పోస్ట్‌లు

సెప్టెంబర్ 1, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

అడిడాస్ ను దాటేసిన డెకత్ లాన్ ..!

చిత్రం
ప్రపంచ స్పోర్ట్స్ షూస్ మార్కెట్ రంగంలో నిన్నటి దాకా రారాజుగా వెలుగొందాయి ప్రముఖ షూస్ కంపెనీలు అడిడాస్ , నైక్ లు. కానీ అనుకోని రీతిలో మార్కెట్ రంగంలో సునామీలా దూసుకు వచ్చింది డెకత్ లాన్ షూస్ కంపెనీ. రిటైలింగ్ బిజినెస్ లో భారీ అమ్మకాలు సాగిస్తోంది. ఇప్పటికే వ్యాపార పరంగా టాప్ రేంజ్ లో ఉన్న కంపెనీలను ఎప్పుడో దాటేసింది. గత ఏడాది నుంచి డెకత్ లాన్ కంపెనీ తయారు చేసిన షూస్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తక్కువ ధరలతో పాటు నాణ్యవంతమైనవిగా ఉండేలా వీటిని, సరికొత్త డిజైన్లతో రూపొందించింది ఈ కంపెనీ. కొన్నేళ్లుగా స్పోర్ట్స్ పరంగా రాజ్యమేలుతూ వస్తున్నాయి ఆడి డాడ్ , నైక్ కంపెనీలు. ప్రపంచ మంతటా ప్రధానమైన పట్టణాలు, నగరాలలో డెకత్ లాన్ కంపెనీ షూస్ మాల్స్, స్టోర్స్, వేర్ హౌజెస్ ను ఏర్పాటు చేసింది. మిగతా కంపెనీలకంటే ధరల్లో  30 శాతానికి పైగా డిస్కౌంట్ లభించడం తో పాటు క్వాలిటీ లో ఎక్కడా కాంప్రమైజ్ కాక పోవడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఆసియా లో బిగ్ మార్కెట్ వాటా కలిగిన ముంబైలో డెకత్ లాన్ తన స్టోర్స్ ను ప్రారంభించింది. భారతీయుల్లో నరనరాన జీర్ణించుకున్న ఆట ఏదైనా ఉందంటే  అది క్రికెట్ ఒక్కటే.ఆటగాళ్ల...

!..అరుదైన నటుడు..అద్భుత నాయకుడు..జయహో జనసేనాని..!

చిత్రం
తెలుగు సినిమా రంగంలో కామ్ గా ఎంటర్ అయి ..సునామీలా సెన్సేషన్ సృష్టించిన ఒకే ఒక్కడు ..అరుదైన నటుడు..కొణిదెల పవన్ కళ్యాణ్. ఈ స్టార్ కు ఇప్పుడు 58 ఏళ్ళు. మొదటి నుంచి సినిమా రంగంలో తనవారు ఉన్నప్పటికీ, తనకంటూ ప్రత్యేకతను, బ్రాండ్ ను , ఇమేజ్ ను స్వంతం చేసుకున్న యాక్టర్. ఓ సామాన్యమైన, మధ్యతరగతి పోలీస్ కానిస్టేబుల్ కుటుంబంలోంచి వచ్చిన పవన్ ..స్వశక్తితో ఎదిగారు. అంచెలంచెలుగా టాప్ పొజిషన్ లోకి చేరుకున్నాడు. పవన్ కళ్యాణ్ తనను తాను నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు. అంతే కాకుండా అంతర్ముఖుడైన ఆయనకు, ప్రపంచాన్ని నిత్యం ప్రభావితం చేస్తూ, కోట్లాది ప్రజలు నిత్యం స్మరించుకునే చేగువేరా అంటే వల్లమాలిన అభిమానం. పుస్తకాలంటే చచ్చేంత ఇష్టం. నటుడిగా ఎదిగిన ఆయన అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. జనం కోసం జనసేన పార్టీ స్థాపించారు. ప్రజా నాయకుడిగా ఎదిగారు. ఎన్నో ఆరోపణలు, విమర్శలు చేసినా తట్టుకుని నిలబడ్డారు. సమస్యలను ప్రస్తావించడంతో పాటు ప్రజల పక్షాన పోరాడుతున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే ఇంకో వైపు పాలిటిక్స్ లో ఫుల్ టైమర్ గా ఉన్నారు. నటుడిగా, నిర్మాతగా, యుద్ధ కళలో ఎక్స్ పర్ట్ గా , దర్శకుడిగా , రచయితగా , రాజకీయ వే...

జెరోమ్ గరం గరం..సాహూపై ఆగ్రహం..!

చిత్రం
ఇప్పటికే పాన్ ఇండియా సూపర్ స్టార్ గా పేరొందిన, డార్లింగ్ ప్రభాస్ నటించిన సాహో సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే ఇంకా దీనిపై విమర్శలు వస్తూనే వున్నాయి. కానీ వసూళ్ల పరంగా చూస్తే బాక్సాఫీస్ లు బద్దలు కొడుతోంది. దాదాపు 375 కోట్లకు పైగా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ సుజిత్ రెడ్డి. కేవలం ఒకే ఒక్క సినిమాను తీశాడు. బాహుబలి బిగ్ హిట్ తర్వాత ప్రభాస్ రెండు ఏళ్ళు ఈ సినిమా కోసం ఆగాడు. తన స్టామినాకు , తన రేంజ్ కు తగ్గట్టు సినిమా ఉండేలా చూసుకున్నాడు. సాహో ప్రారంభం నుంచే సెన్సేషన్ సృష్టించింది. డిఫరెంట్ గా ఉండేలా హాలీవుడ్ స్థాయిని తలపించేలా సాహో ను తీశాడు సుజిత్.  ఇదే సమయంలో బాలీవుడ్ లో టాప్ రేంజ్ లో ఉన్న శ్రద్దా కపూర్ ను తీసుకున్నారు. ఆమెకు దాదాపు భారీ ఫీజు చెల్లించినట్టు సినీ వర్గాల భోగట్టా . ఇక ప్రభాస్ ఇండియాలో ఏ హీరో తీసుకోనంత రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రీ రిలీజ్  ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. ప్రతిదీ రిచ్ గా ఉండేలా ప్లాన్ చేశారు నిర్మాతలు. ఇందులో ఎక్కడా రాజీ పడలేదు. సినిమా మొత్తం డార్లింగ్ ప్రభాస్ దే. సినిమా ప్రమోషన్ నుంచి రిలీజ్ దాకా ..అంతా తానే అయి ముందు...

తమిళ సినీవాలిలో అతడో సునామి..!

చిత్రం
బతుకంత యుద్ధంలో అలా వచ్చి ఇలా వెళ్లిపోయే సైనికుడు కాదు అతడు. అతడో సునామి. సినిమా అన్నది కొందరికి వ్యాపారం. ఇంకొందరికి అదో ఛాలెంజ్. ప్రపంచాన్ని కాన్వాస్ లో బంధించే సాధనాల్లో సినిమా ఒకటి. అది లోకాన్ని పరుచుకున్న సముద్రం. భూమిని అల్లుకున్న ఆకాశం. ఇందులో తోడుకున్నోళ్లకు తోడుకున్నంత. చదువుతో పని లేదు. పైరవీలతో పని లేదు. బాకాలు ఊదాల్సిన అవసరం లేదు. కావాల్సిందల్లా నీకు నీ మీద అచంచలమైన నమ్మకం. మనల్ని ప్రతి క్షణం వెంటాడే కాలం సాక్షిగా యుద్ధం చేయాల్సిందే. అప్పుడే నిలబడతాం. లేకపోతే పడి పోతాం . ఈ పోరాటపు ప్రయాణంలో సినిమాను యుద్ధంగా చేసుకుని సాగిపోతున్న డైరెక్టర్లు ఇండియాలో ఎందరో ఉన్నారు. వారిలో ఉన్న కొద్ది మందిలో ఎన్నదగిన వ్యక్తుల్లో ఒకరు తమిళంలో పేరొందిన బాల పళనిసామి. దర్శకుడిగా , స్క్రీన్ ప్లే రైటర్ గా, నిర్మాతగా ఆయన ఇప్పటికే పేరొందారు. తమిళ సినిమా రంగంలో రెబల్ గా పేరు తెచ్చుకున్నారు బాల. సినిమా చవిచూడని, పట్టించుకోని అణగారిన వర్గాలను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను, సామాజిక ఇబ్బందులను సెల్యులాయిడ్ మీద అద్భుతంగా ఆవిష్కరించాడు. అందుకే బాల అంటే అక్కడ ఎనలేని క్రేజ్. బాల తీసింది కొన్ని స...

