పోస్ట్‌లు

ఆగస్టు 29, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్రభాస్ భళారే ..సాహో సూపరే..!

చిత్రం
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద అంచనాలకు అందకుండా సంచనాలు సృష్టిస్తున్న ఒకే ఒక్క సినిమా సాహో నిన్నటి దాకా రాజమౌళి బాహుబలి రికార్డులు తిరగ రాస్తే , ఇప్పుడు సుజిత్ రెడ్డి తీసిన ఈ మూవీ రికార్డుల సునామీ రేపుతోంది. టాలీవుడ్ లో ఇప్పటి దాకా హాలీవుడ్ రేంజ్ లో ఇలాంటి సినిమాను ఏ డైరెక్టర్ తీయలేక పోయాడు. కంట్రీ అంతటా ఈ మూవీ గురించిన చర్చ జరుగుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సినీ జనాలకు, ఫ్యాన్స్ కు జీవితం లో మరిచి పోలేని రీతిలో కిక్ ఇచ్చాడు. తన పేరు మీదున్న రికార్డులను తానే అధిగమించాడు, ఈ పాన్ ఇండియన్ స్టార్. హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో డైరెక్టర్ సుజీత్ రెడ్డి తెరకెక్కించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఏ సినిమా చేయని రీతిలో సాహో ను 10 వేల థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పటికే వారం రోజుల వరకు అన్ని థియేటర్లలో టికెట్లు బుక్ అయిపోయాయని అభిమానులు వాపోతున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో సుజీత్ రూపొందించాడు. ఒక్కసారిగా ప్రభాస్ ఇప్పుడు ఇండియాలో టాప్ మోస్ట్ న్యూస్ మేకర్ గా మారి పోయాడు.బాడీ పరంగా  సిల్వర్ స్టోలెన్ ను తలపించే ప్రభాస్ తన సత్తా ఏమిటో మరోసారి చాటాడు. ఇంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా...

సింధు సరే...వీళ్లకేం తక్కువ ..?

చిత్రం
ఈ దేశాన్ని కాషాయ మయం చేయాలని అనుకుంటున్న మోడీ, అమిత్  షా , ఆర్. ఎస్ . ఎస్.  పరివారం సక్సెస్ అయినప్పటికీ, ఇంకా కార్పొరేట్ , బిజినెస్ టైకూన్లు , రిలయన్స్ అంబానీ, ఆదానీలదే  హవా నడుస్తోంది. మన్ కీ బాత్ , స్వచ్ఛ భారత్ అని ప్రచారం చేస్తున్నంతగా దేశం ఎదగడం లేదు. వీరి ప్రభావం దేశంలోని అన్ని రంగాలపై పడింది. ఏకంగా వ్యాపారం పేరుతో జనాన్ని బురిడీ కొట్టిస్తూ కోట్లాది  రూపాయలు  కొల్లగొడుతూ ఆస్తులు సంపాదిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ బడా బాబులకు వంత పాడుతోంది. ఈ బిలియనీర్లు ఇప్పుడు ఆటగాళ్లను స్పాన్సర్ చేస్తున్నారు. వీరిని బ్రాండ్ అంబాసిడర్లు గా వాడుకుంటున్నారు. ఇండియాలో మహిళల విభాగంలో పీవీ సింధు ఏడాదికి 20 కోట్లకు పైగానే సంపాదిస్తోందని అమెరికాకు చెందిన ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ప్రపంచ స్థాయిలో ఒకే ఒక్క ఛాంపియన్ షిప్ సాధించిన సింధును ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కానీ అయిదు బంగారు పతకాలు సాధించి పెట్టి , దేశాన్ని , జాతిని  తలెత్తుకునేలా చేసిన చిరుత పులి హిమ దాస్,  బాక్సింగ్ ఛాంపియన్ షిప్ సాధించిన మేరీ కోమ్ , ఒకే కాలుతో ప్రతిభ చూపిన జోషి గు...

