పోస్ట్‌లు

సెప్టెంబర్ 25, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

మనోడు అపర కుబేరుడు..!

చిత్రం
ధీరుభాయి అంబానీ పుత్ర రత్నం ముఖేష్ అంబానీ ఇండియాలో అపర కుబేరుడిగా మరోసారి వినుతికెక్కారు. రిలయన్స్ గ్రూప్ కంపెనీస్ కు చైర్మన్ గా వున్న ముఖేష్ మరోసారి వైరల్ గా మారారు. నిన్నటి దాకా జియో తో సెన్సేషనల్ సృష్టించిన ఈ వ్యాపార దిగ్గజం దెబ్బకు ఇతర కంపెనీలు లబోదిబోమంటున్నాయి. ఒకే ఒక్క ప్రకటనతో భారతీయ టెలికాం రంగాన్ని షేక్ చేశారు ధీరుభాయి సుపుత్రులు. తండ్రి స్థాపించిన రిలయన్స్ ను ఇవ్వాళ  ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీగా తీర్చిదిద్దారు. వేలాది మంది దీనిని నమ్ముకుని ఉన్నారు. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. ఒకే ఒక్క ప్రకటనతో ఇండియాలో షేర్స్ అమాంతం పైకి ఎగ బాకాయి. ప్రత్యర్థి కంపెనీల షేర్స్ డీలా పడ్డాయి. జియో లో నమోదైన కస్టమర్లు ఏకంగా 34 కోట్లకు చేరుకున్నారు. ఇది కూడా ఓ రికార్డ్. తాజాగా అపర కుబేరులు ఎవరో జాబితా విడుదలైంది. మొత్తం కుబేరుల్లో 3,80,700 కోట్ల తో అపర కుబేరుడుగా ముఖేష్ అంబానీ మొదటి ప్లేస్ లో నిలిచి చరిత్ర సృష్టించారు. రెండవ స్థానంలో హిందూజా, మూడో ప్లేస్ లో అజీమ్ ప్రేమ్ జి ఉన్నారు. మొత్తం 25 మంది కుబేరుల లిస్టును ప్రక...

మోస్ట్ పవర్ ఫుల్ మెన్ - ఇమ్రాన్ నోట మోడీ మాట

చిత్రం
నిన్నటి దాకా చిలుక పలుకులు పలికిన పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఉన్నట్టుండి మాట మార్చాడు. ఇండియాతో ప్రతి క్షణం యుద్దానికి కాలు దువ్వుతోంది పాక్. ఎప్పుడైతే జమ్మూ, కాశ్మీర్లో 370 ఆర్టికల్ ను కేంద్రంలోనే మోదీ ప్రభుత్వం రద్దు చేయడంతో ఇమ్రాన్ ఖాన్ మరింత రెచ్చి పోయాడు. భారత్ పై లేనిపోని ఆరోపణలు చేస్తూనే బురద జల్లడం ప్రారంభించారు. మరో వైపు ఉగ్రవాదులకు తమ ప్రాంతం అడ్డాగా ఉందని ఒప్పుకుంటూనే ఇండియాను ఇమ్రాన్ ఖాన్ టార్గెట్ చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అంతర్జాతీయ వేదికపై జరిగిన సమావేశంలో ఇండియాపై పాకిస్థాన్ ప్రతినిధి నిప్పులు చెరిగారు. జమ్మూ, కాశ్మీర్ తమదేనంటూ చెప్పుకొచ్చారు. అక్కడ పాల్గొన్న దేశాలలో ఒక్క చైనా దేశం తప్పా పాకిస్థాన్ కు ఏ ఒక్క దేశమూ మద్దతు పలకలేదు. సరి కదా పాకిస్తాన్ ను ఉగ్రస్తాన్ అంటూ పేర్కొన్నాయి. ఇదే సమయంలో అమెరికాలో ఇమ్రాన్ ఖాన్ పర్యటించారు. ఆ దేశ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తో మీట్ అయ్యాడు. పాకిస్తాన్, ఇండియా దేశాలు చర్చలు జరిపి ఆసియాలో ఉద్రిక్త వాతావరణం లేకుండా చేయాలని, ఇందు కోసం తాను మధ్యవర్తిత్వం వహించేందుకు రెడీగా ఉన్నానంటూ ట్రంప్ స్పష్టం చేశారు. దీనిని భ...

న్వవ్వుల రేడు ఇక రాడు..!

చిత్రం
తెలుగు సినిమా రంగం గొప్ప నటుడిని కోల్పోయింది. హాస్య నటుడిగా పేరున్న తెలంగాణకు చెందిన వేణు మాధవ్ ఇక సెలవంటూ వెళ్లి పోయాడు. మొన్నటికి మొన్న ఎమ్మెస్ ను కోల్పోయింది. జనానికి వినోదం పంచుతున్న వాళ్లంతా ఒక్కరొక్కరుగా ఉండలేమంటూ వెళ్లి పోతున్నారు. మొదట మిమిక్రి ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయిన జీవితం ఉన్నట్టుండి నటుడిగా సక్సెస్ అయ్యాడు. సూర్యాపేట జిల్లా కోదాడలో 1969 సెప్టెంబరు 28 లో పుట్టారు. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సంప్రదాయం సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టి 400లకు పైగా సినిమాల్లో నటించాడు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ దాకా మొత్తం తెలుగు మీడియం లోనే చదివాడు. ఇంగ్లీషు పెద్దగా రాదని ఆయనే చెప్పుకునే వారు. వేణుమాధవ్‌కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే ఇష్టం. ఏ చిన్న సందర్భం వచ్చిన డ్యాన్స్‌ చేసి అందరినీ అలరించేవాడు. నాలుగో తరగతి నుంచే మిమిక్రీ చెయ్యడం ప్రారంభించాడు. చదువుకునే రోజుల్లోనే ఉపాధ్యాయుల్ని అనుకరించి అందరినీ తెగ నవ్వించే వాడు. అమితాబ్ బచ్చన్, ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సు లేయడం, వారిని అనుకరించి మాట్లాడటం మొదలైనవన్నీ చేసేవాడు. వేణు మాధవ్ కు వెంట్రిలాక్విజ...