విద్యుత్ శాఖ వింత పోకడ
తెలంగాణాలో ప్రభుత్వ శాఖలు, సంస్థలు సర్కారు అధీనంలో ఉన్నా అవి తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఇక విద్యుత్ శాఖ, ఎస్సి గురుకులాల సంస్థ ఈ రెండూ ఎవ్వరి మాటా వినడం లేదు. ఎందుకంటే ఈ రెండు శాఖల బాధ్యులు నేరుగా ముఖ్యమంత్రితో సంబంధాలు కలిగి ఉండటం కావొచ్చు. ఇప్పటికే వేలాది పోస్టులు ఖాలీగా ఉన్నా భర్తీ చేయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. అన్ని శాఖల్లో అర్హత, వయసు విషయంలో బీసీలకు 45 ఏళ్ళ వరకు దరఖాస్తు చేసుకునే వీలు ఉండగా వీటి భర్తీలో మాత్రం ఇందుకు మినహాయింపు లేదు. కేవలం 34 ఏళ్ళ వరకే పరిమితి విధించారు. అంతే కాకుండా బీఇ, బీటెక్ పాసైన వారికి అప్ప్లై చేసుకునే వీలు లేకుండా చేసింది తెలంగాణ విద్యుత్ సంస్థ.
గతంలో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్ట్ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎవరిని పిలిచారు. ఇంతవరకు ఆ పోస్టు గురించిన వివరాలు ఏవీ లేవు. అపాయింట్ అయిన సదరు అధికారి సీఎం కు పిఆర్ ఓ గా విధులు నిర్వహిస్తున్నారు. మరో వైపు అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కోసం నోటిఫికేషన్ వేశారు. అందులో వయసు కూడా కుదించారు. దీని వల్ల ఎందరో ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతోంది. తాజాగా విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్లో డిగ్రీ అర్హతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీటెక్ ను డిగ్రీగా గుర్తించని విద్యుత్ శాఖ.. 23,018 మంది అప్లికేషన్లను ‘ఇన్ వ్యాలీడ్ క్వాలిఫికేషన్’ అంటూ రిజెక్ట్ చేసింది.
దీంతో బీటెక్ చేసిన అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు బీటెక్ చేసిన వారిని అనుమతిస్తుండగా విద్యుత్ శాఖ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని, తమకు అవకాశం లేకుండా చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ ఇటీవల 2,500 జూనియర్ లైన్మెన్ పోస్టులు, 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులు, 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. జేఎల్ఎం పోస్టులకు 58,568 దరఖాస్తులు వచ్చాయి. కేవలం ఐటీఐ అభ్యర్థులను మాత్రమే ఈ పోస్టులకు అర్హులుగా ప్రకటించారు.
ఇక జేపీఓ పోస్టుకు 36,557 అప్లికేషన్లు, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు 1,13,891 దరఖాస్తులు వచ్చాయి. జేపీవో, జేఏసీఏ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిలో 23,018 మంది అప్లికేషన్లను ఇన్వ్యాలీడ్ క్వాలిఫికేషన్ పేరుతో అధికారులు రిజెక్ట్ చేశారు. డిగ్రీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో విద్యుత్ శాఖ పేర్కొంది. దీంతో బీటెక్ చేసిన అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. అయితే విద్యుత్ శాఖ అధికారులు ప్రొఫెషనల్ డిగ్రీ చేసిన వారందరినీ రిజెక్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ సంస్థలు బీటెక్ పట్టాను డిగ్రీగా గుర్తిస్తుండగా, రాష్ట్రంలో కొత్త విధానం ఏంటని కేండిడేట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న వారిని అనుమతిస్తే ఎదురయ్యే సమస్యల నేపథ్యంలోనే బీటెక్ వారిని రిజెక్ట్ చేశామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. అందుకే నోటిఫికేషన్లో బీఏ, బీకాం, బీఎస్సీ లేదా అవే సబ్జెక్టులతో చేసే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ డిగ్రీలనే అనుమతిస్తామని పేర్కొన్నామని అంటున్నారు. ఈ పోస్టులకు మామూలు డిగ్రీ చాలంటున్నారు. బీటెక్ చేసిన అభ్యర్థులు జూనియర్ పర్సనల్ ఆఫీసర్గా కానీ, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్గా కానీ ఎంపికైతే భవిష్యత్తులో విద్యుత్ సంస్థల్లో సమస్యలు తలెత్తుతాయి. తమకు అర్హత ఉందంటూ సబ్ ఇంజనీర్, ఏఈ పోస్టులకు భవిష్యత్లో కన్వర్షన్ అడిగే అవకాశం ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సర్వీస్పై వెయిటేజ్ ఇస్తూ కన్వర్షన్ ఇవ్వండని చట్టపరంగా పోరాడే అవకాశం ఉంటుంది. అందుకే ప్రొఫెషనల్ డిగ్రీలను అనుమతించలేదు అని చెబుతున్నారు.
గతంలో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్ట్ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎవరిని పిలిచారు. ఇంతవరకు ఆ పోస్టు గురించిన వివరాలు ఏవీ లేవు. అపాయింట్ అయిన సదరు అధికారి సీఎం కు పిఆర్ ఓ గా విధులు నిర్వహిస్తున్నారు. మరో వైపు అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కోసం నోటిఫికేషన్ వేశారు. అందులో వయసు కూడా కుదించారు. దీని వల్ల ఎందరో ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతోంది. తాజాగా విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్లో డిగ్రీ అర్హతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీటెక్ ను డిగ్రీగా గుర్తించని విద్యుత్ శాఖ.. 23,018 మంది అప్లికేషన్లను ‘ఇన్ వ్యాలీడ్ క్వాలిఫికేషన్’ అంటూ రిజెక్ట్ చేసింది.
దీంతో బీటెక్ చేసిన అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు బీటెక్ చేసిన వారిని అనుమతిస్తుండగా విద్యుత్ శాఖ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని, తమకు అవకాశం లేకుండా చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ ఇటీవల 2,500 జూనియర్ లైన్మెన్ పోస్టులు, 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులు, 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. జేఎల్ఎం పోస్టులకు 58,568 దరఖాస్తులు వచ్చాయి. కేవలం ఐటీఐ అభ్యర్థులను మాత్రమే ఈ పోస్టులకు అర్హులుగా ప్రకటించారు.
ఇక జేపీఓ పోస్టుకు 36,557 అప్లికేషన్లు, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు 1,13,891 దరఖాస్తులు వచ్చాయి. జేపీవో, జేఏసీఏ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిలో 23,018 మంది అప్లికేషన్లను ఇన్వ్యాలీడ్ క్వాలిఫికేషన్ పేరుతో అధికారులు రిజెక్ట్ చేశారు. డిగ్రీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో విద్యుత్ శాఖ పేర్కొంది. దీంతో బీటెక్ చేసిన అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. అయితే విద్యుత్ శాఖ అధికారులు ప్రొఫెషనల్ డిగ్రీ చేసిన వారందరినీ రిజెక్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ సంస్థలు బీటెక్ పట్టాను డిగ్రీగా గుర్తిస్తుండగా, రాష్ట్రంలో కొత్త విధానం ఏంటని కేండిడేట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న వారిని అనుమతిస్తే ఎదురయ్యే సమస్యల నేపథ్యంలోనే బీటెక్ వారిని రిజెక్ట్ చేశామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. అందుకే నోటిఫికేషన్లో బీఏ, బీకాం, బీఎస్సీ లేదా అవే సబ్జెక్టులతో చేసే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ డిగ్రీలనే అనుమతిస్తామని పేర్కొన్నామని అంటున్నారు. ఈ పోస్టులకు మామూలు డిగ్రీ చాలంటున్నారు. బీటెక్ చేసిన అభ్యర్థులు జూనియర్ పర్సనల్ ఆఫీసర్గా కానీ, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్గా కానీ ఎంపికైతే భవిష్యత్తులో విద్యుత్ సంస్థల్లో సమస్యలు తలెత్తుతాయి. తమకు అర్హత ఉందంటూ సబ్ ఇంజనీర్, ఏఈ పోస్టులకు భవిష్యత్లో కన్వర్షన్ అడిగే అవకాశం ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సర్వీస్పై వెయిటేజ్ ఇస్తూ కన్వర్షన్ ఇవ్వండని చట్టపరంగా పోరాడే అవకాశం ఉంటుంది. అందుకే ప్రొఫెషనల్ డిగ్రీలను అనుమతించలేదు అని చెబుతున్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి