పోస్ట్‌లు

ఆగస్టు 3, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

వినియోగం మందగమనం ..ఆదాయం అంతంత మాత్రం..!

చిత్రం
ఏదైనా ఆదాయం పొందాలంటే వినియోగం అన్నది తప్పనిసరి. వ్యవస్థలో నగదు లభించక పోవడం కూడా మరో కారణం. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో సంక్షోభం నెలకొనడం తో షేర్లలో భారీ నష్టాలు చవిచూశాయి . కొంత కాలం పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఏ దేశమైన అభివృద్ధి సాధించాలంటే ..ఆర్థికంగా మరింత బలంగా ఉండాలి. దీనికి చోదక శక్తి వినియోగ రంగం. మన దేశ ఆర్ధిక రంగం మరింత ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వినియోగ రంగం ఈ ఏడాది గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది . దేశీయ వినియోగం, ఉత్ పాదకతపైనే ఎక్కువగా ఆధారపడిన మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు వృద్ధి క్షీణతను చవిచూస్తోంది. భారీ మెజారిటీతో రెండోసారి కొలువు దీరిన ఎన్డీయే సర్కారు కుంగిన ఆర్థిక వ్యవస్థను పరుగెత్తించే చర్యలు చేపడుతుందన్న ఆకాంక్షలు బలంగా ఉండగా, బడ్జెట్‌ తర్వాత నిరాశ చెందాల్సి వచ్చింది. ముఖ్యంగా వ్యవస్థలో నిధుల లభ్యత పడిపోవడం, ఎన్‌బీఎఫ్‌సీ రంగం సంక్షోభం వినియోగాన్ని దెబ్బ తీశాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రజల్లో కొనుగోలు శక్తి నశించింది. నోట్ల రద్దు భారతీయ ఆర్ధిక రంగాన్ని కోలుకోలేకుండా చేసింది. దీంతో నిరుద్యోగం పెరిగింది . ఉద్యోగిత తగ్గింది. అన్ని రంగాలు కుదేలయ్య...

ప్రపంచంలో ఢిల్లీనే బెటర్.. చావడం కంటే బతకడమే కష్టం..!

చిత్రం
రోజులు మారాయి . చావడం కంటే బతకడం కష్టంగా మారింది . ఇండియాలో ఎక్కడికి వెళ్లినా ఇప్పుడు బతికే పరిస్థితులు లేవు . ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ మరింత పెరిగింది. చెన్నై , బెంగళూర్ , ముంబై , హైదరాబాద్ ..ఇలా చెప్పుకుంటూ పోతే బతకడం దుర్భరం . చావే నయం అన్న స్థితికి అటు కేంద్రం లోని బీజేపీ సర్కార్ ..ఇటు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు తీసుకు వచ్చాయి . ఉద్యోగం, చదువు, పెళ్లి.. అవసరం ఏదైనా కానివ్వడం ఒక చోట నుంచి మరొక చోటుకు ఇల్లు మార్చడం పెద్ద తలనొప్పి. ఇల్లు వెతకడం నుంచి మొదలు పెడితే అడ్వాన్స్, ట్రాన్స్‌పోర్ట్, ఇంటర్నెట్, ఫోన్, గ్యాస్‌ వంటి యుటిలిటీ చేంజెస్‌ వరకూ ప్రతి ఒక్కటీ టాస్కే. పైగా ఖర్చు కూడా..తడిసి మోపెడవుతోంది . ఇంటి షిఫ్టింగ్‌లో ప్రపంచ దేశాల్లోని ప్రధాన నగరాలతో పోలిస్తే మన దేశ రాజధాని ఢిల్లీ అత్యంత చౌక నగరమట. వినడానికి బాగుంది కదూ .  బెర్లిన్‌ ప్రధాన కేంద్రంగా సేవలందిస్తున్న కొరియర్‌ అండ్‌ లాజిస్టిక్‌ కంపెనీ మూవింగ్‌ ప్రపంచ దేశాల్లోని 85 నగరాల్లో 2019 మూవింగ్‌ ఇండెక్స్‌ స్టడీని నిర్వహించింది. ఇంటి షిప్టింగ్‌లో వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ఇల్లు మారిన తర్వాత కుదురుకునే వరకూ తొలి మూడు నాల...

గోదావరి కన్నెర్ర .. కుండపోత ..గుండెకోత ..!

