ప్రిన్స్.. సరిలేరు నీకెవ్వరు

మిల్క్ బాయ్ గా ఇప్పటికే పేరున్న మినిమమ్ గ్యారెంటీ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది. ఈ సినిమా డైరెక్టర్ ముందే చెప్పినట్టు బొమ్మ అదుర్ది అన్న డైలాగ్ నిజం చేసింది ఈ సినిమా. తాజాగా చిత్ర యూనిట్ తో పాటు సినీ నిర్మాతలు అనిల్ సుంకర, దిల్ రాజు లు సైతం విస్తు పోతున్నారు ఈ సినిమా వసూళ్లను చూసి. దీంతో చిత్ర బృందం మొత్తం న్యూ వేవ్ ను క్రియేట్ చేస్తూ హల్ చేస్తోంది. సంక్రాంతి పండుగ వేళ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేలా తెర కెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకు పోతోంది. ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉండటంతో తర్వలోనే ‘సరిలేరు నీకెవ్వరు’ వందకోట్ల మార్క్ను దాటేసే అవకాశముందని సినీ వర్గాలు అంటున్నాయి. తొలిరోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 46.77 కోట్ల షేర్ సాధించిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో 32.77 కోట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం. ఇక, రెండో రోజు సుమారు 20 కోట్ల వరకు ఈ సినిమా రాబట్టిందని అంటున్నారు. మొత్తానికి తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్లకు చేరువగా వచ్చిందని సమాచారం. అధికారిక లెక్కలు వస్తే..ఈ సిన...