పోస్ట్‌లు

డిసెంబర్ 12, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

మనోడికి కోటిన్నర ఆఫర్

చిత్రం
తెలంగాణకు చెందిన కుర్రాడు సాయి చరిత్ రెడ్డి తన సత్తా చాటాడు. ఏకంగా కోటిన్నర వార్షిక వేతనాన్ని పొందాడు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఈ కుర్రాడు. ఏదో తరగతి వరకు నల్లగొండ లో చదివిన ఈ కుర్రాడు జాక్ పాటు కొట్టడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. ఐఐటీ బాంబే లో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్న ఈ స్టూడెంట్ ఓ చరిత్రను క్రియేట్ చేశాడు. ఇంజనీరింగ్ పూర్తి కాకుండానే క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఐటీ దిగ్గజ కంపెనీ మైక్రో సాఫ్ట్ లో జాబ్ దక్కించుకున్నాడు. ఎంతో మంది పోటీలో ఉన్నా ఇతనొక్కడినే కంపెనీ ఎంపిక చేసుకుంది. అంటే ఇతడి సత్తా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మొత్తం 11 మందిని ఇంటర్వ్యూకు పిలిచారు. ఇందులో ముగ్గురిని మాత్రమే కంపెనీ ఎంపిక చేసింది. స్వస్థలం మాడ్గులపల్లి మండలం ధర్మపురం. ముందు నుంచి ఇంజనీరింగ్ అంటే ఇష్టం. అందుకే ప్రతి పరీక్షలో టాప్ లో ఉంటూ వచ్చాడు. అన్ని టెస్టుల్లో సెలెక్ట్ అవుతూ రాణించాడు ఈ కుర్రాడు. స్వంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం. నిరంతరం ఇన్ఫర్మేషన్ సేకరించడం, మెంటార్స్, లెక్చరర్స్ తో డిస్కస్ చేయడం చేస్తూ వచ్చాడు. మాక్ టెస్టులకు కూడా అటెండ్ అయ్యాడు. జేఈఈ అడ్వాన్స్ లో 51...

కష్టాల్లో ఇన్ఫోసిస్

చిత్రం
ఐటీ సెక్టార్లో టాప్ పొజిషన్లో కొనసాగుతున్న ఇన్ఫోసిస్ కంపెనీని ఆరోపణలు వెంటాడుతున్నాయి. షేర్‌హోల్డర్ల హక్కుల పరిరక్షణకు సంబంధించి ఇన్ఫోసిస్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా వేయనున్నట్లు అమెరికాకు చెందిన న్యాయసేవల సంస్థ ది షాల్‌ లా ఫర్మ్‌ వెల్లడించింది. మార్కెట్‌ను తప్పుదోవ పట్టించేలా ఇన్ఫోసిస్‌ తప్పుడు ప్రకటనలు చేసిందని షాల్‌ ఆరోపించింది. స్వల్పకాలిక లాభాలను పెంచి చూపించడం కోసం ఆదాయాల లెక్కింపునకు తప్పుడు విధానాలు పాటించిందని ఫిర్యాదులో పేర్కొంది. పెద్ద డీల్స్‌పై ప్రామాణికంగా జరపాల్సిన సమీక్షలు జరగకుండా సీఈవో సలిల్‌ పరేఖ్‌ తప్పించారని షాల్‌ ఆరోపించింది. పైగా ఈ అకౌంటింగ్‌ లొసుగులు, వివాదాస్పద డీల్స్‌ వివరాలను ఆడిటర్లు, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల దృష్టికి తీసుకెళ్ల నివ్వకుండా ఫైనాన్స్‌ విభాగంపై యాజమాన్యం ఒత్తిడి తెచ్చిందని తెలిపింది. ఈ అంశాలకు సంబంధించి కంపెనీ అందర్నీ తప్పుదోవ పట్టించేలా అవాస్తవమైన, తప్పుడు ప్రకటనలు చేసింది. ఈ వ్యవహారం గురించి మార్కెట్లకు నిజాలు తెలిసిన తర్వాత.. ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది అని షాల్‌ పేర్కొంది. 1,00,000 డాలర్ల పైగా నష్టపోయిన ఇన్వెస్టర్లు.. క్లాస...