అరవై ఏళ్ళ నవ మన్మధుడు

చిత్రం
పట్టుమని ముప్పై ఏళ్లకే జవసత్వాలు కోల్పోతున్న ఈ తరుణంలో అతను మాత్రం 60 ఏళ్ళ వయసు వచ్చినా ఇంకా నవ మన్మధుడిగానే అలరిస్తున్నారు. తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఓ బ్రాండ్ ను, ఇమేజ్ ను స్వంతం చేసుకున్న నాగార్జున అక్కినేని. నవరసాలను పలికించే అతికొద్ది మంది నటుల్లో నాగ్ ఒకరు. అక్కినేని నాగేశ్వర్ రావు రెండో కుమారుడు ఆయన. నట వారసత్వం పుణికి పుచ్చుకున్నా ఏ రోజు ఎవ్వరిని అనుకరించ లేదు. అటు మహిళలు ఇటు యూత్ అభిమానులను సంపాదించుకున్నారు. ఎప్పుడూ పెదవుల మీద చిరునవ్వు చిందిస్తూ నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. యాక్టర్ గా , బిజినెస్ మెన్ గా, యాంకర్ గా ఇలా ప్రతి ఫార్మాట్ లో నాగ్ సక్సెస్ అయ్యారు. డ్రెస్సెస్ ఎంపిక దగ్గరి నుంచి, ప్రతి పనిలో , నటనలో రిచ్ నెస్ ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఎన్నో సినిమాలు నటించినా చాలా మూవీస్ జనాన్ని ఎంటర్ టైన్ చేసాయి. నాగ్ కెరీర్లో మన్మధుడు అతి పెద్ద హిట్. దానికి సీక్వెన్స్ గా తాజాగా మన్మధుడు -2 విడుదలైంది. ఆ సినిమా కంటే ఈ కొత్త సినిమాలో నాగార్జున మరింత అందంగా, రొమాంటిక్ గా కనిపించారు. ముద్దులు హద్దు మీరినా నాగ్ కోసం మహిళలు వెళ్లడం సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. పెళ్...

ఈటెల తూటాలు..మాటల మంటలు..!

చిత్రం
తెలంగాణాలో రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయన మాటల తూటాలు పేల్చారు. దీంతో గులాబీ దళంలో మంత్రి చేసిన మాటలు మంటలు రేపాయి. తాజాగా త్వరలో జరిగే రాష్ట్ర మంత్రివర్గంలో కీలక మార్పులు ఉంటాయని, ఉత్తర తెలంగాణలో సీనియర్ నాయకుడిని మారుస్తారంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో సీరియస్ గా తీసుకున్న ఈటెల రాజేందర్ కరీంనగర్ జిల్లాలో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం సంచలనం కలిగించింది. తాను ఆరిపోయే దీపాన్ని కాదాని, వెలిగే దీపాన్ని అని ఈటెల అన్నారు. తాను ఎవరి నుంచైనా 5 వేల రూపాయలు తీసుకున్నట్టు నిరూపిస్తే, రాజకీయాల నుంచి ఇప్పుడే తప్పుకుంటానని చెప్పారు. తనపై కొన్ని ప్రసార మాధ్యమాలలో వచ్చిన వార్తలపై ఆయన ఘాటుగా స్పందించారు. తనపై వచ్చిన వార్తల పట్ల కలత చెందారు. తనపై జరుగుతున్న చిల్లర ప్రచారంపై సమాధానం చెప్పాల్సిన పని లేదన్నారు. ఉద్యమ సమయం నుంచి తెరాసతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. తన గడప తొక్కిన ప్రతి ఒక్కరికి సాయం చేశానని ఈటెల చెప్పారు.15 ఏళ్లలో తాను ఏ ఒక్కరి నుంచీ డబ్బులు తీసుకోలేదని చెప్పారు. మంత్రి పదవి తనకు భిక్ష కాదని.. ఆ పదవి కోసం ...

కేజ్రీవాల్ నిర్ణయం..మహిళలకు వరం..ఢిల్లీలో ఉచిత ప్రయాణం..!

చిత్రం
అవనిలోనే కాదు సమాజంలో సగ భాగమైన మహిళలకు మేలు చేకూర్చేలా చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు, ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈ దేశంలో ఎక్కడా లేవిధంగా పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించారు. మెరుగైన విద్య కోసం నిధులు ఖర్చు చేశారు. అంతే కాకుండా విద్యా హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నారు. మహిళా సాధికారత పేరుతో ఒకే ఒక్క రోజును నిర్వహించి చేతులు దులుపుకోవడం కాదు, కావాల్సింది వారు తమ కాళ్లపై తాము నిలబడాలి. అంతే కాదు మహిళలు, యువతులు ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్లగలిగేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని గతంలోనే పలుసార్లు ప్రకటించారు. అయితే బీజేపీ మాత్రం ఇదంతా ఆప్ ఆడుతున్న నాటకం అని కొట్టి పారేస్తోంది. తాజాగా కేవలం మహిళల కోసం ఉచితంగా బస్సులో ఎక్కడికైనా ప్రయాణించే సౌలభ్యం ఏర్పాటు చేసింది సర్కార్. దీంతో మహిళలు కేజ్రీవాల్ కు జేజేలు పలుకుతున్నారు. భాయ్ దూజ్ పండగను పురస్కరించుకొని అక్టోబర్ 29 నుంచి ఈ కార్యక్రమం అమల్లోకి రానుంది. ఈ మేరకు సమావేశమైన ఆప్ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. మహిళలకు సురక్షిత ప్రయాణ అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతోనే ...