పోస్ట్‌లు

మే 8, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

వ్య‌వ‌సామే బెట‌ర్ అంటున్న ఇంజ‌నీర్

చిత్రం
ఎవ‌రైనా ప్ర‌భుత్వ కొలువు వ‌దులుకుంటారా..అలా చేస్తే అత‌డిని పిచ్చోడ‌ని మ‌నం కామెంట్స్ చేస్తాం. కానీ హ‌రీష్ ద‌న్ దేవ్ మాత్రం నెల నెలా వ‌చ్చే జీతాన్ని వ‌దులుకున్నాడు కేవ‌లం వ్య‌వ‌సాయం మీదున్న ప్రేమ‌తో. జైస‌ల్మేర్ ప్రాంతానికి చెందిన హ‌రీష్ ..మేధావి. ఇంగ్లీష్ భాష‌పై మంచి ప‌ట్టుంది. ప్ర‌భుత్వ ఇంజ‌నీర్‌గా ప‌నిచేశాడు. కానీ ఎందుక‌నో దాని మీద ఆస‌క్తి త‌గ్గి పోయింది. 2012లో జైపూర్‌లో ఇంజ‌నీరింగ్ కంప్లీట్ చేశాడు. ఢిల్లీలో ఎంబీఏ కోసం అప్ల‌యి చేశాడు. ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ ప‌రీక్ష రాసి ఎంపిక‌య్యాడు. ఆ త‌ర్వాత ఉద్యోగం చేసుకుంటూనే ఎంబీఏ చ‌దివాడు. జూనియ‌ర్ ఇంజ‌నీర్‌గా జైస‌ల్మేర్ మున్సిపాలిటీలో ప‌నిచేశాడు. రెండు నెల‌ల పాటు ప‌నిచేశాక స‌ర్కార్ జాబ్ పై ఆస‌క్తి తగ్గింది. బిక‌నేర్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్శిటీని సంద‌ర్శించాడు హ‌రీష్‌. కందులు, సిరి ధాన్యాల గురించి తెలుసుకున్నారు. వ్య‌వ‌సాయ నిపుణుల‌తో చ‌ర్చించాక ఓ నిర్ణ‌యానికి వ‌చ్చాడు. అలోవేరా ఫార్మింగ్ చేస్తే బావుంటుంద‌ని సూచించ‌డంతో దానిపై దృష్టి పెట్టారు. మ‌రింత సాగుపై అవ‌గాహ‌న పెంచుకునేందుకు ఢిల్లీకి వెళ్లారు. అక్క‌డ వ్య‌వ‌సాయ రంగంపై ఏర్పాటు చ...

ఫోర్బ్స్ మెచ్చిన ఫెవికోల్ మ్యాన్ - వేలాది మందికి బ‌తుకునిచ్చిన పారేఖ్

చిత్రం
ఫెవికోల్ పేరు చెబితే ఎవ‌రైనా ఇట్టే గుర్తు ప‌డ‌తారు. అంతలా పాపుల‌ర్ అయ్యింది ఈ ప్రొడ‌క్ట్. ఇది లేకుండా ఇపుడు నిర్మాణ రంగం ముందుకు వెళ్ల‌లేని ప‌రిస్థితి. ఒక‌ప్పుడు ప్యూన్ గా ప‌నిచేసిన బ‌ల‌వంత్ పారేఖ్ ..ఇపుడు కోట్లాది రూపాయ‌ల వ్యాపార సామ్రాజ్యానికి అధిప‌తిగా ఎదిగారు. ఫెవికోల్ మెన్ గా ఆయ‌న‌ను ఆప్యాయంగా పిలుస్తారు. ఆయ‌న సాగించిన జ‌ర్నీ గురించి తెలుసు కోవాలంటే ఈ క‌థ త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే. 1959లో పిడిలైట్ ఇండ‌స్ట్రీస్ ను స్థాపించాడు పారేఖ్. ఇండియ‌న్ మార్కెట్‌లో ఆయ‌న ప్రారంభించిన కంపెనీ వాటా 75 శాతానికి పైగా ఉందంటే అర్థం చేసుకోవ‌చ్చు దాని మ‌హ‌త్తు ఏమిటో. గుజ‌రాత్ లోని భ‌వ్‌న‌గ‌ర్ జిల్లా మ‌హువా గ్రామంలో పారేక్ జ‌న్మించారు. న్యాయ విద్య అభ్య‌సించాల‌ని ముంబ‌యి వెళ్లారు. మ‌ధ్య‌లోనే చ‌దువు ఆపేశారు. గుజ‌రాత్‌లో మహాత్మా గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా మూవ్ మెంట్‌లో పాల్గొన్నారు. సామాజిక కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన్నారు. లా డిగ్రీ పూర్తి చేశాక‌..న్యాయ‌వాదిగా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. ముంబ‌యిలో బ‌త‌క‌డం క‌ష్టంగా మార‌డంతో ...డ‌యింగ్, ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించాడు. అక్క‌డ కూడా వ‌ర్క‌వుట్ కా...

13 వేల పెట్టుబ‌డి ..8 వేల కోట్ల రాబ‌డి

చిత్రం
ఎక్క‌డికి వెళ్లినా..ఐస్ క్రీంల‌కు ఉన్నంత డిమాండ్ ఇంకే దానికి ఉండ‌డం లేదు. ఎన్నో కంపెనీలు వాటిని త‌యారు చేస్తున్నాయి. క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు తంటాలు ప‌డుతున్నాయి. చెన్నైకి చెందిన ఆర్జీ చంద్ర‌మొగ‌న్ క‌థ మాత్రం వేరు. ఆయ‌న ఐస్ క్రీంలను త‌యారు చేయ‌డం మొద‌లు పెట్టాడు. పెట్టిన పెట్టుబ‌డి ల‌క్ష‌లు కాదు..జ‌స్ట్ 13 వేల రూపాయ‌లు మాత్ర‌మే. ఆ పెట్టుబ‌డే ఇవాళ 8 వేల కోట్ల రాబ‌డి తీసుకు వ‌చ్చేలా చేసింది. ఇది రియ‌ల్లీ స‌క్సెస్ ఫుల్ స్టోరీ. ఆయ‌న‌కు ఇపుడు 67 ఏళ్ల వ‌య‌సు. కానీ అలా క‌నిపించ‌రు. నిత్యం క‌ష్ట‌ప‌డ‌టం ఆయ‌న నైజం. చెన్నైలోని స్వాంకీ హాట్స‌న్ బిల్డింగ్‌లో స్వంత ఆఫీసులో కొలువుతీరి ఉన్నారు ప్ర‌శాంతంగా. విజ‌య‌పు ద‌ర‌హాసంతో ..ఎన‌లేని ఎన‌ర్జీని స్వంతం చేసుకున్న ఆయ‌న ఏది చెప్పినా అదో పాఠ‌మే. అంత‌లా ప్ర‌భావితం చేస్తున్నారు. అరున్ ఐస్ క్రీమ్స్ భారీ వాటా క‌లిగి ఉన్న‌ది. అతి పెద్ద డెయిరీ సంస్థ‌గా పేరు తెచ్చుకుంది. హాట్స‌న్ ప్రొడ‌క్స్ కు చెన్నై లో ఎన‌లేని డిమాండ్ ఉంటోంది. విరుధాన‌గ‌ర్ జిల్లాలోని తిరుతంగ‌ల్ కు చెందిన చంద్ర‌మొగ‌న్ 21 ఏళ్ల వ‌య‌సున్న‌ప్పుడు త‌న క‌ల‌ల‌ను నిజం చేసేందుకు న‌డుం బిగించా...