చిత్రం
నిన్నటి దాకా వానల కోసం ఎదురు చూసిన జనానికి ఇప్పుడు ఎప్పుడు ఆగిపోతుందా అని ఎదురు చూస్తున్నరు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వరహాసాలకు వాగులు , కుంటలు , వంకలు పొంగి పొర్లుతున్నవి . జలాశయాలు నీళ్లతో కళకళలాడుతున్నవి. ఇక గోదావరి ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది . పలు గ్రామాలు జల దిగ్భంధం లో చిక్కుకున్నాయి . జనం సాయం కోసం అల్లాడుతున్నారు . ఓ వైపు ఏపీ మరో వైపు తెలంగాణాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దేవీపట్నం గ్రామం పూర్తిగా నీట మునిగింది . మరో వైపు ప్రాణహిత, శబరి, సీలేరు నదులు ఉప్పొంగడంతో  గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది . భద్రాచలం వద్ద 46.10 అడుగులకు వరద నీరు చేరుకోవడం తో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు . ఇది మరింత పెరిగే అవకాశం ఉంది .  ఇంకో వైపు పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేపై రెండు అడుగుల ఎత్తున గోదావరి వరద ప్రవహిస్తోంది. కాఫర్‌ డ్యామ్‌ వద్ద 28.2 అడుగులకు జలాలు చేరాయి . వరద నీరు మరింత పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 11.10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు . తెలంగాణ లో ప్రవేశించే  కృష్ణా నదిలో భారీగా  వరద. నీరు వచ్చి చేరుతుండడంతో . శ్రీశైలం...

బిగ్‌బాస్‌ సక్సెస్ .. రేటింగ్ లో టాప్ ..!

చిత్రం
స్టార్ టీవీ అంటే చాలు ఎవరైనా గుర్తు పడతారు. అంతలా అది దేశమంతటా విస్తరించింది . ఎంతలా అంటే ఇంటిల్లి పాదిని అలరించేలా ..ఆకట్టుకునేలా. ఎప్పుడైతే స్టార్ టీవీ గ్రూప్ నకు ఉదయ్ సింగ్ సీయీవోగా వచ్చి చేరాడో ..అప్పటి నుంచి దాని స్వరూపమే మారి పోయింది. ఊహించని రీతిలో దానిని టాప్ రేంజ్ లోకి తీసుకు వెళ్ళాడు . జీ గ్రూప్ లో టాప్ పొజిషన్ లో ఉన్నఈ మోస్ట్ సక్సెస్ ఫుల్ పర్సన్ గా రికార్డ్ బ్రేక్ చేసాడు . ఇంకేం క్రికెట్ టెలికాస్ట్ చేసేందుకు భారీ ఎత్తున వేలం పాటలో దక్కించుకున్నాడు . ఒక్క ప్రపంచ కప్ తో స్టార్ కు ఊహించని రీతిలో ఆదాయం లభించింది . ఎంత అనేది ఇప్పటి దాకా ఉదయ్ సింగ్ వెల్లడించలేదు. ఇక సౌత్ ఇండియాలో ఎంటర్ అయ్యేందుకు తెలంగాణను చూస్ చేసుకున్నాడు . ఇంకేం మాటీవీ ని కొనుగోలు చేసాడు . ఆ డీల్ ఎంత అనేది ఇప్పటి దాకా ఎవ్వరికీ తెలీదు. ఎప్పుడైతే మాను కొన్నాడో ..ఇక తెలుగు టీవీ రంగంలో పోటీ ఎక్కువయింది . ఇప్పటికే జీ తెలుగు టాప్ రేంజ్ లో ఉండగా ..ఈటీవి తన స్తానం కోసం పోటీ పడుతోంది. వచ్చీ రాగానే నార్త్ లో సక్సెస్ రేంజ్ లో ఉన్న ప్రోగ్రామ్స్ , సీరియల్స్ ను   తెలుగులోకి డబ్ చేసి వదిలారు . కొంచెం కొంచెం తెలు...