అమ్మకానికి ఎయిరిండియా

చిత్రం
ఇప్పటికే ప్రభుత్వ కంపెనీలను అమ్మకానికి పెట్టిన మోదీ సర్కార్ తాజాగా ఎయిరిండియాపై కన్నేసింది. భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ లో ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో పడ్డది. దాదాపు 70 వేల మందికి పైగా ఉద్యోగులు స్వచ్చంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నష్టాల నెపం పేరుతో లాకవుట్ ప్రకటించడంతో లేదా మూసి వేయడమే లేదా ఇతర కంపెనీలకు దారాదత్తం చేయడమో చేస్తూ వస్తోంది. నోట్ల రద్దు తర్వాత భారత ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారింది. దేశీయ విమానయాన రంగంలో విశిష్ట సేవలు అందించిన ఎయిరిండియా సంస్థ ప్రమాదంలో చిక్కుకుంది. మోయలేని భారంగా మారడంతో ఇక అమ్మడానికి రెడీ అవుతోంది కమల ప్రభుత్వం. అందరూ ఊహించినట్లుగానే చావు కబురు చల్లగా చెప్పారు మంత్రివర్యలు. నష్టాలు, రుణాల భారంతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో 100 శాతం వాటాలు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు హర్‌దీప్‌ సింగ్‌ పురి స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్‌ కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని పునరుద్ధరించినట్లు, వ్యూహాత్మకంగా వాటాల విక్రయ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసినట్లు ఆయన లోక్‌సభకు రాత పూర...

వినోద రంగంలో విప్లవం

చిత్రం
ఇండియన్ వినోద రంగంలో ఇదో కీలక పరిణామం. ఒక రకంగా ఈ వార్త సెన్సేషన్ అనే చెప్పక తప్పదు. దేశ టీవీ ప్రసార పంపిణీ విభాగంలో అతిపెద్ద కంపెనీ ఆవిర్భావానికి అడుగులు పడుతున్నాయి. ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ, డిష్‌ టీవీ విలీనానికి ఇరు కంపెనీల మధ్య కొన్ని నెలలుగా జరుగుతున్న చర్చలు ముగింపు దశకు చేరాయి. ఇరు కంపెనీల ప్రమోటర్లతోపాటు, ప్రైవేటు ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్‌పింకస్‌ డీల్‌ విషయమై ఒక అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. ముందుగా డిష్‌ టీవీ తన డీటీహెచ్‌ వ్యాపారాన్ని వేరు చేస్తుంది. ఆ తర్వాత భారతీ టెలీ మీడియాతో విలీనం చేస్తుంది. ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీకి భారతీ టెలీమీడియా మాతృ సంస్థగా ఉంది. ఇరు కంపెనీలు కలిస్తే 4 కోట్ల మంది టీవీ సబ్ర్‌స్కయిబర్లతో ప్రపంచంలో అతిపెద్ద టీవీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా అవతరిస్తుంది. ఈ మేరకు విలీన పథకానికి సంబంధించి తుది అంశాలపై కసరత్తు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ, డిష్‌ టీవీలు కలవడం వల్ల డైరెక్ట్‌ టు హోమ్‌ టీవీ ప్రసారాల పంపిణీ మార్కెట్లో ఆధిపత్యానికి అవకాశం ఏర్పడుతుంది.  87 శాతం మార్కెట్‌ కేవలం రెండు సంస్థల చేతుల్లోనే ఉంటుంది. ఎయిర్‌టెల్‌ డిజిటల...