అంచ‌నాలు తారుమారు..ప్రాంతీయ పార్టీలే కీల‌కం

చిత్రం
ప్రీ పోల్ స‌ర్వేల దెబ్బ‌కు కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని క‌ల‌లు కంటున్న బీజేపీ కూట‌మి ఆశ‌లు రోజు రోజుకు స‌న్న‌గిల్లుతున్నాయి. మ‌రో వైపు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ కూట‌మి జోరుమీదుంది. మోదీ ప్ర‌భంజ‌నం త‌గ్గింద‌ని..క‌నీసం బీజేపీ ప్ర‌భుత్వానికి 100 సీట్లు త‌గ్గే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని స‌ర్వేలు స్ప‌ష్టం చేయ‌డంతో ..దేశంలోని ప్రాంతీయ పార్టీల‌న్నీ కూట‌మిగా ఏర్ప‌డేందుకు ఇప్ప‌టి నుంచే వ్యూహాలు ర‌చిస్తున్నాయి. ఆయా పార్టీల‌కు చెందిన అధినేత‌ల‌తో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అలుపెరుగ‌కుండా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క , ఢిల్లీ , కేర‌ళ నేత‌ల‌తో మంత‌నాలు జ‌రిపారు. ఇప్ప‌టికే కూట‌మి దిశ‌గా అడుగులు ప‌డేలా కృషి చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో కంటే ఈసారి ఎన్నిక‌ల్లో బీజేపీ స‌ర్కార్ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభించ‌డం వ‌ల్ల ..జ‌నాద‌ర‌ణ త‌గ్గింద‌ని..ఆ నెగ‌టివ్ ఓట్లు కాంగ్రెస్ వైపు మొగ్గుతాయ‌ని చంద్ర‌బాబు అంచ‌నా వేస్తున్నారు. ఇరు పార్టీలు ఇపుడు గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఏ పార్టీకి కేంద్రంలో పూర్తి స్థాయిలో ప్ర‌భుత్వాన్...

వెలాసిటీదే హ‌వా ..మెరిసిన వ్యాట్

చిత్రం
ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ త‌ర‌హాలో మ‌హిళల కోసం ఇండియాలో నిర్వ‌హిస్తున్న టీ -20 ఛాలెంజ్ టోర్నీలో వెలాసిటీ జ‌ట్టు అల‌వోక‌గా నెగ్గింది. ఈ జ‌ట్టుకు మిథాలీ రాజ్ నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో సూప‌ర్ నోవాస్ జ‌ట్టును ఓడించిన ట్ర‌య‌ల్ బ్లేజ‌ర్స్ ను రెండో మ్యాచ్‌లో వెలాసిటీ ఓడించింది. బౌల‌ర్లు త‌మ ప్ర‌తిభ‌ను చూపించ‌డంతో మూడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. మొద‌ట‌గా ఏక్తా బిస్ట్ , కేర్ లు చెరో వికెట్లు తీశారు. దీంతో ట్ర‌య‌ల్ బ్లేజ‌ర్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి 112 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ఈ జ‌ట్టులో హ‌ర్లీన్ డియోల్ ఒక్క‌రే 43 ప‌రుగులు భారీ స్కోర్ చేసింది. మొద‌టి మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ స్మృతి మంధాన ఈసారి మాత్రం కేవ‌లం 10 ప‌రుగులు మాత్ర‌మే చేసి వెనుదిరిగింది. సుజీ బేట్స్ తో క‌లిసి హ‌ర్లీన్ ఇన్నింగ్స్ కు మంచి పునాది వేసినా..ఆ త‌ర్వాత ఆమెకు స‌రైన స‌హ‌కారం అంద‌లేదు. ఛేద‌న‌లో ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ డేనియ‌లీ వ్యాట్ , ష‌ఫాలీ వ‌ర్మ స‌త్తా చాట‌డంతో ఒక ద‌శ‌లో రెండు వికెట్లు కోల్పోయి 111 ప‌రుగుల వ‌ద్ద నిలిచింది. అయితే విజ‌యానికి మ‌ర...

ఉత్కంఠ పోరులో స‌న్ రైజ‌ర్స్ అవుట్ - చెన్నైతో అమీతుమీకి ఢిల్లీ రెడీ

చిత్రం
స‌మ ఉజ్జీల మ‌ధ్య పోరాటం ఎలా వుంటుందో తెలుసు కోవాలంటే ..ఐపీఎల్ మ్యాచ్‌లు చూడాల్సిందే. ప్ర‌తి జ‌ట్టులో ఏదో ఒక ప్ర‌త్యేక‌తతో టోర్నీలో త‌మ ప్ర‌తాపాన్ని చూపించింది. ప్ర‌పంచ క‌ప్ కు వార్మ‌ప్ మ్యాచ్‌లుగా ప‌నికొస్తాయ‌ని బీసీసీఐ భావించింది. పేరుకే వ‌య‌సులో చిన్నోళ్ల‌యినా టోర్నమెంట్‌లో అభిమానుల‌కు త‌మ అద్భుత‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించి తీపి జ్ఞాప‌కాల‌ను మిగిల్చారు. రిష‌బ్ పంత్, శాంస‌న్ లాంటి ఆట‌గాళ్లు మెరిశారు. ఎలాంటి బంతులైనా స‌రే అల‌వోక‌గా ఆడారు. ప‌రుగులు రాబ‌ట్టారు. ఇండియ‌న్ క్రికెట్ టీంకు ఆట‌గాళ్ల కొర‌త అంటూ లేకుండా పోయింది. ఒక‌రు కాక పోతే మ‌రొక‌రు రెడీగా ఉన్నారు ..దేశం త‌ర‌పున ఆడేందుకు. ఐపీఎల్ పుణ్య‌మా అంటూ టాలెంట్ క‌లిగిన క్రికెట‌ర్స్ త‌మ‌ను తాము ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ల‌భించింది. దీంతో ఐపీఎల్ బౌల‌ర్లు, బ్యాట్స్ మెన్స్ కు ఓ వేదిక‌గా ఉప‌యోగ ప‌డింది. విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా జ‌రిగిన ఐపీఎల్ ఎలిమినేట‌ర్ లో ఢిల్లీ జ‌ట్టు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుపై ఘ‌న విజ‌యం సాధించింది. ఆరు విజ‌యాల‌తో ప్లే ఆఫ్ లో చోటు సంపాదించిన ఆ జ‌ట్టు మ‌రో అడుగు వేయ‌లేక చ‌తికిల ప‌డింది. ఓవ‌ర్ ఓవ‌ర్ కు మ‌ధ్య...

ఎనిమిది వేల పెట్టుబ‌డి..500 కోట్ల రాబ‌డి - వాట్ ఏ జ‌ర్నీ

చిత్రం
ద‌మ్ముండాలే కానీ ఆకాశాన్ని అందుకోవ‌చ్చు. మండే గుండెల‌కు భ‌రోసా క‌ల్పించ‌వ‌చ్చు. వంద‌లాది మందికి ఉపాధి చూపించొచ్చు. కావాల్సింద‌ల్లా భిన్నంగా ఆలోచించ‌డం..విభిన్నంగా ప్ర‌యాణం చేయ‌డం. మారుతున్న టెక్నాల‌జీకి అనుగుణంగా వ్యాపారాన్ని ప్రారంభించ‌డం ఇదే నేటి అంకురాల‌కు అంకురార్ప‌ణ చేస్తే చాలు ..రూపాయ‌ల‌తో పాటు డాల‌ర్లు మ‌న చెంత‌కు చేరుతాయి. ఇండియాలో కేవ‌లం 8 వేల రూపాయ‌ల పెట్టుబ‌డితో 500 కోట్ల రూపాయ‌ల‌ను ఆదాయంగా స‌మ‌కూర్చు కోవ‌డం న‌మ్మలేని నిజం..ఇది మ‌న ముందున్న వాస్త‌వం. ఈ రియ‌ల్లీ స్టోరీని తెలుసు కోవాలంటే ..గూర్గాన్ కేంద్రంగా ప్రారంభించిన ఈ స్టార్ట‌ప్ కంపెనీ ఓన‌ర్ అమిత్ దాగా గురించి తెలుసు కోవాల్సిందే. ఎందుకంటే అత‌ను సాధించిన ఈ విజ‌యం అసాధార‌ణ‌మైన‌ది. ఎంద‌రికో స్ఫూర్తి దాయ‌కంగా నిలుస్తుంది. న‌మ్మ‌కం, నాణ్య‌త‌, వినియోగ‌దారుల అభిరుచుల‌కు అనుగుణంగా ప్రొడ‌క్ట్స్ ను చేర‌వేయ‌డం ఇదే వ్యాపార విజ‌య ర‌హ‌స్యం. ప్ర‌తి రోజు ల‌క్ష‌లాది మంది త‌మ అవ‌స‌రాల నిమిత్తం ఏదో ఒక‌టి కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, రియ‌ల్ ఎస్టేట్, టెలికాం రంగాలు అభివృద్ధి చెందుతుండ‌డం..వేలాది మందికి ప్ర‌త్య...

ఇండియ‌న్ యాప్స్‌లో డిఫ‌రెంట్ .. లైవ్ లోకోతో ప్లే అండ్ ఎర్న్

చిత్రం
ఇండియాలో ఐడియాస్‌కు కొద‌వ‌లేదు. లెక్కలేనంత ప్ర‌తిభ క‌లిగిన ఔత్సాహికులు ఎంద‌రో ఉన్నారు. స్టార్ట‌ప్‌లు..ఆంట్ర‌ప్రెన్యూర్స్ గా ఎదిగేందుకు కేంద్ర ప్ర‌భుత్వం, ఆయా రాష్ట్రాలు వెన్ను ద‌న్నుగా నిలుస్తున్నాయి. కొత్త అంకురాల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. మ‌న తెలివికి చిన్న ప‌రీక్ష పెట్టి..డ‌బ్బులు ఇస్తే ఎంత బావుంటుందో క‌దూ ..అలాంటి ఆలోచ‌న‌ల్లోంచి పుట్టిందే లోకో యాప్. ఆదాయంతో పాటు ఏకంగా విజ్ఞానం పెంపొందించు కోవ‌చ్చు దీంతో. మొబైల్ క్విజ్ షోను గౌర‌వ్ క‌పూర్ డెవ‌ల‌ప్ చేశాడు. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు ..ఎక్క‌డి నుంచైనా ఆప‌రేట్ చేయొచ్చు. కావాల్సింద‌ల్లా నెట్ క‌నెక్టివిటీ, కాస్తంత మెద‌డుకు ప‌దును పెడితే చాలు..ఆడుతూనే ఎర్నింగ్ చేయొచ్చ‌న్న‌మాట‌. సామాజిక దిగ్గ‌జాల్లో రిజిష్ట‌ర్ అయిన వాళ్లు కూడా ఈ యాప్ ద్వారా ఆడేయొచ్చు. డ‌బ్బులు పోగేసుకోవ‌చ్చు. ఫేస్ బుక్ , లింక్డ్ ఇన్, రెడ్డిట్, వాట్స్ యాప్, ట్విట్ట‌ర్‌లో వాడుకోవ‌చ్చు. నాలెడ్డ్ మీకెంతుందో చూసుకోవ‌చ్చు. ప‌నిలో ప‌నిగా మెద‌ళ్లు పాద‌ర‌సంలా ప‌నిచేస్తాయి. బాడీకి కావాల్సిన జోష్ ..సంపాదించిన డ‌బ్బులతో వ‌స్తాయి. ఆట‌కు ఆట‌..మెద‌డ‌కు మేత‌..ఇంకో వైపు...