బంగారం ఆదాయానికి మార్గం

ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం. దాచుకోలేం. ఆకలైతే తినలేం. అరిగించు కోలేం. ఇలాంటి మాటలు ఇక కట్టి పెట్టండి బాస్. బతకాలంటే డబ్బులు కావాలి. ఒక్కరు సంపాదిస్తే గడిచే రోజులు పోయాయి. ఇంటిల్లిపాది కష్టపడితేనే పూట గడుస్తోంది. ఎలాంటి కష్టం చేయకుండా ఉన్న దగ్గరి నుంచే కాసులు కొల్లగొట్టాలన్నా, లేదా కరెన్సీ మన జేబుల్లోకి రావాలంటే మాత్రం బంగారం మించిన వస్తువు మరొక్కటి ఈ ప్రపంచం లో లేదు. ఇండియాలో ఉన్నంత బంగారం ఇంకే దేశంలో లేదంటే నమ్మలేం. కానీ అది ముమ్మాటికీ వాస్తవం కూడా. భారత దేశంలోని ఆలయాలు, ఆశ్రమాలు, బ్యాంకుల్లో లెక్కలేనంతగా బంగారం మూలుగుతోంది. స్థిరమైన ప్రాఫిట్ రావాలంటే మాత్రం పసిడిని మించిన ప్రయోగం లేదు.

రోజుకు లేదా వారానికో లేదా నెలకో కనీసం ఒక గ్రాము అయినా బంగారాన్ని కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. బరువు అంటూ ఉండదు. ఎక్కడికైనా సులభంగా తీసుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈజీగా లోన్స్ తీసుకునే వీలు కలుగుతుంది. అందుకే పసిడి మీద పెట్టుబడి అన్నది డెడ్ ఇన్వెస్ట్ మెంట్ కానే కాదు.
ఇదిలా ఉండగా గోల్డ్ జ్యూయల్లరీకి 2021 జనవరి 15 నుంచి హాల్‌‌ మార్కింగ్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసేసుకున్న సంగతి తెలిసిందే. హాల్‌‌మార్కింగ్‌‌లోకి మారడానికి ఇంకా వన్‌‌ ఇయర్ సమయం ఇచ్చింది. ఈ ఏడాదిలో మార్కెట్‌‌లో ఎన్నో మార్పులు చోటు చేసుకోవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. బులియన్ డీలర్స్, జ్యూయల్లర్స్‌‌ ఇప్పటికే తమ వద్దనున్న నాన్ హాల్‌‌ మార్కెడ్ జ్యూయల్లరీ స్టాక్‌‌ను క్లియర్ చేసు కునేందుకు, జీరో మేకింగ్ ఛార్జస్‌‌ను ఆఫర్ చేయొచ్చని బులియన్ నిపుణులు పేర్కొంటున్నారు.

ఒకవేళ మేకింగ్ ఛార్జీలను వదులు కోకపోతే, అదే జ్యూయల్లరీని కరిగించి, హాల్‌‌మార్క్ చేయాల్సి వస్తుందన్నారు. వచ్చే ఏడాది ప్రభుత్వం హాల్‌‌ మార్కింగ్‌‌పై నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వద్ద రిజిస్టర్ చేసుకోవడానికి, నాన్ హాల్‌‌ మార్కింగ్ స్టాక్స్‌‌ను  క్లియర్ చేసుకునేందుకు ఏడాది సమయం ఇవ్వనున్నట్టు తెలిపింది. బీఐఎస్‌‌ గోల్డ్ జ్యూయల్లరీకి మూడు రకాల గ్రేడ్స్‌‌ ఇస్తుంది. అవి 14, 18, 22 క్యారెట్ల గ్రేడ్స్. కాగా చిన్న చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నాన్ హాల్‌‌ మార్కెడ్ జ్యూయల్లరీనే ఎక్కువగా విక్రయిస్తారు. గ్రామాల్లో చాలా మందికి హాల్‌‌ మార్కింగ్ గురించి, దాని ప్రయోజనాల గురించి తెలియదు. ఇవేమీ చూసుకోకుండానే..బంగారం కొనేస్తుంటారు. ప్రస్తుతం హాల్‌‌మార్కింగ్ జ్యూయల్లరీ అమ్మేందుకు బీఐఎస్‌‌ నుంచి లైసెన్స్ పొందిన జ్యూయల్లర్స్ దేశ వ్యాప్తంగా 3 లక్షల మంది ఉన్నారు.

