పోస్ట్‌లు

జూన్ 29, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ముంబ‌యిలో అధికారిక యాపిల్ స్టోర్

చిత్రం
ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ న‌మ్మ‌క‌మైన కంపెనీ ఏదంటే ..ఎవ‌రైనా ఠ‌క్కున స‌మాధానం చెప్పేది యాపిల్ కంపెనీనే. కోట్లాది జ‌నం గుండెల్ని మీటిన ఈ సంస్థ నుంచి ఏ ప్రొడ‌క్ట్ వ‌చ్చినా..ఏ యాక్స‌స‌రీస్ వ‌చ్చినా స‌రే లైన్‌లో నిల్చుని తీసుకుంటారు. యాపిల్ బ్రాండ్ నేమ్ ఉన్న‌ది ఏదైనా చేతిలో ఉంటే దాని లుక్, గెట‌ప్‌, దాని స్టేట‌స్ వేరంటారు ఫ్యాన్స్. ధ‌ర ఎంతున్నా కొనేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. ఐటీ సెక్టార్‌లో వేగంగా దూసుకు వ‌చ్చింది ఈ కంపెనీ. ఆయా దేశాధినేత‌ల నుంచి సామాన్యుల దాకా ఫ‌స్ట్ ప్ర‌యారిటీ ఏదంటే యాపిల్‌నే. త‌ర్వాతి స్థానం శాంసంగ్‌ది. గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు కూడా మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు మార్కెట్‌లోకి తీసుకు వ‌చ్చినా యాపిల్ కంపెనీతో పోటీ ప‌డ‌లేక పోయాయి. గ‌త కొన్నేళ్ల నుంచి యాపిల్ ప్రాడ‌క్ట్స్ టాప్ వ‌న్ పొజిష‌న్‌లో ఉంటున్నాయి. యాపిల్ ఫోన్ త‌యారు గురించి స్టీవ్ జాబ్స్ ఒకానొక స‌మ‌యంలో మీడియా అడిగిన ..అస‌లు యాపిల్ స‌క్సెస్ సీక్రెట్ ఏమిటి అని..ఇలా జ‌వాబిచ్చారు. మ‌నం త‌యారు చేసే ఏ వ‌స్తువు కానివ్వండి ..అమ్ముడు పోతుందా లేదా అన్న‌ది కాదు ముఖ్యం..ప‌ది కాలాల పాటు నాణ్య‌వంతంగా , స‌మ‌ర్థ‌వంత...

బ‌తికిపోయిన పాకిస్తాన్ ..బెంబేలెత్తించిన ఆఫ్గ‌నిస్తాన్

చిత్రం
ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్‌లో ఈజీగా గెలుస్తుంద‌ని భావించిన పాకిస్తాన్ జ‌ట్టు చావు త‌ప్పి క‌న్ను లొట్ట ప‌డింద‌న్న చందంగా ఆఫ్గ‌నిస్తాన్ పై అతి క‌ష్టం మీద విజ‌యం సాధించింది. ఆఖ‌రు వ‌ర‌కు ఆఫ్గాన్ క్రికెట‌ర్స్ చుక్క‌లు చూపించారు. గెలుపు అంచుల దాకా వ‌చ్చి ఆ జ‌ట్టు చ‌తికిల ప‌డడంతో పాక్ ఆట‌గాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విజ‌యంతో పాకిస్తాన్ సెమీఫైన‌ల్ ఆశ‌లు స‌జీవంగా ఉంచుకుంది. పెను సంచ‌ల‌నం తృటిలో త‌ప్పిపోయింది లేకుంటే ఆఫ్గాన్ రికార్డు సృష్టించేదే. ఆఫ్గ‌న్ ఆఖ‌రు వ‌ర‌కు పాక్‌పై ఆధిప‌త్యం సాధించింది. ఆ జ‌ట్టు స్పిన్న‌ర్ల దెబ్బ‌కు పాక్ క్రికెట‌ర్లు ప‌రుగులు చేసేందుకు నానా తంటాలు ప‌డ్డారు. ఓట‌మి అంచుల్లో చిక్కుకున్న పాకిస్తాన్ జ‌ట్టును ఇమాద్ వ‌సీం ఒక్క‌డే అడ్డుగోడ‌లా నిలిచాడు. విరోచిత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆ జ‌ట్టు క‌ష్టం మీద గెలుపొందింది. ఈ టోర్నీలో పాకిస్తాన్‌కు వ‌రుస‌గా ఇది మూడో విజ‌యం. ఇమాద్ వ‌సీం 54 బంతులు ఆడి 49 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అత్యంత ఉత్కంఠ భ‌రితంగా ఇరు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ కొన‌సాగింది. ఏడు వికెట్లు కోల్పోయి మూడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ష‌హీన్ ఆఫ్రిది 47 ప‌...

