జగన్ నిర్ణయానికి జనామోదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న అసాధారణమైన నిర్ణయాన్ని జనం స్వాగతిస్తున్నారు. మొదటిసారిగా ఓ మహిళకు ఉన్నతమైన పదవిని కట్టబెట్టడం చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో. విజయనగరం జిల్లా సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్గా, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ట్రస్ట్ చైర్పర్సన్గా ఆనంద గజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం. తనకు ఈ పదవిని అప్పగించడంతో ఆమె ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఈ సందర్భంగా జగన్కు కృతజ్ఞతలు తెలియ చేసింది. కాగా గత కొన్నేళ్లుగా ఒకే కటుంబం చెలాయిస్తున్న ఆధిపత్యానికి చెక్ పెట్టారు. 1958లో దివంగత పి.వి.జి.రాజు నెలకొల్పిన మాన్సాస్ సంస్థ విద్యా వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు విద్యా సంస్థలను నడుపుతోంది. 1958లో పీవీజీ రాజు వ్యవస్థాపక చైర్మన్ కాగా ఆనంద గజపతిరాజు, అశోక్ గజపతిరాజు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఉండేవారు. 1994లో పి.వి.జి.రాజు మరణం తర్వాత ఆనంద గజపతిరాజు చైర్మన్ అయ్యారు. 2016లో ఆయన మరణం తర్వాత అశోక్ గజపతిరాజు చైర్మన్ బాధ్యతల...