పోస్ట్‌లు

జులై 12, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

వారెవ్వా నీరా..మ‌స్తు..జ‌బ‌ర్ద‌స్తు..?

చిత్రం
బ‌లిదానాలు, త్యాగాలు, పోరాటాల సాక్షిగా కోరి తెచ్చుకున్న తెలంగాణ‌లో ఇపుడు కొలువుల జాడ లేక పోగా..తాగ‌డంలో తెలంగాణ నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌లోకి వ‌చ్చేట‌ట్టు క‌నిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు క‌లిసి వేల కోట్లకు పైగా తాగి తందానాలు ఆడారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసిన మహానుభావులు అందినంత మేర ..ముంద‌స్తుగానే కేసుల‌ను బుక్ చేసుకున్నారు. ఓట‌ర్ల‌కు పైస‌లు ఇచ్చుడు..తాగుడు షురూ చేయడంతో జ‌నం జై తెలంగాణ అన్న‌రు. ఇంకేం ఐదేళ్ల‌కు లైసెన్స్ దొరికింద‌ని స‌ర్కార్ భ‌లే ముచ్చ‌ట ప‌డుతున్న‌ది. ఇక అధికారులు, కింది స్థాయి సిబ్బంది ఆగ‌డాల‌కు చెప్ప‌నీక లేదు. ఎక్క‌డ దొర‌క ప‌డితే అక్క‌డ నోట్ల క‌ట్ట‌లు బ‌ట్ట‌బ‌య‌లు అవుతున్న‌వి. పాడుగాను..ఓ వైపు మా భూములు మా పేర్ల మీద రాయ‌కుండ లంచం అడుగుతున్న‌రంటూ ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకుంట లేరు. ఊర్ల‌ల్ల బ్యాంకుల ప‌డ్డ పైస‌ల‌న్నీ క‌ల్లు దుకాణాలు, మ‌ద్యం షాపుల‌కు చేరుతున్న‌యి. మ‌స్తుగ తాగుతున్న‌రు..సోయి లేకుండా పండుతున్న‌రు. ఇపుడు తెలంగాణ స‌ర్కార్ మ‌రో ప్లాన్ కు తెర తీసింది. త్వ‌ర‌లో నీరా పాల‌సీ తీసుకు రావాల‌ని అనుకుంటోంది. సాధ్య‌మ‌వుతుందా లేదా అని సూడుండ్రంటూ...

అంచ‌నాలు మించిన ఫ‌లితాలు .. ఆనంద డోలిక‌ల్లో ఉద్యోగులు

చిత్రం
ఓ వైపు ఐటీ రంగం ఒడిదుడుకుల‌కు లోన‌వుతుంటే మ‌రో వైపు పొరుగు సేవ‌ల‌ను అందిస్తూ త‌న‌కంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న ఇండియాకు చెందిన ఇన్ఫోసిస్ కంపెనీ ఆశించిన దానికంటే గ‌ణనీయ‌మైన ఫ‌లితాల‌ను అందుకుంది. ఓ ర‌కంగా మార్కెట్ వ‌ర్గాల‌ను సైతం విస్తుపోయేలా చేసింది ఈ కంపెనీ. మొద‌టి నుంచి బెంగ‌ళూరు కేంద్రంగా ప‌నిచేస్తున్న ఈ ఐటీ దిగ్గ‌జ కంపెనీ, విలువ‌ల‌కు పెద్ద పీట వేస్తూ..చాప కింద నీరులా ఐటీ రంగంలో నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్ లో ఉండేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఉద్యోగ భ‌ద్ర‌త‌తో పాటు మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తోంది ఈ కంపెనీ. దీంతో టెక్కీలు, ఐటీ ఎక్స్ ప‌ర్ట్స్ అంతా ఇన్ఫోసిస్ కంపెనీకే త‌మ మొద‌టి ప్ర‌యారిటీని ఇస్తున్నారు. ఈ ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్ అంటే 2019 - 2020 వ సంవ‌త్స‌రం తొలి మూడు నెల‌ల‌కు గాను క‌న్సాలిడేటెడ్ ఆదాయం వార్షిక ప్రాతిప‌దిక‌న చూస్తే ..3 వేల 802 కోట్ల‌తో 5.2 శాతంగా న‌మోదైంది. ఇది కంపెనీ ప‌రంగా చూస్తే అరుదైన రికార్డుగానే భావించాలి. గ‌త నెల‌తో ముగిసిన మూడు నెల‌ల్లో ఇన్ఫోసిస్ ఆదాయం వార్షిక ప్రాతిప‌దిక‌న 21 వేల 803 కోట్ల‌కు చేరుకుని 13.9 శాతంగా న‌మోదైంది. గ‌త ఏడాది ఇదే కాలంలో...

చ‌ట్టం ముందు అంతా స‌మానం .. స‌భాప‌తిపై ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం

చిత్రం
ఈ దేశంలో ఎవ‌రైనా స‌రే .. ఏ స్థాయిలో వున్నార‌నేది ముఖ్యం కాదు..ప్ర‌తి ఒక్క‌రికి హ‌క్కులు..బాధ్య‌త‌లు ఒకేలా ఉంటాయి. ప్ర‌జాప్ర‌తినిధులైనంత మాత్రాన వారికి ప్ర‌త్యేక చ‌ట్టాలంటూ వుండ‌వు. ఇది గుర్తించి న‌డుచు కోవాల్సిన బాధ్య‌త ఎన్నికైన వారికి వుండాలి. తెలియ‌క పోతే తెలుసుకోవాల్సిన బాధ్య‌త వారిపై ఉంది. స‌భాప‌తి అయినంత మాత్రాన మేం చేతులు క‌ట్టుకుని కూర్చోవాల్సిన అవ‌స‌రం లేదంటూ ..స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం క‌ర్నాట‌క స్పీక‌ర్ ర‌మేష్ కుమార్ తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. త‌న‌కు కొంత స‌మ‌యం కావాల‌ని కోరుతూ స్పీక‌ర్ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది. ఈ సంద‌ర్భంగా ఘాటైన వ్యాఖ్య‌లు చేసింది ధ‌ర్మాస‌నం. కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబ‌ల్ ఎమ్మెల్యేల రాజీనామాలు, వారి అన‌ర్హ‌త పై ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోకూడ‌దంటూ స్పీక‌ర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. అస‌లు స్పీక‌ర్ మా గురించి ఏమ‌నుకుంటున్నారు..? స‌ర్వోన్న‌త న్యాయ స్థానం అధికారాల‌ను స్పీక‌ర్ స‌వాల్ చేస్తున్నార‌ని అనుకోవాలా...ఇదేనా ఆయ‌న ఉద్దేశం..? స‌్పీక‌ర్‌కు ఆదేశాలు జారీ చేసేందుకు సంబంధించి మాకున్న ప‌వ...

రేప‌టి క్రికెట్ జ‌గ‌జ్జేత ఎవ‌రో - ప్ర‌పంచం ఉత్కంఠ భ‌రితం..!

చిత్రం
అంచ‌నాలు రేపి..ఆశ‌లు ప‌రుగులు తీసేలా చేసి..కోట్లాది గుండెల్లో గుబులు రేపి..మ‌న‌సుల్ని నిదుర పోనీయ‌కుండా చేసిన ప్ర‌పంచ క్రికెట్ క‌ప్‌ను ఎవ‌రు స‌గ‌ర్వంగా ముద్దాడుతారో రేప‌టితో స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఫైన‌ల్‌కు అనూహ్య‌మైన రీతిలో దూసుకొచ్చిన న్యూజిలాండ్ ఒక వైపు..అంచ‌నాల‌కు మించి ప్రొఫెష‌న‌ల్ ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించ‌డ‌మే కాకుండా హాట్ ఫేవ‌రేట్‌గా ఫ్యాన్స్ నుంచి నీరాజనాలు అందుకుంటున్న ఆతిథ్య ఇంగ్లండ్ జ‌ట్టు మ‌రో వైపు క‌ద‌న రంగంలోకి దూకేందుకు రెడీ అంటోంది. ఇరు జ‌ట్ల మ‌ధ్య హోరా హోరీగా పోటీ మాత్రం జ‌ర‌గ‌నుంద‌న్న‌ది ఖాయం. ఒక‌టా రెండా ఏకంగా ల‌క్ష‌ల‌ను దాటి..ట్రిలియ‌న్ డాల‌ర్ల మార్కెట్‌ను దాటేసింది క్రికెట్ టోర్నీ అంటే న‌మ్మ‌గ‌ల‌మా.  ఇది అక్ష‌రాల వాస్త‌వం. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ మ్యాచ్‌ల‌ను ప్ర‌సారం చేసేందుకు భారీ ఎత్తున బిడ్డింగ్ నిర్వ‌హిస్తే ..దిగ్గ‌జ కంపెనీలు పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కు మీడియా రారాజుగా వెలుగొందుతున్న స్టార్ టీవీ గ్రూపు చేజిక్కించుకుంది. ఇది కూడా ఓ రికార్డు. ప్ర‌పంచానికి టెన్నిస్, ఫుట్ బాల్ మాత్ర‌మే తెలుసు ..మొన్న‌టి దాకా..కానీ ఇవాళ లోకాన్ని క్రికెట్ శాసిస్తోంది..ఊపేస్తోంది....

వ్య‌క్తిత్వ వికాస సూత్రాలు..స్ఫూర్తి కిర‌ణాలు (పాఠాలు)

చిత్రం
1) భ‌క్త బాంధవులారా మీకు మంగ‌ళాశాస‌నాలు ..ప్ర‌తి హృద‌యం ప్రేమ పూరిత‌మైన‌దే అయి వుంటుంది. కావాల్సింద‌ల్లా సంక‌ల్ప బ‌లం. అది కావాలంటే మిమ్మ‌ల్ని మీరు సంస్కరించు కోవాలి. అప్పుడే జ‌న్మ ధ‌న్య‌మ‌వుతుంది. 2) దుస్తులు శ‌రీరానికి క‌ప్పుకోవ‌డానికో లేదా ధ‌రించ డానికో ప‌నికి వ‌స్తాయి. అదే మ‌న‌సును క‌మ్ముకున్న చీక‌టి తెర‌ల‌ను తొల‌గించాలంటే..భ‌క్తి అనే దుప్ప‌టితో శుభ్రం చేస్తే ..హృద‌యం తేలిక‌వుతుంది. ఆ స‌మ‌యంలో ఏ ప‌ని అయినా సుల‌భం అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంది. 3) ఎన్ని ఆస్తులు సంపాదించినా..ఎన్ని నోట్ల క‌ట్ట‌లు పోగేసుకున్నా ఏం లాభం . గుండెల్లో ప్రేమ‌త‌నం..మాన‌వ‌త్వం లేక‌పోతే..భ‌క్తిత‌త్వం అల‌వ‌ర్చుకోక పోతే ఉండీ ఏం లాభం. రోజూ కొత్త‌ద‌నాన్ని ఆస్వాదించండి. ప్ర‌కృతిని ప్రేమించండి. దానితో మ‌మేకం అయ్యేందుకు మిమ్మ‌ల్ని మీరు స‌న్న‌ద్ధం చేసుకోండి . 4) ప్ర‌తి ఒక్క‌రు జీవించి ఉన్నారు అంటే అర్థం మ‌నం చేయాల్సిన మంచి ప‌నులు ఇంకా మిగిలి ఉన్నాయ‌న్న మాట‌. అందుకే దేవుడు మీ వైపు చూస్తూనే ఉన్నాడు. అంత‌రాత్మ‌ను మించిన దైవం లేదు. అదెప్పుడూ మ‌న‌ల్ని ఎరుక ప‌రుస్తూనే ఉంటుంది. 5) క‌రు...

క‌భీ క‌భీ మేరే దిల్ మే..ఖ‌యాల్ ఆథా హై..!

చిత్రం
ఎన్ని సార్లు విన్నా గుండెల్లో ఏదో వెలితి..ఒక‌టా ..రెండా..వంద‌లా ..కాదు..వేల‌సార్ల‌కు చేరుకుంది ..ఈ పాట విన్న‌ప్పుడ‌ల్లా..శ్రీ‌లంక రేడియో స్టేష‌న్ లో క‌భీ క‌భీ మేరే దిల్ మే ..ఖ‌యాల్ ఆథా హై..అంటూ మంద్ర స్వ‌రంలో వినిపించేది. అలా ఇంటి ముందు..నేల‌పై ఎన్నిసార్లు ప‌డుకుని నిద్ర పోయానో..లెక్క‌లేదు. పైన చంద్రుడు..మ‌ధ్య‌లో వెన్నెల..నిర్మ‌ల‌మైన ఆకాశం..ముఖేష్ గొంతులోంచి జాలు వారుతుంటే ..గుండె ఆగిపోతుందేమోన‌న్న ఆందోళ‌న‌..అయినా ఏమిటీ ఇంత‌టి మ‌హ‌త్తు ఉంటుందా ..ఏమో తెలియ‌దు..ఊహ తెలిసిన‌ప్ప‌టి నుంచి పాట‌లన్నా..కన్నీళ్లు నిండిన క‌విత్వ‌మంటే చ‌చ్చేంత ఇష్టం..వాటిపై అమ‌లిన ప్రేమ‌..ఎడ‌తెగ‌ని ఇష్టం కూడా. జీవిత‌మంటే ఆస్తులు..అంత‌స్తులు..నోట్ల క‌ట్ట‌లు..హోదాలు..ప‌ద‌వులు కాదు..గుప్పెడంత ప్రేమ కావాలి. హృద‌యానికి తోడు లేక పోతే..మ‌న‌సును వెలిగించే ధూపం లేక‌పోతే ఎట్లా..తుజే జ‌మీపే అంటూ ల‌త మార్ద‌వ‌మైన గొంతుతో ఆలాపిస్తుంటే..ఆక‌లి ఎట్లా అవుతుంది..ఏముందు ఆ స్వ‌రంలో ..దేవుడు ముందే అమ‌ర్చి పంపించాడా అనిపించింది. అప్ప‌ట్లో రాజేష్ ఖ‌న్నా పిచ్చి..ఎంతంటే..గుండెలో ప‌ట్ట‌లేనంత అభిమానం. వ్యామోహం కూడా. హ‌మ్ దోనో..దో ప్రేమీ అ...

అంద‌రి చూపు ఐటీ కోర్సుల‌పైనే - స్టూడెంట్స్ ప్ర‌యారిటీ వీటికే

చిత్రం
ఐటీ రంగంలో చోటు చేసుకుంటున్న పెను మార్పుల దెబ్బ‌కు స్టూడెంట్స్ ఏం చ‌ద‌వాలో అర్థం కాని ప‌రిస్థితిలో ఉన్నారు. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీకి ఎన‌లేని డిమాండ్ పెర‌గ‌డంతో వీరి ప్రాధాన్య‌త దీనిపైనే ఉంటోంది. తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం ఎంసెట్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించింది. మ‌రో వైపు జాతీయ స్థాయిలో ఈ ప‌రీక్ష కంటే ముందే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ ప‌రీక్ష‌ల‌ను చేప‌ట్టింది. దేశ వ్యాప్తంగా లక్ష‌ల సంఖ్య‌లో విద్యార్థులు హాజ‌రయ్యారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీస్, నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీస్, ఐఐటిహెచ్ అండ్ ఐఐటిబి క్యాంప‌స్‌ల‌తో పాటు మ‌రికొన్ని ఇంజ‌నీరింగ్ కాలేజీలు స్టూడెంట్స్ ను వ‌డ‌పోత పోశాయి. వారు క‌న‌బ‌ర్చిన ప్ర‌తిభ ఆధారంగా మార్కుల‌తో పాటు ర్యాంకుల‌ను ప్ర‌క‌టించింది. తాజాగా టీఎస్ ఎంసెట్‌ను ఈసారి జ‌వ‌హ‌ర‌ల్ లాల్ నేష‌న‌ల్ టెక్నాల‌జీ యూనివ‌ర్శిటీ ప‌రీక్ష నిర్వ‌హించింది. ఆయా సీట్లు, ఫీజులు, కోటాల‌ను కేటాయిస్తూ సీట్ల భ‌ర్తీ ప్ర‌క్రియ చేప‌ట్టింది. ఎంసెట్ సీట్ల మొద‌టి విడ‌త కేటాయింపులో సుమారు 16 వేల‌కు పైగా సీట్లు మిగిలి పోయాయి. వీటిలో ఎక్కువ‌గా విద్యార్థులు ఐటీ రిలేటెడ్...