పోస్ట్‌లు

నవంబర్ 13, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

మహా సంక్షోభం..అధికారం సగం సగం

చిత్రం
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాను రూపొందించినట్లు సమాచారం. శివసేన, ఎన్సీపీలకు చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవితో పాటు చెరో 14 మంత్రి పదవులు ఇవ్వాలని, కాంగ్రెస్‌కు అయిదేళ్ల పాటు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు 11 మంత్రి పదవులు ఇవ్వాలనే విధంగా ఒప్పందం కుదరనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై తొలుత ఎన్సీపీ, కాంగ్రెస్‌లు చర్చలు జరిపి, ఆ తరువాత శివసేనతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని పేర్కొన్నాయి. ముంబైలోని ట్రైడెంట్‌ హోటల్‌లో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే, కాంగ్రెస్‌ మహారాష్ట్ర అధ్యక్షుడు థోరాత్, మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్, మాణిక్‌ రావు సమావేశమయ్యారు. చర్చలు సరైన దిశలో కొనసాగు తున్నాయని  ఉద్ధవ్‌ ఠాక్రే చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా పార్టీల నుంచి మద్దతు లేఖను సాధించేందుకు తాము అడిగిన మూడ్రోజుల గడువును గవర్నర్‌ కోష్యారీ తిరస్కరించారనే విషయాన్ని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో శివసేన ప్రస్తావించలేదు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఇప్పటికే అమల్లోకి వచ్చినందున, మారుతున్న రాజకీయ సమీకరణాల కారణంగా..మ...

ధర్మాసనం సంచలన నిర్ణయం

చిత్రం
సమాచార హక్కు చట్టం ఇకపై ఈ చట్టం పరిధిలోకి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌  కార్యాలయం కూడా చేరింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టే తేల్చి చెప్పింది. 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం సమర్థించింది. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దృష్టిలో ఉంచుకొని పారదర్శకత కొనసాగాలనీ, భంగకరంగా మార కూడదని వ్యాఖ్యానించింది.  సీజేఐ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చేటప్పుడు పారదర్శకత, గోప్యతల మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాల్సిన అవసరాన్ని కోర్టు నొక్కి చెప్పింది. సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రం లాంటి సమాచార హక్కు చట్టం విస్తృతిని మరింత పరిపూర్ణం చేస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు నిచ్చింది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ కార్యాలయం సైతం సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని తేల్చి చెప్పింది. చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ సారథ్యంలోని ఐదుగురు జడ్జీల   రాజ్యాంగ ధర్మాసనం 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సంపూర్ణంగా సమర్థించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుని సవాల్‌ చేస్తూ స...

హైపవర్ కమిటీ వద్దన్న సర్కార్

చిత్రం
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల మరింత కఠిన వైఖరిని ప్రదర్శిస్తోంది. దీనిపై విపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు, మేధావులు, కళాకారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వం పూర్తిగా తన బాధ్యతల నుండి తప్పుకునే ప్రయత్నం చేస్తోంది. సమ్మె నేపథ్యంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు భావించిన సంగతి తెలిసిందే. సమ్మె సమస్య పరిష్కారానికి ఈ మేరకు జ్యుడీషియల్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని, దీనిపై మీ నిర్ణయం తెలుపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. హైపవర్‌ కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్‌ విముఖత వ్యక్తం చేసింది.1947పారిశ్రామిక వివాదాల పరిష్కార చట్టం ప్రకారం కార్మికులంతా కంపెనీ నిబంధనలకు లోబడి పని చేయాలని, కానీ ఆర్టీసీ కార్మికులు ఏ చట్టాలను పట్టించు కోవడం లేదని ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది.  సెక్షన్‌ 10 ప్రకారం లేబర్ కమిషన్‌కు ఈ సమ్మె విషయమై ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె లేబర్‌ కోర్టు పరిధిలో ఉందంటూ కోర్టు దృష్టికి తెచ్చిం...

