పోస్ట్‌లు

డిసెంబర్ 4, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

అయ్యో హ్యారిస్‌ అవుట్‌

చిత్రం
అమెరికన్ పాలిటిక్స్ లో అరుదైన, అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. యుఎస్ ప్రెసిడెంట్ పదవికి 2020లో జరుగనున్న ఎన్నికల పోటీ నుంచి డెమొక్రటిక్‌ పార్టీ సభ్యురాలు, భారత సంతతికి చెందిన 54 ఏళ్ళ కమలా హ్యారిస్‌‌ నిష్క్రమించారు. ఆర్థిక కారణాల వల్ల అగ్రరాజ్య అధ్యక్ష రేసు నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఈ కాలిఫోర్నియా సెనెటర్‌ వెల్లడించారు. నేను బిలియనీర్‌ను కాదు. నా ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్లలేను. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు నా వద్ద సరిపడా ఆదాయ వనరులు లేవు. ఇందు కోసం అన్ని మార్గాలు నేను అన్వేషించాను. అయితే కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల నా జీవితంలోనే అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరిలో కమలా హ్యారిస్‌ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా. మనమంతా కలిసే ఇది పూర్తి చేద్దాం. నాతో కలిసి రండి అని ఆమె తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. కాలిఫోర్నియాలోని ఆక్లాండ్‌లో గల బాల్టిమోర్‌ నుంచి కమలా హ్యారిస్‌ ఫర్‌ ద పీపుల్‌ అనే నినాదంతో తన ఎన్నికల క్యాంప...

మదుపరులకు మహదావకాశం

చిత్రం
మదుపరులకు గుడ్ న్యూస్. కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం ప్రకటించింది. ఇక ఈక్విటీల మాదిరే కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్లోనూ రిటైల్‌ ఇన్వెస్టర్లు చురుగ్గా ఇన్వెస్ట్‌ చేసే అవకాశం రానుంది. ఇందుకు వీలుగా దేశంలోనే తొలి కార్పొరేట్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ ప్రారంభానికి ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్‌ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ ఈటీఎఫ్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అదనపు నిధుల సమీకరణ సులభం కానుంది. బడ్జెట్లో పేర్కొన్నట్టుగా బాండ్‌ మార్కెట్‌ను ఇది మరింత విస్తృతం చేస్తుందని కేబినెట్‌ భేటీ అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. భద్రత, లిక్విడిటీ, పన్ను లేని స్థిరమైన రాబడులను బాండ్‌ ఈటీఎఫ్‌ అందిస్తుంది అని వివరించారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం 1,000 నుంచి బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. బాండ్లకు డిమాండ్‌ పెరిగితే, అప్పుడు తక్కువ ఖర్చుకే నిధులను సమీకరించుకునే అవకాశం ప్రభుత్వ రంగ సంస్థల కుంటుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల రుణ అవసరాలకు అనుగుణంగా ఏటా బాండ్‌ కేలండర్‌ను రూపొందిస్తామన్నారు. కాగా, ఈ నెల్లోనే భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ను ప్రారంభించే అవకాశాలున్న...

విద్యుత్ శాఖ వింత పోకడ

చిత్రం
తెలంగాణాలో ప్రభుత్వ శాఖలు, సంస్థలు సర్కారు అధీనంలో ఉన్నా అవి తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఇక విద్యుత్ శాఖ, ఎస్సి గురుకులాల సంస్థ ఈ రెండూ ఎవ్వరి మాటా వినడం లేదు. ఎందుకంటే ఈ రెండు శాఖల బాధ్యులు నేరుగా ముఖ్యమంత్రితో సంబంధాలు కలిగి ఉండటం కావొచ్చు. ఇప్పటికే వేలాది పోస్టులు ఖాలీగా ఉన్నా భర్తీ చేయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. అన్ని శాఖల్లో అర్హత, వయసు విషయంలో బీసీలకు 45 ఏళ్ళ వరకు దరఖాస్తు చేసుకునే వీలు ఉండగా వీటి భర్తీలో మాత్రం ఇందుకు మినహాయింపు లేదు. కేవలం 34 ఏళ్ళ వరకే పరిమితి విధించారు. అంతే కాకుండా బీఇ, బీటెక్ పాసైన వారికి అప్ప్లై చేసుకునే వీలు లేకుండా చేసింది తెలంగాణ విద్యుత్ సంస్థ. గతంలో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్ట్ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎవరిని పిలిచారు. ఇంతవరకు ఆ పోస్టు గురించిన వివరాలు ఏవీ లేవు. అపాయింట్ అయిన సదరు అధికారి సీఎం కు పిఆర్ ఓ గా విధులు నిర్వహిస్తున్నారు. మరో వైపు అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కోసం నోటిఫికేషన్ వేశారు. అందులో వయసు కూడా కుదించారు. దీని వల్ల ఎందరో ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతోంది. తాజాగా విద్యుత్ స...

