పోస్ట్‌లు

నవంబర్ 5, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

మిస్టర్ కూల్ సరి కొత్త అవతారం

చిత్రం
మాజీ టీమిండియా సారధి, ప్రస్తుత జట్టు ప్లేయర్ గా కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోనీకి సరి కొత్త పోస్టు ఇవ్వాలని అనుకుంటోంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. టీమిండియా తొలి డే అండ్‌ నైట్‌ టెస్టుకు సిద్ధమైన తరుణంలో అందుకు ప్రత్యేక గుర్తింపు తీసుకు రావాలని బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగనున్న టెస్టుకు భారత మాజీ టెస్టు కెప్టెన్లను ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. భారత క్రికెట్‌ జట్టు టెస్టు చరిత్రలో డే అండ్‌ నైట్‌ టెస్టు ఆడటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో భారత జట్టుకు సేవలందించిన టెస్టు కెప్టెన్లను అందరినీ ఆహ్వానించి వారి అనుభవాలను పంచుకోనుంది. ఇందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, బ్రాడ్‌ కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ యాజమాన్యాలు సంయుక్తంగా భారత మాజీ కెప్టెన్ల ను ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు 2001లో ఆసీస్‌పై కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన వీవీఎస్‌ లక్ష్మణ్‌, రాహుల్‌ ద్రవిడ్‌లతో పాటు ఆ గెలుపులో భాగస్వామ్యం అయిన వారికి కూడా ప్రత్యేకంగా ఇన్విటేషన్స్ పంపనున్నారు. ఇక ధోని కామెంటేట...

బ్రాండ్లు భళా..కలర్స్ కళ కళ

చిత్రం
ఇండియాలో నిర్మాణ రంగం శరవేగంగా వృద్ధి చెందుతోంది. ఐటీ పరంగా టాప్ పొజిషన్ లో ఉన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరంగా దూసుకు పోతోంది. కలర్స్ కంపెనీస్ లాభాల బాట పట్టాయి. ఇల్లయినా, కార్యాలయమైనా అద్దంలా మెరవాలని అంతా అనుకుంటారు. అందుకే కొత్త కొత్త రంగులతో భవనానికి రంగులు వేసేందుకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఓనర్స్ తమ ఇంటి కైనా, ఆఫీసు కైనా గతంలో ఆరేళ్లకు ఒకసారి పెయింట్స్ వేసే వారు. ఇప్పుడు ఆ ధోరణి మారింది. రెండేళ్లకు ఒకసారి వేస్తున్నారు. బెడ్‌ రూమ్స్, లివింగ్‌ రూమ్స్‌ విషయంలో తరచూ రంగులు మారుస్తున్న కస్టమర్లు పెరుగుతున్నారని కంపెనీలు చెబుతున్నాయి. కస్టమర్ల ‘కలర్‌ఫుల్‌’ ఆలోచనలతో పెయింట్‌ కంపెనీలు కళకళ లాడుతున్నాయి. ఏటా రెండంకెల వృద్ధి సాధిస్తూ పల్లెల్లో సైతం విస్తరిస్తున్నాయి. స్టాక్‌ మార్కెట్లో మిడ్, స్మాల్‌క్యాప్‌ షేర్లు అంత బాగా లేకున్నా, లిస్టెడ్‌ పెయింట్‌ కంపెనీల షేర్ల ధరలు ఈ ఏడాదిలో 65 శాతం దాకా పెరిగాయి. ప్రధాన బ్రాండ్లు గ్రామీణ ప్రాంతాలకూ చొచ్చుకు పోయాయి. మొత్తం పరిశ్రమలో వినియోగం పరంగా పట్టణాల వాటా 60 శాతం కాగా, మిగిలినది గ్రామీణ ప్రాంతాలది. ఈ మధ్య గ్రామాల్లోనూ ప్రీమియం రంగులు వాడుతుండట...

