పోస్ట్‌లు

డిసెంబర్ 24, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

పసిడి ధరతో పరేషాన్

చిత్రం
కొనుగోలుదారులకు కోలుకోలేని షాక్ ఇస్తోంది బంగారం. మార్కెట్ లో బంగారం ధరలు అమాంతం పెరుతున్నాయే తప్పా తగ్గడం లేదు. ధరాభారం మోయలేకున్నా జనం మాత్రం కొనుగోలు చేయడం మాత్రం మానడం లేదు. ఇటీవల కాస్త నెమ్మదించిన పసిడి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడం, దేశీయంగా కొనుగోళ్లు వెల్లు వెత్తడంతో బులియన్‌ మార్కెట్లో బంగారం ధర మళ్లీ  39 వేల రూపాయల స్థాయికి చేరింది. అమెరికా ఆర్థిక గణాంకాలు నిరుత్సాహ పరచడం, వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికా చైనాల మధ్య అంతరం పెరగడం కూడా మరో కారణం. దీంతో ఫ్యూచర్‌ మార్కెట్లో కూడా ధరలు మళ్లీ పైపైకి పోతున్నాయి. వరల్డ్ మార్కెట్లో పసిడి ధరలు 7 వారాల గరిష్టాన్ని నమోదు చేసాయి. దేశీయంగా ఇదే ధోరణి నెలకొంది. దేశ రాజధానిలో మంగళవారం 191 పెరిగి 10 గ్రాముల ధర 39,239 పలికింది. అటు వెండి ధర కూడా ఇదే బాటలో పయనించింది.  ఒక్క రోజే 943 పెరగడంతో కేజీ వెండి ధర 47,146కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 6 డాలర్లు పెరిగి 1,495 స్థాయికి చేరింది. పసిడి ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి. అమెరికా ఎగుమతులు క్షీణించడంతో నాలుగో త్రైమాసికంలో వృద్ధిపై అనుమానాలు ర...

మనోడు..అపర కుబేరుడు

చిత్రం
ఈ ఏడాది రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీకి బాగా కలిసొచ్చింది. మిగతా కంపెనీలకు షాక్ ఇస్తూ..తన వ్యాపారాన్ని మరింత విస్తరించడంతో ఆయన అందరికంటే ముందు వరుసలో నిలిచారు. ఇది కూడా ఇండియన్ బిజినెస్ లో ఓ చరిత్రే. ముకేశ్ సంపద విలువ ఏకంగా 16.5 బిలియన్‌ డాలర్ల మేర అంటే దాదాపు 1.2 లక్షల కోట్లు పెరిగింది. 60.8 బిలియన్‌ డాలర్లకు చేరింది. బ్లూమ్‌ బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ఈ వాస్తవ విషయాలు వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం సుమారు 61 బిలియన్‌ డాలర్ల నికర విలువతో దాదాపు 4.3 లక్షల కోట్లు గా పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ముకేశ్‌ అంబానీ 12వ స్థానంలో నిల్చారు. వ్యాపార పరంగా కొన్ని సార్లు హెచ్చు తగ్గులకు లోనైనప్పటికీ గణనీయమైన ఆదాయాన్ని గడించింది. రిలయన్స్ గ్రూప్ కంపెనీలో షేర్స్ తీసుకున్న వారికి పెద్ద ఎత్తున ప్రాఫిట్ లభించింది. ఇదిలా ఉండగా గహంలో 10 రూపాయలతో ఒక్క షేర్ విలువ ఉండగా ఇప్పుడు అది ఏకంగా 10 వేల రూపాయలకు చేరింది. గతంలో కంటే ఈ సంవత్సరం మదుపుదారులకు భారీగా లాభాలు అందేలా కంపెనీ ప్రయత్నం చేసింది. ఊహించని రీతిలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు దూసుకెళ్లడం కూడా ...

కోట్లు కురిపిస్తున్న ఏఐ

చిత్రం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పుణ్యమా అంటూ టాలెంట్ ఉన్నోళ్ల కోసం దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఐటీ పరంగా చూస్తే ఇండియన్స్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ డిమాండ్ ఉంటోంది. తాజాగా ఇదే రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో విభిన్నమైన కోర్సులు చేసే వారి పంట పండుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ , ఎంఎల్, ఎథికల్ హ్యాకింగ్, డిజిటల్ టెక్నాలజీ, డేటా అనలిస్ట్, తదిర కోర్సులు చేసిన వారంతా కోట్లు సంపాదిస్తున్నారు. ఓ వైపు ఆర్ధిక మందగమనం ఉన్నా ఐటీ రంగం మాత్రం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. పలు వ్యాపార సంస్థల్లో కొంగొత్త టెక్నాలజీల వినియోగం మెరుగు పడుతున్న నేపథ్యంలో దేశీయంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాదిలో ఏఐ ఉద్యోగుల సంఖ్య రెట్టింపయ్యింది. అయితే, నిపుణులు తగినంత స్థాయిలో దొరకడం లేదు. దీంతో చాలా సంస్థల్లో ఏఐ ఉద్యోగాలు ఖాళీగా ఉంటున్నాయి. ఏఐ ఉద్యోగుల సంఖ్య గతేడాది 40,000గా ఉండగా 2019లో 72,000కు చేరింది. ఏఐ ప్రాజెక్టులపై పనిచేసే కంపెనీల సంఖ్య గతేడాది 1,000 దాకా ఉండగా ఈ ఏడాది 3,000కు చేరింది. వ్యాపారాలు, డేటా నిర్వహణకు కంపెనీలు పెద్ద ఎత్తున ఆర...

టీఎస్ సీఎస్ పై ఉత్కంఠ

చిత్రం
పాలనా పరంగా కీలక పదవి అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ సీనియర్ ఐఏఎస్ లలో నెలకొంది. ఇప్పటికే పలువురు ఐఏఎస్ లు లోపాయికారీగా ప్రయత్నాలు ప్రారంభించారు. కొందరు కేంద్రం స్థాయిలో ఇంకొందరు రాష్ట్ర స్థాయిలో పెద్దఎత్తున ట్రై చేస్తున్నట్టు సమాచారం. ఎందరు రేసులో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పని చేస్తున్న శైలేంద్ర కుమార్‌ జోషి త్వరలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ కాలం మరో కొన్ని రోజులే మిగిలి ఉండటంతో కొత్త సీఎస్‌ ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీనియారిటీ, సమర్థత, స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త సీఎస్‌ ఎంపికపై సీఎం డిసిషన్ తీసుకోనున్నారు. సీఎస్‌ పదవి రేసులో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పేరు సైతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. వీరిద్దరిలో ఒకరిని సీఎస్‌గా నియమించే అవకాశాలున్నాయని సమాచారం. కాగా సీనియారిటీ పరంగా చూస్తే సీఎస్‌ రేసులో తెలంగ...

ప్రక్షాళనతోనే పరిష్కారం

చిత్రం
నిన్నటి దాకా ఆందోళనలతో అట్టుడికిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇప్పుడు దిద్దుబాటు చర్యల్లో మునిగి పోయింది. ఎలాగైనా సరే ఆర్టీసీని ఆదాయ బాటలు నడిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. దీంతో సీఎం ఎప్పటికప్పుడు ఆర్టీసీపై సమీక్షలు చేస్తున్నారు. మంత్రి, ఉన్నతాధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఏ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గండం నుంచి గట్టెక్కించాలని, ఇందు కోసం అవసరమైతే కఠిన చర్యలు తీసు కోవాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలకు దిగారు. అంతే కాకుండా ఆర్టీసీ కార్గో సర్వీసెస్ రంగం లోకి ఎంటర్ కావాలని డిసైడ్ అయ్యింది. తాజాగా టీఎస్‌ఆర్టీసీలో ప్రక్షాళన చేయడం మొదలైంది. ఎవరెక్కడ పనిచేస్తున్నారో, వారికిచ్చే వేతనానికి తగ్గ పని జరుగుతోందో లేదో, ఏ విభాగంలో ఎందరున్నారో వంటి విషయాలపై ఇప్పటి వరకు లోపించిన జవాబుదారీతనాన్ని తిరిగి తీసు కొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్టీసీ సమ్మె అనంతరం టికెట్‌ ధరల పెంపుతో ఇప్పటికే సంస్థ ఆదాయం పెరగ్గా, మరిన్ని చర్యలతో సంస్థకు మరింత ఊపు తెప్పించనుంది. కొన్ని విభాగాల్లో సిబ...

ఆర్ధిక రంగం ప్రమాదకరం

చిత్రం
నిన్నటి దాకా చిలుక పలుకులు పలికిన బీజేపీ ప్రభుత్వం చెబుతున్నవన్నీ నీటి మూటలేనని తేలి పోయింది. ఇప్పటికే దేశ ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారుతోంది, దీనికి వెంటనే కాయకల్ప చికిత్స అవసరమని ఆర్థికరంగ నిపుణులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్లు సుబ్బారావు, రంగ రాజన్ లు హెచ్చరించారు. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోక పోతే దివాళా తీసే ప్రమాదం పొంచి ఉందంటూ ముందస్తు జాగ్రత్తలు సూచించారు. అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ పట్టించు కోలేదు. వీరిని ఆయన నమ్మలేదు. ఏకంగా నోట్లను రద్దు చేశారు. దీని ప్రభావం అన్ని రంగాలపై పడింది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ స్పష్టం చేసింది. భారత్‌లో ఆర్థిక మందగమన పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని అభిప్రాయ పడింది. దీర్ఘకాల ఈ ధోరణిని అరికట్టడానికి కేంద్రం తక్షణం విధానపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఐఎంఎఫ్‌ డైరెక్టర్స్‌ నివేదిక వెలువరించిన అంశాలను సంస్థ ఆసియా, పసిఫిక్‌ శాఖలో భారత్‌ వ్యవహారాల చీఫ్‌ రానిల్‌ సల్‌గాడో వెల్లడించారు. అయితే ఇండియా ఇటీవల ఆర్ధిక రంగంలో కొంత ముందడుగు వేసింది. లక్షలాది మంది పేదరికం నుంచి బయట పడ్డారు. 2019 సంవత్సరం న...