పోస్ట్‌లు

డిసెంబర్ 1, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఇక సెలవన్న ఎమ్మెస్కే ప్రసాద్‌

చిత్రం
భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, ప్రస్తుత ఇండియన్ క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ మన్నవ శ్రీకాంత ప్రసాద్ పదవీ కాలం ముగిసింది. సంక్షోభంలో ఉన్న భారతీయ క్రికెట్ కు ఓ రకంగా దిశా నిర్దేశం చేసేందుకు ప్రయత్నం చేశారు. తెలుగు వాడైన ఎమ్మెస్కె సక్సెస్ ఫుల్ గా తన పదవీ బాధ్యతలు నిర్వహించారు. 2016లో ఆయన భారత క్రికెట్ ఎంపిక సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ప్రసాద్ స్వంత స్థలం గుంటూరు నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడికొండూరు గ్రామం. నాన్న రవిప్రసాద్‌ గుంటూరులోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లేబొరేటరీలో పని చేసే వారు. ఆయనకు ఒక సోదరుడు, సోదరి ఉన్నారు. వీళ్ళ ఊళ్లో ప్రతీ మూడిళ్లలో ఒక డాక్టరో, ఇంజనీరో ఉండే వారు. అలానే ఇతడి సోదరుడు కూడా ఇంజనీర్‌ కాగా, సోదరి డాక్టర్‌. ప్రాథమిక విద్యాభ్యాసం గుంటూరు లోని కేంద్రీయ విద్యాలయలో పూర్తయింది. గ్రాడ్యుయేషన్ హిందూ కళాశాలలో పూర్తి చేశాడు. పాఠశాల దశలోనే క్రికెట్‌పై ఆసక్తి కలిగింది. ఇంట్లో కూడా ప్రోత్సాహం లభించడంతో గుంటూరుకు వచ్చి పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో గంటల తరబడి ప్రాక్టీసు చేసేవాడు. వికెట్‌ కీపింగ్‌ ఇతడికి సహజ సిద్ధంగానే అబ్బింది. గుంటూరులో జరిగిన కోచింగ...

హెడ్గే సెన్సేషన్ కామెంట్స్

చిత్రం
మెజారిటీ లేక పోయినా మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్‌ మూడు రోజుల పాటు హై డ్రామా నడపడంపై బీజేపీ సీనియర్ నేత, కర్నాటక ఎంపీ అనంత కుమార్ హెడ్గే సంచలన కామెంట్స్ చేశారు. 40 వేల కోట్ల కేంద్ర నిధులు  వృథా కాకుండా కాపాడేందుకే ఫడ్నవిస్‌ను సీఎంను చేశారని ఆరోపించారు. ఒకవేళ చివరి నిమిషంలో ఫడ్నవిస్ రంగంలోకి దిగ కుండా ఉండి వుంటే ఆ నిధులను శివసేన కూటమి దుర్వినియోగం చేసేదేనని హెడ్గే ధ్వజమెత్తారు. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి శివసేన మరి కొద్ది గంటల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనగా, ఎన్సీపీ అసమ్మతి నేత అజిత్ పవార్ అండతో హడా విడిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం 15 గంటల్లోనే ఫడ్నవిస్ కేంద్ర నిధులను వెనక్కి తరలించినట్టు హెడ్గే విమర్శించారు. దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర సీఎంగా 80 గంటలు కొనసాగిన సంగతి మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆయన రాజీనామా చేశారు. ఈ డ్రామా అంతా ఆయన ఎందుకు నడిపినట్టు. మెజారిటీ లేక పోయినా ఆయన సీఎం అయ్యారని మీకు తెలియదా అని అందరూ అడుగుతున్నారు. దాదాపు 40 వేల కోట్ల కేంద్ర నిధులను ఫడ్నవిస్ కాపాడారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంల...