వారిలో కేవలం 30 వేల మంది మాత్రమే హాల్‌‌మార్కింగ్ జ్యూయల్లర్స్‌‌ను విక్రయిస్తున్నారు. 2019 ఆర్థిక సంవత్సరంలో దేశంలో వెయ్యి టన్నుల గోల్డ్ వినియోగం జరిగింది. దానిలో 450 టన్నులు మాత్రమే హాల్‌‌ మార్కింగ్ జ్యూయల్లరీ. బీఐఎస్‌‌ హాల్‌‌మార్క్ అనేది..ఇండియాలో విక్రయించే గోల్డ్, సిల్వర్ జ్యూయల్లరీకి ఇస్తోన్న హాల్‌‌ మార్కింగ్ సిస్టమ్. ఇది ఆ విలువైన మెటల్ స్వచ్ఛతను కొలుస్తోంది. ఇండియాలో గోల్డ్ జ్యూయల్లరీకి హాల్‌‌మార్కింగ్ సిస్టమ్‌‌ను 2000 ఏప్రిల్‌‌లో ప్రవేశపెట్టారు. అప్పుడది వాలంటరీ స్కీమ్‌‌ మాత్రమే. కానీ హాల్‌‌మార్కెడ్ గోల్డ్‌‌నే అమ్మేందుకు జ్యూయల్లర్స్‌‌ను ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో జ్యూయల్లర్స్‌‌కు ఫీజులు తగ్గించింది. దీనిపై అవగాహన కల్పించడానికి బీఐఎస్ పలు ట్రైనింగ్ ప్రొగ్రామ్స్‌‌ను కూడా నిర్వహించింది. ప్రస్తుతం దీన్ని తప్పనిసరి చేసింది.

మార్కెట్‌‌లో, కన్జూమర్లలో తమపై నమ్మకాన్ని చూరగొనడానికి జ్యూయల్లర్స్‌‌కు హాల్‌‌మార్కింగ్ గోల్డ్‌‌ విక్రయం ఎంతో ఉపయోగ పడుతుంది. ఏదైనా బంగారపు ఆభరణాన్ని చూడగానే దాని కచ్చితమైన నాణ్యతను, స్వచ్ఛతను అంచనా వేయలేం. దీని కోసం మనం ఒక నిపుణుడి సలహా అవసరం. అలాంటి సమయాల్లో దాని అసలు విలువ తెలుసు కోకుండానే, ఎక్కువ మొత్తాన్ని చెల్లించి గోల్డ్ జ్యూయల్లరీని కొంటున్నారు చాలా మంది. ఒకవేళ బీఐఎస్ హాల్‌‌మార్క్‌‌కు సంబంధించిన గ్రేడ్స్  ఉంటే, ఆ ఐటమ్ స్వచ్ఛత ఎంతో తేలికగా తెలుసు కోవచ్చు. హాల్‌‌ మార్కింగ్ ఉన్న గోల్డ్‌‌ను తేలికగా మళ్లీ అమ్మొచ్చు లేదా రీసైక్లింగ్ చేసుకోవచ్చు కూడా. హాల్‌‌ మార్కింగ్ ఉన్న గోల్డ్‌‌ వల్ల కస్టమర్లు ఎక్కడా కూడా నష్ట పోవడానికి వీలుండదు. ఎక్కడైన జ్యూయల్లర్స్ మోసం చేశారని తెలిస్తే..వారిపై చర్యలు కూడా ఉంటాయి. గోల్డ్‌‌ వినియోగంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఇండియా ఉంది. మొత్తం మీద అమిత్ షా కన్ను మన బంగారంపై పడిందన్నమాట.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!