మనోడికి కోటిన్నర ఆఫర్

తెలంగాణకు చెందిన కుర్రాడు సాయి చరిత్ రెడ్డి తన సత్తా చాటాడు. ఏకంగా కోటిన్నర వార్షిక వేతనాన్ని పొందాడు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఈ కుర్రాడు. ఏదో తరగతి వరకు నల్లగొండ లో చదివిన ఈ కుర్రాడు జాక్ పాటు కొట్టడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. ఐఐటీ బాంబే లో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్న ఈ స్టూడెంట్ ఓ చరిత్రను క్రియేట్ చేశాడు. ఇంజనీరింగ్ పూర్తి కాకుండానే క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఐటీ దిగ్గజ కంపెనీ మైక్రో సాఫ్ట్ లో జాబ్ దక్కించుకున్నాడు. ఎంతో మంది పోటీలో ఉన్నా ఇతనొక్కడినే కంపెనీ ఎంపిక చేసుకుంది. అంటే ఇతడి సత్తా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మొత్తం 11 మందిని ఇంటర్వ్యూకు పిలిచారు. ఇందులో ముగ్గురిని మాత్రమే కంపెనీ ఎంపిక చేసింది. స్వస్థలం మాడ్గులపల్లి మండలం ధర్మపురం. ముందు నుంచి ఇంజనీరింగ్ అంటే ఇష్టం. అందుకే ప్రతి పరీక్షలో టాప్ లో ఉంటూ వచ్చాడు. అన్ని టెస్టుల్లో సెలెక్ట్ అవుతూ రాణించాడు ఈ కుర్రాడు. స్వంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం. నిరంతరం ఇన్ఫర్మేషన్ సేకరించడం, మెంటార్స్, లెక్చరర్స్ తో డిస్కస్ చేయడం చేస్తూ వచ్చాడు. మాక్ టెస్టులకు కూడా అటెండ్ అయ్యాడు. జేఈఈ అడ్వాన్స్ లో 51...