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

చిత్రం
దేశంలోనే అత్యుత్తమైన రాజకీయ వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఏ మేరకు సిటిజన్షిప్ సవరణ బిల్లుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇది మరింత వేడిని రాజేసింది. దేశమంతటా వైరల్ గా మారింది. ఇదే అంశంపై దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర్ వెలిబుచ్చిన అభిప్రాయాలు మరింత ప్రాధాన్యత చేసుకున్నాయి. పీకేకు మేధావిగా, వ్యూహకర్తగా ఎంతో పేరుంది. ఆయన ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వారు అధికారంలోకి రావడం ఖాయంగా మారింది. దీంతో ఇండియాలో విస్మరించలేని నాయకుడిగా, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన కోసం దేశాన్ని ప్రభివితం చేస్తున్న నాయకులూ, ఆయా పార్టీల నేతలు ప్రశాంత్ కిషోర్ ను ఎంచుకున్నారు. కాగా ఇటీవల ఆయన నితీష్ కుమార్ నేతృత్వంలో చేరారు. తాజాగా తమిళనాడులో రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న డీఎంకే అధినేత స్టాలిన్ కు పీకే సపోర్ట్ చేయనున్నట్టు సమాచారం. ఎన్ని ఆందోళనలు జరిగినా, అభ్యంతరాలు చోటు చేసుకున్నా పార్లమెంట్ లో పౌరసత్వ సవరణ బిల్లు నెగ్గింది. భారత రాష్ట్రపతి సంతకం కూడా చేశారు. ఈ బిల్...

దిశ బాధ్యత కమిషన్ దే

చిత్రం
దిశ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చాటాన్ పల్లి ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు చేపట్టేందుకు సుప్రీం కోర్టు  ముగ్గురు సభ్యులతో కూడిన ఎంక్వైరీ కమిషన్‌ ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్‌కార్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రేఖా బల్దౌతాలతో పాటు సీబీఐ మాజీ డైరెక్టర్‌ డీఆర్‌ కార్తికేయన్‌లతో కూడిన ఈ బృందం హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తుందని, ఆరు నెలల్లో నివేదిక సమర్పిస్తుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ ట్రైమెన్‌ కమిషన్‌లో ఒకరైన కార్తికేయన్‌ గతంలో సిటీలోని సీఆర్పీఎఫ్‌ యూనిట్‌ ఐజీగా పని చేశారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు దర్యాప్తు చేయడానికి ఏర్పాటైన సిట్‌కు నేతృత్వం వహించారు. అప్పట్లో ఈ దర్యాప్తునూ హైదరాబాద్‌ కేంద్రంగానే నిర్వహించారు. 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబదూర్‌లో మానవబాంబు దుశ్చర్యకు రాజీవ్‌ గాంధీ మృతి చెందారు. అప్పటి ఆ రాష్ట్ర గవర్నర్‌ భీష్మనారాయణ్‌ సింగ్‌ అభ్యర్థన మేరకు కేంద్రం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఆ నేపథ్యంలో ఏర్పాటైన సిట్‌కు నేతృత్వం వహించే బాధ్యతలను ఐపీఎస్‌ అధికారి డీఆర్‌ కార్...

అస్సాంలో ఆగ్రహజ్వాల

చిత్రం
పార్లమెంట్‌ సాక్షిగా ఆమోదించిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అస్సాంలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గువాహటిలో యుద్ధ వాతావరణం కనిపించింది. కర్ఫ్యూను సైతం లెక్క చేయకుండా రోడ్ల దిగ్బంధం, గృహ దహనాలు, దుకాణాల లూటీకి పాల్పడుతుండటంతో పోలీసులు లాఠీచార్జి, కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు చెబుతుండగా ముగ్గురు మరణించారని ఆందోళనకారులు అంటున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విద్యా, వాణిజ్య సంస్థలు పని చేయలేదు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ముందు జాగ్రత్తగా త్రిపుర, అసోంలకు రైలు సర్వీసులను రద్దు చేశారు. విమాన సర్వీసులను సైతం పలు ప్రాంతాలకు నిలిపి వేశారు. సైనికులు ఫ్లాగ్‌ మార్చ్‌ చేపట్టారు. ఇంటర్నెట్‌ సేవలపై మరో 48 గంటల పాటు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో అస్సాం వాసులకు ప్రధాని మోదీ ట్విట్టర్‌ ద్వారా పలు హామీలిచ్చారు. ఇంటర్నెట్‌పై నిషేధం ఉండగా ట్విట్టర్‌లో హామీల విషయం ప్రజలకెలా తెలుస్తుందని కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది. ఇదిలా ఉండగా రాష్ట్ర రాజధాని గువాహటిలోనే ఆందోళనల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆందోళనకారులు భవనాలు, దుకాణాలకు నిప్పు పెట్టడం, ధ్వంసం చే...

