పోస్ట్‌లు

ఏప్రిల్ 1, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

జ‌నం జ‌నసంద్రం..ప‌వ‌న్ ప్ర‌భంజ‌నం

చిత్రం
జ‌న‌మే జ‌నం ఎటు చూసినా జ‌న‌మే. ఇసుక వేస్తే రాల‌నంత జ‌నం. ఊహించ‌ని రీతిలో అభిమానులు ప్రేమ‌గా పిలుచుకునే ప‌వ‌ర్ స్టార్ కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. భావ సారూప్య‌త క‌లిగిన మేధావులు, వ్య‌క్తులు, సంస్థ‌ల‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముందు నుంచి క‌లిసి న‌డుస్తున్నారు. ప‌వ‌న్ వెన్నంటి అపార రాజ‌కీయ‌ప‌ర‌మైన అనుభ‌వం క‌లిగిన నాదెండ్ల మ‌నోహ‌ర్ ఉండ‌నే ఉన్నారు. ప‌వ‌న్ చిటికె వేసినా..లేదా మాట్లాడినా తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజ‌నాన్ని సృష్టిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈసారి జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ కొద్ది శాతం తేడాతో అధికారంలోకి వ‌చ్చింది. బీజేపీతో చెలిమి కూడా లాభించింది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంట్, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీన్ మారింది. తెలుగుదేశం పార్టీ తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న‌దైన శైలితో పాద‌యాత్ర చేప‌ట్టారు. తానే ప‌వ‌ర్లోకి వ‌స్తాన‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. టీడీపీ నుండి టికెట్లు ద‌క్క‌ని వారంతా జ‌గ‌న్ పంచ‌న చేరారు. అన్ని పార్ట...

జ‌నం చేతుల్లో ఆయుధం..ప్ర‌జాస్వామినికే త‌ల‌మానికం రాజ్యాంగానికి ర‌క్ష ..జాతికి సుర‌క్ష‌..ఓటు ..!

చిత్రం
అయిదేళ్ల‌కు ఒక‌సారి వ‌చ్చే ఎన్నిక‌ల‌ను చూసి ఆవేశ ప‌డిపోతే ఎలా..నిరుత్సాహానికి గురైతే ఏం ప్ర‌యోజ‌నం. ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశంగా భార‌త‌దేశానికి పేరుంది. ఇక్క‌డున్నంత స్వేచ్ఛ ఇంకే దేశంలోను లేదంటే అతిశ‌యోక్తి కాదు. ఎన్నో కులాలు, మ‌తాలు, వ‌ర్గాలు, జాతులు కోట్లాది మంది స‌ఖ్య‌త‌తో జీవిస్తున్నారు. అభిప్రాయాలలో భేదాలు ఉన్న‌ప్ప‌టికీ..ఆలోచ‌న‌ల్లో తేడాలు ఉన్న‌ప్ప‌టికీ ఎన్నిక‌లు వ‌చ్చే స‌రిక‌ల్లా ఎవ‌రికి వారు త‌మ ఆత్మ ప్ర‌బోధం మేర‌కు ఓటు హ‌క్కు వినియోగించుకుంటున్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకు వ‌చ్చిన మ‌హాత్ముడు క‌ల‌లు క‌న్న గ్రామాలు పురోభివృద్ధి సాధించాలంటే ఓటును వాడుకోవాల్సిందే. ప్ర‌తి అయిదేళ్ల‌కు ఒక‌సారి పార్ల‌మెంట్‌కు..ఆయా రాష్ట్రాల‌లో శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతాయి. ఇది స‌ర్వ‌సాధార‌ణం. కొన్ని సంద‌ర్భాల‌లో ఓటు వేయ‌కుండా త‌మ‌కెందుకులే అనే ధోర‌ణితో చాలా మంది దూరంగా ఉంటున్నారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ధ‌తి కాదు. రాజ్యాంగం ప్ర‌తి ఒక్క‌రికి ఓటు హ‌క్కు వినియోగించుకునే అరుదైన అవ‌కాశాన్ని ఇచ్చింది. దీని ద్వారానే మ‌నం ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను..మ‌న కోసం ప‌...

జ‌నం మెచ్చిన లీడ‌ర్లు..మాట‌లతో మంట‌లు ..!

చిత్రం
ఓ వైపు ఎండ‌లు మండిపోతుంటే..మ‌రో వైపు జ‌నం మెచ్చిన పొలిటిక‌ల్ లీడ‌ర్లు మాత్రం త‌మ పంచ్‌లు..ప్ర‌సాల‌తో మ‌రింత అగ్గి రాజేస్తున్నారు. ఎన్నిక‌ల పుణ్య‌మా అంటూ ఊపిరి పీల్చుకున్న జ‌నానికి త‌మ మాట‌ల తూటాల‌తో కంటి మీద కునుకే లేకుండా చేస్తున్నారు. పోలింగ్ కొద్ది రోజులే ఉండ‌డంతో లీడ‌ర్ల పంచ్‌ల‌ను భ‌లే ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియాలోనే త‌న మాట‌ల‌తో మెప్పించే ద‌మ్మున్న లీడ‌ర్‌గా తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత‌..ప్ర‌స్తుత తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పేరుంది. ఇంగ్లీష్‌, తెలుగు, హిందీ, ఉర్దూ త‌దిత‌ర భాష‌ల‌లో ఆయ‌న‌కు మంచి ప‌ట్టుంది. అన్నింటికంటే తెలంగాణ యాస‌, మాండ‌లికాన్ని ఆయ‌న వంట ప‌ట్టించుకున్నంత‌గా ఇంకే నాయ‌కుడు ప్రాక్టీస్ చేయ‌లేదు. ఏ విష‌యం గురించైనా అన‌ర్ఘ‌లంగా ప్ర‌సంగించ‌గ‌ల ద‌మ్ము ..ధైర్యం ఒక్క కేసీఆర్‌కే ఉన్న‌ది. జనాన్ని మాట‌ల‌తో మెస్మ‌రైజ్ చేయ‌డం..కొత్త విష‌యాల గురించి తెలియ చేయ‌డం..ల‌క్ష‌లాది ప్ర‌జ‌ల‌ను ఒకే చోట నుండి క‌ద‌ల‌నీయ‌కుండా చేయ‌డంలో ఆయ‌నకు ఆయ‌నే సాటి. కేసీఆర్ వ‌చ్చుడో..స‌చ్చుడో అంటూ ఆయ‌న ఇచ్చిన నినాదం జ‌నాన్ని ఉద్య‌మం వైపు మ‌ళ్లేలా చేసింది. ఏకంగా ప్ర‌త్యేక రాష్ట్రం సిద్ధించేందు...