వన్నె తగ్గని కొలువులు

ప్రపంచం కొత్త దానం కోరుకుంటోంది. అదే సమయంలో భిన్నమైన సాంకేతికతను వాడుతోంది. దీంతో ఇప్పటిదాకా రాజ్యమేలిన ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్, తదితర కోర్సులు నిన్నటి దాకా ప్రభావితం చేసాయి. అంతే కాకుండా మిగతా సామాజిక అంశాలను బోధించే కోర్సులు ఉన్నట్టుండి పడిపోయాయి. అయితే ఇదే స్థానంలో కొత్త కోర్సులకు భలే గిరాకీ పెరిగింది. వీటిలో అట్రిఫీషియల్ ఇంటెలిజెన్స్ , మెషిన్ లెర్న్ ఇంగ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్, డేటా అనలిటిక్స్ ప్రస్తుతం వరల్డ్ వైడ్ మార్కెట్ ను ఊపేస్తున్నాయి. అన్ని కాలేజీలు, యూనివర్సిటీలు వీటిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా దేశ వ్యాప్తంగా సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ కోర్సులకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని ఇండీడ్‌ పేర్కొంది.

గత మూడేళ్లుగా ఈ కోర్సులకు విపరీతమైన ఆదరణ పెరిగిందని, ఎక్కువ ఉద్యోగ నియామకాలు ఈ కోర్సులు అభ్యసించిన వారికే దక్కాయని తెలిపింది. స్టెమ్‌ కోర్సులు చేసిన వారికి 2016 నవంబరు నుంచి 2019 నవంబరు వర​కు 44 శాతం ఉద్యోగ నియామకాలు పెరిగాయని పేర్కొంది. ఇండియాలో  స్టెమ్‌ కోర్సులకు భారీగా డిమాండ్‌ ఉందని, నియామకాల వృద్ధి స్థిరంగా కొనసాగుతుందని తెలిపింది. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, రోబోటిక్స్‌ వంటి రంగాల్లో వస్తున్న అత్యాధునికి సాంకేతిక వల్ల విద్యార్థులు స్టెమ్‌ కోర్సుల పట్ల ఆసక్తి చూపిస్తున్నారని స్పష్టం చేసింది. ఈ కోర్సుల్లో నైపుణ్యం పెంచుకుంటే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడింది.

మొత్తం స్టెమ్‌ ఉద్యోగాల్లో ఢిల్లీ 31 శాతం నియామకాలతో అగ్రస్థానంలో నిలవగా ముంబై  21శాతం, బెంగళూరు 14శాతం, పుణె 12శాతం, హైదరాబాద్‌ 12శాతం, చెన్నై 10 శాతం తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రాంతాల వారిగా విశ్లేషిస్తే పశ్చిమ ప్రాంతాలు 34 శాతం ఉద్యోగాలతో అగ్రస్థానంలో నిలవగా, ఉత్తర, దక్షిణ రాష్ట్రాలు 31శాతం ఉద్యోగాలు పొందాయని..ఈశాన్య ప్రాంతాల్లో కేవలం నాలుగు శాతం ఉద్యోగాలకు మాత్రమే పరిమమితయ్యాయని ఇండీడ్ తెలిపింది. విద్యార్థులు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, పీహెచ్‌పీ డెవలపర్, నెట్ డెవలపర్, ఆండ్రాయిడ్ డెవలపర్ వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలను అందిపుచ్చు కోవడానికి స్టెమ్‌ కోర్సులు నేర్చు కుంటున్నారని వెల్లడించింది. 

కామెంట్‌లు