పోస్ట్‌లు

మే 13, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్రిన్స్ సందేశం..వీకెండ్ వ్య‌వ‌సాయం

చిత్రం
వ్య‌వ‌సాయం దండగ కాదు పండుగ కావాల‌ని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి..గులాబీ బాస్ కేసీఆర్. ఆయ‌న ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణ‌లో నీళ్లు పారించేందుకు..ప్ర‌తి ప‌ల్లెలో వ్య‌వ‌సాయం చేసేందుకు మార్గం సుగమం చేశారు. రాబోయే 2020 సంవ‌త్స‌రానిక‌ల్లా తెలంగాణ అంత‌టా 60 శాతానికి పైగా పొలాలు ప‌చ్చ‌గా మార‌నున్నాయి. ఆ దిశ‌గా ఇప్ప‌టికే జ‌నంలో చైత‌న్యం తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది ప్ర‌స్తుత స‌ర్కార్. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల‌లో తీవ్రంగా ..అపారంగా న‌ష్ట‌పోయింది. వివ‌క్ష‌కు గురైంది. ఆత్మ‌హ‌త్య‌లు, ఆక‌లి చావులు, మోసానికి లోనైంది. ప్ర‌తి రైతుకు ప్ర‌యోజ‌నం చేకూర్చేందుకు ఎన్నో స‌బ్సిడీలు, బ్యాంకుల ద్వారా రుణాలు అంద‌జేస్తోంది. దీంతో ప్ర‌తి ఒక్క‌రు పొలాలు కొనుగోలు చేసేందుకు పోటీ ప‌డుతున్నారు. ఎన్ ఆర్ ఐలు , సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్లు, ఇత‌ర శాఖ‌ల్లోని, సంస్థ‌ల్లోని ఉద్యోగులు భారీ ఎత్తున పొలాలు తీసేసుకున్నారు. అక్క‌డి నుంచే ఇక్క‌డ మానిట‌రింగ్ చేస్తున్నారు. చాలా చోట్ల పండ్ల తోట‌లు, పురుగు మందులు లేని వ్య‌వ‌సాయాన్ని, సాగును ప్రారంభించారు. రాబోయే కాలానికి ప్ర‌స్తు...

స్వ‌చ్ఛంధ సంస్థ‌ల‌కు షోకాజ్ నోటీసులు - సేవ పేరుతో స్వాహా

చిత్రం
ఈజీగా మ‌నీ సంపాదించాలంటే ..చోరీ అయినా చేయాలి లేదంటే బ్యాంక్‌కు రుణం పేరుతో క‌న్నం వేయాలి. ఇవేవీ చేత కాక‌పోతే..స్వ‌చ్ఛంధ సంస్థ స్టార్ట్ చేస్తే చాలు. సుల‌భంగా డ‌బ్బులు పోగేసుకోవ‌చ్చు. సామాజిక సేవా కార్య‌క్ర‌మాల పేరుతో దేశంలో ఇబ్బ‌డి ముబ్బ‌డిగా ఎన్‌జిఓలు, ఫౌండేష‌న్లు పుట్టుకు వ‌చ్చాయి. కోట్లాది రూపాయ‌లు వ‌సూలు చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు సైతం ఎడ్యూకేష‌న‌ల్ ఇనిస్టిట్యూష‌న్స్ పేరుతో ప్రారంభించ‌డం..ఆదాయ ప‌న్ను మిన‌హాయింపు పొంద‌డం ప‌రిపాటిగా మారింది. దీనిని గ‌మ‌నించిన మోదీ స‌ర్కార్ అస‌లు ఎన్ని ఎన్‌జిఓలు దేశంలో ఉన్నాయో హోం శాఖ‌కు పుర‌మాయించారో. అవి ఎక్క‌డెక్క‌డ ఉన్నాయి. ఏయే కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాయి. అందులో వాస్త‌వం ఎంత‌. ఎన్ని కంపెనీలు, ఎన్‌జీఓలు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఏమైనా ప‌ని చేస్తున్నాయా తెలుసుకోమ‌ని ఆదేశించారు. దెబ్బ‌కు స్వ‌చ్ఛంధ సంస్థ‌ల నిర్వాహ‌కులు టాక్స్ రిట్న‌ర్స్ స‌మ‌ర్పించ‌లేక మూసుకుంటే ..మ‌రికొన్ని త‌మ సంస్థ‌ల రిజిస్ట్రేష‌న్ల‌ను ర‌ద్దు చేసుకునేందుకు ఛాన్స్ ఇవ్వ‌మంటూ కోరాయి. త‌క్కువ ఖ‌ర్చుతో కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం. వాటిని ఫోటోలు తీసి సోష‌ల్ మీడియాల్లో ...

ఎన్నో సినిమాలు..మ‌రెన్నో ఛాన్స్‌లు - రైట్ ట్రాక్‌లో ర‌ష్మికా

చిత్రం
అమ్మాయంటే ఇలా వుండాలి. ఇలాంటి వ్య‌క్తితోనే స‌హ‌జీవ‌నం సాగించాల‌నే ఫీలింగ్స్‌ను క‌లిగించేలా త‌నను తాను న‌టిగా ప్రూవ్ చేసుకుంది క‌ర్ణాట‌క‌కు చెందిన ర‌ష్మికా మందాన‌. అంత‌కు ముందు క‌న్న‌డ‌, తెలుగు సినిమాల్లో న‌టించినా పెద్ద‌గా స్కోప్ రాలేదు. కానీ విజ‌య దేవ‌ర‌కొండతో క‌లిసి న‌టించిన గీత గోవిందం మూవీ వ‌చ్చాక‌..ప్ర‌తి తెలుగు కుటుంబంలో మ‌నింటి అమ్మాయే అనుకునేంత‌లా క‌నెక్ట్ అయ్యింది. అలా అన‌డం కంటే ద‌ర్శ‌కుడు ఆ పాత్ర‌ను అలా మ‌లిచాడు. స‌ర‌దాగా సాగుతూనే ఉదాత్త‌మైన ప్రేమ‌కు గొప్ప‌నైన ముగింపు ఇచ్చాడు ఈ మూవీలో. ర‌ష్మికా చాలా ఈజీగా ఎక్క‌డా తొట్రుపాటుకు లోన‌వ‌కుండా పాత్ర‌కు న్యాయం చేసింది. సంగీతం, డైలాగ్స్ , క‌థ అన్నింటికంటే పాత్ర‌లు జ‌నాన్ని థియేట‌ర్ల‌లోకి ర‌ప్పించేలా చేశాయి. ఒక‌ప్పుడు తెలుగు సినిమాలు హీరోల చుట్టూ తిరిగేవి. ఇపుడు సీన్ మారింది. అగ్ర హీరోలు క‌థ‌ల చుట్టూ తిరుగుతున్నారు. క‌ర్ణాట‌క‌లోని ఓ మారుమూలన 5 ఏప్రిల్ 1996లో జ‌న్మించారు ర‌ష్మికా. మోడ‌ల్‌గా, న‌టిగా క‌న్న‌డ‌, తెలుగు సినిమాల్లో పేరు తెచ్చుకున్నారు. 2016లో విడుద‌లైన త‌ను న‌టించిన కిరిక్ పార్టీ సినిమా బ్లాక్ బ్ల‌స్ట‌ర్ సినిమ...