డాబర్ అదుర్స్..ఆదాయంలో చీర్స్

చిత్రం
ఓ వైపు దేశంలో ఆర్ధిక మంద గమనం కొనసాగుతుండగా మరో వైపు దేశీయ కంపెనీలు మాత్రం ఆదాయంలో దూసు కెళుతున్నాయి. ఇప్పటికే ఎఫ్‌ఎమ్‌సీజీ దేశీయ దిగ్గజం డాబర్‌ టాప్ రేంజ్ లో కొనసాగుతోంది. రెండో త్రైమాసిక కాలంలో 404 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ2లో ఆర్జించిన నికర లాభం, 378 కోట్లుతో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించినట్లు డాబర్‌ ఇండియా కంపెనీ వెల్లడించింది. పెట్టుబడుల విలువకు సంబంధించి 40 కోట్ల వన్‌ టైమ్‌  కారణంగా నికర లాభం ఒకింత తగ్గిందని పేర్కొంది. కార్యకలాపాల ఆదాయం 2,125 కోట్ల నుంచి రూ.2,212 కోట్లకు పెరిగిందని తెలిపింది. దేశీయ మార్కెట్ రంగంలో డాబర్ కు మంచి పేరుంది. ఆయుర్వేద ప్రోడక్ట్స్ తో పాటు ఇతర బ్యూటీకి చెందిన వస్తువులను విక్రయిస్తోంది. ఇటు ఆఫ్ లైన్ లోను..అటు ఆన్ లైన్ లోను వీటిని అమ్ముతోంది. డాబర్ అనే సరికల్లా హానీ గుర్తుకు వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు తేనె కు ఎనలేని డిమాండు ఉంటోంది. ఆరోగ్య పరంగా, శారీరకమైన ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు హానీ ఉపయోగ పడుతుంది. దీంతో ప్రకృతి పరంగా లభించే వాటిని శుద్ధి చేసేందుకు భారీ ఎత్తున పరిశ్రమలను నెలకొల్పింది డాబర్. దేశంలోని ప్రతి కిరాణా షా...

ప్యారిస్ లో అల వైకుంఠపురం

చిత్రం
మాటల మాంత్రికుడు, డైనమిక్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ అల్లు అర్జున్, లవ్లీ గర్ల్ పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అల వైకుంఠ పురం లో..సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలను చిత్ర యూనిట్ విడులా చేసింది. ఈ రెండూ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మొదటి పాట సామజ వరగమనా..ను ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాశారు. ఇది బిగ్ హిట్ అయ్యింది. ఈ మూవీకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. యూట్యూబ్ లో విడుదలైన కొద్దీ నిమిషాల్లోపే లక్షలాది మంది దీనిని చూసారు..విన్నారు. దీంతో మంచి ఊఒపు మీదున్న త్రివిక్రమ్ ..మాస్ ఆడియన్స్ ..యూత్ కు జోష్ తీసుకు వచ్చేలా రెండవ సాంగ్ రాములో రాములా..ను విడుదల చేశారు. ఈ పాటను వరంగల్ జిల్లాకు చెందిన గేయ రచయిత కాసర్ల శ్యామ్ రాశాడు. ఇది మరింత పాపులర్ అయ్యింది. ఈ సాంగ్ ను అనురాగ్ కూల్ కర్ణి తో పాటు ప్రముఖ జానపద గాయని, యాంకర్ మంగ్లీ పాడారు. ఈ ఇయర్ లో బిగ్గెస్ట్ మాస్ సాంగ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. అల వైకుంఠపురం లో..సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. భారీ బడ...

