరాన్ ను టార్గెట్ చేసింది. అంతే కాదు చైనాపై గురువు మంటోంది. ఇండియాకు కూడా ఝలక్ ఇచ్చే ప్రయత్నం చేసింది. చివరకు ఇండియన్ ప్రైమ్ మినిష్టర్ మోదీ చేసిన మంత్రాంగంతో యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ దిగి వచ్చారు. అప్పుడప్పుడు కామెంట్స్ చేస్తూ రక్తి కట్టిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం కారణంగా ఆర్ధిక రంగాన్ని తీవ్ర ప్రభావితం చేస్తోంది. అయినా దీనిని కాదని రియల్, కంస్ట్రక్షన్ రంగాలు ఐటీ హబ్ హైదరాబాద్ లో జోరుమీదున్నాయి. దీంతో నగరాన్ని వికేంద్రీకరణ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే కేవలం ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లోనే  కనిపించింది. దీనికి ఎక్కడ లేనంత డిమాండ్ వచ్చింది. ఐటీ కేంద్రంగా ఉన్న హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కోకాపేట వరకు ఎకరం భూమి ధర కోట్లాది రూపాయలను దాటేసింది. మెరుగైన రవాణా, మౌలిక వసతులు అందుబాటులో ఉండటంతో..కంపెనీలన్నీ అటు వైపు మొగ్గు చూపాయి. ఈ క్రమంలోనే ఐటీ కారిడార్ కు దగ్గరగా, ఓఆర్ఆర్ ఆనుకుని ఉండటంతో, సౌత్ సిటీలోనూ రియల్ ఎస్టేట్ విస్తరిస్...

స్వంత సర్కార్ పై సచిన్ కామెంట్స్

చిత్రం
రాజస్థాన్ స్వంత సర్కార్ పైనే కాంగ్రెస్ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కోటలోని జేకే లోన్‌ ప్రభుత్వాసుపత్రిలో వంద మంది శిశువులు మరణించిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ విషాదకర ఘటనపై బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా అన్నింటికీ గత ప్రభుత్వాన్ని నిందిస్తూ ప్రయోజనం ఉండదని చురకలు అంటించారు. కోటలో నెల రోజుల వ్యవధిలో వంద మంది నవజాత శిశువులు మరణించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కోటా నియోజకవర్గం నుంచి గెలుపొందిన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ట్వీట్‌ చేసిన తర్వాత..ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ స్పందించారు. ఈ క్రమంలో ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హెచ్‌ ఎల్‌ మీనాను తొలగించి, దాని పర్యవేక్షణ బాధ్యతల్ని వైద్య విద్యా శాఖ కార్యదర్శికి అప్పగించారు. అయినప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గత బీజేపీ ప్రభుత్వం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని సీఎం అశోక్‌ గెహ్లోత్‌ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కోట ఆస్పత్రిని సందర్శించిన అనంతరం డిప్య...

విజయం మీదే భారం

చిత్రం
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయం మనదే. ఇక మెజారిటీ మీదే మనం దృష్టి పెట్టాలి. ఇప్పటికే సర్వేలు కూడా ఇదే విషయాన్నీ స్పష్టం చేశాయి కూడా. మొత్తం మున్సిపాల్టీలు, కార్పొరేషన్స్ లలో గులాబీ జెండాలు ఎగరాల్సిందే. లేకుంటే మంత్రులు తమ పదవులు పోవడం మాత్రం ఖాయం. ఇక పార్టీ పరంగా కూడా మీకంటూ ఓ ప్లేస్ కూడా ఉండదన్న విషయం గుర్తించాలని సీరియస్ వర్కింగ్ ఇచ్చారు గులాబీ బాస్. మున్సిపల్‌ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడు పెంచింది. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఈ మేరకు కేసీఆర్‌ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సర్వ్ ఏజెన్సీలన్నీ అధికార పార్టీకే అన్నీ అని తెలిపాయన్నారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న120 మున్సిపాలిటీలు,10 కార్పొరేషన్‌లలో మనమే గెలుస్తున్నాం. బీజేపీ మనకు పోటీ అనే అపోహలు వద్దు. మనకు ఎవరితో పోటీ లేదు. పాత, కొత్త నాయకులు సమన్వయంతో పని చేయాలి. పార్టీ ఒకసారి అభ్యర్థిని ఫైనల్ చేసిన తర్వాత ఆ అభ్యర్థి గెలుపు కోసమే పని చెయ్యాలి. అవసరం ఉన్న చోట మంత్రులు ఎన్నికల ప్ర...

తీర్పుపై టాటా గరం

చిత్రం
టాటా గ్రూప్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని తిరిగి చైర్మన్‌గా తీసుకోవాలంటూ నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలతో మిస్త్రీ, టాటాల మధ్య వివాదం మరింతగా ముదురు తోంది. తాజాగా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలను సవాలు చేస్తూ టాటా గ్రూప్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటాతో పాటు టాటా ట్రస్ట్‌లు, గ్రూప్‌ సంస్థలు.. సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పు అసంబద్ధం, తప్పు, కేసు రికార్డుకు పూర్తిగా విరుద్ధం అని రతన్‌ టాటా పిటిషన్‌లో పేర్కొన్నారు. మిస్త్రీని వృత్తి పరంగా మాత్రమే చైర్మన్‌గా నియమించడం జరిగిందే తప్ప..ఆయన కుటుంబానికి టాటా గ్రూప్‌లో అత్యధిక వాటాలు ఉన్నందుకు కాదని స్పష్టం చేశారు. మరోవైపు, సర్‌ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్‌ రతన్‌ టాటా ట్రస్ట్‌కు చెందిన ట్రస్టీలు కూడా వేర్వేరు పిటిషన్లు వేశాయి. ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పులో హేతుబద్ధత లోపించిందని, చట్టాల పరంగా తీవ్రమైన తప్పిదాలు ఉన్నాయని, తప్పుడు ఊహాగానాల ఆధారంగా ఇచ్చినట్లుగా ఉందని ట్రస్టీలు ఆరోపించారు. అటు గ్రూప్‌ సంస్థ టాటా టెలీ సర్వీసెస్ కూడా మరో పిటిషన్‌ దాఖలు చేసింది. ఎన్‌సీఎల్‌టీలో గానీ ఎన్‌సీఎల్‌ఏటీలో గానీ జరిగి...