కార్పొరేట్ కంపెనీల ఆహార జపం

చిత్రం
ఒక్కో ఐడియా ఒక్కోసారి కోట్లు కురిపించేలా చేస్తుంది. ఒక్కసారి బిజినెస్ లో సక్సెస్ అయితే చాలు వేరే రంగాలకు విస్తరించడం చేస్తూ ఉంటాయి ఆయా కంపెనీలు. ఇప్పటికే ఇండియాలో అతి తక్కువ కాలంలో ట్యాక్సీ సేవల్లో టాప్ రేంజ్ కు చేరుకుంది ఓలా. ఇకపై నోరూరించే వంటకాలతో ఆహార ప్రియులను ఆకర్షించనుంది. రాబడులు పెంచుకునే ప్రణాళికల్లో భాగంగా సంస్థ కొత్త ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టింది. తాజాగా ఆహార వ్యాపార విభాగంలో భారీగా విస్తరిస్తోంది. దీనికోసం సొంత ఫుడ్‌ బ్రాండ్స్‌నూ ప్రవేశ పెడుతోంది. స్విగీ, జొమాటో వంటి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్స్‌లో వీటిని లిస్ట్‌ చేయడంతో పాటు సొంతంగా రెస్టారెంట్లు, క్లౌడ్‌ కిచెన్లు, ఫుడ్‌ ట్రక్కులు, చిన్నపాటి కియోస్క్‌లు కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. భోజనం మొదలుకుని బిర్యానీలు, డెసర్ట్‌లు.. ఇలా అన్ని రకాల ఆహారాలకు సంబంధించి ప్రత్యేక బ్రాండ్స్‌ను రూపొందించే ప్రయత్నాల్లో ఉంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో కస్టమర్లకు మరింత చేరువ కావాలనేది ఓలా వ్యూహం. గతంలో హోటళ్లలో భోజనం చేయడమనేది ఎప్పుడో ఒకసారిగా ఉండేది. ప్రస్తుతం ఇది రోజు వారీ వ్యవహారంగా మారి పోతోంది. ఆహార...

నీతా అంబానీకి అరుదైన గుర్తింపు

చిత్రం
రిఫైనింగ్-టు-టెలికాం దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్  చైర్మన్ ముకేశ్‌ అంబానీ భార్య, దాత నీతా అంబానీ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. దేశ కళలు, సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా ప్రోత్సహిస్తున్న ఆమె న్యూయార్క్‌లో అతిపెద్ద ఆర్ట్ మ్యూజియం బోర్డులో స్థానం దక్కించుకున్నారు. ప్రపంచం నలుమూలల నుండి కళను అధ్యయనం చేసి, ప్రదర్శించే మ్యూజియం సామర్థ్యానికి నీతా అంబానీ మద్దతు భారీ ప్రయోజనాన్ని చేకూర్చిందని మెట్రో పాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ చైర్మన్ డేనియల్ బ్రోడ్స్‌స్కీ  తెలిపారు. ఈ నేపథ్యంలోనే నీతా అంబానీని మ్యూజియం గౌరవ ధర్మకర్తగా ఎంపి‍క చేసినట్టు వెల్లడించారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో పనిచేసిన మొదటి భారతీయ మహిళగా ఖ్యాతి గడించిన నీతా క్రీడల రంగంలో రిలయన్స్ ఫౌండేషన్ చేసిన కృషికి భారత రాష్ట్రపతి నుంచి రాష్ట్ర ఖేల్ ప్రోత్సాహాన్ అవార్డును అందుకున్నారు. అలాగే ఆసియాలో అత్యంత శక్తివంతమైన 50 మంది వ్యాపార వేత్తల ఫోర్బ్స్‌ జాబితాలో  ఒకరిగా నిలిచారు. రిలయన్స్‌కు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ రిలయన్స్‌ ఫౌండేషన్‌  ఛైర్మన్‌గా ఉన్న నీతా అంబానీ దేశీయంగా పలు సేవా కార్యక్రమాలతో పాటు విద్య, వైద్యం, ...

