పోస్ట్‌లు

ఆగస్టు 9, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

పెరిగిన ఇళ్ల ధరలు..బతుకులు బుగ్గి పాలు..రియల్లీ రియల్ దందా..!

చిత్రం
ఒకప్పుడు చేతిలో ఓ యాభయ్యో ..వంద రూపాయలు వుంటే చాలు ఈజీజీ బతికే వీలుండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. నీళ్లు , నిధులు , నియామకాల కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పక్కా రియల్ ఎస్టేట్ దందా కొనసాగుతోంది. ఐటి హబ్ మాటేమిటో కానీ సామాన్యులు , మధ్యతరగతి ప్రజలు బతికే పరిస్థితులు కనిపించడం లేదు . గత పాలకుల  హయాంలో ఈ ప్రాంతం కబ్జాకు , దోపిడీకి తెరలేసింది. విలువైన భూములు చాలా అన్యాక్రాంతమైనవి. ఎక్కడ చూసినా రాళ్లు , రియల్ ఎస్టేట్ వెంచర్లు  , అపార్ట్ మెంట్లు దర్శనమిస్తున్నాయి. ఇంకో వైపు ఆకాశాన్ని తాకేలా ఐటి కంపెనీలు కొలువు తీరాయి . కొలువుల సంగతి దేవుడెరుగు ఉన్న కొద్ది జాగా లేకుండా పోయింది .నగరాన్ని వ్యాపారులు , కంపెనీలు , కాలేజీలు , మాల్స్ , నగల దుకాణాలు , మొబైల్స్ స్టోర్స్ , రెస్టారెంట్స్, కార్ల షో రూమ్ లు , దుస్తుల దుకాణాలు వందల కొద్ది వెలిశాయి. ఇక నగరమంతా ఒక వైపు వుంటే పాతబస్తీ మాత్రం ఎప్పటి లాగానే ఉన్నది. అభివృద్ధికి నోచుకోవడం లేదు. వేలాది మందికి నిలువ నీడ దొరకని పరిస్థితి. ఇక రియల్ ఎస్టేట్ దందా మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. దేశం లో ఎక్కడా లేని రీతిలో ఇక్కడ ...

అపజయంపై అంతర్మధనం - పార్టీకి చంద్రబాబు చికిత్స

చిత్రం
దేశ రాజకీయాల్లో టీడీపీ అధినేత నారా చంద్ర బాబు నాయుడుకు యెనలేని పేరున్నది. ఆయనకు అపారమైన అనుభవం ఉన్నప్పటికీ, అపర చాణుక్యుడిగా వినుతికెక్కిన ఆయన తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా అపజయం పాలు కావడంపై బాబు జీరించుకోలేక పోతున్నారు. ఏపీకి పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. ఏకంగా కొన్ని సీట్లకే పరిమితం కావడం, అతిరథ మహారథులు అనుకున్న సీనియర్లు, మాజీ మంత్రులు ఘోరంగా ఓటమి పాలయ్యారు. ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు మేలు జరిగేలా పథకాలను అమలు చేసారు. అధికారులను పరుగులు పెట్టించారు. కానీ ఆశించిన రీతిలో తాను నమ్ముకున్న నాయకులు అందుకోలేక పోయారు. దీంతో చంద్ర బాబు ఒక్కడే ..ఒంటరిగా మిగిలారు. రాష్ట్ర రాజధాని అమరావతి కోసం ఎంతో కష్టపడ్డారు. అంతే కాకుండా కొత్త రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకు వచ్చెనందుకు కృషి చేసారు. అయినా జనం టీడీపీ కంటే వైసీపీ నే ఎక్కువగా నమ్మారు. భారీ ఎత్తున ఆ పార్టీకి అంతులేని విజయాన్ని ఇచ్చారు. ఇప్పటికే చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటల తూటాలు పేల్చుతున్నారు. బాబు హయాంలో తీసుకున్న ని...

బీసీసీఐకి కోలుకోలేని షాక్ - ఇక ఎక్కడైనా టెస్టింగే

చిత్రం
ప్రపంచంలోనే భారీ ఆదాయం కలిగిన, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ బీసీసీఐకి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది నాడా. మేం పూర్తిగా ఇండిపెండెంట్. మాపై ఇంకొకరి పెత్తనం ఏమిటి..? మా నిర్ణయాలు మేమే తీసుకుంటాం. మమ్మల్ని నియంత్రించే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు అంటూ బీరాలు పలికిన బీసీసీఐ ఇప్పుడు ప్లేట్ ఫిరాయించింది. కేంద్ర ప్రభుత్వంలోని క్రీడా మంత్రిత్వ శాఖ పరిధిలోకి ఆటుగాళ్లను పరీక్షించేందుకు వీలుగా సంతకం చేయడంపై సీనియర్ల నుంఢి పూర్తిగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాజకీయ జోక్యం ఎక్కువై పోయిందని, మంచి పరిణతి కలిగిన ఆటగాళ్లు ఎంపిక కావడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ మేరకు క్రికెటర్లను పరీక్షించే భాద్యత ఇకపై నాడాదే నంటూ బీసీసీఐ సీయివో జోహ్రి సంతకం చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇదే అంశంపై తాము ఒక్క పైసా ప్రభుత్వం నుండి కానీ , క్రీడా సంస్థ నుంచి కానీ  తీసుకోవడం లేదని , తామెందుకు మీ పరిధిలోకి రావాలంటూ గత కొన్నేళ్లుగా యుద్ధం నడుస్తోంది. బీసీసీఐ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉంటూ వచ్చింది. మోదీ కేంద్రంలో కొలువు తీరాకా సీన్ మారింది . ప్రతి వ్యవస్థ పై పట్టు కలిగేందుకు ప్రయత్నం చేశారు ....

పరుగులు తీస్తున్న కృష్ణమ్మ ..జలకళతో శ్రీశైలం

చిత్రం
భారీగా కురుస్తున్న వానలతో దేశంలోని పలు ప్రాంతాలు, రాష్ట్రాలు తల్లడిల్లి పోతున్నాయి. ఇప్పటికే జలదిగ్భందంలో చిక్కుకుని పలువురు మృతి చెందారు. మరి కొందరు వరద ఉధృతికి కొట్టుకు పోయారు. తెలంగాణాలో నదులు పొంగి  ప్రవహిస్తున్నాయి. మరో వైపు ప్రాజెక్టులు , ఎత్తిపోతల పథకాలు నిండు కుండల్ని తలపింప చేస్తున్నాయి. గోదావరి ఉగ్ర రూపం దాల్చితే ..కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కర్ణాటకలో భారీగా వర్షాలు  కురుస్తుండడంతో ఆల్మట్టి , నారాయణపూర్ జలాశయాలు పూర్తిగా నిండి పోయాయి. ప్రమాద స్థాయిని దాటాయి. దీంతో నీటి పారుదల అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్ నిండి పోయింది . ఇక్కడి అధికారులు గేట్లను తెరిచారు . శ్రీశైలం ప్రాజెక్ట్ కు భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో అది కూడా నిండి పోయింది . ఏపీ మంత్రితో పాటు తెలంగాణకు చెందిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్ , నిరంజన్ రెడ్డి , ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నాలుగు గేట్లను ఏపీ మంత్రి పూజలు చేసి తెరిచారు . దిగువన ఉన్న ఈ నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు చేరుతుంది . ప్రాజెక్ట్ కింద ఉన్న ఆయకట్టుదారులకు కొంత ఉపశమనం లభిస్తుంది. ఇప్పటి...

కాషాయ కండువా కప్పుకున్న వివేక్

చిత్రం
తెలంగాణాకు పెద్ద దిక్కుగా, పెద్దాయనగా పిలుచుకునే దివంగత నాయకుడు, బహుజనుల బాంధవుడు వెంకట స్వామి కుమారుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి బీజేపీ లో చేరారు . దేశ రాజధాని ఢిల్లీలో రాష్త్ర పార్టీ అధినేత లక్ష్మణ్ , కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి తో కలిసి బీజీపీ దేశ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కాషాయ కండువాను కప్పుకున్నారు. ఆయనతో పాటు ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్ , తదితర నాయకులు, అనుచరులు , అభిమానులు, కార్యకర్తలతో కలిసి బీజేపీలో చేరారు. ఈ దేశంలో ప్రస్తుతం బీజేపీ పార్టీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చేరిక సందర్బంగా వివేక్ చెప్పారు.  సున్నిత మనస్తత్వం కలిగిన వివేక్ ఇప్పుడు తెలంగాణలో పేరున్న నాయకుడు. ఆయనకు సమున్నత స్తానం కపించనున్నట్లు పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు. తెలంగాణాలో గత సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని రీతిలో బీజేపీ పుంజుకుంది. దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీని నమోదు చేసుకుని, ఏకంగా ఏ పార్టీ మద్దతు లేకుండానే కేంద్రంలో పవర్ లోకి వచ్చింది. ఆయా రాష్ట్రాల్లో కాషాయ జెండా రెప రెప లాడేలా మోదీ, అమిత్ షాలు వర్కవుట్ చేస్తున్నారు. సౌత్ లో కర్ణాటకలో కమల దళం...

గరిమా యాదవ్ నీకో సలాం .. నీ స్ఫూర్తి ఎందరికో ఆదర్శం

చిత్రం
ఆమె అందాల పోటీల్లో అందరి లాగే గరిమా యాదవ్ పాల్గొన్నారు. పార్టిసిపెంట్స్ ను దాటుకుని విజేతగా నిలిచారు. కానీ వచ్చిన ప్రసంశలు ..ప్రచారం ..డబ్బులు ..ఇవేవీ ఆమెను ఆకట్టుకోలేక పోయాయి. తన లక్ష్యం ఐఏఎస్ కావాలని. కానీ మెయిన్స్ దాకా ఆగి పోయింది . ఈ సమయంలో అందాల పోటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తనను తాను ప్రూవ్ చేసుకుంది. విజేతగా గెలిచినా ఎందుకో ..తన మనసు అందుకు ఒప్పుకోలేదు . అంతా బ్యూటీ క్వీన్ గా పిలుస్తూ వుంటే ఆమె మాత్రం దేశం వైపు చూసింది. ఇదే సమయంలో ఇంకొందరైతే ఇదే పొజిషన్ తో ఉంది పోయేవారు . కానీ ఆమె తీసుకున్న నిర్ణయం ఎందరినో విస్మయానికి గురి చేసింది. 25 ఏళ్ళ వయసు ఉన్న గరిమా యాదవ్ ఏకంగా ఇండియన్ ఆర్మీని ఎంచుకున్నారు. ఇంకొకరైతే సైనిక రంగం అంటేనే జడుసుకుంటారు. 2017 లో ఆమె బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత దేశ స్థాయిలో సీడీఎస్ పరీక్ష రాసారు . అందులో పాసై భారతీయ సైన్యంలో చేరారు . మా వాళ్లకు నేను ఒక్కదానినే ఉన్నా. నా పరిమితులు ఏమిటో తెలుసు . ఎన్నో ఇబ్బందులు ..కష్టాలను చవి చూసా. లైఫ్ లో కొన్ని స్వానుభవం లోకి వచ్చాయి . ఆర్మీ పాఠశాల లో చదివా. సెయింట్ స్టీఫెన్ కాలేజీలో డిగ్రీ పూర్త...