వాల్ మార్ట్ తో ఒప్పందం ఉపాధికి ఊతం

చిత్రం
ప్రపంచంలోనే వ్యాపార పరంగా టాప్ రేంజ్ లో ఉన్న అమెరికా దిగ్గజ కంపెనీ వాల్ మార్ట్ హైదరాబాద్ పై కన్నేసింది. ఆ మేరకు ఇక్కడ కూడా బిజినెస్ స్టార్ట్ చేసింది. తన వ్యాపారాన్ని విస్తరించే పనిలో పెద్దది. ఇందు కోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని అంది పుచ్చుకుంటోంది. తమ కాన్సెప్ట్ కు దగ్గరగా ఉండే కంపెనీలతో టై అప్ చేసుకునేందుకు ఉవ్విల్లూరుతోంది. అయితే గతంలో వాల్ మార్ట్ లో అమెరికాలో ఉద్యోగులు రోడ్డెక్కారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో పరిస్థితి అదుపులోకి వచ్చినా, ఈ కంపెనీ ఇండియాలో అత్యధికంగా కొనుగోలుదారులు ఉన్నారు. ఇక్కడైతే వ్యాపారం వర్కవుట్ అవుతుందనే ఆలోచనతో ఈ కామర్స్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇప్పటికే ఇదే రంగంలో కుదురుకున్న ఫ్లిప్ కార్ట్ కంపెనీని టేకోవర్ చేసుకుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇండస్ట్రియల్ పాలసీని తీసుకు వచ్చింది. ఏ దేశానికి చెందిన వారైనా లేదా ఇండియాకు చెందిన వారైనా సరే పెట్టుబడులు పెట్టేందుకు వస్తే వారికి అన్ని సౌకర్యాలు కల్పించేలా చేసింది. దీంతో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారాలు క్యూ క...

రోహిత్..బ్రాండ్ అంబాసిడర్

చిత్రం
అవకాశాలు ఎప్పుడు ఎవరిని తలుపు తడుతాయో చెప్పలేం. ఇలాంటి అరుదైన సన్నివేశాలు ఎక్కువగా ఆటల్లో, పాలిటిక్స్ ల్లో , సినిమా రంగాల్లో చోటు చేసుకుంటాయి. తాజాగా ఇండియన్ క్రికెట్ లో ఓపెనర్ గా రాణిస్తున్న రోహిత్ శర్మ ఇప్పుడు మోస్ట్ పాపులర్ క్రికెటర్. ప్రస్తుత జట్టులో కీలకమైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అంతే కాకుండా భారత క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేశాడు. అదేమిటంటే ఏకంగా 400 సిక్సర్లు కొట్టిన ఘనతను సాధించాడు. ఎలాంటి బంతి అయినా, లేదా ఎంతటి దిగ్గజ బౌలర్ అయినా సరే ఈ క్రికెటర్ ముందు తల వంచాల్సిందే. ఒక్కసారి మైదానంలో ఉన్నాడంటే చాలు సిక్సర్ల మోత మోగుతుంది. అలవోకగా బంతుల్ని స్టేడియంలో పడేలా కొట్టడంలో ఇతనికి ఇతడే సాటి. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు స్టార్లుగా మారి పోయారు. వీరి కోసం దిగ్గజ, కార్పొరేట్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఒక్కో ఆటగాడు కోట్లల్లో సంపాదిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్క దిద్దు కోవాలనే ఆలోచనతో తమ బ్రాండ్ , ఇమేజ్  పెంచుకునే పనిలో పడ్డారు. దీంతో వద్దంటే కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. తాజాగా ఈ క్రికెట్ స్టార్ కు అరుదైన ఆఫర్ లభించింది. రోహిత్‌ శర్మ ‘ల లీగా’ భారత ...

లోకాన్ని వీడిన గొల్లపూడి

చిత్రం
తెలుగు నాట విషాదం చోటు చేసుకుంది. రచయితగా, నటుడిగా అలరిస్తూ వచ్చిన గొల్లపూడి మారుతీరావు  ఇక సెలవంటూ వెళ్లి పోయారు. అనారోగ్య కారణాలతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.  సాహిత్యాభిలాషిగా, రచయితగా అన్ని రంగాలకు చెందిన అంశాలపై విశ్లేషకునిగా, విప్లవాత్మకమైన విమర్శకునిగా గొల్లపూడి పేరు తెచ్చుకున్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. చెన్నైలో తెలుగు సంఘాల కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న గొల్లపూడి.. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అనంతరం కోలుకుని ఇంటికి చేరారు. అయితే, మళ్లీ అస్వస్థతకు గురై ఇటీవల ఆస్పత్రిలో చేరారు. వృద్ధాప్య కారణాల వల్ల శరీరం చికిత్సకు సహకరించ కపోవడంతో తుది శ్వాస విడిచారు. గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్‌ 14న విజయ నగరంలో జన్మించారు. విద్యాభ్యాసాన్ని విశాఖపట్నంలోనే పూర్తి చేశారు. చెన్నైలో తన కుటుంబ సభ్యులతో ఉంటూనే నెలలో కొన్ని రోజులు విశాఖలో గడుపుతూ సాహితీ ప్రియులకు అందుబాటులో ఉండేవారు. ఎన్నో అంశాలపై వ్యాసాలు రాశారు. ఆయన మాటల్లో ఓ విరుపు ఉండేది. అది ఆయనను ప్రత్యేకమైన వ్యక్తిగా, నటుడిగా గుర్తుంచుకునే...

పెళ్లి కళ వచ్చేసిందే బాల

చిత్రం
ఇండియాలో క్రికెటర్లు, సినిమా స్టార్స్ కు ఎక్కడ లేనంత క్రేజ్. వీరికి ఉన్న ఫాలోయింగ్ పొలిటికల్ లీడర్లకు కూడా ఉండదు. తాజాగా తెలుగు, తమిళ్, హిందీ లో నటిస్తున్న ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఉన్నట్టుండి వైరల్ అయ్యారు. ఈ ముద్దుగుమ్మకు అప్పుడే పెళ్లి కళ వచ్చేసిందంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో టెహ్గా వాకబు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు కాజల్ చర్చనీయాంశంగా మారారు. ఉత్తరాదికి చెందిన ఈ బ్యూటీ దక్షిణాదిలో ముఖ్యంగా కోలీవుడ్, టాలీవుడ్‌లో ప్రముఖ కథానాయకిగా వెలుగొందుతోంది.  ప్రస్తుతం ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి అనే కంటే టాలీవుడ్‌లో ఒక్క అవకాశం కూడా లేదు. ఇక కోలీవుడ్‌లో శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌కు జంటగా నటిస్తున్న ఒకే ఒక్క చిత్రం ఇండియన్‌–2 చేతిలో ఉంది. ఈ చిత్రాన్ని కూడా పూర్తి చేసి కాజల్‌ సంసార జీవితంలోకి అడుగు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. నిజానికి కాజల్‌ అగర్వాల్‌కు చాలాకాలం నుంచే ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయాన్ని తనే ఆ మధ్య స్వయంగా చెప్పింది. ఇంకా చెప్పాలంటే కాజల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌కు పెళ్లి అయ్యి ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే అప్పట్లో కెరీర్‌ హైప్‌లో ఉండడంతో కాజ...