ఈ ఐఐటీలు భారీ ప్యాకేజీల‌కు ద్వారాలు - చ‌దువా మజాకా

చిత్రం
జీవితంలో స్థిర ప‌డ‌టానికి కావాల్సిన టైం వ‌చ్చేసింది. తెలంగాణ విద్యా శాఖ పుణ్య‌మా అంటూ ఇంట‌ర్మీడియ‌ట్ విద్య ఈసారి గాడి త‌ప్పింది. దేశంలోనే ఐటీలో టాప్ ఫైవ్‌లో ఒక‌టిగా ఉన్న టీఎస్ స‌ర్కార్ ఈసారి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో ప్రైవేట్ సంస్థ‌కు అప్ప‌గించి ఫ‌లితాల వెల్ల‌డిలో జాప్యం, అధికారుల అల‌స‌త్వం, పాల‌కుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఎంద‌రో విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు. మ‌రికొంద‌రు మార్కులు స‌రిగా రాక ఏం చేయాలో తోచ‌క త‌ల్ల‌డిల్లి పోతున్నారు. ఇండియాలో ఇంజ‌నీరింగ్ కోర్సు చదివితేనే గొప్ప ఉద్యోగాలు వ‌స్తాయ‌ని, విదేశాల‌కు వెళ్లి పోవ‌చ్చ‌ని స్టూడెంట్స్ క‌ల‌లు కంటున్నారు. కానీ వీటికంటే భిన్న‌మైన కోర్సుల‌ను అత్యున్న‌త‌మైన విద్యాల‌యాలుగా, సంస్థ‌లుగా ప్ర‌పంచం మెచ్చిన ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీస్ నిర్వ‌హిస్తున్నాయి. పేరెంట్స్‌కు..ఇటు విద్యార్థుల‌కు ఏ కోర్సులు ఎంచుకోవాలో తెలియ‌క తిప్ప‌లు ప‌డుతున్నారు. కూల్ గా ఆలోచించి ..అన్ని వివ‌రాలు న‌మోదు చేసుకుంటే ..బ్యాంకులు అప్పులు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయి. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇక్క‌డ చ‌దివినా ఓకే అంటున్నాయి. లేదా ఫారిన్ కంట్రీ...

కోట్లే కోట్లు..బంప‌ర్ ప్రైజులు..భారీ ఆఫ‌ర్లు

చిత్రం
ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ పుణ్య‌మా అంటూ కొత్త కుర్రాళ్లు త‌మ టాలెంట్‌కు ప‌దును పెట్టారు. ఆయా జ‌ట్ల‌కు ఫ్రాంచైజీలుగా ఉన్న యాజ‌మాన్యాలు ఒక్కో ఆట‌గాడిని ఒక్కో రేటు పెట్టి వేలం పాట‌లో చేజిక్కించుకున్నాయి. గ‌త కొన్ని రోజులుగా ఇండియాలో 17వ లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. దేశాన్ని నియంత్రించి..చ‌ట్టాలు రూపొందించి..త‌యారు చేసే అత్యున్న‌త పార్ల‌మెంట్‌కు పంపించే ఎంపీలు పోటీ చేస్తుంటే జ‌నం స్పందించ‌డం లేదు. యువ‌తీ యువ‌కులు తీవ్ర నిరాశ‌కు లోన‌య్యారు. ఐపీఎల్ పుణ్య‌మా అంటూ ఇటు వైపు ఎక్కువ మొగ్గు చూపించారు. కార‌ణం క్రికెట్ ఫీవ‌ర్ ఇండియాను ఊపేసింది. ప‌డుకోనీయ‌కుండా చేసింది. కంటి మీద కునుకే లేకుండా చేసింది. ఇంత‌లా ప్ర‌భావితం చేసిన ఆట ఏదైనా ఉందంటే అది క్రికెట్ ఒక్క‌టే. ఏ గ‌ల్లీల చూసినా క్రికెట్టే..ఏ ఇల్లు త‌లుపు త‌ట్టినా సీరియ‌ల్స్ బంద్..సినిమాలు బంద్..అంత‌టా ఐపీఎల్ మాయాజాలం క‌మ్మేసింది. అంద‌రినీ త‌న వైపు తిప్పుకుంది. ఇదీ క్రికెట్ అంటే..దానికున్న ప‌వ‌ర్ ఏమిటో రుచి చూపించింది. టోర్నీలో పాల్గొన్న జ‌ట్లు ఫైన‌ల్ వ‌ర‌కు రావాల‌ని ప‌రిత‌పించాయి. శ‌క్తి వంచ‌న లేకుండా పోరాటం చేశాయి. చివ‌ర‌కు ఉత్క...

కేసీఆర్ ప్ర‌య‌త్నం - స్టాలిన్ క‌ర‌చాల‌నం - రాజ‌కీయం ర‌స‌కందాయం

చిత్రం
తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత ..గులాబీ బాస్ క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు రంగంలోకి దిగారు. అపార‌మైన రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన ఈ పొలిటిక‌ల్ చాణుక్యుడు..అయిన కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ దిశ‌గా పావులు క‌దువుతున్నారు. గ‌తంలో ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేశారు. మ‌మ‌తాను క‌లిశారు. స్టాలిన్‌తో భేటీ అయ్యారు. కుమార‌స్వామితో మాట్లాడుతూనే ఉన్నారు. అఖిలేష్ యాద‌వ్‌తో కేటీఆర్‌కు సన్నిహిత సంబఃధాలున్నాయి. ఎన్న‌డూ లేనంత‌గా ఈసారి ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి సింగిల్ డిజిట్ మెజారిటీ రాద‌ని తేలిపోయింది. ఈ విష‌యాన్ని దేశంలోని ప్ర‌ధాన స‌ర్వే సంస్థ‌ల‌తో పాటు ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార రంగాలు గ‌గ్గోలు పెడుతున్నాయి. నిన్న‌టి దాకా కాల‌ర్ ఎగరేసిన బీజేపీ అధినేత మోదీ..షాలు ఇపుడు శ‌త్రువు అయినా స‌రే తాము స్వాగ‌తం ప‌లుకుతామ‌ని, రెడ్ కార్పెట్ ప‌రుస్తామ‌ని చెప్ప‌క‌నే చెప్పారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన కేసీఆర్, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఎవ‌రికి వారే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. మ‌రో వైపు చంద్ర‌బాబు బిజేపీయేత‌ర పార్టీల‌ను ఒకే వేదిక‌పైకి తీసుకు రావాల‌ని కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిరుగుతున్నారు. ఇదిల...

అబ్బా ..రిల‌య‌న్స్ దెబ్బ ..చిరు వ్యాపారుల‌కు షాక్

చిత్రం
భార‌తీయ వ్యాపార రంగాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న కంపెనీ ఏదైనా వుందంటే అది రిల‌య‌న్స్ ఒక్క‌టే. ధీరూ భాయి అంబానీ ఏ ముహూర్తంలో రిల‌య‌న్స్ ను ప్రారంభించాడో కానీ ఇవాళ ఇండియ‌న్ మార్కెట్ రంగాన్ని చేజిక్కించు కోవ‌డ‌మే కాక‌..ప్ర‌పంచ మార్కెట్‌ను ప్ర‌భావితం చేస్తూ షేక్ చేస్తోంది ఈ కంపెనీ. ఆయిల్, టెలికాం, రిటైల్, లాజిస్టిక్, డిజిట‌ల్, టాయిస్, ఎంట‌ర్ టైన్‌మెంట్, మీడియా, ప్రింట్, సోష‌ల్ మీడియా..ఇలా చెప్పుకుంటూ పోతే ప్ర‌తి రంగంలో రిల‌య‌న్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు భాగ‌స్వామ్యం క‌లిగి ఉన్నాయి. ఒక్క టెలికాం రంగంలో గుత్తాధిప‌త్యం క‌లిగిన సంస్థ‌గా ప్ర‌భుత్వ ఆధీనంలోని భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ ఉండ‌గా..ప్రపంచీక‌ర‌ణ పుణ్య‌మా అంటూ ..ప్రైవేట్ రంగ సంస్థ‌లు ఈ రంగంలోకి వ‌చ్చాయి. ఎప్పుడైతే ఎఫ్‌డీఐల వెల్లువ పెర‌గ‌డంతో భార‌తీయ మార్కెట్‌ను బ‌డా, దిగ్గ‌జ కంపెనీలు వెల్లువ‌లా ముంచెత్తాయి. ఒక్కో కంపెనీది ఒక్కో స్ట‌యిల్. ఒక్కో స్ట్రాట‌జీ. బీఎస్ఎన్ఎల్‌, ఎయిర్‌టెల్, వొడాఫోన్, యునినార్, ఐడియా, త‌దిత‌ర కంపెనీలు టెలికాం రంగాన్ని శాసించాయి. ఆఫ‌ర్లతో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఐటీ రంగం అభివృద్ధి చెంద‌డం, ...