నీతులు సరే ఆస్తుల మాటేమిటి..?
తెలంగాణాలో అవినీతి ఆక్టోపస్ కంటే వేగంగా విస్తరిస్తోంది. ప్రభుత్వం ఆయా శాఖల్లో పని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగులకు పెద్దఎత్తున వేతనాలు పెంచినా వారి పనితీరులో మార్పు రావడం లేదు. ఎక్కడ పడితే అక్కడ అందిన కాడికి దోచుకుంటున్నారు. రెవెన్యూ శాఖలో ఈ జాడ్యం మరింత పెరిగింది. పలు చోట్ల అవినీతి నిరోధక శాఖాధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు. కళ్ళు బైర్లు కమ్మేలా నోట్లకట్టలు, ఆభరణాలు, ఇల్లు, ఫ్లాట్స్, ప్లాట్లు కు సంబంధించి డాక్యుమెంట్స్ లెక్కకుమించి దొరికాయి. తాజాగా కేశంపేట మండల తహశీల్దార్ లావణ్య అరెస్ట్ మరిచిపోక ముందే చిలుక పలుకులు పలుకుతూ నీతి సూత్రాలు వల్లెవేసిన తెలంగాణ జూనియర్ లెక్చరర్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి అడ్డంగా ఏసీబీకి దొరికి పోయారు. లెక్కకు మించి ఆస్తులు కూడబెట్టారన్న సమాచారం మేరకు ఏసీబీ అధికారులు పలు చోట్ల సోదాలు జరిపారు.
హైదరాబాద్ తో పాటు ఆయన బంధువులు ఉంటున్న ఇళ్లల్లో కూడా సోదాలు చేపట్టారు. దిలీశుఖ్ నగర్ లో ఆయన ఉంటున్న వైష్ణవి అపార్ట్ మెంట్ లో ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. పది చోట్ల దాడులు చేశారు. నగరంలోని ఏడు చోట్ల , మహబూబ్ నగర్ జిల్లా తో పాటు కర్నూల్ జిల్లాలో ఉంటున్న మధుసూదన్ రెడ్డి బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో దాడులు చేశారు. ఇంటర్ పేపర్ లీకేజి కేసులో భారీగా అక్రమాలకు పాలడ్డారని మధుసూదన్ రెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆయన ఇంటితో పాటు నాంపల్లిలోని అసోషియేషన్ ఆఫీసులోనూ సోదాలు చేపట్టారు. ఇందులో మూడున్నర కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
తాను ఉంటున్న ఇంటిని 23 లక్షలకు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ సమయంలో మాత్రం ఎనిమిది లక్షలుగా చూపించారు. దీంతో పాటు గడ్డిఅన్నారం, మూసారాంబాగ్ లలో కోటి 81 లక్షలు విలువ చేసే ఫ్లాట్స్ ను 81 లక్షలు చూపినట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. హయత్ నగర్ లో రెండు ఫ్లాట్స్ , హొండా సిటీ కార్, అసోషియేషన్ పేరుతో ఉన్న ఇన్నోవా కారు, బైక్ మధుసూదన్ రెడ్డి వాడుతున్నట్లు గుర్తించారు. వీటితో పాటు రెడ్డి స్నేహితుల దగ్గర 16 లక్షల క్యాష్ , 50 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలిపారు. నార్సింగ్ లో కోట్లు విలువ చేసే నాలుగు ఎకరాల ల్యాండ్ ఉందని ఇందులో రెడ్డితో పాటు మరికొందరు ఉన్నట్లు వెల్లడించారు. మొత్తం మీద ఉన్నతాధికారులపై తీవ్ర ఆరోపణలు చేసిన మధుసూదన్ రెడ్డి జైలు ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఎంతైనా రాజ్యంతో పెట్టుకుంటే జరిగేది ఇదేనన్న సత్యం ఇప్పటికైనా బోధ పడింది.
హైదరాబాద్ తో పాటు ఆయన బంధువులు ఉంటున్న ఇళ్లల్లో కూడా సోదాలు చేపట్టారు. దిలీశుఖ్ నగర్ లో ఆయన ఉంటున్న వైష్ణవి అపార్ట్ మెంట్ లో ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. పది చోట్ల దాడులు చేశారు. నగరంలోని ఏడు చోట్ల , మహబూబ్ నగర్ జిల్లా తో పాటు కర్నూల్ జిల్లాలో ఉంటున్న మధుసూదన్ రెడ్డి బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో దాడులు చేశారు. ఇంటర్ పేపర్ లీకేజి కేసులో భారీగా అక్రమాలకు పాలడ్డారని మధుసూదన్ రెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆయన ఇంటితో పాటు నాంపల్లిలోని అసోషియేషన్ ఆఫీసులోనూ సోదాలు చేపట్టారు. ఇందులో మూడున్నర కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
తాను ఉంటున్న ఇంటిని 23 లక్షలకు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ సమయంలో మాత్రం ఎనిమిది లక్షలుగా చూపించారు. దీంతో పాటు గడ్డిఅన్నారం, మూసారాంబాగ్ లలో కోటి 81 లక్షలు విలువ చేసే ఫ్లాట్స్ ను 81 లక్షలు చూపినట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. హయత్ నగర్ లో రెండు ఫ్లాట్స్ , హొండా సిటీ కార్, అసోషియేషన్ పేరుతో ఉన్న ఇన్నోవా కారు, బైక్ మధుసూదన్ రెడ్డి వాడుతున్నట్లు గుర్తించారు. వీటితో పాటు రెడ్డి స్నేహితుల దగ్గర 16 లక్షల క్యాష్ , 50 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలిపారు. నార్సింగ్ లో కోట్లు విలువ చేసే నాలుగు ఎకరాల ల్యాండ్ ఉందని ఇందులో రెడ్డితో పాటు మరికొందరు ఉన్నట్లు వెల్లడించారు. మొత్తం మీద ఉన్నతాధికారులపై తీవ్ర ఆరోపణలు చేసిన మధుసూదన్ రెడ్డి జైలు ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఎంతైనా రాజ్యంతో పెట్టుకుంటే జరిగేది ఇదేనన్న సత్యం ఇప్పటికైనా బోధ పడింది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి