పోస్ట్‌లు

ఏప్రిల్ 23, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఇందూరు రైత‌న్న‌ల‌కు త‌మిళ తంబీల బాస‌ట

చిత్రం
తమ గోడు వినాల‌ని..తాము పండించిన పంట‌కు క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ దేశ రాజ‌ధానిలో త‌మిళ‌నాడుకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు. ఏళ్ల త‌ర‌బ‌డి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా క‌నీసం త‌మ‌ను మ‌నుషులుగా కూడా గుర్తించ‌డం లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పండించిన పంట‌కు గిట్టుబాటు రావ‌డం లేద‌ని, మినిమం మార్కెట్ ప్రైజ్ కూడా ఇవ్వ‌డం లేదంటూ ధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ విష‌యంపై త‌క్ష‌ణ‌మే స్పందించి త‌మ‌ను ఆదుకోవాల‌ని కోరుతూ నిర‌న‌స వ్య‌క్తం చేశారు. అంత‌కు ముందు ముంబ‌యి నుండి భారీ ఎత్తున రైతులు ఢిల్లీకి పాద‌యాత్ర చేప‌ట్టారు. ఇందులో వేలాది మంది రైతులు పాల్గొన్నారు. వారు పార్ల‌మెంట్‌ను ముట్ట‌డించ‌కుండా పోలీసులు అడ్డుకున్నారు. టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. ఈ విష‌యంపై ప్ర‌ధాన పార్టీల‌న్నీ అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయి. వీరిని స్పూర్తిగా తీసుకున్న తెలంగాణ‌లోని నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతులు పోరుబాట ప‌ట్టారు. దేశంలోనే అత్య‌ధికంగా ప‌సుపు, చెరుకు, కందుల‌ను సాగు చేస్తారు ఈ జిల్లాలో. ప్ర‌త్యేకంగా ప‌సుపు బోర్డు ఏర్పాటు చేయాల‌ని గ‌త కొన్నేళ్లుగా కోరుతూ వ‌స్తున్నారు. పాల‌కులు ...

గేమింగ్ యాప్స్‌తో చిన్నారుల ప‌రేషాన్

చిత్రం
ఇంట‌ర్నెట్‌లో ఎక్క‌డ చూసినా గేమ్స్ యాప్స్ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కోట్లాది మంది చిన్నారులు ప్ర‌పంచ వ్యాప్తంగా వీటి ప‌ట్ల ఆక‌ర్షితుల‌వుతున్నారు. త‌మ బంగారు బాల్యాన్ని కోల్పోతున్నారు. వారు మాన‌సికంగా, శారీర‌కంగా రోజు రోజుకు చిక్కి పోతున్నారు. పేరెంట్స్ సైతం వీరి ప్ర‌వ‌ర్త‌నను చూసి త‌ట్టుకోలేక ..ఆస్ప‌త్రుల‌ను, కౌన్సెలింగ్ సెంట‌ర్ల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. ఇటీవ‌ల వీరి సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. గూగుల్ ప్లే స్టోర్ లో ఇప్ప‌టికే గేమింగ్ యాప్స్ ల‌క్ష‌ల్లో నిక్షిప్త‌మై పోయాయి. ఇంకా వివిధ దేశాల‌లో ఇంజ‌నీరింగ్ ఎక్స్ ప‌ర్ట్స్ పిల్ల‌ల‌ను దృష్టిలో పెట్టుకుని వీటిని రూపొందిస్తున్నారు. కోట్లాది రూపాయ‌లు ఆర్జిస్తున్నారు. అయితే చ‌దువు కోవాల్సిన పిల్ల‌లు ఇపుడు గేమ్స్ ధ్యాస‌లో మునిగి తేలుతున్నారు. విలువైన కాలాన్ని చ‌దువు కోసం కాకుండా వీటిని ఆటాడు కోవడంలోనే గ‌డుపుతున్నారు. ఏమైనా తినాల‌న్నా గేమ్స్ చూసే అన్నీ చేస్తున్నారు. లేక‌పోతే ఏదో కోల్పోయిన‌ట్లు ఫీల‌వుతున్నారు. వీరిని చూసి పేరెంట్స్ మానసికంగా చితికి పోతున్నారు. గేమింగ్ ప‌రిశ్ర‌మ డాల‌ర్ల‌ను కురిపిస్తోంది. దీంతో ఇటీవ‌ల తెలంగాణ స‌ర్కార్ టీ హ‌బ్ ద్వా...