కలిసిన కత్తులు

చిత్రం
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని నిరూపించారు దిగ్గజ నేతలు. ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతుండగా, మరొకరు మాజీ సీఎం. ఈ అరుదైన సన్నివేశం కన్నడనాట చోటు చేసుకుంది. ఈ అరుదైన సంఘటనకు సాక్షీభూతంగా నిలిచింది మాత్రం బెంగళూర్ లోని ఓ ఆస్పత్రి. ప్రతి నిత్యం ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ ఉండే వీరిని చూసి జనం నివ్వెర పోవడం మామూలే. అయితే చాలా రాష్ట్రాల్లో లేదా దేశంలో ఆయా పార్టీలకు చెందిన నేతలు ఒక్కోసారి మాట్లాడుకోరు. కొందరైతే చూసీ చూడనట్లు వ్యవహరిస్తారు. కానీ కర్ణాటకలో మాత్రం రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. పాలిటిక్స్ కంటే స్నేహానికి ఇక్కడ ఎక్కువ విలువ ఇస్తారు. ఇది శుభ పరిణామం కూడా. రాజకీయాలు వేరు. ఫ్రెండ్ షిప్ వేరు. ప్రస్తుతం కర్ణాటక సీఎం గా బీజేపీకి చెందిన యెడ్యూరప్ప కొనసాగుతున్నారు. అంతకు ముందు ఇదే రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరపున సిద్దిరామయ్య ముఖ్యమంత్రిగా పని చేశారు. వీరిద్దరూ బయట ఎంతగా మాటలతో యుద్ధం చేసినా, సవాళ్లు విసురుకున్నా వ్యక్తిగతంగా మాత్రం గొప్ప స్నేహితులు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీలో అత్యంత విలువైన లీడర్ గా, ట్రబుల్ షూటర్ గా పేరొంది...

ఊపిరి పీల్చుకున్న ముద్దుగుమ్మ

చిత్రం
నటి శ్రియ శరన్ లండన్‌ పోలీసుల చేతిలో చిక్కి షాక్‌కు గురైంది. ఈ బ్యూటీ కథానాయకిగా బిజీగా నటిస్తూనే గత ఏడాది చాలా గోప్యంగా రష్యాకు చెందిన తన బ్యాయ్‌ ఫ్రెండ్‌ ఆండ్రి కోస్కిన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత నటనకు కొద్ది కాలం దూరంగా ఉంది. ఉన్నట్టుండి ప్రస్తుతం తమిళంలో సండైక్కారి అనే చిత్రంలో నటిస్తోంది. వివాహానంతరం ఈ బ్యూటీ నటిస్తున్న దక్షిణాది చిత్రం ఇదొక్కటేనన్నది గమనార్హం. నటుడు విమల్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బాస్‌ ప్రొడక్షన్స్‌ కార్పొరేషన్‌ అండ్‌ మెట్రో నెట్‌ మల్టీ మీడియా సంస్థల సమర్పణలో  జయకుమార్‌ నిర్మిస్తున్నారు. మాదేశ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటి శ్రియ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వాహకురాలుగా నటిస్తోంది. విమల్‌ ఆమె కంపెనీలో పనిచేసే ఇంజినీర్‌గా నటిస్తున్నాడు. కాగా సండైక్కారి చిత్ర షూటింగ్‌ ఇటీవల లండన్‌లో నిర్వహించారు. ఈ సందర్భాంగా డైరెక్టర్ సినిమా విశేషాలు తెలిపారు. లండన్‌లోని అతి పెద్ద విమానాశ్రయం స్టెన్‌ పోర్టులో విమల్, శ్రియ, సత్యన్‌ నటించిన సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. అప్పుడు అనుకోకుండా ఒక సంఘటన జరిగిందన్నారు. నటి శ్రియ తెలియ కుండా ...

ఏడాది పాలన..మెరుపులు..మరకలు

చిత్రం
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి కొలువు తీరిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం ముచ్చటగా ఏడాది పూర్తి చేసుకుంది. దేశానికే తమ పాలన ఆదర్శవంతమైన రీతిలో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతుండగా, మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చాడంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉండగా రైతు సంక్షేమం, సబ్బండ వర్గాల అభ్యున్నతే ప్రధాన ఎజెండాగా పెట్టుకుంది ఈ ప్రభుత్వం. గతంలో అనుసరించిన విధంగానే ఈసారి కూడా పాలనను కొత్త పుంతలు తొక్కించే ప్రయత్నం చేశారు. అయితే ఖాళీల భర్తీ విషయంలో మాత్రం సర్కార్ నోరు మెదపక పోవడంపై నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగులకు పీఆర్సీ అమలు ఆగి పోయింది. రైతుబంధు, ఆసరా పెన్షన్ల పెంపు హామీలను తొలి ఏడాదే అమల్లోకి తీసుకు వచ్చారు. పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాల రూపకల్పనపై దృష్టి పెట్టారు. మున్సిపల్, రెవెన్యూ శాఖల్లో అవినీతిని సమూలంగా నిర్మూలించేందుకు ఇప్పటికే కొత్త మున్సిపల్‌ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ముసాయిదా రెవెన్యూ చట్టాన్ని సిద్ధం చేశారు. సుపరిపాలన, అవినీతి నిర్మూలన, జాప్యాలను తుద ముట్టిం చాలనే లక్...