జియో బ్రాడ్‌‌‌‌బ్యాండ్‌‌‌‌పై అనాసక్తి

చిత్రం
ముకేశ్‌‌‌‌ అంబానీ జియో పేరుతో టెలికం కంపెనీని 2016లో ప్రారంభించినప్పుడు, ప్రజలంతా దాని సిమ్‌‌‌‌ కార్డుల కోసం క్యూలు కట్టారు. నెల రోజులపాటు జియో స్టోర్ల ఎదుట ఎప్పుడూ చూసినా రద్దీ కనిపించేది. సిమ్‌‌‌‌ కార్డ్‌‌‌‌ దొరికితే పండగే అన్నట్టు ఉండేది పరిస్థితి. మొదటగా జియో సేవలను ఉచితంగా ఇచ్చారు. తదనంతరం చవకగా టారిఫ్‌‌‌‌లను ప్రకటించింది జియో కంపెనీ. దీంతో విపరీతమైన డిమాండు నెలకొంది. జియో గిగాఫైబర్‌‌‌‌ పేరుతో బ్రాడ్‌‌‌‌ బ్యాండ్‌‌‌‌ సేవలను ప్రకటించినప్పుడు కూడా ఉత్సాహం కనిపించింది. కొన్ని నెలల పాటు దీని సేవలనూ ఉచితంగా ఇచ్చారు. మూడు నెలల క్రితం టారిఫ్‌‌‌‌లను ప్రకటించిన తర్వాత మాత్రం జనంలో ఆసక్తి తగ్గింది. కనీస చార్జీలు 699 రూపాయల నుంచి మొదలు కావడమే ఇందుకు ప్రధాన కారణం. జియో ప్రత్యర్థులు ఎయిర్‌‌‌‌టెల్‌‌‌‌, యాక్ట్‌‌‌‌, హాత్‌‌‌‌వే వంటి ఆపరేటర్ల చార్జీలు కూడా దాదాపు ఇలాగే ఉన్నాయి. యాక్ట్‌‌‌‌ కంపెనీ అయితే నెలకు 450 రూపాయలకు 40 ఎంబీపీఎస్‌‌‌‌ స్పీడుతో సేవలు అందిస్తున్నది. జియో ఇంటర్నెట్‌‌‌‌తో పాటు వాయిస్‌‌‌‌ కాలింగ్‌‌‌‌ సేవలనూ అందిస్తున్నా టారిఫ్‌‌‌‌ ఎక్కువ కావడంతో కస్టమర్ల సంఖ్య ఆశించిన స్థాయికి చే...

టెక్కీలకు లక్కీ ఛాలెంజ్

చిత్రం
ఇండియాలో స్మా ర్ట్‌‌‌‌ఫోన్లు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ, ఇంకా సగానికి పైగా జనాభా ఫీచర్ ఫోన్లనే వాడుతున్నారు. ఫీచర్ ఫోన్లను, 2జీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌నే చాలా మంది అమితంగా ఇష్ట పడుతున్నట్టు కూడా రిపోర్టులు వచ్చాయి. అయితే ఇండియాలో ఫీచర్‌‌‌‌‌‌‌‌ ఫోన్లను వాడే వారి కోసం డిజిటల్ పేమెంట్ సొల్యుషన్స్‌ను రూపొందించాలని ఇండియన్ స్టార్టప్‌‌‌‌లకు, ఇండివిడ్యువల్స్‌ కు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌ ‌‌‌గేట్స్ సవాలు విసిరారు. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్..నేషనల్ పేమెంట్స్ కార్పొ రేషన్ ఆఫ్ ఇండియా, సీఐఐఈ డాట్ కో లతో కలిసి ఈ ‘గ్రాండ్‌‌‌‌ ఛాలెంజ్‌ ’ను లాంచ్ చేశారు. ఫీచర్ ఫోన్లకు డిజిటల్ పేమెంట్ సొల్యుషన్స్‌ ను అందించిన వారికి నగదు బహుమతి ప్రకటించారు. ఇండియాలో సగానికి పైగా జనాభా ఫీచర్‌‌‌‌‌‌‌‌ ఫోన్లను వాడుతున్నా రు. స్మార్ట్‌ ‌‌‌ఫోన్లలో అందుబాటులో ఉండే సౌకర్యాలు ఈ ఫోన్లకు ఉండవు. మనీ ట్రాన్స్‌ ఫర్ చేసుకోవాలన్నా, ఆన్‌ లైన్ ట్రాన్సాక్షన్స్ జరుపుకోవాలన్నా  కచ్చి తంగా స్మార్ట్‌‌‌‌ఫోన్‌ ఉండాల్సిందే. ఇండియాలో స్మార్ట్‌‌‌‌ఫోన్ యూజర్లకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌‌‌‌‌‌‌‌ఫే స్ యాప్ ఉంది. ఈ యాప్‌‌‌‌ ద్వారా ఏ సమయంలో ...

ఈ ఘోరం అవమానకరం

చిత్రం
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశువైద్యాధికారిణి హత్య కేసు సంఘటనపై ప్రముఖులు, సినీవర్గాలు, రాజకీయ నేతలు పెద్ద ఎత్తున స్పందించారు. ఇంకా తమ ఆవేదనను, సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఇందు కోసం ప్రస్తుతం ఉన్న చట్టాలను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల దాకా అన్ని వర్గాల వాళ్ళు ఈ దారుణ కాండను ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వాటిని యుద్ధ ప్రాతిపదికన మార్చాలని కోరుతున్నారు. ఎవ్వరైనా, ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే నేరం చేసే ముందు అంతులేని భయానికి లోను కావాలని, అలాంటి చట్టాలు కావాలన్నారు. ఇదిలా ఉండగా వెటర్నరీ డాక్టర్ ఘటన దేశ వ్యాప్తంగా అందరినీ కలిచి వేస్తోంది. ఇప్పటికే వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. ఆమె కుటుంబానికి న్యాయం జరగాలంటూ నిరసనలు వెల్లు వెత్తుతున్నాయి. పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు  స్పందించారు. అఘాయిత్యానికి పాల్పడిన వారిని శిక్షించాలంటూ తమ అభిప్రాయం చెప్పారు. లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబు వెటర్నరీ డాక్టర్ ఘటనపై ట్విట్టర్లో స్పందించాడు....

పీఠం ఉండేనా..దాదా కొనసాగేనా

చిత్రం
ఆటలోనే కాదు అన్నిటా తానై వ్యవహరిస్తున్న బెంగాల్ టైగర్, ప్రస్తుత బిసిసిఐ ప్రెసిడెంట్ సౌరబ్ గంగూలీ ఇంకో ఐదేళ్ల పాటు కొనసాగేందుకు పావులు కదుపుతున్నారు. మరో తొమ్మిది నెలల్లోనే ప్రెసిడెంట్‌‌‌‌ కుర్చీ నుంచి సౌరవ్‌‌‌‌ గంగూలీ దిగిపోవాలని శాసిస్తున్న కూలింగ్‌‌‌‌ఆఫ్‌‌‌‌ పిరియడ్‌‌‌‌ నిబంధనను మార్చేందుకు బీసీసీఐ రెడీ అయింది. ఈ రూల్‌‌‌‌ను సవరించాలని తమ తొలి జనరల్‌‌‌‌ బాడీ మీటింగ్‌‌‌‌లోనే దాదా నేతృత్వంలోని బోర్డు కొత్త కార్యవర్గం డిసైడైంది. అందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. అలాగే,  ఇండియా క్రికెట్‌‌‌‌కు సేవ చేసేందుకు ముందు కొస్తున్న సమర్థుల కాళ్లకు అడ్డు పడుతున్న కాన్‌‌‌‌ఫ్లిక్ట్​ ఆఫ్‌‌‌‌ ఇంట్రస్ట్‌‌‌‌ రూల్‌‌‌‌ను కూడా ఎత్తి వేయాలని, బోర్డు రాజ్యాంగానికి ఎలాంటి సవరణ చేయాలన్నా సుప్రీం అనుమతి అవసరం లేదని, దాన్ని ఏజీఎమ్‌‌‌‌కే కట్టబెట్టాలని నిర్ణయించింది. వీటికి కూడా ఆమోదం తెలపాలని సుప్రీంను కోరనుంది. సుప్రీం ఓకే చెబితే గనుక దాదా 2024 వరకూ ప్రెసిడెంట్‌‌‌‌గా కొనసాగడంతో పాటు పాలనలో సమూల మార్పులు రానున్నాయి. పాలనలో తన దైన శైలిలో దూసుకెళ్తున్న సౌరవ్‌‌‌‌ గంగూలీ మరో కీ...