కుదరని స్నేహం..ముదిరిన సంక్షోభం

చిత్రం
మరాఠా పీటముడి వీడడం లేదు. ఇండియన్ పాలిటిక్స్ లో ట్రబుల్ షూటర్ గా ఉన్న అమిత్ చంద్ర షా రంగంలోకి దిగినా మహారాష్ట్ర లో రాజకీయ ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ, శివసేన పార్టీల మధ్య సయోధ్య కుదర లేదు. దీంతో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో సీఎం కుర్చీని వీడేది లేదని ఇరు పార్టీల చీఫ్స్ ఉద్దవ్ థాక్రే, ఫడ్నవీస్ స్పష్టం చేశారు. దీంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఎలాంటి అడుగులు మాత్రం పడటం లేదు. సీఎం పీఠం సహా అధికార పంపిణీ సమంగా జరగాలన్న తమ డిమాండ్‌ నుంచి శివసేన వెనక్కు తగ్గడం లేదు. అదే విషయాన్ని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ మరోసారి తేల్చి చెప్పారు. అధికారాన్ని సమంగా పంచు కోవడంపై బీజేపీ లిఖిత పూర్వక హామీ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. శివసేన నేతనే మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి అవుతాడని పునరుద్ఘాటించారు.  ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన శుభవార్త ఏ క్షణమైనా రావొచ్చు అని రాష్ట్ర మంత్రి సుధీర్‌ ముంగంటి వార్‌ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ నివాసంలో జరిగిన పార్టీ సీనియర్‌ నేతల భేటీ అనంతరం ఆయన ఆ వ్యాఖ్య చేశారు. శివసేన నుంచి సానుకూ...

డెడ్ లైన్ బేఖాతర్..సమ్మెనే బెటర్

చిత్రం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు విధించిన డెడ్ లైన్ ను ఆర్టీసీ కార్మికులు పట్టించు కోలేదు. 49 వేల మంది కార్మికుల్లో కేవలం ప్రభుత్వ పిలుపునకు 300 మంది మాత్రమే విధుల్లో చేరారు. మరికొందరు తిరిగి పోరాట బాట పట్టారు. తిరిగి డ్యూటీలో చేరే విషయంలో కార్మికులు వెనకడుగు వేయడం లేదు.  మిగిలిన వారంతా సమ్మెలోనే కొనసాగాలని డిసైడ్ అయ్యారు. డిపోల్లోనే కాకుండా పోలీసు స్టేషన్లు, జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలు, ఆర్టీఓ, ఎస్పీ డీఎస్పీ తదితర కార్యాలయాల్లో కూడా తిరిగి చేరికకు సంబంధించిన లేఖలు ఇవ్వచ్చని అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో కొన్ని చోట్ల కార్మికులు ఆయా కార్యాలయాల్లో అంద జేశారు. విధుల్లో చేరిన కార్మికులనే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని, మిగతా వారికి సంస్థతో ఎలాంటి సంబంధం ఉండదని, ఇదే చివరి అవకాశమని సీఎం తేల్చి చెప్పారు. దీంతో కార్మికుల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికే  జీతాలు లేనందున రాష్ట్ర వ్యాప్తంగా కొంత మంది కార్మికులు విధుల్లో చేరే విషయంలో కుటుంబ సభ్యులు, సన్ని హితులతో చర్చించారు. ఎక్కువ మంది చేరేందుకే ఆసక్తి కనబరిచారు. విషయం తెలిసిన కార్మిక సంఘాల నేతలు వెంటనే ర...

షావోమి సెన్సేషన్..అమ్మకాల్లో రికార్డ్

చిత్రం
చైనాకు చెందిన షావోమి మొబైల్స్, యాక్సెసరీస్, ఎల్సీడీ టీవీలను కొత్తగా లాంచ్ చేసింది. షావోమీ దెబ్బకు దిగ్గజ కంపెనీలు డీలా పడ్డాయి. ఇండియాలో, వరల్డ్ వైడ్ మార్కెట్ లను షేక్ చేసేంది. రికార్డు స్థాయిలో అమ్ముడు పోయాయి. ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా అమ్మకాల్లో టాప్ మూడో పొజిషన్ చేజిక్కించుకుంది. బంపర్ ఆఫర్లు, బహుమతులతో మొబైల్, టీవీ ప్రేమికులకు గాలం వేసింది. దీంతో అన్నీ రికార్డు స్థాయిలో అమ్ముడు పోయాయి. తాజాగా షావోమి తన అద్భుతమైన కెమెరాను అధికారికంగా లాంచ్‌ చేసింది.108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో సహా ఐదు వెనుక కెమెరాలుతో ప్రతిష్టాత్మక స్మార్ట్‌ ఫోన్‌ను బీజింగ్‌లో ఆవిష్కరించింది. ఎంఐ సిరీస్‌లో భాగంగా ఎంఐ సీసీ9 ప్రొ పేరుతో దీన్ని లాంచ్‌ చేసింది. బేసిక్‌ వేరియంట్‌ 6జీబీ ర్యామ్‌,128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ తో ధర సుమారు 28,000 గా నిర్ణయించింది. హై-ఎండ్ 8 జీబీ ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర సిఎన్‌వై  సుమారు 31,000 రూపాయలకు అమ్ముతోంది. ఇక ప్రీమియం ఎడిషన్‌ ధర 8  జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ సిఎన్‌వై ధర 35,000 గా డిసైడ్ చేసింది. ఇతర మార్కెట్లలో దీని లభ్యతపై ప్రస్తుతానికి ఎలాంటి ...

క్రికెట్ కోచ్ పై సెటైర్స్

చిత్రం
ఎందుకనో ముంబై ఆటగాడు, మాజీ జట్టు సారధి ప్రస్తుత టీమిండియా కోచ్ రవి శాస్త్రిపై క్రికెట్ ఫ్యాన్స్ సెటైర్స్ విసురుతున్నారు. టీమిండియా సారథి విరాట్‌ కోహ్లికి బర్త్‌డే విషెస్‌ చెప్పిన రవిశాస్త్రిని నెటిజన్లు సోషల్‌ మీడియాలో ఓ ఆటాడుకుంటున్నారు. తాజాగా బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్న కోహ్లికి యావత్ క్రీడా ప్రపంచం విషెస్‌ తెలిపింది. పనిలో పనిగా టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి కూడా కోహ్లికి విషెస్‌ తెలిపాడు. అయితే అదే రవిశాస్త్రి కొంప ముంచింది. ఎప్పట్నుంచో రవిశాస్త్రి అంటే పడని కొందరు అతడిని టార్గెట్‌ చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. బర్త్‌డే విషెస్‌ తెలిపావు కానీ.. సరైన హ్యాస్‌ ట్యాగ్‌ ఇవ్వడం మర్చి పోయావ్‌, గంగూలీ గారూ టీమిండియాకు ఫిట్‌ నెస్ కోచ్‌ కావాలి, రవి మామా ఈ రోజు ఫుల్‌గా తాగుడేనా, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, సకల భోగాలు అనుభవిస్తున్నావ్ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇక టీమిండియా ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన అనంతరం ప్రధానంగా కోచ్‌ రవిశాస్త్రిని టార్గెట్‌ చేస్తూ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. మిడిలార్డర్‌ బ్యాటింగ్‌ సమస్యను పరిష్కరించడంలో కోచ్‌ విఫలమయ్యాడంటూ విమర్శించారు. అంతే కాకుం...

పెళ్లి చేసుకున్న గ్రేమ్ స్మిత్

చిత్రం
సినిమా, క్రీడా రంగాలకు చెందిన వారికి ఎవ్వరికీ లేనంత పాపులారిటీ ఉంటుంది. కోట్లాది అభిమానుల మనసు దోచుకునే వీరికి ఆదాయం కూడా ఎక్కువే. అందుకే వీరు ఏది చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. తన చిరకాల  ప్రేయసి రోమీ లాం ఫ్రాంచీని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా స్మిత్‌ అధికారిక ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. గత ఏడాదిలోనే ఆమెకు ఎంగేజ్‌ మెంట్‌ రింగ్‌ తొడిగిన స్మిత్‌ తాజాగా ఆమెను పెళ్లి చేసుకున్నారు. తన జీవితంలో ఈ క్షణాలను మరిచి లేనన్నారు. తమ అభిమాన  క్రికెటర్‌ పోస్టుకు స్పందించిన, ఆయన ఫ్యాన్స్‌, నెటిజన్లు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియ జేస్తున్నారు. అటు రోమీ కూడా ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలను షేర్‌ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దక్షిణాఫ్రికా రగ్బీ జట్టు ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి ప్రపంచ కప్ గెలిచిన రోజున స్మిత్ పెళ్లి జరగడం విశేషం. ఈ ఎడమచేతి బ్యాట్స్‌మెన్‌ 2011లో, ఐరిష్ పాప్ గాయకురాలు మోర్గాన్ డీన్‌ను వివాహం చేసుకున్నాడు. నాలుగేళ్లు గడిచాక ఆమె నుంచి విడి పోయాడు. వీరికి ఇద్దరు పిల్లలు...