వేలానికి వేళాయెరా

చిత్రం
క్రికెట్ అభిమానులకు తీపి కబురు. అసలైన క్రికెట్ యుద్దానికి రంగం సిద్ధమవుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 వేలానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోట్లాది రూపాయల కానక వర్షం కురవబోతోంది. అంతే కాకా క్రికెటర్లపై కోట్లు కురిపించేందుకు ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నాయి. మ్యాక్స్‌వెల్‌, క్రిస్‌ మోరిస్‌ లతో పాటు పేసర్‌ కమిన్స్‌  ఈ వేలంలో హాట్‌ కేక్‌లు కావొచ్చని ఐపీఎల్‌ వర్గాలు భావిస్తున్నాయి. కోల్‌కతాలో అందుబాటులో ఉన్న 73 బెర్త్‌ల కోసం జరిగే ఆటగాళ్ల వేలంలో బ్యాట్స్‌మెన్‌ ఫించ్, క్రిస్‌ లిన్, జాసన్‌ రాయ్, మోర్గాన్, రాబిన్‌ ఉతప్పలను తొలి రౌండ్‌లోనే చేజిక్కించు కునేందుకు ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి. వేలానికి అందుబాటులో ఉన్న ఆటగాళ్ల తుది జాబితాను ఐపీఎల్‌ పాలక మండలి ఫ్రాంచైజీలకు అంద జేసింది. మొదటి దశలో 971 మంది వున్న జాబితాను 332 మందికి కుదించింది. ఈ తుది జాబితాలో 19 మంది భారత ఆటగాళ్లతో పాటు ఫ్రాంచైజీలు కోరిన 24 మంది క్రికెటర్లున్నారు. ఇందులో విండీస్‌ పేసర్‌ విలియమ్స్, ఆల్‌రౌండర్‌ క్రిస్టియన్, లెగ్‌ స్పిన్నర్‌ జంపా, బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్ ముషిఫికర్ ఉండగా సర్రే యువ బ్యాట్స్‌మన్‌ విల్‌ జాక్స్‌ కొ...

పాలనలో వైఫల్యం..ప్రజల పాలిట శాపం

చిత్రం
తెలంగాణాలో రెండోసారి కొలువు తీరిన కేసీఆర్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. ఆచరణకు నోచుకోని సంక్షేమ పథకాలతో జనాన్ని బురిడీ కొట్టించిన ఘనత సీఎంకు దక్కుతుందన్నారు. మాయమాటలతో మభ్య పుచ్చుతూ ఫామ్ హౌస్ కే పరిమితమైన చరిత్ర ఈ ఒక్క ముఖ్యమంత్రికే ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని అపులకుప్పగా మార్చారని, ప్రజలపై మోయలేని భారాన్ని మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలనా పరంగా చూస్తే మొదటి ఏడాది అంతా పూర్తిగా నిరాశ పరిచిందన్నారు. గాంధీ భవన్లో శ్రవణ్ మాట్లాడారు. మాటలు కోటలు దాటాయి చేతలు మాత్రం అడుగు కూడా దాటలేదని ధ్వజమెత్తారు. అన్ని ప్రభుత్వ వ్యవస్థలన్నీ పూర్తి నిర్వీర్యమై పోయాయని మండి పడ్డారు. ప్రథమ ఏడాది పాలన అంతా చెప్పలేనన్ని అబద్దాలు, మాయ మాటలతో గడిచి పోయిందన్నారు. వీటి గురించి చెప్పాలంటే ఓ ఏడాది పడుతుందన్నారు. ప్రజలను నిట్ట నిలువునా ముంచారని ఆరోపించారు శ్రవణ్. సాధారణ, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నా సీఎం స్పందించడం లేదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు నోరు మెదపడం లేదని, కనీసం స...