యురేనియం..జీవ వైవిధ్యం..వినాశనం..!

చిత్రం
పదవులను అంటిపెట్టుకున్న పాలకులు పలకడం లేదు. మానవ జాతికి జీవనాధారమైన పచ్చని నల్లమల అటవీ ప్రాంతం, ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొన్ని తరాలుగా, కొన్నేళ్లుగా ఈ మట్టినే నమ్ముకుని బతుకుతున్న, అడవి బిడ్డలు అడవితో శ్శాశ్వతంగా బంధాన్ని కోల్పోనున్నారు. తన భూభాగంలో ప్రవహించే కృష్ణా నది కాలుష్యపు కోరల్లో చిక్కుకోనుంది. అంతేనా తెలంగాణకే కాదు భారత దేశానికి తలమానికంగా నిలిచే జంతు జీవాలు, పులులు ఇక అంతరించి పోనున్నాయి. ఓ వైపు ఇంతటి విధ్వంసానికి శ్రీకారం చుట్ట బోతున్నది కేంద్రంలో కొలువు తీరిన  ప్రభుత్వం. దీని వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుందని తెలిసినా పాలకులు , రాష్ట్ర సర్కార్ నిమ్మకుండి పోయారు. ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చెందిన డీబీర్స్ కంపెనీ ఈ నల్లమలపై కన్నేసి, అడవి బిడ్డల పోరాటానికి తలవంచింది. వజ్రాల వెలికితీత పేరుతో నల్లమలలోకి పూర్తిగా అడుగు పెట్టకుండానే , ప్రజల పోరాటంతో , ఆందోళనలతో దెబ్బకు విరమించుకుంది. తాజాగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇప్పటికే అనుమతులు ఇచ్చేసింది. యురేనియం తవ్వకాల వల్ల నల్లమల పూర్తిగా పాడై  పోతుంది. కనీసం 4 వేలకు పైగా బోర్లు వేయనున్నారు. దీంతో మొత్తం...

గవర్నర్ల మార్పు దత్తన్నకు ప్రమోషన్ ..తెలంగాణకు సౌందర రాజన్

చిత్రం
ఊహించిందే జరిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అయిదు రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లను నియమించింది. గత కొంత కాలంగా మార్పు జరుగుతుందన్న వార్తలు వచ్చాయి. తెలంగాణ గరవ్నర్ గా మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న విద్యాసాగర్ రావు వస్తారని అనుకున్నారు బీజేపీ శ్రేణులు. కానీ పార్టీ ఎందుకనో ఆయన పదవీ కాలాన్ని పొడిగించలేదు. రాబోయే కాలంలో తెలంగాణాలో పాగా వేయాలంటే బలమైన నాయకుడు కావాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ లాంటి లీడర్ ను తట్టుకుని నిలబడాలంటే ..అందుకు ధీటైన నేత ఆ పార్టీకి కావాలి. ఇక ఏపీకి ఇటీవలే గవర్నర్ ను నియమించింది సర్కార్. అప్పుడే తెలంగాణ లో కూడా చేంజ్ ఉంటుందనుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు ఉమ్మడి ఏపీకి గవర్నర్ గా ఉన్నారు నరసింహ్మన్ . తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, ఏపీ తెలంగాణ ల మధ్య నెలకొన్న సమస్యలను ఆయన దగ్గరుండి పరిష్కరించారు. అంతే కాకుండా అన్ని పార్టీల నాయకులను ఆదరించారు. ఇక్కడి సంస్కృతి అంటే గవర్నర్ దంపతులకు ఇష్టం. పలు దేవాలయాల అభివృద్ధికి , విద్యా, వైద్యం మెరుగు పడేలా చేశారు. అప్పట్లో కేసీఆర్ కు సపోర్ట్ గా ఉన్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు  చేశాయి. అయినా ఎలాంటి మార్పు జరగలేదు. కానీ ఉన్నట్టుం...