బంగారం ఆదాయానికి మార్గం

చిత్రం
ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం. దాచుకోలేం. ఆకలైతే తినలేం. అరిగించు కోలేం. ఇలాంటి మాటలు ఇక కట్టి పెట్టండి బాస్. బతకాలంటే డబ్బులు కావాలి. ఒక్కరు సంపాదిస్తే గడిచే రోజులు పోయాయి. ఇంటిల్లిపాది కష్టపడితేనే పూట గడుస్తోంది. ఎలాంటి కష్టం చేయకుండా ఉన్న దగ్గరి నుంచే కాసులు కొల్లగొట్టాలన్నా, లేదా కరెన్సీ మన జేబుల్లోకి రావాలంటే మాత్రం బంగారం మించిన వస్తువు మరొక్కటి ఈ ప్రపంచం లో లేదు. ఇండియాలో ఉన్నంత బంగారం ఇంకే దేశంలో లేదంటే నమ్మలేం. కానీ అది ముమ్మాటికీ వాస్తవం కూడా. భారత దేశంలోని ఆలయాలు, ఆశ్రమాలు, బ్యాంకుల్లో లెక్కలేనంతగా బంగారం మూలుగుతోంది. స్థిరమైన ప్రాఫిట్ రావాలంటే మాత్రం పసిడిని మించిన ప్రయోగం లేదు. రోజుకు లేదా వారానికో లేదా నెలకో కనీసం ఒక గ్రాము అయినా బంగారాన్ని కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. బరువు అంటూ ఉండదు. ఎక్కడికైనా సులభంగా తీసుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈజీగా లోన్స్ తీసుకునే వీలు కలుగుతుంది. అందుకే పసిడి మీద పెట్టుబడి అన్నది డెడ్ ఇన్వెస్ట్ మెంట్ కానే కాదు. ఇదిలా ఉండగా గోల్డ్ జ్యూయల్లరీకి 2021 జనవరి 15 నుంచి హాల్‌‌ మార్కింగ్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసేసుకు...

అబ్బా..ఛార్జీల దెబ్బ

చిత్రం
భారత టెలికం నియంత్రణ సంస్థ దెబ్బకు టెలికం కంపెనీలు లాభాలు గడిస్తున్నా నష్టాలు వస్తున్నాయనే సాకుతో చార్జీల బాదుడు షురూ చేశాయి. మొదటగా వోడాఫోన్ ఏకంగా 40 శాతం చార్జీలు పెంచింది. దీంతో అదనంగా టారిఫ్ లపై మోయలేని రీతిలో భారం మోపింది. దీని బాటలోనే జియో, ఎయిర్ టెల్, ఐడియా టెలికాం కంపెనీలు చార్జీలు తట్టుకోలేని రీతిలో పెంచడంతో మొబైల్ వినియోగదారులు లబోదిబో మంటున్నారు. అన్నీ ఉచితమే అంటూ జనాన్ని బురిడీ కొట్టించి అలవాటు చేసిన సదరు కంపెనీలు ఇప్పుడు వాడకుండా ఉండలేని స్థితికి తీసుకు వచ్చాయి. అదేపనిగా స్మార్ట్ ఫోన్స్ వాడే వాళ్ళు భారీ చార్జీలను భరించలేక పోతున్నారు. డేటా వినియోగం, ఇంటర్నెట్ కనెక్టివిటీ అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అత్యవసరంగా మారింది.  దీంతో కనెక్షన్ అన్నది తప్పనిసరి. దీనిని ఆసరాగా చేసుకున్న టెలికాం కంపెనీలు చార్జీల బాదుడు స్టార్ట్ చేశాయి. తాజాగా ఇండియన్ టెలికం సెక్టార్ లో టాప్ రేంజ్ లో కొనసాగుతున్న రిలయన్స్ జియో కూడా బాదుడు షురూ చేసింది. ఇదిలా ఉండగా నిన్నటి దాకా ఇచ్చిన జియో ఫ్రీ ఫైబర్‌‌‌‌‌‌‌‌కు గడువు తీరి పోయింది. యూజర్లు ఇన్ని రోజులు పొందిన ఉచిత హోమ్ బ్రాడ్‌‌‌‌ బ్యాండ్ సేవలక...

భారీ ప్యాకేజీలు..క్యూ కట్టిన కంపెనీలు

చిత్రం
వరల్డ్ వైడ్ గా మన కుర్రాళ్లకు ఉన్న డిమాండ్ ఏమిటో ఇప్పుడు తెలుస్తోంది దిగ్గజ కంపెనీలకు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ టెక్నాలజీ ల్లో చదివే నాలుగు వేల మంది స్టూడెంట్స్‌‌ కేవలం రెండు రోజుల్లో ఉద్యోగాలు సంపాదించారు. ఇది ఓ రికార్డు గానే భావించాలి. పాత తరం ఐఐటీల స్టూడెంట్స్‌‌లో 350 నుంచి 500 మంది వరకు జాబ్స్‌‌ సాధించారు. ఐఐటీ ఖరగ్‌‌పూర్‌‌ స్టూడెంట్స్ ఆరు మందికి1.5 కోట్ల ప్యాకేజీ లభించింది. మరో 57 మందికి ఏటా రూ.30 లక్షల చొప్పున జీతంతో ఆఫర్ లెటర్లు వచ్చాయి. రాబోయే రోజుల్లో మరికొంత  మంది రిక్రూట్‌‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఐఐటీలో మొదటి రెండు రోజుల్లోనే 500 మంది స్టూడెంట్స్‌‌కు ఆఫర్లు లెటర్లు వచ్చాయి. 715 మందికి ప్రి ప్లేస్‌‌మెంట్‌‌ ఆఫర్లు వచ్చాయి. కోర్‌‌ సెక్టార్‌‌ తరువాత, ఐటీ, ఫైనాన్స్‌‌ సెక్టార్లలో ఎక్కువ మందికి జాబ్స్‌‌ వచ్చాయని ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్‌‌ రామ్‌‌గోపాల్ రావు చెప్పారు. తమ విద్యార్థులు విదేశాల్లో కంటే మన దేశంలో ఉద్యోగాలు చేయడానికే ఇష్ట పడుతున్నారని అన్నారు. ఎక్కువ మంది కోర్‌‌ సెక్టార్లలో జాబ్స్‌‌కు ఇష్టపడుతున్నారని, ఇది ఆర్థికరంగానికి ఎంతో మేలన...

భారీగా కొల్లగొట్టిన కేటుగాడు

చిత్రం
ఈ దేశంలో సామాన్యులకు అప్పులు దొరకవు. కానీ రుణాలు కావాలని ఎగ్గొట్టే వాళ్లకు మాత్రం దండిగా ప్రభుత్వ బ్యాంకులు ఇస్తూ పోతున్నాయి. ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో పీకల లోతుకు కూరుకు పోయిన నీరవ్ మోడీ అనుకున్న దాని కంటే అధికంగా డబ్బులు కొల్లగొట్టాడు. రెండేళ్ల క్రితం పంజాబ్‌‌‌‌ నేషనల్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ స్కామ్‌‌‌‌ బయటికి వచ్చినప్పుడు దేశమంతా నివ్వెర పోయింది. బ్యాంకు సొమ్ము 13,500 కోట్లను నీరవ్‌‌‌‌ మోడీ, ఇతడి బంధువు మెహుల్‌‌‌‌ చోక్సీ కొల్ల గొట్టారని తెలియడంతో బ్యాంకింగ్‌‌‌‌ రంగం మొత్తం షాకింగ్‌‌‌‌కు గురైంది. డొల్ల కంపెనీల ద్వారా మోడీ, అతని మనుషులు బ్యాంకు సొమ్మును దోచేస్తున్నప్పటికీ ఎవరూ కనిపెట్టలేక పోయారు. అయితే ఈ కథ ఇక్కడితో ముగియ లేదు. తవ్విన కొద్దీ మరిన్ని సంచలన విషయాలు బయట పడుతున్నాయి. ఈ ఘటన జరిగాక పీఎన్‌‌‌‌బీ యాజమాన్యం ఫోరెన్సిక్‌‌‌‌ ఆడిట్‌‌‌‌కు ఆదేశించగా, ఈ కమిటీ పలు సంచలన విషయాలను వెల్లడి చేసింది.  ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 28 వేల కోట్ల విలువైన 1,561 లెటర్స్‌‌‌‌ ఆఫ్ అండర్‌‌‌‌ టేకింగ్స్‌‌‌‌ ను పీఎన్‌‌‌‌బీ నీరవ్ మోడీ గ్రూప్‌‌‌‌కు ఇచ్చినట్టు బెల్జియన్‌‌‌‌ ఆడిటింగ్‌‌‌‌ కంపెనీ బీడీఓ ...

నిత్యానందం..కైలాసం

చిత్రం
మనుషుల బలహీనతలు ఆసరాగా చేసుకుని, దైవం పేరుతో అడ్డమైన పనులన్నీ చేసి, కోట్లాది రూపాయలు పోగు చేసి..దేశం నుంచి చెక్కేసిన వివాదాస్పద స్వామిజీ నిత్యానంద ఇప్పుడు ఎంచక్కా ఏకంగా ఓ కంట్రీనే స్థాపించాడు. ఇది వినడానికి విస్తు పోయేలా ఉన్నా, ఇది ముమ్మాటికీ నిజం. వాస్తవం కూడా. ఇప్పటి దాకా బాబాలు, స్వాములు, యోగులు ఆశ్రమాలు పెట్టడం, భక్తులకు జ్ఞాన, ఆధ్యాత్మిక బోధ చేయడం చూశాం. కానీ మనోడు వీరికంటే భిన్నంగా ఉండాలని అనుకున్నాడో ఏమో కానీ ఎవ్వరికీ అసాధ్యం కానీ రీతిలో కొత్త దేశాన్ని స్థాపించాడు. దాని పేరు కైలాసం. ఈ పేరు వింటేనే మనకు హిమాలయాల్లో ఉన్న కైలాస శిఖరం గుర్తుకు వస్తుంది. అది కాదు. దక్షిణ అమెరికా తీరానికి సమీపంలో ఉన్న కంట్రీ ఈక్వెడార్ నుంచి ఓ దీవిని కొనుగోలు చేసి.. అక్కడ ఏర్పాటు చేశాడు ఈ ప్రబుద్దుడు.  గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో రేప్ కేసులో నిత్యానందపై కేసు నమోదు అయ్యింది. ఇందులో భాగంగా ఈ వివాదాస్పద స్వామిజి కోసం గత కొంత కాలంగా ఆయనను పట్టుకునేందుకు భారత పోలీసులు అదే పనిగా వెతుకుతున్నారు. అయినా దొరకడం లేదు. ఎంతైనా స్వామిజీ కదా. బీజేపీ ప్రభుత్వంలో స్వాములదే కాలం. సన్నాసులదే రాజ్యం. దేశం విడిచి ఎ...

కొనేటోల్లకు కొనుక్కున్నంత

చిత్రం
కొనుగోలుదారులకు ఈకామర్స్ దిగ్గజ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొనేటోల్లకు కొనుక్కుంత గిఫ్టులు  ఇస్తోంది. ఈ కామర్స్ దిగ్గజ కంపెనీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. దీంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్, రిలయన్స్ డిజిటల్, పేటీఎం, స్నాప్ డీల్ కంపెనీలన్నీ తక్కువ ధరకే అన్నీ లభిస్తున్నాయి. ఇక ఆయా బ్యాంకుల్లో ఖాతాలు, క్రెడిట్ కార్డులు కలిగిన వాళ్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఇస్తున్నాయి. మరో అడుగు ముందుకు వేసి ఎక్చేంజ్ చేసుకునే సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇఎంఐ సౌకర్యం కూడా అందుబాటులోకి తేవడంతో ఆన్ లైన్ లో కొనుగోలు వార్ మొదలైంది. తాజాగా మొబైల్ వినియోగదారుల కోసం ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ పేరుతో సరికొత్త ఆఫర్లతో మరోసారి అందుబాటులోకి వచ్చింది. ఈ ఆఫర్లలో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు మరియు మరెన్నో ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ కార్డుతో 4,999లకు పైగా షాపింగ్ చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ను కూడా కంపెనీ ప్రకటించింది. అంతే కాకుండా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఈఎమ్ఐ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ...

ఐపీఎల్ వేలానికి వేళాయెరా

చిత్రం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ యుద్దానికి సిద్ధమవుతోంది. వర్ధమాన ఆటగాళ్లకు ఇప్పుడు ఇదో గొప్ప వేదికగా ఉపయోగ పడుతోంది. అండర్ -19 జట్టులో మెరికల్లాంటి కుర్రాళ్ళు దుమ్ము రేపుతున్నారు. ఐపీఎల్ లో తమ ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నారు. మరో వైపు ఇండియన్ క్రికెట్ అకాడెమీకి మెంటార్ గా ఉన్న, మాజీ సారధి రాహుల్ ద్రవిడ్ ఆటగాళ్లకు నగిషీలు చెక్కుతున్నాడు. ఏ ఫార్మాట్ లోనైనా సరే ఆడేలా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా తీర్చి దిద్దుతున్నాడు. ఆయన ట్రైనింగ్ లో రాటుదేలిన కుర్రాళ్ళు ఇప్పుడు టీమిండియా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి వారిలో చాలా మంది ఇప్పుడు రఫ్ఫాడిస్తున్నారు. మరో వైపు బిసిసిఐకి మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రెసిడెంట్ గా కొలువు తీరడంతో పూర్తిగా సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. ఇండియాలో క్రికెట్ కు కొత్త జవసత్వాలు తీసుకు వచ్చే పనిలో పడ్డాడు. ఐపీఎల్ లో కూడా మార్పులు చేయాలని అనుకుంటున్నాడు ఈ దాదా. తాజాగా ఐపీఎల్ పండగ సీజన్ వచ్చేసింది. 2020 సీజన్‌ ఆటగాళ్ల వేలం కోల్‌కతా వేదికగా జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన మొత్తం 971 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొంటుండగా, వారిలో నుంచి 73 మందిని మాత్రమే ఫ్...

మనోడే నెంబర్ వన్

చిత్రం
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు బ్రేక్ చేశాడు. ఇప్పటికే వన్డే, టెస్ట్, టీ 20 ఫార్మాట్ లలో టన్నుల కొద్దీ పరుగులు చేస్తూ ఎవ్వరికీ అందనంత దూరంలో చేరాడు ఈ వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్. ఇటీవలి కాలంలో ఈ ఇండియన్ ఆటగాడిని తట్టు కోవడం ఏ బౌలర్ కు సాధ్యం కావడం లేదు. ఒక్కసారి క్రీడా మైదానం లోకి ఎంటర్ అయ్యాడంటే చాలు ఆఫ్ సెంచరీ చేయాల్సిందే. ఒక్కసారి క్రీజు లో కుదురుకున్నాడంటే ఇక వెనుదిరిగి చూడాల్సిన పనిలేదు. అంతలా తనను తాను ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ వస్తున్నాడు. కోహ్లీకి ఉన్నంత డిమాండ్ ఏ ఆటగాడికి ఇండియాలో లేదంటే నమ్మలేం. అంతలా పాపులర్ అయ్యాడు. ప్రపంచంలో అత్యంత ఆదాయం కలిగిన క్రీడాకారుల్లో విరాట్ కోహ్లీ టాప్ వన్ ప్లేస్ దక్కించుకున్నాడు. ఇప్పటి దాకా క్రీడా విశ్లేషకుల అంచనా ప్రకారం కోహ్లీ సంపద ఏడాదికి కోట్లల్లో ఉంటుంది. ఇది ఇంకా ఎక్కువగానే ఉంటుంది. కోహ్లీ మైదానంలో పులిలా ఉంటాడు. ఏ మాత్రం ఓటమిని ఒప్పుకోడు. గెలుపు సాధించేంత దాకా నిద్ర పోడు. మోస్ట్ వాంటెడ్ ప్లేయర్ గా కోహ్లీని ఇంటర్ నేషనల్ మీడియా వెల్లడించింది. తాజగా కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. టెస్టు ర్యాంకింగ్ లో మళ్లీ ...