పోస్ట్‌లు

జూన్ 13, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

స్టార్ టీవీకి జాక్ పాట్ - ఇండియా పాక్ మ్యాచ్‌కు 100 కోట్ల ఆదాయం

చిత్రం
ప్ర‌పంచాన్ని ఊపేస్తూ..ఆశ్చ‌ర్య పోయేలా చేస్తూ..కోట్లాది ప్ర‌జ‌ల గుండెల్ని ల‌య‌బ‌ద్ధంగా మార్చేసే స‌న్నివేశం ఏదైనా వుందంటే అది క్రికెట్ ఒక్క‌టే. అమెరికా లాంటి పెద్ద‌న్న లాంటి దేశ‌మే ఈ ఆట‌కున్న క్రేజ్ చూసి నివ్వెర పోతోంది. ఎందుకింత క్రేజ్ వుందో తెలుసుకోమ‌ని ఏకంగా త‌న క్రీడా నిపుణుల‌ను ఆదేశించిందంటే దానికున్న డిమాండ్ ఏమిటో అర్థ‌మ‌వుతుంది. అన్ని దేశాలు ఆడ‌డం మామూలే. కానీ దాయాదులైన పాకిస్తాన్ , ఇండియా క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే ఏ మ్యాచ్ అయినా అది తీవ్ర ఉత్కంఠ‌కు గురి చేస్తుంది. కోట్లాది భార‌తీయులే కాదు ల‌క్ష‌లాది పాకిస్తానీయులు కూడా క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తారు. నిద్ర‌హారాలు మాని ఏం జ‌రగ‌బోతుందో అంచ‌నాలు, చ‌ర్చోప చ‌ర్చ‌లు జ‌రుగుతుంటాయి.  మ్యాచ్ జ‌రిగే వారం రోజుల కింద‌టి నుంచే వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున బెట్టింగ్‌లు జోరందుకుంటాయి. కోట్లాది రూపాయ‌ల‌కు పైగా బెట్టింగ్ ఉంటుంద‌ని క్రికెట్ వ‌ర్గాలే అంగీక‌రిస్తున్నాయి. ఆక్టోప‌స్ లాగా ఈ క్రికెట్ ఆట పేరుకు పోయింది. చాప కింద నీరులా ప్ర‌తి ఒక్క‌రిని క‌దిలిస్తోంది. ప్ర‌స్తుతం ప్రపంచ క్రికెట్ క‌ప్ టోర్న‌మెంట్ జ‌రుగుతోంది. ఇంగ్లండ్‌లో జ‌రుగుత...

వ‌ర‌ల్డ్ మార్కెట్‌లో భారీగా పెరిగిన ఎంఎస్ వాల్యూ

చిత్రం
టెక్నాల‌జీ రంగంలో ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే మైక్రోసాఫ్ట్ కంపెనీ బ్రాండ్ విలువ అమాంతం పెరిగింది. త‌న చ‌రిత్ర‌ను తానే తిరిగి రాసుకుంది. ఈ ఘ‌న‌తను తెలుగువాడి సార‌థ్యంలో ఈ సంస్థకు ద‌క్క‌డం మ‌న‌వారంద‌రికీ గ‌ర్వ‌కార‌ణమనే చెప్పాలి. గ‌త ముప్పై ఏళ్లుగా రారాజుగా మైక్రోసాఫ్ట్ వెలుగొందుతోంది. మార్కెట్ కాపిట‌లైజేష‌న్ జూన్ 7 వ‌ర‌కు చూస్తే ట్రిలియ‌న్ డాల‌ర్ల మైలు రాయిని అందుకుంది. అంటే దీని విలువ రూపాయల్లో చూస్తే 70 ల‌క్ష‌ల కోట్లుగా వుంది. అమెరికాలో అత్యంత విలువైన కంపెనీగా ఎంఎస్ అవ‌త‌రించ‌డంలో ఆ కంపెనీకి సిఇఓగా వున్న స‌త్య కీల‌క పాత్ర పోషించారు. అదే అమెరికాకు చెందిన మ‌రో కంపెనీ అమెజాన్ రెండో ప్లేస్‌లో ఉండ‌గా, మూడో స్థానంలో యాపిల్ కంపెనీ ఉంది. ఈ రెండు కంపెనీల మార్కెట్ కాపిట‌లైజేష‌న్ దాదాపు 880 బిలియ‌న్ డాల‌ర్లుగా న‌మోదైంది. అంటే దాదాపు 62 ల‌క్ష‌ల కోట్లు రూపాయ‌లుగా వుంది. జూన్ 7కు నాలుగు రోజుల ముందు నుంచి మైక్రోసాఫ్ట్ షేర్ ధ‌ర 10 శాతానికి పైగా పెరిగింది. ఇది మ‌దుప‌రుల‌కు శుభ సూచ‌కం. మైక్రోసాఫ్ట్ కంపెనీ త‌న స్ట్రాట‌జీని మార్చుకుంది. క్లౌడ్ స‌ర్వీసెస్‌కు మంచి భ‌విష్య‌త్ ఉంటుంద‌ని భావించింది....

షానే క‌మ‌ల ద‌ళ‌ప‌తి ..పార్టీకి ర‌థ‌సార‌థి

చిత్రం
ఊహాగానాల‌కు తెర దించారు. తిరిగి అమిత్ షానే పార్టీకి ద‌ళ‌ప‌తి అంటూ స్ప‌ష్టం చేశారు..భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీజి. ఆయ‌న స్థానంలో వేరే వారికి అప్ప‌గిస్తార‌నే ప్ర‌చారం పార్టీలో జోరందుకుంది. రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ బాధ్యులు ..పీఎంతో సీరియ‌స్‌గా చ‌ర్చించారు. మోదీకి కుడి భుజంగా, నెంబ‌ర్ టూగా ఉంటూ వ‌చ్చారు. ఎక్క‌డ‌లేని ప్ర‌యారిటీ షాకు ఇవ్వ‌డంపై పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌లు గుర్రుగా ఉండ‌డం, మోదీపై విమ‌ర్శ‌లు చేసేందుకు సైతం వెనుకాడ‌లేదు. కానీ సీన్ మారింది. ఫీనిక్స్ ప‌క్షిలాగా ఎక్కడా తొట్రు ప‌డ‌లేదు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రెండోసారి దేశ వ్యాప్తంగా థంబింగ్ మెజారిటీని పార్టీకి తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త మాత్రం వీరిద్ద‌రిదే.  మోదీ కెప్ట‌న్‌గా వుంటే ..వైస్ కెప్టెన్‌గా అమిత్ షా అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు. అటు పార్టీని చాప కింద నీరులా విస్త‌రించేలా చేయ‌డంలో షా చేసిన కృషి చెప్పుకోత‌గ్ద‌ది. క‌మ‌లానికి రెండో సారి ప‌వ‌ర్ లోకి వ‌చ్చేలా చేయ‌డంతో అమిత్ షా పార్టీ అధ్య‌క్షుడిగా స‌క్సెస్ అయ్యారు. ఇక ఆయ‌న మాట‌కు తిరుగు లేకుండా పోయింది. ఏ ఒక్క నేత కూడా పార్టీకి, మోదీ టీంకు వ్య‌...

వేత‌న జీవుల్లో సంజీవ్ వేర‌యా - సీఎండీనా మ‌జాకా ..!

చిత్రం
ఎవ‌రీ సంజీవ్ పురి అనుకుంటున్నారా. ఆయ‌న గురించి చెప్పాలంటే ఓ పెద్ద క‌థ వుంది. ఇండియ‌న్ టొబాకో కంపెనీకి ఛైర్మ‌న్‌గా, చీఫ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా కొన‌సాగుతున్నారు. భార‌త దేశంలో అత్యంత న‌మ్మ‌క‌మైన బ్రాండ్ గా ..కోట్లాది రూపాయ‌ల ఆదాయాన్ని గ‌డించిన కంపెనీగా మార్చ‌డంలో ఈ ఐఐటీయ‌న్ పాత్ర చెప్పుకోద‌గ్గ‌ది. ప్ర‌పంచం విస్తు పోయేలా ..కంపెనీల అధిప‌తులు ఆశ్చ‌ర్య పోయేలా సంజీవ్ పురి చ‌రిత్ర సృష్టించారు. ఒక‌ప్పుడు సంస్థ‌ను మూసి వేయాల‌ని నిర్ణ‌యించుకున్న స‌మ‌యంలో పురితో పాటు అంత‌కు ముందున్న ఛైర్మ‌న్ అహోరాత్రులు శ్ర‌మించారు. ఈ కంపెనీకి జీవం పోశారు అన‌డం కంటే ప్రాణం పెట్టారు అని చెప్ప‌వ‌చ్చు. మోస్ట్ మెమోర‌బుల్ సిఎండిగా ఆయ‌న వినుతికెక్కారు. తాజాగా ఇండియాలోనే భారీ ప్యాకేజీ ..వేత‌నం తీసుకునే వ్య‌క్తిగా పురి రికార్డు బ్రేక్ చేశారు. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కంపెనీగా ఐటీసీ ఎదిగింది. సంజీవ్ పారితోష‌కం గ‌డిచిన ఆర్థిక సంవ‌త్స‌రం 2018-2019లో 51 శాతానికి పైగా పెరిగి..6 కోట్ల 16 ల‌క్ష‌ల‌కు చేరుకుంది. ఇందులో మూల వేత‌నం ఒక కోటి 44 ల‌క్ష‌లు కాగా , 40 ల‌క్ష‌లు భ‌త్యాలు, 4 కోట్ల 32 కోట్ల ప‌నితీరు ఆధారంగా బోన‌స్ ప‌రంగా యాజ‌...

పిచాయ్ ప్ర‌యారిటీ ఇండియానే - వ‌ర‌ల్డ్ మార్కెట్‌లో మ‌న‌మే బెట‌ర్

చిత్రం
ప్ర‌పంచాన్ని విస్మ‌య ప‌రిచి..దిగ్గ‌జ కంపెనీల‌కు ఝ‌ల‌క్‌లు ఇస్తూ త‌న‌కంటూ విస్మ‌రించ‌లేని స్థానాన్ని ఏర్పాటు చేసుకుని ఐటీ రంగాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న కంపెనీగా పేరొందిన గూగుల్ దిగ్గ‌జ కంపెనీ టాప్ ప్రయారిటీ ఏద‌న్నా ఉందంటే అది ఇండియా ఒక్క‌టేన‌ట‌. మార్కెట్ రిసెర్చ్ కంపెనీలు చెబితే పొర‌పాటు ప‌డిన‌ట్టే. సాక్షాత్తూ ఆ సంస్థ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న వ‌ర‌ల్డ్ హెడ్ సుంద‌ర్ పిచాయ్ మాటల్లోని వాస్త‌వం. ఇత‌ర దేశాల‌కంటే భార‌త్‌లోనే మార్కెట్‌కు స్కోప్ ఎక్కువ‌గా వుంద‌న్నారు. తాజాగా అమెరికా- ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై సుంద‌ర్ పిచాయ్ మాట్లాడారు. ఏర‌కంగా మార్కెట్ విస్త‌రించ‌నుందో స్ప‌ష్టం చేశారు. ఇండియ‌న్ మార్కెట్ ప‌రిస్థితుల‌న్నీ కొత్త ఉత్ప‌త్తుల‌ను అభివృద్ధి చేసేందుకు స‌హ‌క‌రిస్తాయ‌ని వెల్ల‌డించారు. ఇక్క‌డ వేటిని అభివృద్ది చేస్తామో ..వాటిన‌న్నింటిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్ల‌వ‌చ్చ‌ని తెలిపారు. అమెరికా- ఇండియా దేశాలు క‌లిసి వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు స‌రైన ప్ర‌మాణాలు తీ...

మీషూ స్టార్ట‌ప్‌కు ఎఫ్‌బీ బిగ్ ఆఫ‌ర్

చిత్రం
ప్ర‌పంచంలోని సామాజిక మాధ్య‌మాల్లో టాప్ పొజిష‌న్‌లో ఉన్న అమెరిక‌న్ కు చెందిన ఫేస్ బుక్ ఇండియాలోని బెంగ‌ళూరు కేంద్రంగా కార్య‌క‌లాపాలు సాగిస్తున్న మీషూ స్టార్ట‌ప్ కంపెనీలో పెట్టుబ‌డులు పెట్ట‌నుంది. ఈ మేర‌కు బిగ్ ఆఫ‌ర్ ను ప్ర‌క‌టించింది. ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామ‌న్న‌ది ఆ సంస్థ ప్ర‌క‌టించ‌లేదు. ఎఫ్ బీ ప‌రంగా చూస్తే ఇది రెండో కంపెనీ. రీ సెల్ల‌ర్స్, ఎస్ఎంబీలు, మైక్రో ఆంట్ర‌ప్రెన్యూన‌ర్స్ క‌లుపుతూ ఇండియా వ్యాప్తంగా సంస్థ ను విస్త‌రించేలా చేశారు. సోష‌ల్ మీడియా ద్వారా బ‌య్య‌ర్స్ ను ఆక‌ట్టు కోవ‌డం. అమ్మ‌కాల ద్వారా ఆదాయాన్ని స‌మ‌కూర్చు కోవ‌డం. ఇదంతా సామాజిక మాధ్య‌మాలతో అనుసంధానమై కొద్ది కాలంలోనే లాభాల ప‌ట్టాలెక్కింది మీషూ. మీషూ కంపెనీ మీద త‌మ‌కు న‌మ్మ‌కం ఉంద‌ని, అందుకే ఈ స్టార్ట‌ప్‌లో పెట్టుబ‌డి పెట్టేందుకు ముందుకు వ‌చ్చిన‌ట్లు ఫేస్ బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్ట‌ర్ క‌మ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మోహ‌న్ వెల్ల‌డించారు. 2014 జూలైలో లిటిల్ ఐ ల్యాబ్స్ కంపెనీలో ఇంత‌కు ముందు పెట్టుబ‌డి పెట్టింది ఈ సంస్థ‌. ఆండ్రాయిడ్ యాప్స్‌ను డెవ‌ల‌ప్ చేసేందుకు న్యూ సాఫ్ట్ వేర్ టూల్‌ను క్రియేట్ చేసింది. 10 నుం...

