పేమెంట్స్ రంగంలోకి ఆదిత్య గ్రూప్ - ఆర్బీఐ లైన్ క్లియర్

డిజిటల్ టెక్నాలజీ పుణ్యమా అంటూ ఇండియాలో పెద్ద ఎత్తున బ్యాంకింగ్ రంగ వ్యవస్థ ఎదుర్కొంటున్న కష్టాలు తొలగి పోతున్నాయి. ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు పెద్ద ఎత్తున లావాదేవీలు నిర్వహిస్తూ..ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఇంకో వైపు నోట్ల రద్దు దెబ్బకు భారతీయ ఆర్థిక వ్యవస్థ కునారిల్లి పోయింది. జీఎస్టీ అమలు చేయడంతో కేంద్రానికి గణనీయంగా ఆదాయం సమకూరింది. దీంతో బీజేపీ రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అన్ని లావాదేవీలతో పాటు రుణాలు, ఇతర ఆర్థిక పరమైన కార్యక్రమాలన్నీఇపుడు మరింత సులభతరం అయ్యాయి. అన్ని బ్యాంకులు టెక్నాలజీతో అనుసంధానం కావడంతో సేవలు వేగవంతం అవుతున్నాయి. సంబంధిత బ్యాంకులకు చెందిన యాప్లను డౌన్లోడ్ చేసుకుంటే చాలు క్షణాల్లో ఎన్ని డబ్బులైనా..ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈజీగా పంపించు కోవచ్చు. కోటక్ మహీంద్ర, టాటా గ్రూప్ , రిలయన్స్ కూడా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నాయి. తాజాగా ఈ కామర్స్, లాజిస్టిక్ రంగంలో టాప్ రేంజ్లో ఉన్న ఆదిత్య , బిర్లా గ్రూప్ కంపెనీ పంట పండింది. పే మెంట్స్ బ్యాంక్ లను ప్రారంభించేందు...