పోస్ట్‌లు

మార్చి 8, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

లేచి ప‌డిన పృథ్వీరాజ్

చిత్రం
న‌టుడిగా తెలుగు సినిమా రంగంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న పృథ్వీరాజ్ ఇపుడు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. బాగున్న‌ప్పుడు అంతా పోగైన జ‌నం ఇపుడు ప‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొని శ్రీ వెంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఛైర్మ‌న్ ప‌ద‌వి నుంచి అనూహ్యంగా త‌ప్పుకోవ‌డంతో ఎవ‌రూ ఆయ‌న ద‌రిదాపుల్లోకి వెళ్ల‌డం లేదు. ఈ విష‌యాన్ని, ఘోర‌మైన అవ‌మాన‌క‌రంగా భావిస్తున్న‌ట్లు స్వ‌యంగా ఈ న‌టుడే ఇటీవ‌ల వాపోవ‌డం జ‌రిగింది. ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాల్లో న‌టించి మెప్పించిన ఘ‌న‌త పృథ్విది. అంతే కాకుండా ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడే స్వ‌భావం క‌లిగి ఉండ‌డం కూడా ఆయ‌న కెరీర్‌కు పెద్ద అడ్డంకిగా మారింది. మొద‌టి నుంచి తెలుగుదేశం పార్టీకి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తూ వ‌చ్చారు. పృథ్వీరాజ్ కు వైఎస్ ఆర్ అంటే పిచ్చి. అదే వైఎస్ జ‌గ‌న్‌కు హార్డ్ కోర్ ఫ్యాన్‌గా ఉంటూ వ‌చ్చారు. అంతేకాకుండా జ‌గ‌న్ స్థాపించిన కొత్త పార్టీలో ఆయ‌న వెంట కార్య‌క‌ర్త‌గా ప‌నిచేశారు. న‌మ్మ‌క‌మైన నాయ‌కుడిగా ఎదిగారు. ఏకంగా పార్టీకి వెన్నుద‌న్నుగా నిలిచారు. పార్టీ ప్ర‌చారానికి ర‌థ‌సార‌థిగా ఉన్నారు. ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఓ వైపు వృత్తి ప‌రంగా క‌ళాకారుడైన పృథ్వీరాజ...

ఆస్ట్రేలియానే అస‌లైన విజేత

చిత్రం
అంద‌రూ అనుకున్న‌ట్టుగానే మన మ‌హిళా క్రికెట్ జ‌ట్టు చేతులెత్తేసింది. ఫైన‌ల్ పోరులో చ‌తికిల‌ప‌డింది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ప‌క్కా ప్లాన్ తో ఆడితే..మ‌న వాళ్లు అలా వ‌చ్చి ఇలా పెవిలియ‌న్ దారి ప‌ట్టారు. వ‌చ్చిన అద్భుత‌మైన అవ‌కాశాన్ని వ‌దులుకున్నారు. దీంతో మ‌రోసారి ఆస్ట్రేలియా మ‌హిళా జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. వ‌రుస‌గా అయిదోసారి టీ20 ప్ర‌పంచ క‌ప్ ను ముద్దాడింది. ఇండియా జ‌ట్టును చిత్తుగా ఓడించింది. చాంపియన్‌ ఆట తీరుతో ఆస్ట్రేలియా మరోసారి మెరిసింది..  ప్రపంచకప్‌-2020 విజేతగా నిలిచింది. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో  4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.  స్టార్‌ బ్యాటర్‌ అలీసా హీలీ విధ్వంసానికి తోడు.. మరో ఓపెనర్‌ బెత్‌ మూనీ  హాఫ్‌ సెంచరీతో రాణించారు. దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 19.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. ప్రధాన బ్యాటర్లు షషాలీ, మంధాన, రోడ్రిగ్స్ , హర్మన్ లు ఎలాంటి ప‌ర్ ఫార్మెన్స్ క‌న‌బ‌ర్చ‌లే...

నిన్న లేబ‌ర్..నేడు సిఇఓ ..విమెన్ స‌క్సెస్ జ‌ర్నీ

చిత్రం
క‌ల‌లు క‌నండి..వాటిని నిజం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేయండి. పోతే పోయేదేముంది..జ‌స్ట్ క‌ష్ట‌ప‌డ‌ట‌మేగా. అయితే విజ‌యం వ‌రిస్తుంది. కాక‌పోతే అప‌జ‌యం నేర్పిన అనుభ‌వం ప‌నికొస్తుంది. కొంద‌రిని చూస్తే జాలేస్తుంది. ఇంకొంద‌రిని చూస్తే గుండెల్లో దాచుకోవాల‌ని అనిపిస్తుంది. ఈ స‌మాజంలో ఆడ‌వాళ్లంటే చుల‌క‌న భావం. వాళ్లకు ఏదీ చేత‌కాద‌నే కామెంట్స్ ఎక్కువ‌గా వింటూ వుంటాం. కానీ అవేవీ ఆమె విష‌యంలో అడ్డురాలేదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన అనిలా జ్యోతి రెడ్డిది క‌న్నీటి క‌థ‌. అత్యంత పేద‌రికం నుంచి వ‌చ్చిన ఆమె ఎన్నో క‌ష్టాల‌ను అనుభ‌వించింది. లేబ‌ర్‌గా ప‌నిచేసిన ఆమె ఇపుడు ఏకంగా ప్ర‌పంచాన్ని శాసిస్తున్న అమెరికాలో ఏకంగా ఐటీ రంగానికి సంబంధించి కీ సాఫ్ట్ వేర్ సొల్యూష‌న్స్ కంపెనీని ఏర్పాటు చేసింది. ఒక‌ప్పుడు కూలీగా ప‌నిచేసిన జ్యోతి రెడ్డి ఇపుడు బిగ్గెస్ట్ కంపెనీకి సిఇఓగా ఉన్నారు. ఇది నిజంగా జ‌రిగిన క‌థ‌.  ఎంద‌రికో స్ఫూర్తి దాయ‌కంగా నిలిచిన ఆమె జీవితం ప్ర‌తి ఒక్క‌రికి పాఠం కావాలి. ఐదుగురు పిల్ల‌లు క‌లిగిన ఆ కుటుంబంలో ఎనిమిదేళ్ల‌ప్పుడు పేరెంట్స్ బ‌తుకు భారం ఎక్కువై జ్యోతిరెడ్డిని అనాధ ఆశ్ర‌మంలో చేర్పించారు....