పోస్ట్‌లు

జూన్ 24, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

- నేను చ‌నిపోయాక నా ఫోటో ప్ర‌తి ఇంట్లో ఉండాలి - తండ్రి బాట‌లో త‌న‌యుడు

చిత్రం
అవినీతి అంతం నా పంతం - విద్యాభివృద్ధే నా ల‌క్ష్యం త‌ప్పులు అంద‌రూ చేస్తారు..కానీ కొంద‌రే వాటిని గుర్తించి మ‌ళ్లీ త‌ప్పులంటూ చేయ‌కుండా వుండేందుకు ప్ర‌య‌త్నిస్తారు. గొప్ప వారుగా రాణించేందుకు కృషి చేస్తారు. అవినీతి, ఆరోప‌ణ‌లు ఎదుర్కొని..కేసుల దాకా వెళ్లి..జైలుపాలై ..చివ‌రికి బ‌య‌ట‌కు వ‌చ్చి..ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి రెండ‌వ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌జా నాయ‌కుడిగా త‌న‌ను తాను మ‌ల్చుకుంటున్నారు. ప్ర‌జ‌ల ప‌క్ష‌పాతిగా ..జ‌న‌హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న దివంగ‌త సీఎం డాక్ట‌ర్ వై.ఎస్. రాజ‌శేఖ‌ర్ రెడ్డి అడుగు జాడ‌ల్లో న‌డుస్తున్నారు జ‌గ‌న్. ఓ వైపు ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డ్డారు. ఏటికి ఎదురీదారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చేప‌ట్టారు. జనం బాధ‌ల‌ను విన్నారు. వారి క‌ష్టాల‌ను ద‌గ్గ‌రుండి చూశారు. అందుకే ఆయ‌న‌కు ఏపీ జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. అనూహ్య‌మైన విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు. ఈ గెలుపు ఇచ్చిన కిక్‌తో జ‌గ‌న్ సంతృప్తి చెంద‌లేదు. త‌న ముందున్న స‌వాళ్ల‌ను గుర్తించారు. త‌న క‌ర్త‌వ్యం ఏమిటో ప్ర...

అద్భుతం ..ముల్క‌నూరు తీర్మానం..!

చిత్రం
స‌హ‌కార వ్య‌వ‌స్థ‌కు ప్రాణం పోస్తూ లెక్క‌లేనంత ఆదాయాన్ని గ‌డిస్తూ..తెలంగాణ రాష్ట్రంలోని ప‌ల్లెల‌కు స్ఫూర్తి దాయ‌కంగా నిలుస్తున్న ముల్క‌నూరు గ్రామ పంచాయ‌తీ ప్ర‌భుత్వం చేయ‌లేని ప‌నిని చేసింది. అక్ర‌మాల‌కు పాల్ప‌డుతూ, ముక్కు పిండి వ‌సూలు చేస్తున్న ప్రైవేట్ బ‌డులకు షాక్ ఇచ్చేలా నిర్ణ‌యం తీసుకుంది. ఎవ‌రైనా స‌రే త‌మ ఊరిలో ఉన్న వారు ..ఏ స్థాయిలో ఉన్నా స‌రే ఇక్క‌డి ప్ర‌భుత్వ బ‌డుల్లో త‌మ పిల్ల‌లు చ‌దివిస్తేనే స‌ర్టిఫికెట్లు జారీ చేస్తామ‌ని తీర్మానం చేసింది. నిధులు ఎప్పుడు వ‌స్తాయి..వ‌చ్చిన త‌క్ష‌ణ‌మే ఏ ర‌కంగా వెన‌కేసుకోవాలోన‌ని త‌ల‌లు ప‌ట్టుకుంటున్న స‌ర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఈ గ్రామం తీసుకున్న అసాధార‌ణ నిర్ణ‌యాన్ని చూసి త‌లొంచు కోవాలి. ఊరంతా ఒక్క‌టి కావాలి..గుడిలో దీపం వెల‌గాలి, బ‌డిలో గంట మోగాలి. అన్ని శాఖ‌ల‌కు చెందిన సిబ్బంది, ఉద్యోగులు ఊరులోనే ఉండాలి. అప్పుడే మ‌హాత్ముడు క‌ల‌లు క‌న్న గ్రామ స్వ‌రాజ్యం సాధ్య‌మ‌వుతుంది. విద్యా రంగం భ్ర‌ష్టు ప‌ట్టి పోయింది. కేజీ టు పీజీ అంటూ జ‌పం చేస్తున్న ప్ర‌భుత్వం ఆయా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో క‌నీస వ‌స‌తులు క‌ల్పించ‌డంలో శ్ర‌ద్ధ చూపించ...

అన‌కొండ‌లా అక్ర‌మాస్తులు - న‌ల్ల‌ధ‌నంలో భార‌తీయులు - లోక్‌స‌భ ముందు స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్ప‌ణ‌..!

చిత్రం
పొద్ద‌స్తామ‌నం క‌ష్ట‌ప‌డి, రేయింబ‌వ‌ళ్లు వ‌ళ్లు వంచి ..వ‌చ్చిన డ‌బ్బుల‌తో ..రేప‌టికి వ‌స్తాయ‌ని న‌మ్మ‌కంతో బ్యాంకుల్లో దాచుకున్న డ‌బ్బుల్ని అక్ర‌మంగా రుణాల పేరుతో టోక‌రా ఇచ్చిన వాళ్లు ద‌ర్జాగా ఎంజాయ్ చేస్తున్నారు. అవినీతి అన‌కొండ‌లా పెరిగి పోయింది. దాచుకున్న డ‌బ్బుల్ని ఇత‌ర దేశాల‌కు త‌ర‌లించారు. అక్క‌డే దాచుకున్నారు. ల‌క్ష‌లాది కోట్లు మ‌న తీరాల‌ను దాటి వెళ్లాయి. ఇండియ‌న్స్ 1980 నుంచి 2010 మ‌ధ్య వివిధ స‌మ‌యాల్లో విదేశాల్లో దాచిన అక్ర‌మ సంప‌ద దాదాపు 216.48 బిలియ‌న్ డాల‌ర్ల నుంచి 490 బిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కు దాచుకున్నారు. వీటి విలువ ప్ర‌స్తుత విలువ ప్ర‌కారం ..15 ల‌క్ష‌ల కోట్ల నుంచి 34 ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కు చేరుకుంద‌ని అంచ‌నా. ప్ర‌పంచంలోనే స‌ర్వే చేయ‌డంలో అగ్ర‌శ్రేణి సంస్థ‌గా పేరొందిన నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప‌బ్లిక్ పాల‌సీ అండ్ ఫైనాన్స్ ( ఎన్ఐఎఫ్ఎం) , నేష‌న‌ల్ అప్లైడ్ ఎక‌నామిక్ రీసెర్చ్ (ఎన్‌సిఏఈఆర్), నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ (ఎన్ఐఎఫ్ఎం) సంస్థ‌లు వేర్వేరుగా స‌ర్వే చేప‌ట్టాయి. దీంతో ఆస‌క్తిక‌ర‌మైన‌..దిగ్భ్రాంతిక‌ర‌మైన వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆర్థిక వ్య...

ష‌కీబ్ కా క‌మాల్ ..బంగ్లా దెబ్బ‌కు ఆఫ్గాన్ డ‌మాల్

చిత్రం
నిన్న‌టి దాకా క్రికెట్‌లో తామే పులుల‌మంటూ విర్ర‌వీగిన క్రికెట్ జ‌ట్ల‌కు అండ‌ర్ డాగ్స్ గా ప‌రిగ‌ణించిన బంగ్లాదేశ్ క్రికెట్ జ‌ట్టు కోలుకోలేని షాక్‌లు ఇస్తూ తాము సింహాల‌మంటూ నిరూపిస్తున్నారు. ప్ర‌పంచ క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్‌లో ప్రారంభ‌మైన మ్యాచ్‌ల‌న్నీ చ‌ప్ప‌గా సాగ‌గా..తాజాగా మిగిలిన జ‌ట్ల‌న్నీ నువ్వా నేనా అన్న రీతిలో త‌ల‌ప‌డుతున్నాయి. దీంతో నిరాశ చెందిన క్రికెట్ అభిమానులు ఇపుడు పండ‌గ చేసుకుంటున్నారు. ప్లేస్ ఏమీ మార‌లేదు. అదే ఆఫ్గ‌నిస్తాన్ ..అదే సౌథాంప్ట‌న్  మైదానం ..జ‌ట్టు మారిందంతే నిన్న ఇండియా..ఇవాళ బంగ్లా. మొన్న‌టి లాగానే పిచ్ మార‌లేదు. సేమ్ సీన్ రిపీట్ . కానీ ఇరు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా జ‌రిగింది. క్రికెట్ ఆట‌కున్న ప‌వ‌ర్ ఏమిటో లోకానికి చాటి చెప్పింది. ఆప్ఘ‌నిస్తాన్ జ‌ట్టును బంగ్లా ఓడించి ..సెమీఫైన‌ల్ రేసుపై క‌న్నేసింది. ఆప్ఘ‌నిస్తాన్ స్పిన్న‌ర్లు మ‌రోసారి స‌త్తా చాటారు. ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా అద్భుత‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించి..బంగ్లాదేశ్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. బ్యాట్స్ మెన్స్ ప‌ట్టుద‌ల‌తో ఆడారు. మెరుగైన స్కోర్‌ను అందించారు. ఆ త‌ర్వాత బంగ్లా బౌల‌ర్లు ఆఫ...