ఘ‌నంగా రౌండ్ టేబుల్ ఇండియా పుర‌స్కారాలు

చిత్రం
చెన్నై కేంద్రంగా స్వ‌చ్ఛంధ సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న రౌండ్ టేబుల్ ఇండియా ఎన్‌జిఓ సంస్థ ఆధ్వ‌ర్యంలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో వివిధ రంగాల‌లో విశిష్ట సేవలందించిన వారికి పుర‌స్కారాలు హైద‌రాబాద్‌లో అంద‌జేశారు. మాదాపూర్‌లోని హెచ్ఐసిసీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఐటీ , ప‌రిశ్ర‌మ‌ల ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్ , జీవీకే గ్రూప్ సంస్థ‌ల డైరెక్ట‌ర్ పింకీ రెడ్డి, ఏఐజీ హాస్పిట‌ల్స్ డైరెక్ట‌ర్ జి.వి.రావులు హాజ‌ర‌య్యారు. విజేత‌ల‌కు అవార్డులు అంద‌జేశారు. మొత్తం 12 కేట‌గిరీల‌లో అఛీవ‌ర్ అవార్డు, ఎమ‌ర్జింగ్ పుర‌స్కారాల‌ను ప్ర‌దానం చేశారు. ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ ద్వారా వ‌చ్చిన విరాళాల‌ను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో మౌళిక వ‌స‌తులు, సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు వినియోగించ‌నున్న‌ట్లు ఆర్‌.టి.ఐ సంస్థ బాధ్యులు తెలిపారు. ఇక పుర‌స్కారాలు అందుకున్న వారిలో స్వ‌చ్ఛంధ సేవా సంస్థ‌ల విభాగంలో విశిష్ట సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన డాక్ట‌ర్ రెడ్డీస్ ఫౌండేష‌న్‌కు అవార్డు ద‌క్కింది. ఎస్ఎంఈ కేట‌గిరీలో సువెన్ లైఫ్ సైన్సెస్ ఎంపిక కాగా, విద్యా విభాగంలో చిర‌క్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ నిర్వాహ‌కురాలు ర‌త్నారెడ్డి పుర‌స్కారా...

అంద‌రి చూపు క‌రీంన‌గ‌ర్ వైపు - క‌రీంన‌గ‌ర్ మేయ‌ర్‌కు స‌లాం..!

చిత్రం
మ‌న రాష్ట్ర‌మే కాదు ..జాతి యావ‌త్తు క‌రీంన‌గ‌ర్ వైపు చూస్తోంది. ఆ ప‌ట్ట‌ణ మేయ‌ర్ అధికార పార్టీకి చెందిన వ్య‌క్తి ర‌వీంద‌ర్ సింగ్. ఆయ‌న అంద‌రి లాగా హంగు, ఆర్భాటాల‌కు, అధికార ద‌ర్పానికి చోటివ్వ‌రు. ప్ర‌జల‌కు ఏం కావాలో , వారికున్న స‌మ‌స్య‌లు ఏమిటో ..వాటిని ఎలా ప‌రిష్క‌రించాలోన‌ని నిత్యం ఆలోచిస్తుంటారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే వుంటారు. వారికి క‌నీస వ‌స‌తుల‌ను క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ర‌వీంద‌ర్ సింగ్ పేరు దేశ వ్యాప్తంగా వైర‌ల్ గా మారింది. ఎందుకంటే ఆయ‌న తీసుకున్న సాహోసోపేత‌మైన నిర్ణ‌యం ల‌క్ష‌లాది మంది జ‌నాన్ని ఆలోచింప చేసేలా చేసింది. ఏ ప్ర‌భుత్వం , ఏ ప్ర‌జాప్ర‌తినిధి, ఎమ్మెల్యే, ఎంపీలు , ఐఏఎస్‌లు చేయ‌ని ప‌నిని ఈ మేయ‌ర్ చేశారు. అదేమిటంటే కేవ‌లం ఒకే ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు ..కార్పొరేష‌నే ద‌గ్గ‌రుండి ఎవ‌రైనా చ‌నిపోతే..ఏ కులానికి చెందిన వారైనా, ఏ మ‌తానికి చెందిన వారైనా సరే అంతిమ యాత్ర నిర్వ‌హించ‌డంతో పాటు అంత్య‌క్రియ‌లు చేస్తుంది. ర‌వీంద‌ర్ సింగ్ తీసుకున్న ఈ నిర్ణ‌యానికి వేలాది మంది జేజేలు ప‌లికారు. ఆయ‌న‌ను ఆద‌ర్శంగా తీసుకుని మ‌రికొన్ని మున్సిపాలిటీల‌లో దీనిని అమ‌లు చేసేందుకు చ‌ర...

ఫీజుల మోత‌.. దోచుకున్నోళ్ల‌కు దోచుకున్నంత - కాలేజీల దందా..!

చిత్రం
బంగారు తెలంగాణ‌లో బ‌తుకు బ‌రువై పోతోంది. చ‌దువు ఉన్న‌త వ‌ర్గాల‌కే ద‌క్కుతోంది. పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల పిల్ల‌ల‌కు ఇంజ‌నీరింగ్, మెడిసిన్, అగ్రిక‌ల్చ‌ర్ , ఫార్మ‌సీ కోర్సులు చ‌ద‌వాలంటే ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయాల్సిన ప‌రిస్థితి దాపురించింది. కేజీ టూ పీజీ పేరుతో కాల‌యాప‌న చేస్తున్న స‌ర్కార్ ..విద్యా వ్య‌వ‌స్థ‌ను గాలికి వ‌దిలివేసింది. ఓ వైపు టీచ‌ర్లు లేక పాఠ‌శాల‌లు కునారిల్లిపోతుంటే మ‌రో వైపు క‌నీస వ‌స‌తులు లేక విద్యార్థులు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల గురుకులాలను ఆర్భాటంగా ప్రారంభిస్తున్నారే త‌ప్పా టీచింగ్, నాన్ టీచింగ్ భ‌ర్తీ విష‌యంపై శ్ర‌ద్ద చూపించ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. ఇవాళ తెలంగాణ‌లో ఇంజ‌నీరింగ్ కోర్సులతో పాటు మెడిసిన్, హోమియోప‌తి, డెంట‌ల్, ఆయుర్వేద కోర్సులు చ‌ద‌వాలంటే ఆస్తులైనా అమ్ముకోవాలి లేదా అప్పులైనా చేయాల్సిందే. లేక‌పోతే చ‌దువుకు దూరంగా ఉండాల్సిందే.  చ‌దువు కోవ‌డం కంటే చ‌దువును కొనాల్సిన ప‌రిస్థితి దాపురించింది. క‌ష్ట‌ప‌డి ర్యాంకులు సంపాదించినా ఏ కాలేజీలో సీటు వ‌స్తుందో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఉమ్మ‌డి రాష్ట్రంలో దివంగ‌త ముఖ్య...

