ఉరి తీసినా వెళ్ళేది లేదు
ఇలాంటి కొడుకులను కన్నామా, లోకమంతా అమ్మాయిని పాడు చేసి కాల్చారని చెబుతుంటే వినేందుకు గుండె జల్లు మంటోంది. ఆ కొడుకులు ఉన్నా ఒకటే, లేకున్నా, పోయినా ఒక్కటే. అంటూ జస్టిస్ ఫర్ దిశను దారుణంగా హత్య చేసిన వారికి ఏ శిక్ష పడినా బాధ పడినా లాభం లేదని మహ్మద్పాషా, శివ, నవీన్కుమార్, చెన్నకేశవుల తల్లిదండ్రులు కన్నీరు పెట్టారు. ఇదిలా ఉండగా ‘జస్టిస్ ఫర్ దిశ’ హత్య కేసులో మరో నిందుతుడు కూడా ఉన్నాడంటూ సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఊట్కూర్ మండలంలోని చిన్నపొర్ల గ్రామానికి చెందిన వ్యక్తి ఉన్నారని వదంతులు వచ్చాయి. దీనిపై పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. ఆ మండల పోలీస్ బాస్ చిన్నపొర్లకు వెళ్లి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.
ఇక్కడ అలాంటి వారు ఎవరూ లేరంటూ సమాచారం వచ్చింది. నిందితులు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల, జక్లేర్ గ్రామాలకు చెందిన మహ్మద్పాషా, నవీన్కుమార్, చెన్నకేశవులు, శివలను పోలీసులు నిర్ధారించారు. అనంతరం అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు పంపారు. ఈ సంఘటన దేశమంతటా కలకలం సృష్టించింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రింట్ అండ్ మీడియాతో పాటు జాతీయ మీడియా సైతం జస్టిస్ ఫర్ దిశ హత్యకు సంబంధించిన వార్త కథనాలను ఎప్పటికప్పుడు అప్డెట్ చేయడంతో గుడిగండ్ల, జక్లేర్ల గ్రామాల పేర్లు దేశమందరి నోటా వినిపించి నట్లయింది. రాయిచూర్ టూ హైదరాబాద్కు వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు సైతం హత్య చేసింది ఇదే గుడిగండ్ల, జక్లేర్ గ్రామ యువకులంటూ చెప్పు కోవడం విశేషం.
ఈ సంఘటనపై ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్, ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, తెలంగాణ మంత్రి కేటీఆర్లు వెంటనే ట్విట్ చేశారు. దీంతో జాతీయ నేతలు సైతం స్పందించడంతో ప్రతి ఒక్కరి నోటా ఇదే చర్చ నీయాంశామైంది. ఎప్పుడైతే పదో తరగతి ఫెయిల్ అయ్యాడో అప్పటి నుంచి నా కొడుకు గాడిది కింద పడేనప్పా.. అంటూ ఆరీఫ్ తండ్రి హుస్సేన్ భార్య మౌలానీబీతో కలసి వాపోయారు. ఏదో పెట్రోల్ బంకులో పని చేస్తానంటే సరే అంటిమి. లారీ డ్రైవర్లతో కూనమై హైదరాబాద్ పాయే. వాడు ఇంత లంగ పనులు చేస్తాడని అనుకున్నామా చెప్పండి. దునియాల చాలా మంది లారీ డ్రైవర్లుగా పని చేస్తుండ్రు. కానీ ఇలా చేశారని నేను ఎక్కడ వినలేదబ్బా. నాకు ఒక బిడ్డా ఉంది.
ఆ ఆడపిల్లను కాల్చి చంపిండు అని వినగానే నేను బతికున్నా సచ్చినట్లు అనిపిస్తోందబ్బా. నీ కొడుకు కేసు మీదా సంతకం చేయమని చెప్పి షాద్నగర్ పోలీసులు చెబితే వెళ్లా. వారు ఇచ్చిన కాగితాలపై సంతకాలు పెట్టా. బయట ఎక్కడ చెప్పొద్దు తండ్రివని చంపుతారని పోలీసులు చెప్పారు. నన్ను టోల్ప్లాజా దగ్గర వదిలి పెట్టారు. అక్కడి నుంచి ఊరికి వచ్చా అని వాపోయారు. నా కొడుకు శివ అని చెప్పు కునేందుకు పానం ఒప్పడం లేదు. వాడు చేసిన పనికి ఉరి తీసిన పోను.. కోర్టుకు పిలిచిన వెళ్లను అంటూ తండ్రి గొర్రెల కాపరి రాజప్ప గొల్లుమని ఏడుస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
అమ్మాయిని నీ కొడుకు శివ మరో ముగ్గురితో కలిసి కాల్చి చంపిన కేసులో జైలుకు పంపుతున్నామని పోలీసులు చెప్పారు. నేనూ సంతకం కోసం వెళ్ళా. నా కొడుకును ఉరి తీసినా రాను అంటూ సంతకం పెట్టి వచ్చానని చెప్పాడు. ఈ దారుణానికి పాల్పడింది నా నియోజకవర్గంకు చెందిన వారేనని తెలిసి బాధ పడ్డాను. ఆ అమ్మాయిని హత్య చేసి మక్తల్ పరువు తీశారు. వారికి తగిన శిక్ష పడినప్పుడే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావన్నారు ఎమ్మెల్యే చిట్టెం రామ్ మోహన్ రెడ్డి. మొత్తం మీద ఈ రెండు గ్రామాలు దేశ మంతటా వైరల్ అయ్యాయి. ఇది కూడా ఓ చరిత్రే కదూ.
ఇక్కడ అలాంటి వారు ఎవరూ లేరంటూ సమాచారం వచ్చింది. నిందితులు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల, జక్లేర్ గ్రామాలకు చెందిన మహ్మద్పాషా, నవీన్కుమార్, చెన్నకేశవులు, శివలను పోలీసులు నిర్ధారించారు. అనంతరం అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు పంపారు. ఈ సంఘటన దేశమంతటా కలకలం సృష్టించింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రింట్ అండ్ మీడియాతో పాటు జాతీయ మీడియా సైతం జస్టిస్ ఫర్ దిశ హత్యకు సంబంధించిన వార్త కథనాలను ఎప్పటికప్పుడు అప్డెట్ చేయడంతో గుడిగండ్ల, జక్లేర్ల గ్రామాల పేర్లు దేశమందరి నోటా వినిపించి నట్లయింది. రాయిచూర్ టూ హైదరాబాద్కు వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు సైతం హత్య చేసింది ఇదే గుడిగండ్ల, జక్లేర్ గ్రామ యువకులంటూ చెప్పు కోవడం విశేషం.
ఈ సంఘటనపై ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్, ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, తెలంగాణ మంత్రి కేటీఆర్లు వెంటనే ట్విట్ చేశారు. దీంతో జాతీయ నేతలు సైతం స్పందించడంతో ప్రతి ఒక్కరి నోటా ఇదే చర్చ నీయాంశామైంది. ఎప్పుడైతే పదో తరగతి ఫెయిల్ అయ్యాడో అప్పటి నుంచి నా కొడుకు గాడిది కింద పడేనప్పా.. అంటూ ఆరీఫ్ తండ్రి హుస్సేన్ భార్య మౌలానీబీతో కలసి వాపోయారు. ఏదో పెట్రోల్ బంకులో పని చేస్తానంటే సరే అంటిమి. లారీ డ్రైవర్లతో కూనమై హైదరాబాద్ పాయే. వాడు ఇంత లంగ పనులు చేస్తాడని అనుకున్నామా చెప్పండి. దునియాల చాలా మంది లారీ డ్రైవర్లుగా పని చేస్తుండ్రు. కానీ ఇలా చేశారని నేను ఎక్కడ వినలేదబ్బా. నాకు ఒక బిడ్డా ఉంది.
ఆ ఆడపిల్లను కాల్చి చంపిండు అని వినగానే నేను బతికున్నా సచ్చినట్లు అనిపిస్తోందబ్బా. నీ కొడుకు కేసు మీదా సంతకం చేయమని చెప్పి షాద్నగర్ పోలీసులు చెబితే వెళ్లా. వారు ఇచ్చిన కాగితాలపై సంతకాలు పెట్టా. బయట ఎక్కడ చెప్పొద్దు తండ్రివని చంపుతారని పోలీసులు చెప్పారు. నన్ను టోల్ప్లాజా దగ్గర వదిలి పెట్టారు. అక్కడి నుంచి ఊరికి వచ్చా అని వాపోయారు. నా కొడుకు శివ అని చెప్పు కునేందుకు పానం ఒప్పడం లేదు. వాడు చేసిన పనికి ఉరి తీసిన పోను.. కోర్టుకు పిలిచిన వెళ్లను అంటూ తండ్రి గొర్రెల కాపరి రాజప్ప గొల్లుమని ఏడుస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
అమ్మాయిని నీ కొడుకు శివ మరో ముగ్గురితో కలిసి కాల్చి చంపిన కేసులో జైలుకు పంపుతున్నామని పోలీసులు చెప్పారు. నేనూ సంతకం కోసం వెళ్ళా. నా కొడుకును ఉరి తీసినా రాను అంటూ సంతకం పెట్టి వచ్చానని చెప్పాడు. ఈ దారుణానికి పాల్పడింది నా నియోజకవర్గంకు చెందిన వారేనని తెలిసి బాధ పడ్డాను. ఆ అమ్మాయిని హత్య చేసి మక్తల్ పరువు తీశారు. వారికి తగిన శిక్ష పడినప్పుడే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావన్నారు ఎమ్మెల్యే చిట్టెం రామ్ మోహన్ రెడ్డి. మొత్తం మీద ఈ రెండు గ్రామాలు దేశ మంతటా వైరల్ అయ్యాయి. ఇది కూడా ఓ చరిత్రే కదూ.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి