విశాల్ కు ప్రియా గ్రీన్ సిగ్నల్
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ప్రియుడు, యువ తమిళ నటుడు విష్ణు విశాల్ మరోసారి వైరల్ గా మారాడు. ఎప్పుడూ సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియా లో చురుకుగా ఉండటం ఈ నటుడికి అలవాటు. ఇంతకు ముందు వరకూ తన చిత్రాలకు సంబంధించిన వార్తలో ఉండేవారు. ఇప్పుడు ప్రియురాలు, ప్రేమ అంటూ వార్తలో నానుతున్నారు. గుత్తా జ్వాల ప్రేమలో మునిగి తేలుగున్నట్లు సోషల్ మీడియాలో అవుతోంది. నటుడిగా మాత్రం బిజీగానే ఉన్నారు. ప్రస్తుతం జగజ్జాల కిల్లాడి, ఎఫైఆర్ చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా విష్ణు విశాల్ ఇంతకు ముందు సిలుక్కువార్ పట్టి సింగం చిత్రంలో నటించడంతో పాటు దాని నిర్మాణ బాధ్యతలను చేపట్టారు.
దీనికి సెల్లా ఆయ్యావు దర్శకుడు. ఈ చిత్రం 2018 డిసెంబర్లో విడుదలయ్యింది. చిత్రం ఆశించిన విజయాన్ని అందు కోలేదు. అయినా విష్ణువిశాల్ ఈ దర్శకుడికి తాజాగా మరో ఛాన్స్ ఇచ్చారు. వీరి కాంబినేషన్లో కొత్త చిత్రానికి సంబంధించిన ఫ్రీ పొడక్షన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయ్యాయి. కాగా ఇందులో విష్ణు విశాల్కు జంటగా నటి ప్రియా భవానీ శంకర్ను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మకు కథ వినిపించినట్లు, కథ నచ్చడంతో ప్రియా భవానీ శంకర్ కూడా నటించడానికి ఒకే కూడా చెప్పేసిందట.
ఈ చిత్రానికి ఇంకా కాల్షీట్స్ను కేటాయించలేదట. కారణం ఇప్పుడు ప్రియా భవానీ శంకర్ చేతి నిండా చిత్రాలతో చాలా బిజీగా ఉంది. ప్రస్తుతం కురుది ఆట్టం, కళత్తిల్ సంథిస్పోమ్, కసడదపర, మాఫియా, బొమ్మై, ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాల మధ్య ఖాళీ చూసుకుని విష్ణు విశాల్ చిత్రానికి కాల్షీట్స్ కేటాయిస్తానని నటి ప్రియా భవానీశంకర్ మాట ఇచ్చినట్లు తెలిసింది. కాగా ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.
దీనికి సెల్లా ఆయ్యావు దర్శకుడు. ఈ చిత్రం 2018 డిసెంబర్లో విడుదలయ్యింది. చిత్రం ఆశించిన విజయాన్ని అందు కోలేదు. అయినా విష్ణువిశాల్ ఈ దర్శకుడికి తాజాగా మరో ఛాన్స్ ఇచ్చారు. వీరి కాంబినేషన్లో కొత్త చిత్రానికి సంబంధించిన ఫ్రీ పొడక్షన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయ్యాయి. కాగా ఇందులో విష్ణు విశాల్కు జంటగా నటి ప్రియా భవానీ శంకర్ను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మకు కథ వినిపించినట్లు, కథ నచ్చడంతో ప్రియా భవానీ శంకర్ కూడా నటించడానికి ఒకే కూడా చెప్పేసిందట.
ఈ చిత్రానికి ఇంకా కాల్షీట్స్ను కేటాయించలేదట. కారణం ఇప్పుడు ప్రియా భవానీ శంకర్ చేతి నిండా చిత్రాలతో చాలా బిజీగా ఉంది. ప్రస్తుతం కురుది ఆట్టం, కళత్తిల్ సంథిస్పోమ్, కసడదపర, మాఫియా, బొమ్మై, ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాల మధ్య ఖాళీ చూసుకుని విష్ణు విశాల్ చిత్రానికి కాల్షీట్స్ కేటాయిస్తానని నటి ప్రియా భవానీశంకర్ మాట ఇచ్చినట్లు తెలిసింది. కాగా ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి