పోస్ట్‌లు

అక్టోబర్ 5, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

నీతులు సరే ఆస్తుల మాటేమిటి..?

చిత్రం
తెలంగాణాలో అవినీతి ఆక్టోపస్ కంటే వేగంగా విస్తరిస్తోంది. ప్రభుత్వం ఆయా శాఖల్లో పని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగులకు పెద్దఎత్తున వేతనాలు పెంచినా వారి పనితీరులో మార్పు రావడం లేదు. ఎక్కడ పడితే అక్కడ అందిన కాడికి దోచుకుంటున్నారు. రెవెన్యూ శాఖలో ఈ జాడ్యం మరింత పెరిగింది. పలు చోట్ల అవినీతి నిరోధక శాఖాధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు. కళ్ళు బైర్లు కమ్మేలా నోట్లకట్టలు, ఆభరణాలు, ఇల్లు, ఫ్లాట్స్, ప్లాట్లు కు సంబంధించి డాక్యుమెంట్స్ లెక్కకుమించి దొరికాయి. తాజాగా కేశంపేట మండల తహశీల్దార్ లావణ్య అరెస్ట్ మరిచిపోక ముందే చిలుక పలుకులు పలుకుతూ నీతి సూత్రాలు వల్లెవేసిన తెలంగాణ జూనియర్ లెక్చరర్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి అడ్డంగా ఏసీబీకి దొరికి పోయారు. లెక్కకు మించి ఆస్తులు కూడబెట్టారన్న సమాచారం మేరకు ఏసీబీ అధికారులు పలు చోట్ల సోదాలు జరిపారు. హైదరాబాద్ తో పాటు ఆయన బంధువులు ఉంటున్న ఇళ్లల్లో కూడా సోదాలు చేపట్టారు. దిలీశుఖ్ నగర్ లో ఆయన ఉంటున్న వైష్ణవి అపార్ట్ మెంట్ లో ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. పది చోట్ల దాడులు చేశారు. నగరంలోని ఏడు చోట్ల , మహబూబ్ నగర్ జి...

రోడ్డెక్కని బస్సులు..ప్రయాణీకుల అవస్థలు

చిత్రం
ప్రజలకు కొన్నేళ్లుగా నిజాయితీగా విశిష్టమైన రీతిలో సేవలు అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మరోవైపు ఏపీలో ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేసుకున్నది. దీంతో తెలంగాణాలో కూడా కార్మికులు, సిబ్బంది తమ సంస్థను యుద్ధప్రాతిపదికన విలీనం చేయాలని అంతవరకు తమ ఆందోళన కొనసాగుతుందని టీఎస్ ఆర్టీసీ కార్మిక నాయకులు స్పష్టం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం దిగి రావడం లేదు. దాదాపు 75 శాతానికి పైగా బస్సులు డిపోల నుండి రోడ్డెక్కలేదు. పండగ వేళ పిల్లా పాపలతో ఊళ్లకు బయలు దేరిన వారికి ప్రయాణం నరకంగా మారింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఉదయం వేళ డిపోల నుంచి ఒక్క బస్సు కూడా ప్లాట్‌ఫారంల పైకి రాలేదు. ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడిపే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చినా ఆచరణ సాధ్యం కాలేదు. బస్సుల్లేక పోవటాన్ని ఆసరా చేసుకున్న ప్రైవేటు వాహనదారులు పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడ్డారు. ప్రతి చోటా వాస్తవ ధరలకంటే ఎక్కువగా మూడు రేట్లు పెంచారు. దీంతో జనం లబోదిబో మంటు...

బాంటియా..దాండియా..!

చిత్రం
ఆర్ధిక మందగమనం దెబ్బకు బడా కంపెనీలన్నీ దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. జనంలో కొనుగోలు శక్తి లేకపోవడంతో తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు భారీ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే బిగ్ కంపెనీలన్నీ ఆఫ్ లైన్ తూ పాటు ఆన్ లైన్ ను నమ్ముకున్నాయి. అయినా కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. గతంలో ఎన్నడూ లేనిరీతిలో బంగారాన్ని కొనేందుకు, దాచి పెట్టుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రూటు మార్చిన కంపెనీలన్నీ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. రా రామ్మంటూ తాయిలాలు ఎరగా వేస్తున్నాయి. కేవలం ఒకే ఒక్క రూపాయి చెల్లించండి కావాల్సినవన్నీ, కోరుకున్నవన్నీ మీ ఇంటికి తీసుకు వెళ్లండంటూ వేడుకుంటున్నాయి. తాజాగా ఫర్నిచర్ సెక్టార్ లో టాప్ రేంజ్ లో ఉన్న బాంటియా విస్తుపోయేలా బహుమతులు ప్రకటించింది. దేశంలోనే అతిపెద్ద రిటైలర్‌ అవార్డు సొంతం చేసుకున్న సదరు కంపెనీ ఈ సారి మస్తు జోష్ నింపేందుకు రెడీ అయ్యింది. బాంటియా ఫర్నిచర్‌ ప్రతి ఏటా కస్టమర్లకు ఆఫర్లను ప్రకటిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది.   సాధారణంగా ఎవరైనా ఫ్లాట్‌ లేదా ప్లాట్‌ కొంటే నజరానాలు ప్రకటిస్తారు. అయితే బాంటియా ఫర్నిచర్‌ షోరూం తమ కస్టమర్ల...

రాహులా మజాకా..!

చిత్రం
ఒకప్పుడు తెలంగాణ అంటేనే చీదరింపు. భాషతో..యాసతో ..వెటకారపు పలకరింపులు..ఇవ్వన్నీ తెలుగు సినిమాలో కనిపించేటివి.. వినిపించేటివి కూడా. అంతెందుకు ప్రచురణ, మీడియా లో వారిదే పెత్తనం. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో ఇగ అప్పటి నుంచి ఇక్కడి సంస్కృతికి ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు ఎక్కడ చూసినా తెలంగాణ మాటలే. పాటలే..అలసి పోయేదాకా ఆడడమే. ఇటీవల మోస్ట్ పాపులర్ పర్సన్ ఎవరూ అంటే ఒకే ఒక్క పేరు ..అదే రాహుల్ సిప్లిగంజ్. స్టార్ మా టీవీ తో మనోడు మరింత ఫెమస్ అయిపోయిండు. ఇప్పటికే సింగర్ గా యూట్యూబ్ స్టార్ గా రికార్డ్ లు క్రియేట్ చేసింది. అంతే కాకుండా సినిమా లో ఎంటరయ్యిండు. అక్కడ కూడా తన వాయిస్ తో దుమ్ము రేపిండు. తాజాగా అతడి స్టామినా చూసి మా టీవీ బిగ్ బాస్ ప్రోగ్రాంలో రాహుల్ కు ఛాన్స్ ఇచ్చింది. ఇంకేం జనాలకు మరింత కనెక్ట్ అయ్యిండు. పాటలు పాడుతూ, తన తెలంగాణ మాటలతో అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎలిమినేషన్ వరకు వచ్చేసరికల్లా ఫ్యాన్స్ అతడికి మరో ఛాన్స్ ఇస్తూనే ఉన్నారు. ఈ ప్రోగ్రాం లో పార్టిసిపెంట్స్ తో పాటు రాహుల్ పోటీ పడుతూనే అన్ని టాస్క్ స్ ను ఎదుర్కుంటూ పోటీకి సై అంటున్నాడు. హైదరాబాద్ లోని ధూల్ ప...