రాణించిన నవదీప్ ..విండీస్ ఓటమి ..ఇండియా గెలుపు

చిత్రం
విండీస్ జట్టుతో జరిగిన టీ 20 మ్యాచ్ లో భారత జట్టు అతి కష్టం మీద గెలుపొందింది . టాస్ గెలిచిన టీమ్ ఇండియా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది . కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు ఇండియన్ బౌలర్లు . కొత్తగా వచ్చిన కుర్రాడు నవదీప్ సైని దుమ్ము రేపాడు . అతడి బౌలింగ్ దెబ్బకు విండీస్ ఆటగాళ్లు విలవిలలాడారు . పరుగులు తీసేందుకు ఇబ్బంది పడ్డారు . టార్గెట్ స్వల్పమే అయినా ఇండియా ఆటగాళ్లు కూడా విండీస్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక పోయారు . అంతకు ముందు విండీస్ మొదట బ్యాటింగ్ కు దిగగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. తొలి బంతికే వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఓవర్‌కో వికెట్ చొప్పున కోల్పోతూ పూర్తి కష్టాల్లో కూరుకు పోయింది. 28 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన తరుణంలో నికోలస్ పూరన్ ,  కీరన్ పోలార్డ్ లు ఆ మాత్రం స్కోర్ చేయడంతో ఈ మాత్రం పరుగులు చేయగలిగింది . విండీస్‌ జట్టులో ఐదుగురు ఆటగాళ్లు ఒక్క పరుగు కూడా చేయలేదు. నలుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కూడా దాటలేదు. దీంతో 95 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో నవ్‌దీప్ సైనీ మూడు వికెట్లు తీసుకోగా, భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టా...

రూపీ వాల్యూ వెనక్కి ..రేటింగ్ లో ఇండియా కిందకు

చిత్రం
ప్రపంచ జీడీపీ రేటింగ్ లో ఇండియా మరో స్థానానికి దిగజారింది . రూపాయి విలువ క్షీణించడం ప్రధాన కారణం. ఇప్పుడు ప్రకటించిన స్థానాలలో భారత్ ఏడో స్థానానికి పది పోయింది . యునైటెడ్ కింగ్ డమ్ , ఫ్రాన్స్ దేశాలకు కొద్ది తేడాతో ఇండియా 2 ,73 ట్రిలియన్ డాలర్లతో నిలిచింది . అంతకు ముందు డేటా ప్రకారం 2017 లో భారత్ ఫ్రాన్స్ దేశాన్ని దాటి ఆరో స్థానాన్ని సాధించింది . అప్పుడు 2 .65 ట్రిలియన్ డాలర్ల తో అతిపెద్ద ఎకానమీగా అవతరించింది . ఆ తర్వాత యుకె ను కూడా వెనక్కు నెట్టేసి ఇండియా ఐదో స్థానం పొందింది . కానీ తాజాగా ప్రకటించిన జాబితాలో ఇండియాను ఫ్రాన్స్ , యుకె దేశాలు ముందు వరుసలో చేరాయి .  ఇక 2018 లో కూడా అమెరికానే మొదటి స్థానాన్ని సాధించడం విశేషం . ఈ దేశం ఎప్పటి లాగానే టాప్ ఎకానమీగా నిలిచింది . దీని జీడీపీ 20 .5 ట్రిలియన్లుగా నమోదైంది . యూస్ తర్వాత చైనా 13 .6 ట్రిలియన్ డాలర్లతో రెండో స్థానంతో సరి పెట్టుకుంది . జపాన్ 5 ట్రిలియన్ డాలర్లతో , జర్మనీ 4 ట్రిలియన్ డాలర్లతో మూవుడు నాలుగో స్థానాలతో నిలిచాయి . డాలర్ మారకంలో భారతీయ రూపాయి విలువలో క్షీణత వల్ల రేటింగ్ లో వెనక్కి వెళ్ళింది . 2017 లో రూపీ వాల్యూ 3 శాతం ...

లాభాల బాట పట్టిన బ్యాంకులు

చిత్రం
ఇండియాలో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో పాటు ఆంధ్రా బ్యాంక్ లాభాల బాట పట్టాయి . ఈ ఏడాది జూన్ నెలతో ముగిసిన తొలి క్వార్ట్రర్ లో 2  వేల 312 కోట్ల లాభం వచ్చింది . అయితే ఆశించినంత టార్గెట్ ను చేరుకోలేక పోయింది . నోట్ల రద్దు , మొండి బకాయిలు పేరుకు పోవడం , కేంద్రంలో ప్రభుత్వ నిర్ణయాలు భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలను నిర్వీర్యం చేశాయి . ఈ సమయంలో ప్రభుత్వ బ్యాంకుల కంటే ప్రయివేట్ బ్యాంకులు మరింత ఆదాయాన్ని గడించాయి . గతంలో ఏఫ్డీలు ఎంతగా వచ్చాయో ఇప్పుడు జీఎస్టీ , ఐటి అధికారుల దాడుల నేపథ్యంలో కస్టమర్లు ..ఖాతాదారులు ..డబ్బులు కలిగిన వాళ్ళు ఎవరూ బ్యాంకుల వైపు చూడటం లేదు . దీంతో నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల లావాదేవీలు కొంత మంద గమనం కలిగింది .  అయితే ఎస్బీఐ రెండు వేల కోట్ల రూపాయలు లాభం గడించడం ఒకింత ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఇదే సమయంలో గత సంవత్సరం 4  వేల 785 కోట్ల నష్టాలను చవి చూసింది. దీంతో కాస్ట్ కట్టింగ్ , సిబ్బంది పై అదనపు భారం పడటం కూడా ఉన్నతాధికారులు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడింది . కాగా నికర వడ్డీ ఆదాయం 5 శాతం పెరిగి 22 , 939 కోట్లకు చేరుకుంది ...

