పోస్ట్‌లు

ఆగస్టు 21, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

గుండె నుంచి గుండెల్లోకి..క్యూబా మోహన రాగం..!

చిత్రం
ప్రపంచాన్ని ఒంటి చేత్తో శాశించాలని, పెద్దరికాన్ని ప్రదర్శిస్తున్న అగ్ర రాజ్యం అమెరికా పక్కలో బల్లెం లా తయారైన క్యూబా పేరు తలుచుకున్నప్పుడు, దాని గురించి ఆలోచించినప్పుడు రోమాలు పైకి లేస్తాయి. శరీరంలో ఏదో విద్వత్తు ప్రవహిస్తుంది. క్యూబా ..కాస్ట్రో ..చేగువేరా ..గుండెల్లో కదలాడుతూనే వుంటారు. ఎందుకంటే చూస్తే చిన్న దేశం. కానీ యుఎస్ కు ముచ్చెమటలు పట్టించిండ్రు. గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అమెరికా ఇప్పటికీ కాస్ట్రో పేరు తలుచుకుని భయ పడుతోంది. అంతేనా ప్రభావితం చేస్తూ నియతం వెంటాడుతున్న ఒకే ఒక్కడు చేగువేరా. ఉద్విగ్న మైన చరిత్రకు, పోరాటాలకు ఊపిరి పోసిన చరిత్ర క్యూబాది. అందుకే ఆ దేశమన్నా, దాని గురించి తెలుసుకోవాలన్నా ఎంతో ఆసక్తి. ఈ లోకంలో ఎందరో హీరోలయ్యారు. ఇంకొందరు కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసారు. జనం గుండెల్లో రాజులయ్యారు. మహారాజులై కీర్తింప బడుతున్నారు. ఏళ్ళు గడిచినా , కాలం వెళ్లి పోతున్నా, సాంకేతికత కొత్త పుంతలు తొక్కినా , పోగేసుకున్న చరిత్ర అలాగే ఉన్నది. పాడు కోవడానికో లేదా గుర్తు తెచ్చు కోవడానికో కాదు..కోట్లాది ప్రజల ఆర్త నాదం. క్యూబా గురించి ..కన్నడ నాట గొప్ప రచయితగా పేరొంది...

పొలిటికల్ ఫైర్ బ్రాండ్ ..మహోవా వారెవ్వా..!

చిత్రం
ఆమె అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చింది. తన ప్రతిభా పాటవాలతో, అత్యంత ధైర్య సాహసాలతో మొదటి సారిగా పార్లమెంట్ లోకి అడుగు పెట్టింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. తన ప్రసంగంతో తోటి ఎంపీలతో పాటు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దాస్ మోదీని సైతం విస్తు పోయేలా చేసింది మహువా మొయిత్రా. బెంగాల్ రాష్ట్రం లోని కృష్ణా నగర్ లోక్ సభ నియోజక వర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసింది. ప్రత్యర్థి కేంద్రంలోని బీజేపీ పార్టీఐకి చెంది న కళ్యాణ్ చౌబే పై 63 వేల 318 ఓట్ల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. బెంగాల్ లో మమతా బెనర్జీతో పాటు మహోవా హవా కొనసాగుతోంది. సమాజం పట్ల విస్తృతమైన అవగాహన కలిగిన మహోవా పద్దతిగా మాట్లాడతారు. అంతే కాదు సూటిగా ప్రశ్నిస్తారు. జనాన్ని ప్రేమించే ఆమె వారికి అందుబాటులో వుంటారు. అందుకే ఆమెకు యెనలేని డిమాండ్. సామాజిక, రాజకీయ, ఆర్ధిక, సాంకేతిక , ప్రజా సమస్యల పట్ల మహోవాకు మంచి పట్టుంది. ఇదే ఆమెకు అస్సెట్ గా మారింది. దేశ ప్రధాని, స్పీకర్ ల మనసు దోచుకుంది. దీంతో ఆమె ఒక్క రోజులో దేశంలో ఎందరికో రోల్ మోడల్ గా మారి పోయారు. మహిళలు అన్ని...

సంస్కరణలకు ఊతం..మహిళలకు వరం

చిత్రం
అరబ్ దేశాలలో చావడం కంటే బతకడం చాలా కష్టం. కఠినతరమైన నియమ నిబంధనలు అక్కడి ప్రజలనే కాదు, ఇతర దేశాలకు చెందిన వారికి కూడా ఇబ్బంది కరమే. ప్రపంచంలో ఏ దేశాలలో లేని విధంగా సౌదీ అరేబియా దేశంలో పురుషుల కంటే మహిళలపై ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని దాటుకుని బయటకు రావాలంటే చాలా కష్టం కూడా. ప్రపంచంతో పోటీ పడాలన్నా, సాంకేతికత అందిపుచ్చు కోవాలంటే , దేశం అభివృద్ధి పథంలో నడవాలంటే పురుషులతో పాటు మహిళలు కూడా భాగస్వామ్యం ఉండాలని ఆ దేశపు యువ రాజు భావించారు. అతడు వచ్చాక సమూలంగా మార్పులు చేశారు. ప్రతి ఒక్కరు చదువు కోవాలని, టెక్నలాజి లో మరింత పరిణతి చెందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందు కోసం భారీ ఎత్తున నిధులు, సౌకర్యాలు కల్పించారు. తాజాగా సౌదీ మహిళలకు ఎక్కడికైనా ప్రయాణం చేసేందుకు సేచ్ఛను కల్పిస్తూ సంచల నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు ముందు విధించిన కఠినతరమైన ఆంక్షలను ఎట్టి వేస్తున్నట్లు ప్రకటించారు. పురుషులతో సమానంగా స్త్రీలకు సమానంగా హక్కులు కల్పించేందుకు అక్కడి సర్కార్ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. తాజాగా ట్రావెల్ ఫ్రీడమ్ లభించింది. 21ఏళ్లు  పైబడిన మహిళలు ఇకపై ఇంట్లోని పురుషుల పర్మిషన్ లేకుం...

ఆకలి తీరుస్తున్న అమ్మ పాల బ్యాంక్.లు..!

చిత్రం
అప్పుడే పుట్టిన పిల్లలకు సరిపడా పాలు ఇవ్వక పోవడం వల్ల ఎంతో మంది మృత్యువాతకు లోనవుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆసుపత్రులు ప్రత్యేకంగా తల్లులకు సంబంధించిన అమ్మ పాల బ్యాంకులను ఏర్పాటు చేశారు. దీని వల్ల పాలు రాని లేదా తక్కువ పాలు కలిగిన తల్లుల పిల్లలకు ఈ పాల బ్యాంకుల వల్ల ఎంతో మేలు చేకూరుతోంది. రోగులకు అత్యవసర సమయంలో రక్తం ఎలా ఉపయోగ పడుతుందో, ఈ పాల బ్యాంకులు పిల్లలను కాపాడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో తల్లులు ఎక్కువ మంది పాల కొరతతో ఇబ్బంది పడుతున్నారు. దీని తీవ్రతను గమనించిన, నగరంలో పేరున్న నీలోఫర్ హాస్పిటల్ లో మొదటి సారిగా అమ్మ పాల బ్యాంక్ ను ప్రారంభించారు. పాలను సేకరించడం, వాటిని శుద్ధి చేయడం, భద్రంగా భద్ర పర్చడం చేస్తారు. దీని కోసం ప్రత్యేకంగా సిబ్బందితో పాటు స్పెషల్ డాక్టర్స్ కూడా ఈ బ్యాంక్ లో పని చేస్తున్నారు. కొందరు పురిట్లోనే పిల్లలు చని పోతుండగా, మరికొందరు తల్లులు మృత్యు వాతకు గురవుతున్నారు. ఈ సమయంలో పిల్లల సంరక్షణ భాద్యతను ఈ ఆస్పత్రి నిర్వాహకులు చూసుకుంటున్నారు. దీనికి ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదు. ధాత్రి అనే స్వచ్చంద సంస్థ ఈ అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పిల్...