మ్యాక్స్ వెల్ కు విరాట్ బాసట

చిత్రం
ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌ వెల్‌పై టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి ప్రశంసల జల్లు కురిపించాడు. మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేనందున క్రికెట్‌కు విరామం ప్రకటించిన మ్యాక్స్‌ వెల్‌ నిర్ణయం అసాధారనమైదని ప్రశంసించాడు. అలా చెప్పడానికి, విరామం నిర్ణయం తీసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలని కోహ్లి పేర్కొన్నాడు.  2014లో ఇంగ్లండ్‌ పర్యటనలో తాను కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నట్లు వెల్లడించాడు. ఆ సిరీస్‌లో ఒక్క అర్ద సెంచరీ సాధించ లేదని, దీంతో ఆటగాడిగా చాలా కృంగి పోయినట్లు.. అంతే కాకుండా ఇక ప్రపంచం ముగిసి పోయిందని అనుకునే వాడినని తెలిపాడు. అలాంటి గడ్డు పరిస్థితి నుంచి బయట పడటానికి చాలా సమయం పట్టినట్లు చెప్పాడు. ఏ ఒక్కరూ కూడా తన వ్యక్తిగత విషయాలను బయటకు వెల్లడించడానికి ఇష్ట పడరు. కానీ మ్యాక్స్‌ వెల్‌ తను ఎదుర్కొంటున్న సమస్యను బాహ్య ప్రపంచానికి తెలిపాడు. మ్యాక్స్‌ చేసింది అసాధారణం. నేను కూడా ఇక ప్రపంచం ముగిసి పోయందనుకున్న సందర్బాలు చాలా ఉన్నాయి. ఆ సందర్భంలో ఏం చేయాలో అర్థం కాదు. ఈ విషయాన్ని ఎవరితో పంచు కోవాలో కూడా అర్థం కాలేదు. అందరూ ఎవరి పనిలో వారు నిమజ్ఞమై పోతుంటారు. అయిత...

శివసేనపై ట్రబుల్ షూటర్ ఫైర్

చిత్రం
శివసేన కొత్త డిమాండ్లకు తాము తలొగ్గనందునే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరిగిందని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్‌ షా స్పష్టం చేశారు. సీఎం పదవిని పంచు కోవాలనే శివసేన ప్రతిపాదనను తాము ఆమోదించ లేదని చెప్పారు. తమ కూటమి అధికారం లోకి వస్తే మహారాష్ట్ర తదుపరి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ కొనసాగుతారని ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు తాను కూడా బహిరంగంగా ప్రకటించామని షా వెల్లడించారు. అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయని శివసేన తర్వాత కొత్త డిమాండ్‌తో ముందుకు వచ్చిందని ఆరోపించారు. శివసేన డిమాండ్‌ తమకు ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదని చెప్పారు. మరో వైపు కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేనలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ దిశగా కనీస ఉమ్మడి కార్యక్రమం రూప కల్పనపై పార్టీలు సంప్రదింపులు జరుపు తున్నాయని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పృధ్వీరాజ్‌ చవాన్‌ వెల్లడించారు. ముసాయిదా సీఎంపీని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేలు ఆమోదించిన తర్వాత ఈ దిశగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పారు. ఇదిలా ఉండగా ...

మహీంద్రా బంపర్ ఆఫర్

చిత్రం
మిలీనియర్‌ ఆయిల్‌ ట్రేడర్ కుమారుడికి తమ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం కల్పిస్తామని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ చేశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన మిలీనియర్‌ రాకేశ్‌ థక్కర్‌ కొడుకు ద్వార్‌కేశ్‌ థక్కర్‌. ఇంజనీరింగ్‌ చదువుతున్న ద్వార్‌ కేశ్‌కు చదువు పట్ల ఆసక్తి లేని కారణంగా తన స్వస్థలం పాంద్రా నుంచి సిమ్లాకు వెళ్లాడు. సొంతంగా ఎదగాలని నిర్ణయించుకొని అక్కడ ఓ హోటళ్లో అంట్లు శుభ్రం చేసే పనిలో చేరాడు. ప్రతి రోజు అంట్లను శుభ్రం చేసి, రోడ్లపైనే నిద్ర పోయే వాడు. ఈక్రమంలో సిమ్లా పోలీసులు అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా, అతను ఓ మిలీనియర్‌ కొడుకు అని తేలింది. ఓ మిలీనియర్‌ కొడుకు అంట్లు తోముతున్న దృశ్యాలు ప్రధాన పత్రికల్లో రావడంతో అందరూ ఆశ్చర్య పోయారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న ఆనంద్‌, అతనికి తన కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం కల్పించారు. ఈ విషయంపై థక్కర్‌ స్పందిస్తు మహీంద్ర కంపెనీ ఆఫర్‌ను కచ్చితంగా స్వీకరిస్తానని తెలిపాడు. కంపెనీ అధికారులను త్వరలోనే కలుస్తానని చెప్పాడు. మరోవైపు థక్కర్‌ తండ్రి రాకేశ్‌ థక్కర్‌.. మహీంద్ర ఆఫర్‌ చ...