కేసీఆర్, జ‌గ‌న్ ల దోస్తానా - ప్ర‌గ‌తికి ఫ‌ర్మానా

చిత్రం
కాలం విచిత్ర‌మైంది. అది ఎంత‌టి వారినైనా కట్టి ప‌డేస్తుంది. పైనున్న వాళ్ల‌ను కింద‌కు తోసేస్తుంది. అట్ట‌డుగున ఉన్న వాళ్ల‌ను అంద‌లం ఎక్కిస్తుంది. ఏపీ ఉమ్మడి రాష్టం నుండి విడి పోయాక ఇరు రాష్ట్రాలు వేర్వేరుగా ఏర్పాట‌య్యాక‌..చాలా ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. పంప‌కాల విష‌యంలో పంతాలు, పట్టింపుల‌కు పోవ‌డంతో చివ‌ర‌కు గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకోవాల్సిన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అటు వైపు టీడీపీ కొలువు తీరిన చంద్ర‌బాబు నాయుడుకు ఇక్క‌డ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మ‌ధ్య‌న అంత‌రాలు ఏర్ప‌డ్డాయి. త‌ర్వాత వీరిద్ద‌రి మ‌ధ్య న‌ర‌సింహ‌న్ స‌యోధ్య కుదిర్చే ప్ర‌య‌త్నం చేశారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసుకున్నారు. టీడీపీ కాంగ్రెస్‌తో క‌లిసి పోటీ చేస్తే..టీఆర్ఎస్‌, ఎంఐఎంలు క‌లిసి పోటీ చేశాయి. కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  ఆ మేర‌కు ఆయ‌న కొన్ని రాష్ట్రాలు తిరిగారు. ఆయా సీఎంల‌ను క‌లిశారు. మ‌రో వైపు చంద్ర‌బాబు సైతం బీజేపీ యేత‌ర పార్టీల‌ను కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఏపీలో ఎట్టి ప‌రిస్థితుల్లోన...

ముంబ‌యి..మోస్ట్ కాస్ట్‌లీ సిటీ

చిత్రం
ప్ర‌పంచంలోనే అత్యంత కాస్ట్‌లీ న‌గ‌రాల‌లో ఇండియాలోని ముంబ‌యి న‌గ‌రం చోటు ద‌క్కించుకుంది. ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చి ఇండియాలో నివ‌సించాలంటే అత్యంత సేఫెస్ట్, ఖ‌రీదైన ప్రాంతంగా ముంబ‌యి చేరింది. మెర్స‌ర్ అధ్య‌య‌న నివేదికలో ఈ విష‌యం వెల్ల‌డించింది. ఆసియా ఖండంలో 20 అత్యంత ఖ‌రీదైన న‌గ‌రాల‌లో ఒక‌ట‌ని తెలిపింది. గ్లోబ‌ల్ క‌న్స‌ల్టింగ్ సంస్థ మెర్స‌ర్ ప్ర‌తి ఏటా స‌ర్వే చేస్తుంది. జాబితాను ప్ర‌క‌టిస్తుంది. ఈసారి ప్ర‌పంచ వ్యాప్తంగా 209 దేశాల్లో జీవ‌న వ్య‌యంపై విస్తృతంగా అధ్య‌య‌నం చేసింది. ఈ కంపెనీ 25వ వార్షిక జాబితాలో ముంబై మ‌హా న‌గ‌రం 67వ స్థానంలో నిలిచింది. గ‌త ఏడాదితో పోలిస్తే 12 స్థానానికి దిగ జారింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది మ‌రింత ఖ‌రీదైన‌దిగా మారిందిని పేర్కొంది. క‌నీసం బ‌య‌ట భోజ‌నం చేసేందుకు అయ్యే ఖ‌ర్చులు , ఇత‌ర సేవ‌ల వ్య‌యాలు త‌గ్గు ముఖం ప‌ట్టిన‌ప్ప‌టికీ ప్ర‌పంచంలో గృహాలు అత్య‌ధిక రేటు ప‌లుకుతున్న న‌గ‌రాల్లో ఇది ఒక‌టిగా మెర్స‌ర్ తెలిపింది.  ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన న‌గ‌రాల్లో ఒక‌టిగా నిలిచిందని స‌మ‌గ్ర రిపోర్టులో నివేదించింది. వ‌ర‌ల్డ్ వైడ్ లిస్ట్‌లో ఢిల్లీ న‌గ‌రం 118వ స్థానంలో నిల...