నిబద్ధతకు దక్కిన గౌరవం .. ప్రజా గొంతుకు ప్రతిరూపం

చిత్రం
మనీ .. మీడియా ..మాఫియా ..ఈ మూడు ప్రమాదకరమైనవి . వీటిని విడిగా చూడలేం . అలా అని పక్కన పెట్టలేం. కొన్నేళ్లుగా ప్రచురణ ..ప్రసార మాధ్యమాలు ప్రజల పక్షాన మాట్లాడేందుకు ప్రయత్నం చేశాయి . లేకపోతే రాజకీయ నాయకులు మరింతగా ఈ దేశాన్ని ..ఈ వ్యవస్థను .. ఈ సమాజాన్ని మరింత భ్రష్టు పట్టించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు . ఎందరో నిబద్దత కలిగిన పాత్రికేయులు , బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టులు , పౌర పాత్రికేయులు తమ విధుల్ని ...బాధ్యతతో వ్యవహరించడం వల్లనే ఎన్నో సమస్యలు వెలుగులోకి వచ్చాయి . మరెన్నో దేశాన్ని ...ప్రజలను చైతన్యవంతం చేస్తూనే వున్నాయి . వందలాది మంది ప్రజల పక్షాన నిలిచారు . వారి వాయిస్ ను వినిపించేందుకు ప్రయత్నం చేసారు . ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు , మరెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు .  ఇవ్వాళ మీడియా ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది . కాదనలేం . కానీ కార్పొరేట్ రంగపు వాసనలు ప్రసార , ప్రచురణ , సామాజిక మాధ్యమాల వైపు మళ్ళాయి . ఇది అత్యంత ప్రమాదకరం కూడా. పాలిటిక్స్..బిజినెస్ ..ప్రభుత్వాలు ఒక్కటై పోయాయి . ఇప్పుడు ఎవరి గొంతును వారే వినిపిస్తున్నారు. ఎవరికి వారే తమ వార్తలు ప్రధాన శీర్షికలుగా , భారీ హెడ్డింగులతో రాయి...

చెక్ పవర్ కోసం పోరాటం .. సర్పంచులు గరం గరం

చిత్రం
గ్రామ పంచాయితీల ఎన్నికలు ముగిసినా సమస్యల పరిష్కారం మాటేమిటో కానీ ..భాద్యత కలిగిన సర్పంచులు రోడ్డెక్కారు. తమకు న్యాయం కావాలని కోరుతూ ఆందోళన బాట పట్టారు . ప్రస్తుత తెలంగాణ సర్కార్ తీరుపై .. తీసుకున్న నిర్ణయంపై భగ్గుమంటున్నారు. ప్రధాన రహదారుల పై నిరసనలు , ధర్నాలు చేపడుతున్నారు. దీంతో పోలీసులకు మరింత పని పెరిగింది. ఇప్పటికే గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి . నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆయా గ్రామాలలో సమస్యలతో ప్రజలు తల్లడిల్లి పోతున్నారు . గతంలో డ్రా చేసే అధికారం ..నిధులు ఖర్చు పెట్టే పవర్ ఆయా గ్రామాల సర్పంచులకు ఉండేది . ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ చెక్ పవర్ ను తీసి వేసింది . సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ కు ఇద్దరికీ అధికారం ఉండేలా చట్టంలో మార్పులు తీసుకు వచ్చింది .  ఉన్న చెక్ పవర్ తీసి వేస్తే తమకు గ్రామాల్లో ఎవరికీ పనికి రాకుండా పోతామని , తమ మాట ఎవరూ వినరని ప్రస్తుతం ఎన్నికైన సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . గ్రామం అభివృద్ధి చెందాలన్నా , ఏ పనులైనా కావాలన్నా ముందు ఆ గ్రామ సర్పంచ్ కీలకం. దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎలాగో ..పల్లెకు మొదటి పౌరుడు సర్పంచ్. దీంతో అతడు లేదా...