ప్ర‌పంచంలో ఎల్ఐసి న‌మ్మ‌క‌మైన బ్రాండ్

చిత్రం
భార‌తీయ జీవిత బీమా సంస్థ అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. ఇప్ప‌టికే ఇండియాలో సామాన్యుడి నుండి క‌రోడ్‌ప‌తి వ‌ర‌కు బీమా ప‌రంగా విశిష్ట సేవ‌లందిస్తున్న ఈ కంపెనీ ..ఇండియాకు ఓ బ్రాండ్‌గా నిలిచి పోయింది. త‌న‌కంటూ ఓ ఇమేజ్ ను స్వంతం చేసుకుంది. సాధార‌ణ బీమా నుండి అన్ని ఫార్మాట్‌ల‌లో పాల‌సీదారులకు, వారి కుటుంబాల‌కు తోడుగా వుంటోంది. క‌ష్టకాలంలో న‌మ్మ‌కాన్ని..భ‌రోసాను క‌ల్పిస్తోంది. ఈ క్రెడిట్ అంతా ఆ సంస్థ‌ను ఇప్ప‌టికీ ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో..న‌డిపిస్తూ ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో టాప్ వ‌న్‌లో నిలిచింది. ఇదంతా దానిని న‌మ్ముకున్న కోట్లాది ప్ర‌జ‌ల స‌హ‌కారం, ల‌క్ష‌లాది మంది ఏజెంట్లు క‌ష్ట‌ప‌డ‌టం. తాజాగా అంత‌ర్జాతీయ మార్కెట్ రీసెర్చ్ ఏజెన్సీ కంటార్ ఈ ఏడాదికి గాను విడుద‌ల చేసిన టాప్ 100 బ్రాండ్స్ జాబితాలో భార‌త్‌కు చెందిన మూడు కంపెనీలు మాత్ర‌మే చోటు ద‌క్కించుకున్నాయి.  వాటిలో మొద‌టి స్థానం ఎల్ఐసీ, హెచ్‌డిఎఫ్‌సీతో పాటు టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ త‌ర్వాతి స్థానాల్లో నిలిచాయి. జీవిత బీమా సంస్థ‌కు 68 స్థానం ల‌భిస్తే..టీసీఎస్ కు 97 స్థానం ల‌భించింది. అంత‌ర్జాతీయ ఈ కామ‌ర్స్ దిగ్గ‌జ కంపెనీ అమెజాన్ అగ్ర స్థానం...

ప్ర‌జా నాయ‌కా..జ‌గ‌న్మోహ‌నా..జ‌య‌హో

చిత్రం
అవ‌మానాలు ఎదుర్కొని..ఆర్థిక నేరాల కేసుల్లో జైలుపాలై..తిరిగి ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చి..అధికార పీఠం ఎక్కిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రెండ‌వ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్‌సీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌జా రంజ‌క పాల‌న సాగిస్తున్నారు. మూడు సంవ‌త్స‌రాల పాటు అలుపెరుగ‌కుండా ప్ర‌జా యాత్ర పేరుతో పాద‌యాత్ర చేప‌ట్టారు. తండ్రి మ‌ర‌ణం స‌మ‌యంలో సంయ‌మ‌నం కోల్పోని ఈ యువ‌నాయ‌కుడు తిరిగి ప్ర‌జా నేత‌గా ప‌రిణితి చెంద‌డానికి కొన్నేళ్లు ప‌ట్టింది. అయినా అలసి పోలేదు. వెన‌క్కి తిరిగి చూడ‌లేదు. ప‌క్కా ప్ర‌ణాళిక‌తో దూకుడు ప్ర‌ద‌ర్శించారు. అప‌ర చాణుక్యుడిగా దేశంలో పేరుగాంచిన నారా చంద్ర‌బాబు నాయుడును ధీటుగా ఎదుర్కొన్నారు. అటు కేంద్రంలోను ఇటు తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్‌తో స‌ఖ్య‌త‌గా వున్నారు. ప‌రిపాల‌న అంటే ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. టీడీపీకి చుక్క‌లు చూపించారు. త‌న‌కంటూ ఓ న‌మ్మ‌క‌మైన టీంను ఏర్పాటు చేసుకున్నారు.  పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్‌గా పేరొందిన ప్ర‌శాంత్ కిషోర్‌తో కాంట్రాక్టు కుదుర్చుకున్నారు జ‌గ‌న్. ప్ర‌సార‌, ప్ర‌చుర‌ణ మాధ్య‌మాలే కాకుండా సోష‌ల్ , డిజిట‌ల్ మీడియాల‌ను ఆయ‌న వాడుకున్నంత‌గా ఏ నాయ...