ఆరు వంద‌ల‌కే అన్నీ - రిల‌యన్స్ మ‌రో సంచ‌ల‌నం

చిత్రం
ప్ర‌పంచ టెలికాం రంగంలోనే అతి పెద్ద టెలికాం రంగ సంస్థ‌గా ఇప్ప‌టికే రికార్డు న‌మోదు చేసింది ఇండియాకు చెందిన రిల‌య‌న్స్ టెలికాం సంస్థ‌. అనిల్ అంబానీ కొడుకు, కూతురు ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న ఈ సంస్థ అనూహ్య‌మైన విజ‌యాలు న‌మోదు చేసుకుంటోంది. ప్ర‌త్య‌ర్థుల అంచ‌నాల‌కు అంద‌ని రీతిలో త‌న మార్కెట్‌ను విస్త‌రించుకుంటూ వెళుతోంది. మొద‌టిసారిగా ప్ర‌తి ఒక్క‌రికి అతి త‌క్కువ ధ‌ర‌కే డేటా, వీడియో కాల్స్ కూడా అంద‌జేస్తామంటూ చేసిన ప్ర‌క‌ట‌న‌ను మిగ‌తా టెలికాం కంపెనీలు ఎయిర్ టెల్, ఐడియా, ఒడాఫోన్, బీఎస్ఎన్ఎల్ , యునినార్ లు పెద‌వి విరిచాయి. కోట్లాది భార‌తీయుల‌కు చేరువ కావ‌డం అన్న‌ది క‌ల త‌ప్ప నిజం కాదంటూ కామెంట్స్ చేశాయి. త‌మ ద‌రికి రిల‌య‌న్స్ రాలేదంటూ ఎయిర్ టెల్ బీరాలు ప‌లికింది. ఆయా టెలికాం ఆప‌రేట‌ర్ల‌కు దిమ్మ తిరిగేలా..జీవిత కాలం గుర్తుంచుకునేలా కోలుకోలేని షాక్ ఇచ్చింది రిల‌య‌న్స్ కంపెనీ. జియో పేరుతో అతి చౌక‌గా డేటా సౌక‌ర్యంతో పాటు అన్నీ ఉచితంగానే వీడియో, ఆడియో కాల్స్ స‌దుపాయాలు క‌ల్పిస్తూ రంగంలోకి ఎంట‌ర్ అయింది. ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్లాన్ల‌తో కోట్లాది మంది భార‌తీయులు జియోలో చేరి పోయారు. అంతేకాకుండా ఇ...

వారెవ్వా వాట్స‌న్ ..స‌న్ రైజ‌ర్స్‌కు చెన్నై షాక్

చిత్రం
ఐపీఎల్ టోర్నీలో చెన్నై జ‌ట్టు ప‌టిష్ట‌వంత‌మైన స్థితిలో ఉంది. ప్ర‌త్య‌ర్థులు ఎవ‌రైనా స‌రే ..ఏ జ‌ట్టు అయినా స‌రే చూడ‌డం లేదు. బౌలింగ్ లోను..బ్యాటింగ్‌లోను దుమ్ము రేపుతోంది. ఎంఎస్ ధోనీ కెప్ట‌న్‌గా కొన‌సాగుతున్న ఈ జ‌ట్టులో ప్ర‌తి ఆట‌గాడు కీల‌క‌మైన స‌మ‌యంలో రాణిస్తున్నారు. స‌మిష్టిగా విరుచుకు ప‌డుతున్నారు. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో జ‌రిగిన హోరా హారీ మ్యాచ్‌లో చెన్నై ..చుక్క‌లు చూపించింది. మ‌రో వైపు స‌న్ రైజ‌ర్స్ ..తామేమీ తీసిపోమంటూ చెన్సై ఆట‌గాళ్ల‌ను ఆడుకున్నారు. అయినా వాట్స‌న్ విధ్వంస‌క‌ర‌మైన ఇన్నింగ్స్ ఆడ‌డంతో చెన్నై అద్భ‌త విజ‌యం సాధించింది. డేవిడ్ వార్న‌ర్ ఎప్ప‌టి లాగానే రాణించ‌గా..మ‌నీష్ పాండే తోడ‌వ్వ‌డంతో భారీ స్కోరు సాధించింది. ర‌షీద్ ఖాన్ బౌలింగ్‌లో ఫోర్లు, సిక్స‌ర్లు అల‌వోక‌గా బాదాడు. స్వంత గ‌డ్డ‌పై ఎదురేలేని చెన్నై..ఎనిమిదో విజ‌యాన్ని స్వంతం చేసుకుంది. ప్లేఆఫ్ చేరుకున్న మొద‌టి జ‌ట్టుగా చెన్నై రికార్డు సృష్టించింది. స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టులో మ‌నీష్ పాండే 49 బంతులు ఎద‌ర్కొని ఏడు ఫోర్లు , మూడు సిక్స‌ర్ల‌తో 83 ప‌రుగులు చేయ‌గా..డేవిడ్ వార్న‌ర్ 45 బంతులు ఎదుర్కొని 3 ఫో...

ఇంట‌ర్ బోర్డు తీరుపై హైకోర్టు ఆగ్ర‌హం - పిల్ల‌ల భ‌విత‌వ్యం ముఖ్యం

చిత్రం
తెలంగాణ‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల ప్ర‌భావం విద్యార్థుల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. అధికారుల తీరుపై ..ప్ర‌భుత్వం స్పందించ‌క పోవ‌డంపై ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మ‌రో వైపు ఇంట‌ర్ బోర్డు కార్యాల‌యం వ‌ద్ద బాధితులు, పేరెంట్స్ ఆందోళ‌న చేప‌ట్టారు. పోలీసులు బాధితుల ప‌ట్ల అమానుషంగా ప్ర‌వ‌ర్తించారు. ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌ని అక్క‌డికి వెళ్లిన మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త డాక్ట‌ర్ నాగేశ్వ‌ర్ ప‌ట్ల ఖాకీలు అనుస‌రించిన తీరుపై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్త‌మైంది. అటు పిల్లల్ని ఇటు పేరెంట్స్, విద్యార్థి సంఘాలు, ఆయా పార్టీల నేత‌ల‌ను అరెస్ట్ చేశారు. ప‌రిస్థితి కంట్రోల్ త‌ప్ప‌డంతో అస‌లు బోర్డులో ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొని ఉన్న‌ది. ఈ విష‌యంపై బాల‌ల హ‌క్కుల సంఘం హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీనిపై స్పందించిన హైకోర్టు తాత్కాలిక న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రాఘ‌వేంద్ర సింగ్ రాథోడ్, న్యాయ‌మూర్తి ఎ. రాజశేఖ‌ర్ రెడ్డిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తీవ్రంగా స్పందించింది. మీ పిల్ల‌లకు ఇలాంటి స‌మ‌స్య ఎదురైతే ఇలాగే ప్ర‌వ‌ర్తిస్తారా అంటూ ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాదిని ప...

జ్ఞానపు వెలుగులు..లోకానికి దిక్సూచీలు ..పుస్త‌కాలు

చిత్రం
ప్ర‌పంచాన్ని మార్చే శ‌క్తి పుస్త‌కాల‌లో ఉంది. ఆహారం లేకుండా నేనుండ‌గ‌ల‌ను. కానీ పుస్త‌కాలు చ‌ద‌వ‌కుండా..రాయ‌కుండా నేనుండ‌లేనంటూ వాపోయాడు..దాస్ కేపిట‌ల్ సృష్టిక‌ర్త కార్ల్ మార్క్స్ మ‌హాశ‌యుడు. ఆయ‌న అష్ట క‌ష్టాలు ప‌డ్డాడు. ఏంగిల్స్ అనే స్నేహితుడు లేక పోతే పెట్టుబ‌డి పూర్త‌య్యేది కాదేమో. జీవితాంతం క‌న్నీళ్ల‌తోనే ఆయ‌న స‌హ‌వాసం చేశాడు. కానీ రాయ‌కుండా ఉండ‌లేక పోయాడు. వేలాది పుస్త‌కాల‌ను అమూలాగ్రం చ‌దివాడు. ఇవాళ పుస్త‌క దినోత్స‌వం. రోజు రోజుకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టెక్నాల‌జీ ప‌రంగా ఎన్నో మార్పులు వ‌చ్చాయి. కానీ పుస్త‌కాలు అంత‌కంత‌కూ ప్ర‌చురితం అవుతూనే ఉన్నాయి. ఫిక్ష‌న్..నాన్ ఫిక్ష‌న్ ..ఇలా ప్ర‌తి విభాగంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ల‌క్ష‌లాది పుస్త‌కాలు ప్రింటింగ్‌కు నోచుకుంటున్నాయి. క‌విత్వం, సాహిత్యం, నాట‌కం, క‌ళ‌లు, వ్య‌క్తిగ‌త జీవిత చ‌రిత్ర‌లు, స్వ‌గ‌తాలు, అనువాదాలు, న‌వ‌ల‌లు, నాటిక‌లు, గ‌ల్పిక‌లు, చ‌రిత్ర‌, సామాజిక శాస్త్రాలు ఇలా ప్ర‌తి రంగానికి చెందిన పుస్త‌కాలు విరివిగా దొరుకుతున్నాయి. లెక్క‌కు మించి చిన్నారులు, పెద్ద‌లు , మ‌హిళ‌లు , ఇత‌ర రంగాల‌కు చెందిన వారంతా చ‌ద‌వ‌డ...

ప్ర‌ధానిపై పోటీకి సై అంటున్న రైత‌న్న‌లు

చిత్రం
తెలంగాణ‌లోని నిజామాబాద్ జిల్లాకు చెందిన పసుపు రైతులు ఏకంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని, ప‌సుపు బోర్డు ఏర్పాటు చేయ‌లేద‌ని, క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర క‌ల్పించ‌లేదంటూ 178 మంది రైతులు స్వ‌చ్ఛందంగా లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో పోటీకి దిగారు. ఇంత పెద్ద ఎత్తున పోటీ చేయ‌డం ఇదే మొద‌టి సారి. గ‌తంలో ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని పోలేప‌ల్లి గ్రామానికి చెందిన 18 మంది మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీ సీటుకు పోటీ చేశారు. 98 వేల ఓట్ల‌ను సాధించి మిగ‌తా అభ్య‌ర్థులు త‌ల‌దించుకునేలా చేశారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న సీఎం కేసీఆర్ కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత ఏనాడూ త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కృషి చేసిన పాపాన పోలేదని, త‌మ గురించి ప‌ట్టించు కోలేదంటూ నిప్పులు చెరిగారు. రైతు సంఘం ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం నుండి ఎలాంటి స్పంద‌న క‌నిపించ‌లేదు. జిల్లా క‌లెక్ట‌ర్‌కు మొర పెట్టుకున్నారు.త‌మ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేని స్థితిలో ప్ర‌భుత్వం ఉందంట...

ఇంట‌ర్ బోర్డు ద‌గ్గ‌ర టెన్ష‌న్ టెన్ష‌న్ ‍ - హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు

చిత్రం
విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళ‌న‌ల‌తో హైద‌రాబాద్‌లోని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్యాల‌యం వ‌ద్ద ఉత్కంఠ భ‌రిత వాతావ‌ర‌ణం నెల‌కొంది. పెద్ద ఎత్తున బాధితులు త‌ర‌లి రావ‌డంతో ప‌రిస్థితి చేయి దాట‌కుండా ఉండేందుకు భారీగా పోలీసు బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. కార్యాల‌యం లోప‌లికి వెళ్ల‌కుండా ఉండేందుకు బ్యారికేడ్ల‌ను ఏర్పాటు చేశారు. 16 మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డినా సంబంధిత శాఖ మంత్రి ఎట్ట‌కేల‌కు ఇవాళ సూర్యాపేట‌లో స్పందించారు. ఇంట‌ర్ ఫ‌లితాల విడుద‌ల‌లో జ‌రిగిన పొర‌పాట్ల కంటే అపోహ‌లే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ..అన్నారు. విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళ‌న చెంద‌వ‌ద్దంటూ కోరారు. ప్ర‌తి ఒక్క‌రికి న్యాయం జ‌రుగుతుంద‌ని..ద‌య‌చేసి ఆత్మ‌హ‌త్య‌ల‌కు ..అఘాయిత్యాల‌కు పాల్ప‌డ‌వ‌ద్దంటూ విద్యార్థుల‌కు సూచించారు. ఒక‌వేళ త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని భావిస్తే..రీ వాల్యూయేష‌న్ కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని, ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన క‌మిటీ నివేదిక వ‌చ్చాక బాధ్యుల‌పై ,సాంకేతికంగా త‌ప్పులు వుంటే సంస్థ పైన‌..మాన‌వ పొర‌పాట్లు జ‌రిగితే ..సంబంధిత శాఖాధికారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జ‌గదీశ్ రెడ్డి చెప...