నవ మన్మధుడు ఈ లెజెండ్

చిత్రం
హాలీవుడ్‌ సింగర్‌ జాన్‌ లెజెండ్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే తన పాటలతో జనాలను ఉర్రూత లూగించిన ఈ పాప్‌ సింగర్‌ ఈ ఏడాదికి గాను ‘మోస్ట్ సెక్సీయెస్ట్ మ్యాన్‌’గా నిలిచాడు. ఈ విషయాన్ని ప్రముఖ పీపుల్‌ మ్యాగజైన్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా జాన్‌ లెజెండ్‌ మాట్లాడుతూ ప్రముఖ హాలీవుడ్‌ నటుడు ఇడ్రిస్‌ ఎల్బా తర్వాత నేను ఈ అవార్డును పొందడం చాలా సంతోషంగా ఉంది. అంతే కాకుండా ఈ అవార్డుతో నాలో ఒత్తిడి పెరిగింది. ఈ అవార్డు అందుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. అదేవిధంగా కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే అంత సెక్సీ మెస్ట్‌ మ్యాన్‌గా ఉన్నానా లేదో అనుమానం కలుగుతోంది. అయితే ఈ విషయంలో గతేడాది విన్నర్‌గా నిలిచిన ఇడ్రిస్‌ ఎల్బాను అనుసరిస్తాను అని జాన్‌ లెజెండ్‌ పేర్కొన్నారు. జాన్‌ లెజెండ్‌ తన ట్విటర్‌ ఖాతాలో.. ఒక చిన్న నాటి ఫోటో, ఎల్బా ఫోటో జత చేసి షేర్‌ చేశారు. ఆ ఫోటోకి 1995 నాటి జాన్‌ లెజెండ్‌  చాలా కలవరపడుతున్నాడు. కానీ 2018కి ఎంపికైన ఎల్బాను అనుసరిస్తున్నాడు. 2019 నన్ను ‘మోస్ట్‌ సెక్సీయెస్ట్‌ మ్యాన్‌’ గా ఎంపిక చేసిన పీపుల్‌ మ్యాగజైన్‌కి ధన్యవాదాలు అంటూ కామెంట్‌ చేసి ఎల్బాకు ట్యాగ్‌ చేశారు. ద...

ముంబై ఇండియన్స్ లోకి బౌల్ట్

చిత్రం
న్యూజిలాండ్‌ స్టార్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ తరుపున ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్‌ తన అధికారిక ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్‌ ట్రేడింగ్‌ విండో ద్వారా ఒప్పందం చేసుకుంది. ఇక మరోవైపు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఆటగాడు అంకిత్‌ రాజ్‌పుత్‌ ఆటగాళ్ల మార్పులో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌కు బదిలీ అయ్యాడు. ఐపీఎల్‌-2020 సీజన్‌కు సంబంధించి ట్రేడింగ్‌ విండో గడువు ముగుస్తుండటంతో ఆటగాళ్ల మార్పులు ఇంకా చోటు చేసుకునే అవకాశం ఉంది. ట్రేడింగ్‌ ముగిసిన అనంతరం ఐపీఎల్‌ వేలం డిసెంబర్‌19న కోల్‌కతాలో జరగనుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇప్పటి వరకు మూడు ఫ్రాంచైజీల తరుపున బౌల్ట్‌ ఆడాడు. తొలుత సన్‌రైజర్స్‌ తరుపున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన ఈ లెఫ్టార్మర్‌..ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తరుపున ప్రాతినిథ్యం వహించాడు. అయితే వచ్చే సీజన్‌ కోసం సక్సెస్‌ ఫుల్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌తో ట్రెంట్‌ బౌల్ట్‌ జత కట్టాడు. ఇక అంకిత్‌ రాజ్‌పుత్‌ కూడా కింగ్స్‌ పంజాబ్‌ తరుపున ఆడి జట్టుకు ఎన...

పెద్దాయనా నీకో దండం

చిత్రం
కోట్లున్నా సాయం చేసేందుకు చేతులు రావు. అకౌంట్లలో కోట్లు మూలుగుతున్నా, లక్షల్లో వేతనాలు పొందుతున్నా, చేతినిండా సంపాదిస్తున్నా పట్టెడన్నం పెట్టలేని ప్రబుద్ధులు ఎందరో ఈ సమాజంలో నేటికీ ఉన్నారు. కానీ డబ్బున్న మహారాజులు సిగ్గుతో తలొంచుకునేలా ఓ చిరు కుటుంబానికి చెందిన వ్యక్తి భారత సైన్యానికి తన వంతుగా సహాయం చేశాడు. వేలాది మందికి స్ఫూర్తిగా నిలిచాడు. జీవితమంతా గడిపింది చిరు వ్యాపారి గానే.. కానీ గుణంలో మాత్రం భారీ ఉదారతను చాటుకున్నారు. తాను వృద్ధాశ్రమంలో ఉంటూనే కష్టపడి సంపాదించిన 50 లక్షల రూపాయలను భారత సైన్యానికి విరాళంగా ఇచ్చి తన దేశభక్తిని చాటుకున్నారు. సూర్యాపేట జిల్లా మట్టపల్లికి చెందిన సిరిపురం విశ్వనాథం గుప్తా. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్య రాజన్‌ను కలిసి తన కష్టార్జితం నుండి 50 లక్షలను సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి అందించాలని కోరుతూ చెక్‌ అంద జేశారు. 78 సంవత్సరాల వయసులో, మట్టపల్లిలోని వృద్ధాశ్రమంలో ఉంటూ కాలం వెళ్ల్లదీస్తున్నారు విశ్వనాథం. యాభై ఏళ్లు వ్యాపారంలో ఎంతో సంపాదించా.. నేను పుట్టిన తీగుళ్ల తో పాటు నేను పెరిగి, వ్యాపారం చేసిన హుజూర్‌నగర్‌ ప్రాంతంలోనూ అనేక దేవాలయాలకు ఆర...

స్వంత గూటికే రమ్య ప్రిఫర్

చిత్రం
కన్నడ నాట సంచలన నటిగా పేరు పొందిన రమ్య కొంత కాలం తర్వాత తిరిగి తన స్వంత గూటికి రానున్నారు. దీంతో ఆమె అభిమానులు ఆనందానికి లోనవుతున్నారు. గతంలో ఆమెకు విపరీతమైన క్రేజీ ఉండేది. అయితే సినిమాల్లో ఫుల్ స్వింగ్ లో నటిగా వెలుగొందుతున్న సమయంలోనే క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా రమ్య తిరిగి మూవీల్లో నటించేందుకు సంసిద్ధమనే సంకేతాలు పంపారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ సరసన అభి మూవీలో నటించడం ద్వారా తన కెరీర్‌ను స్టార్ట్ చేసింది. నటి రమ్య తక్కువ సమయంలోనే కన్నడ చిత్రసీమలో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగారు. అ ‍ యితే ముక్కు సూటిగా మాట్లాడే ధోరణితో ఆమె వివాదాస్పద నటిగా కూడా పేరొందారు. 2013లో రాజకీయాల్లో అడుగు పెట్టిన రమ్య 2017లో కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు. దీంతో తాను ప్రాణప్రదంగా ప్రేమించే సినిమాలకు దూరమయ్యారు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయంతో ఆమె సోషల్‌ మీడియా బాధ్యతల నుంచి వైదొలిగారు. తనకు ఇప్పటికీ ఆఫర్లు వస్తున్నాయని, వాటిని తాను అంగీకరించ లేదని, అయితే సినిమాల్లో తిరిగి పని చేయడం తనకు ఫన్‌ గానే ఉంటుందన్నారు. దీనిపై ఇప్పడే ఏ...