తట్టు కోలేనంత..ఛార్జీల మోత

చిత్రం
నిన్నటి దాకా అపరిమిత నెట్ వర్క్, డేటా సౌకర్యంతో కస్టమర్స్ కు అంతులేని సంతోషాన్ని మిగిల్చిన మొబైల్ టెలికాం కంపెనీలు ఇప్పుడు ఛార్జీల మోత మోగించి షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. నిన్నటి దాకా బంపర్ ఆఫర్లతో కోట్లాది మంది మొబైల్ వినియోగదారులకు శఠగోపం పెట్టిన ఈ కంపెనీలు ఇప్పుడు ట్రాయ్ కొట్టిన దెబ్బకు నష్టాలు పూడ్చుకునేందుకు వడ్డన మార్గం ఎంచుకున్నాయి. ఇక కొద్ది గంటలు మాత్రమే ఉండడంతో ఇక ఉచితం అంటూ ఏదీ ఉండబోదని స్పష్టమైంది. ఇప్పటికే ఎంత పెంచాలనే దానిపై టెలికాం కంపెనీలు పునరాలోచనలో పడ్డాయి. మరో వైపు దేశంలోనే అతిపెద్ద నెట్ వర్క్ కలిగిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ప్రభుత్వ టెలికాం కంపెనీ దివాళా అంచున నిలబడింది. దీనిని గట్టెక్కించేందుకు నానా తంటాలు పడుతోంది మోడీ ప్రభుత్వం. ప్రైవేట్ టెలికాం సెక్టార్ లో రిలయన్స్, ఎయిర్ టెల్ , వోడా ఫోన్ కంపెనీలు తమ వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సింది పోయి, ఛార్జీల భారం మోపేందుకు రెడీ అవుతున్నాయి. ఇదిలా ఉండగా వొడాఫోన్ ఐడియా తన మొబైల్ కాల్స్, డేటా ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించింది. 2 రోజుల, 28 రోజుల, 84 రోజుల, 365 రోజుల వాలిడిటీతో ఉన్న ప్...

ఇక నీట్ సంరంభం షురూ

చిత్రం
వచ్చే వైద్య విద్యా సంవత్సరానికి మెడికల్‌ అడ్మిషన్లకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష కు దరఖాస్తు ప్రక్రియ  షురూ అయ్యింది. ఈ నెల ఆఖరు వరకు దరఖాస్తు చేసు కోవడానికి వీలు కల్పించారు. పరీక్ష మే నెల 3న నిర్వహిస్తారు. జూన్‌ 4న ఫలితాలు విడుదల చేస్తారు. తర్వాత కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. 2020–21కు సంబంధించి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ దరఖాస్తు విడుదల చేయనుంది. దరఖాస్తులను ఎన్‌టీఏ.ఏసీ.ఇన్, ఎన్‌టీఏనీట్‌.ఎన్‌ఐసీ.ఇన్‌ల్లో పొందవచ్చు. దరఖాస్తులో ప్రత్యక్ష ఫొటోతో పాటు అదనపు పత్రాలూ జోడించాల్సి ఉంటుంది.  పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. 180 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. దేశవ్యాప్తంగా 154 నగరాల్లోని 2,546 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. 2020–21 సంవత్సరంలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌ కోర్సులకు నీట్‌ ప్రవేశ పరీక్ష ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో సీట్లు సాధించాలంటే నీట్‌ ర్యాంకు తప్పనిసరి. మొదటిసారిగా ఎయిమ్స్, జిప్‌మర్‌ మెడికల్‌ కాలేజీ ల్లోని ఎంబీబీఎస్‌ సీట్లనూ నీట్‌ ద్వారానే భర్తీ చేయనున...