నచ్చితే సిప్లిగంజ్ కు పెళ్లి

చిత్రం
బుల్లి తెరపై స్టార్ మా టీవీ టెలికాస్ట్ చేసిన రియాల్టీ షో బిగ్ బాస్ ముగిసినా ఇంకా తెలుగు నాట చర్చ జరుగుతూనే ఉన్నది. ఎవరూ ఊహించని రీతిలో ఫైనలిస్ట్ గా గల్లీ బాయ్, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గెలిచాడు. అయితే రాహుల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. సిప్లిగంజ్, సినీ నటి పునర్నవి భూపాళం ల మధ్య బిగ్ బాస్ హౌజ్ లో జరిగిన సంభాషణలు, వారిద్దరి మధ్య జరిగిన టాస్క్స్ , తిట్టిన తిట్లు, పునర్నవి ముద్దు పెట్టడం సెన్సేషన్ గా మారాయి. ఒక దశలో వీరిద్దరి మధ్య కొంత కెమిస్ట్రీ నడుస్తోందన్న కామెంట్స్ కూడా వచ్చాయి. తమ కొడుకుకు నచ్చితే పెళ్లి చేసేందుకు రెడీగా ఉన్నామని రాహుల్ పేరెంట్స్ స్పష్టం చేశారు. దీంతో ఈ సింగర్ ఎవరిని ఎంపిక చేసుకుంటాడోనన్న ఉత్కంఠ నెలకొంబిగ్ బాస్ షో లో రాహుల్, పునర్నవిల రిలేషన్‌షిప్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వీకెండ్‌లో వచ్చే నాగార్జున వారి మధ్య అలకలను, ప్రేమను గుర్తు చేస్తూ సెటైర్లు విసిరారు. ఇక పునర్నవి రాహుల్‌కు గోరు ముద్దలు తినిపించడం, అదే సమయంలో తప్పు చేస్తే అతన్ని చెడామడా తిట్టడం.. ఇంట్లో ఏం జరిగినా ఇద్దరు కలిసే ఉండటం ప్రేక్షకులను మెప్పించింది. ఓరోజు ఎలాగోలా ధైర్య...

ప్రపంచం ఆయుర్వేద జపం

చిత్రం
భారత దేశంలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరగానే మరోసారి ఆయుర్వేదంకు ప్రయారిటీ పెరిగింది. పతంజలి అధినేత రామ్ దేవ్ బాబా తన హవాను కొనసాగిస్తున్నారు. ఇండియన్ మార్కెట్లో విదేశీ కంపెనీల జైత్ర యాత్రకు ఊహించని రీతిలో చెక్ పెట్టింది పతంజలి. తక్కువ ఖర్చుకే, అందరికీ అందుబాటులో ఉండేలా అన్ని ప్రోడక్ట్స్ ను అందుబాటు లోకి తీసుకు వచ్చింది. దేశ వ్యాప్తంగా ప్రతి మూలకు విస్తరించింది. అన్ని వర్గాలకు సంబంధించిన వన్నీ పతంజలి స్టోర్స్ లో ఉండేలా చేసింది. భారతీయ వ్యాపారం అంతా గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. ఎక్కువగా ప్రతి రోజు సామాన్యులు, మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అంతే కాకుండా ఉన్నత వర్గాలకు చెందిన వారు సైతం పతంజలి జపం చేస్తున్నారు. ఇంటిల్లి పాదికి అవసరమైన నిత్యావసర వస్తువులు సైతం పతంజలి తయారు చేస్తోంది. దేశ సంస్కృతి, సాంప్రదాయం పేరుతో వస్తువులు తయారు చేసేలా పతంజలి దృష్టి పెట్టింది. ఇటీవల ఎక్కువ మంది జనం రోగాలకు లోనవుతున్నారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర దామోదర దాస్ మోదీ ఆయుర్వేదం, యోగాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయుర్వేద వస్తువులకు మంచి గిరాకీ లభిస్తోంది. తాజాగా ఈ కామర...