జ‌గ‌న్ ప్ర‌జా ద‌ర్బార్ - జ‌నంతో ముఖాముఖి

చిత్రం
ఏ ముహూర్తాన ఆంధ‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారో కానీ ..సందింటి జ‌గన్మోహ‌న్ రెడ్డి ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ప‌రిపాల‌న సాగిస్తున్నారు. ఉన్న‌తాధికారుల‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రికి భ‌ద్రమైన జీవితం వుంటుంద‌ని స్ప‌ష్టం చేస్తూనే మ‌రో వైపు ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాల‌ని, మ‌రింత బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని హెచ్చ‌రించారు. ఏ మాత్రం తేడా వ‌స్తే ఉపేక్షించ‌బోనంటూ ప్ర‌క‌టించారు. దేశంలోనే పార‌ద‌ర్శ‌క‌మైన పాల‌న అందిస్తామ‌ని, ఈ రాష్ట్రం మిగ‌తా రాష్ట్రాల‌కు ఆద‌ర్శవంతంగా ఉండేలా తీర్చిదిద్దుతాన‌ని చెప్పారు జ‌గ‌న్. ఏ రోజు ఏ ప‌థ‌కం ప్ర‌క‌టిస్తారో, ఏ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుడ‌తారో తెలియ‌క హ‌య్య‌ర్ అఫీసియ‌ల్స్ ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. కొన్నేళ్ల‌పాటు ప్ర‌జా సంక‌ల్ప యాత్రను చేప‌ట్టిన ఈ యువ నాయ‌కుడు వారి బాధ‌ల‌ను, స‌మ‌స్య‌ల‌ను విన్నారు..చూశారు. అవినీతి, అక్రమాల‌కు తావు ఉండ‌రాద‌ని, ఎవ‌రైనా అడిగినా లేదా డిమాండ్ చేసినా త‌క్ష‌ణ‌మే త‌నకు నేరుగా ఫోన్ చేయాల‌ని జ‌గ‌న్ సూచించారు. ఆ మేర‌కు వెంట‌నే త‌న నెంబ‌ర్ ఇవ్వాల‌ని ఆదేశించారు. మ‌రో వైపు కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. జ...

తెలుగు వాకిట నిలువెత్తు సంత‌కం - సినారే ..భ‌ళారే

చిత్రం
భార‌తీయ సాహితీ జ‌గ‌త్తులో మ‌రిచిపోని వ‌సంత మేఘం సినారే. అపూర్వ‌మైన విజ్ఞానం క‌లిగిన వ్య‌క్తిగా..తెలుగు సాహిత్యానికి ఎన‌లేని కీర్తి ప్ర‌తిష్ట‌ల‌ను తీసుకు వ‌చ్చిన సాహితీవేత్త‌గా పేరు గ‌డించారు. ఆయ‌న స్పృశించ‌ని ప్ర‌క్రియ లేదంటే అతిశ‌యోక్తి కాదేమో. కొన్ని ద‌శాబ్దాల‌పాటు శాసించారు. త‌ను లేకుండా ఏ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌ని స్థాయికి చేరుకున్నారు. తెలంగాణలో ఎంద‌రో గొప్ప వ్య‌క్తులు జ‌న్మించారు. త‌నువు చాలించారు. వారిలో సినారే, దాశ‌ర‌థి, కాళోజీ, వేదం జీవ‌న నాదం ..దాశ‌ర‌థి కృష్ణ‌మాచార్య , సామ‌ల సదాశివ లాంటి వారెంద‌రో లెక్కించ‌లేనంత మంది త‌మ శ‌క్తిని ధార‌పోశారు. సాహిత్యానికి జీవం పోశారు. కొన్ని త‌రాల‌కు స‌రిప‌డా సాహిత్య‌పు విలువ‌ల‌ను కాపాడుతూ అవి చెరిగి పోకుండా త‌మ క‌లాల‌కు ప‌దును పెట్టారు. డాక్ట‌ర్ సింగిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి గురించి చెప్పాలంటే ..నాలుగు ద‌శాబ్ధాలను తిర‌గ తోడాల్సి ఉంటుంది. తాజాగా సీఎం కేసీఆర్ ఆయ‌న స్మారకార్థం గ్రంధాల‌యాన్ని ప్రారంభించారు. ఆయ‌న మ‌న‌మ‌ధ్య నుంచి వెళ్లిపోయి రెండేళ్ల‌యింది.  క‌విగా, ర‌చ‌యిత‌గా, వ‌క్త‌గా, సినీ గేయ ర‌చ‌యిత‌గా, అనువాద‌కుడిగా, ఆచార్యుడిగా, వీసీగా, ప్ర‌భ...