సత్తా చాటిన మన ఐఐటియన్స్

చిత్రం
ఐఐటీ హైదరాబాద్‌లో మొదటి విడత క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో విద్యార్థులు సత్తా చాటారు. కేవలం ఒక్క స్లాట్‌ లోనే ఏకంగా 53 మంది విద్యార్థులకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ లభించాయి. 2019–20 విద్యా సంవత్సరానికి గానూ ఐఐటీ హైదరాబాద్‌లో జరిగిన తొలి విడత ఎంపిక కార్యక్రంలో మొదటి స్లాట్‌ క్యాంపస్‌ ప్లేస్‌ మెంట్స్‌ ప్రారంభమయ్యాయి. మూడు గంటల పాటు కొనసాగింది. ఆ తర్వాత చేపట్టిన మరో రెండు స్లాట్లలో ప్లేస్‌మెంట్స్‌ సెలెక్షన్‌ రాత్రి 12 గంటల వరకు కొనసాగాయి. తొలి స్లాట్‌లో మొత్తం 15 కంపెనీలు పాల్గొనగా అందులో టీఎస్‌ఎంసీ, ఎస్‌ఎంఎస్, డేటాటెక్‌ అండ్‌ ఎన్‌టీటీ ఏటీ సంస్థ లు ఆరుగురు విద్యార్థులకు విదేశాల్లో ప్లేస్‌మెంట్స్‌ ఇచ్చాయి. బుక్‌మైషో, స్ప్రింక్లర్, జాగ్వార్, బజాజ్‌ ఆటో, బెన్‌వై మెల్లన్, డామినో డాటా ల్యాబ్స్, కాగోపోర్ట్‌ వంటి కంపెనీలు ప్లేస్‌మెంట్స్‌లో తొలి సారి పాల్గొనడం విశేషం. మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మ్యాన్‌ సాక్స్, సేల్స్‌ఫోర్స్, ఇంటెల్, క్వాల్‌కామ్, ఒరాకిల్‌ వంటి సంస్థలు ఐఐటీహెచ్‌కు వచ్చాయి. అందులో అత్యధికంగా మైక్రోసాఫ్ట్‌ 17 మందికి ఆఫర్లను ఇచ్చిందని, వారిలో ఐదుగురు అమ్మాయిలు ఉన్నట్లు ఐఐటీ ప్లేస్‌మెంట్...

ఉరి తీసినా వెళ్ళేది లేదు

చిత్రం
ఇలాంటి కొడుకులను కన్నామా, లోకమంతా అమ్మాయిని పాడు చేసి కాల్చారని చెబుతుంటే వినేందుకు గుండె జల్లు మంటోంది. ఆ కొడుకులు ఉన్నా ఒకటే, లేకున్నా, పోయినా ఒక్కటే. అంటూ జస్టిస్‌ ఫర్‌ దిశను దారుణంగా హత్య చేసిన వారికి ఏ శిక్ష పడినా బాధ పడినా లాభం లేదని మహ్మద్‌పాషా, శివ, నవీన్‌కుమార్, చెన్నకేశవుల తల్లిదండ్రులు కన్నీరు పెట్టారు. ఇదిలా ఉండగా ‘జస్టిస్‌ ఫర్‌ దిశ’ హత్య కేసులో మరో నిందుతుడు కూడా ఉన్నాడంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అయింది. ఊట్కూర్‌ మండలంలోని చిన్నపొర్ల గ్రామానికి చెందిన వ్యక్తి ఉన్నారని వదంతులు వచ్చాయి. దీనిపై పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. ఆ మండల పోలీస్‌ బాస్‌ చిన్నపొర్లకు వెళ్లి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ అలాంటి వారు ఎవరూ లేరంటూ సమాచారం వచ్చింది. నిందితులు నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల, జక్లేర్‌ గ్రామాలకు చెందిన మహ్మద్‌పాషా, నవీన్‌కుమార్, చెన్నకేశవులు, శివలను పోలీసులు నిర్ధారించారు. అనంతరం అరెస్ట్‌ చేసి చంచల్‌గూడ జైలుకు పంపారు. ఈ సంఘటన దేశమంతటా కలకలం సృష్టించింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రింట్‌ అండ్‌ మీడియాతో పాటు జాతీయ మీడియా సైతం జస్టిస్‌ ఫర్‌ దిశ హత్యక...

దళిత బిడ్డల విద్యకే ప్రయారిటీ

చిత్రం
ప్రతి జిల్లాలో ఓ స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాలో ఈ కేంద్రాలున్నాయి. కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటు కావడంతో అన్ని జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈమేరకు కార్యాచరణ రూపొందించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసే అవకాశముందనే అంశంపై కసరత్తు చేపట్టింది. ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో ప్రధాన స్టడీ సర్కిళ్లను హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. దీంతో పాటు నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, సిద్దిపేట, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. సివిల్‌ సర్వీసెస్, గ్రూప్‌ సర్వీసులు తదితర ప్రధాన శిక్షణ కార్యక్రమాలకు హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌లో శిక్షణ ఇస్తుండగా.. మిగతా చోట్ల ఇతర కేటగిరీల్లోని ఉద్యోగాలకు శిక్షణ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి పలు రకాల శిక్షణలు ఇవ్వగా దాదాపు 2వేల మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు....

న్యాయం జరగడం ఖాయం

చిత్రం
దిశ కుటుంబ సభ్యులకు సత్వర న్యాయం అందేలా చూస్తామని కేంద్ర పశు సంవర్థక శాఖ సహాయ మంత్రి సంజీవ్‌కుమార్‌ అన్నారు. రాజకీయ నేతగా కాకుండా ఓ వెటర్నరీ వైద్యుడిగా పరామర్శించడానికి వచ్చానన్నారు.  జస్టిస్‌ ఫర్‌ దిశ తల్లిదండ్రులు, సోదరిని ఆయన పరామర్శించారు. అంతకు ముందు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎంపీ రంజిత్‌రెడ్డితో కలసి ఆయన శంషాబాద్‌లోని డీసీపీ కార్యాలయానికి వెళ్లి సైబారాబాద్‌ సీపీ సజ్జనార్‌తో జస్టిస్‌ ఫర్‌ దిశ కేసుపై చర్చించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ఆధారాలు సేకరించాలని మంత్రి సూచించారు. ఫాస్ట్రాక్‌ కోర్టు ద్వారా త్వరితగతిన కేసును పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాధ్యాయుత పదవుల్లో ఉన్న హోంమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ అనుచితంగా మాట్లాడారని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. జస్టిస్‌ ఫర్‌ దిశ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఓ మంత్రి 100 నంబరుకు ఫోన్‌ చేయక పోవడం పొరపాటని అంటే.. మరొకరు ప్రతి మహిళకూ పోలీసు కాపలా ఉంటుందా.. అని వెటకారంగా మాట్లాడారని విమర్శించారు. ఆ మంత్రులపై కూడా జస్టిస్‌ ఫర్‌ దిశకు జరిగిన లాంటి సంఘటన జరిగితే గానీ వారికి ఆ బాధ తెలియదన్నారు. ప...

మృగాళ్లకు ఉరి శిక్షే సరి

చిత్రం
మహిళలు, పిల్లలపై అత్యాచారాలకు పాల్పడే వారికి సత్వరమే ఉరి శిక్ష విధించాలని, దీనిపై పునః సమీక్షకు వీలు లేని విధంగా చట్టాలను తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. చట్టాలంటే నేరాలకు, అఘాయిత్యాలకు పాల్పడే వారికి జంకు, భయం లేకుండా పోతోంది. ముఖ్యానంగా చిన్నారులు, బాలికలు, మహిళలు ఎక్కువగా అత్యాచారాలకు, అఘాయిత్యాలకు లోనవుతున్నారు. ఎన్ని చట్టాలు ఉన్నా, వాటిలోని లొసుగులు ఆసరాగా చేసుకుని రెచ్చి పోతున్నారు. మహిళల పట్ల అఘాయిత్యాలకు పాల్పడుతున్న దుర్మార్గుల నుంచి దేశాన్ని రక్షించు కోవాల్సిన సమయం ఆసన్న మైందన్నారు. జస్టిస్‌ ఫర్‌ దిశ ఘటన నేపథ్యంలో ట్విట్టర్‌ వేదికగా ప్రధాని దృష్టికి కేటీఆర్‌ పలు విషయాలు తీసుకెళ్లారు. మహిళలపై అఘాయిత్యాల పట్ల ఆవేదన చెందుతూ, నిస్సహాయంగా న్యాయం కోరుతున్న లక్షలాది మంది తరఫున ఈ వినతి చేస్తున్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. అత్యాచార నిందితులకు శిక్ష అమలులో  జాప్యం జరుగుతోందని, న్యాయం ఆలస్యమైతే అన్యాయం జరిగినట్లేనని అన్న నానుడిని ఈ సందర్భంగా కేటీఆర్‌ గు...

ప్లీజ్..మమ్మల్ని వదిలేయండి

చిత్రం
దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన పశువైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య కేసు రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. ఆమె పట్ల మృగాళ్లు అనుసరించిన అమానవీయ దారుణంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కఠిన శిక్షల కంటే ఆ నిందితులను వెంటనే ఉరి తీయాలంటూ జాతి యావత్తు ముక్త కంఠంతో కోరుతోంది. అడుగడుగునా బాధితురాలి పట్ల పోలీసుల నిర్లక్ష్యమే అగుపించింది. దీంతో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అధినేతలు, ప్రముఖులు, సినీ వర్గాలు పెద్ద ఎత్తున విచారం వ్యక్తం చేశారు. మరో వైపు తాకిడి ఎక్కువ కావడంతో తమకు ప్రైవసీ అంటూ లేకుండా పోతోందంటూ ప్రియాంకా రెడ్డి పేరెంట్స్ వాపోతున్నారు. దయచేసి మేం అల్లారు ముద్దుగా పెంచుకున్న మా బిడ్డ మాకు లేకుండా పోయింది. సాయం చేయమంటూ కోరినా పట్టించుకోని, స్పందించని పోలీసులు ఇప్పుడు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఇక చాలు, మాకు ఎవ్వరి సానుచూతి వద్దు. నేరస్థులకు కఠిన శిక్ష పడేలా చేయమని మాత్రమే మేము కోరుతున్నాము అని వేడుకున్నారు. ఇదిలా ఉండగా ఈ దుస్సంఘటనను తలచుకుని ప్రియాంకా రెడ్డి తల్లిదండ్రులు కుమిలి పోతున్నారు. పరామర్శల పేరుతో పలువురు నేతల పర్యటనతో వారు మరింత మానసిక వేదనకు గురవుతున్నారు. చని ప...

స్మరించు కోవడం మానవ ధర్మం

చిత్రం
మరాఠాలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. అనూహ్య పరిణామాల నేపథ్యంలో సంకీర్ణ సర్కారు కొలువు తీరింది. కేంద్రంలో అధికారాన్ని చెలాయిస్తున్న బీజేపీకి శివ సేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే చుక్కలు చూపించారు. అంతే కాదు మహారాష్ట్రలో కమలాన్ని నామ రూపాలు లేకుండా చేస్తానని ఉద్దవ్ తో పాటు ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే శపథం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో శివ సేనకు పవర్ దక్కనీయకుండా చేసేందుకు ట్రబుల్ షూటర్లు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా నానా ప్రయత్నాలు చేశారు. తమ చెప్పు చేతుల్లో ఉన్న గవర్నర్ ను పావులాగా వాడుకున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి అధికారం దక్కనీయ కూడదనే లక్ష్యంతో ఉద్దవ్ ఠాక్రే ..చిరకాల స్నేహాన్ని వదులుకున్నారు. అంతే కాదు కొన్ని తరాలుగా శత్రుత్వం కలిగిన వైరి వర్గాలతో చెలిమి చేశారు. రెండున్నర ఏళ్ళ కోసం కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలతో జత కట్టారు. మొదటి సారిగా శివ సేన పార్టీ మరాఠాలో అధికారం అందుకునేలా చేశారు. ఇది మహారాష్ట్ర చరిత్రలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇదిలా ఉండగా వేలాది మంది సాక్షిగా ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా తన తల...