పోస్ట్‌లు

జనవరి 16, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

పాక్ కు మళ్ళీ భంగపాటు

చిత్రం
మరోసారి పాకిస్తాన్ కు భంగపాటు ఎదురైంది. భద్రతా మండలిలో కశ్మీర్‌ అంశాన్ని మరోసారి లేవనెత్తేందుకు పాక్ ప్రయత్నం చేసింది. చైనా సాయంతో వివాదాస్పద అంశాన్ని ప్రస్తావించేందుకు పాక్‌ ప్రయత్నించగా మండలిలో మిగిలిన సభ్యులెవరూ మద్దతివ్వక పోవడంతో ఏకాకిగా మిగిలి పోయింది. కశ్మీర్‌ అంశం ద్వైపాక్షిక మైనందున దానిపై చర్చించడం కుదరదని, మండలిలోని ఇతర సభ్యులు స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి రావాలంటే పాకిస్తాన్‌ తనకు కష్టమైన చర్యలు చేపట్టాల్సిందేనని భారత్‌ స్పష్టం చేసింది. పాక్‌ ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి వేదికగా పదే పదే చేసిన నిరాధార ఆరోపణలకు మద్దతు లభించలేదు అని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ వెల్లడించారు. పాక్‌ ప్రయత్నమంతా దృష్టి మరల్చేందుకేనని మిగిలిన సభ్యులు గుర్తించడం సంతోషకరం. సమస్యల పరిష్కారానికి ద్వైపాక్షిక పద్ధతులు ఉన్నాయని భద్రత సమితి సభ్యులు పాక్‌కు గుర్తు చేశారు అని ఆయన వివరించారు. దురుద్దేశ పూర్వక ఆరోపణలు చేయడం పాక్‌కు అలవాటేనని, సమితి సభ్యులు సూచించినట్టుగా సమస్యల పరిష్కారానికి కొన్ని కష్టమైన చర్యలు తీసుకోవడమే ఆ దేశానికి మేలని ఆయన అన్నారు. చైనా...

ధోని..మిథాలీలకు బిసిసిఐ షాక్

చిత్రం
సుదీర్ఘ కాలం పాటు దేశానికి తమ ఆట ద్వారా ఎన్నో మరుపురాని విజయాలను అందించిన మాజీ సారధులు మహేంద్ర సింగ్ ధోని, మిథాలీ రాజ్ లకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఘోరంగా అవమానించింది. వారి గెలుపుల్ని పరిగణలోకి తీసుకోలేదు. రాబోయే ఏడాది కాలానికి కొత్తగా వార్షిక కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. 27 మందితో రూపొందించిన ఈ జాబితాలో మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి చోటు దక్కలేదు. గత జులైలో ప్రపంచ కప్‌ సెమీ ఫైనల్‌ తర్వాత భారత్‌కు ప్రాతినిధ్యం వహించని ధోని భవిష్యత్తుపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. 2019 అక్టోబర్‌ నుంచి 2020 సెప్టెంబరు వరకు ఈ కాంట్రాక్ట్‌ వర్తిస్తుంది. టాప్‌ గ్రేడ్‌ అయిన ‘ఎ ప్లస్‌’లో ఎప్పటిలాగే ముగ్గురు క్రికెటర్లు కోహ్లి, రోహిత్, బుమ్రాలకే అవకాశం దక్కింది. టాపార్డర్‌ బ్యాట్స్‌మన్‌ లోకేశ్‌ రాహుల్‌ ఇటీవల నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. దీంతో అతడిని ‘బి’ గ్రేడ్‌ నుంచి ‘ఎ’ గ్రేడ్‌లోకి ప్రమోట్‌ చేశారు. టెస్టు ఓపెనర్‌గా తన స్థానం సుస్థిరం చేసుకున్న మయాంక్‌ అగర్వాల్, వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా కూడా ‘సి’నుంచి ‘బి’లోకి వచ్చారు. ముగ్గురు ఆటగాళ్లు అంబటి రాయుడు, దినేశ్‌ కార్తీక్, ఖలీల్...

టెలికం కంపెనీలకు షాక్

చిత్రం
భారత సర్వోన్నత న్యాయస్థానం టెలికాం కంపెనీలకు భారీ షాక్ ఇచ్చింది. స్థూల రాబడి సర్దుబాటుపై గతంలో ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాల్సిందిగా కోరుతూ టెలికం కంపెనీలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ఎస్ఏ నజీర్, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం రివ్యూ పిటిషన్లలో పసలేదని తేల్చి వాటిని కొట్టివేసింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై భారతీ ఎయిర్‌టెల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు పేర్కొంది. టెలికం కంపెనీలు ప్రభుత్వానికి1.47 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు కంపెనీలకు పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. లైసెన్స్ ఫీజు , స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీలుల కింద టెలికం కంపెనీలు దాదాపు 1.47 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉందని గతేడాది టెలికం మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపింది. టెలికం కంపెనీలు జూలై 2019 నాటికి లైసెన్స్ ఫీజు కింద 92,642 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఎస్‌యూసీ కింద అక్టోబరు 2019 నాటికి 55,054 కోట్లు చెల్లించాల్సి ఉంది. భారతీ ఎయ...

జెఫ్ కు గోయెల్ ఝలక్

చిత్రం
ఇండియా టూర్ లో ఉన్న అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‌కు ఊహించని ఘటనలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే అమెజాన్ తమ వ్యాపారాల్ని నాశనం చేస్తోందంటూ చిన్న, మధ్య స్థాయి వ్యాపారులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. ఇక భారత్‌లోని వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను కలుసుకోవాలని భావించిన బెజోస్‌కు ఇప్పటి వరకూ ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ లభించలేదు. దీనికి తోడు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తాజాగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. భరత చట్టాలను ఈ కామర్స్ సంస్థలు కచ్చితంగా పాటించాలంటూ స్పష్టం చేశారు. భారత్‌లో బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామన్న అమెజాన్ ప్రకటనపై కూడా స్పందించారు. పెట్టుబడిదారులు భారత్‌లోని చట్టాలకు లోబడి వ్యవహరించాలి. భారత్‌లో ఓ బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టబోతున్న అమెజాన్ ఈ దేశానికి ఉపకారం చేసినట్లు అవ్వదు. ఇక్కడ ప్రతిఏటా బిలియన్ డాలర్ల నష్టం వస్తోందని వారు భావించినప్పుడు దాన్ని పూడ్చుకోవడానికి నిధులు తేక తప్పదు కదా అని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో గోయల్-జెఫ్‌ బెజోస్‌ల సమావేశం జరగకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక వస్తువులపై అమెజాన్ ఆఫర్ చేసే భారీ డిస్కౌంట్లపై ఇప్పటికే అనేక దేశాల్లో అనుమ...

మాలిక్ పునరాగమనం

చిత్రం
అదృష్టం అంటే ఇదేనేమో. అది ఏ రూపంలో ఎప్పుడు పలకరిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. పాకిస్తాన్‌ మాజీ సారథి, ఆల్‌రౌండర్‌ షోయబ్‌ మాలిక్‌ అనూహ్యంగా పాకిస్తాన్‌ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో తలపడబోయే పాకిస్తాన్‌ జట్టును ఆ దేశ సెలక్లర్లు ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన పాక్‌ జట్టులో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ షోయబ్‌ మాలిక్‌, మహ్మద్‌ హఫీజ్‌లను సెలక్టర్లు ఎంపిక చేశారు. అంతే కాకుండా అన్‌క్యాప్డ్‌ ప్లేయర్స్‌ హారిస్‌ రౌఫ్‌, అహ్సన్‌ అలీలను కూడా ఎంపిక చేశారు. అయితే సీనియర్‌ బౌలర్లు మహ్మద్‌ అమిర్‌, వాహబ్‌ రియాజ్‌లను జట్టు నుంచి తప్పించడం గమనార్హం. గత కొంత కాలంగా ఫామ్‌లో లేక తంటాలు పడుతున్న మాలిక్‌ పాక్‌ జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ క్రమంలోనే వన్డేలకు గుడ్‌బై చెప్పిన మాలిక్‌ టీ20ల్లో కొనసాగుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌ క్రికెట్‌ను గాడిన పెట్టేందుకు చర్యలు ప్రారంభించామని, దీనిలో భాగంగానే జట్టులో మార్పులు చేపట్టామని ఆ దేశ ప్రధాన కోచ్‌, చీఫ్‌ సెలక్టర్‌ మిస్బావుల్‌ హక్‌ పేర్కొన్నాడు. తామి ఆడిన చివరి 9 టీ20 సిరీస్‌ల్లో 8 ఓడి పోయామని గుర...

అబ్బా టిక్ టాక్ దెబ్బ

చిత్రం
సోషల్ మీడియాలో టాప్ పొజిషన్ లో గత కొంత కాలంగా టాప్ పొజిషన్ లో కొనసాగుతూ వస్తున్న ముఖ పుస్తకం కు షాక్ ఇచ్చింది చైనాకు చెందిన దిగ్గజ కంపెనీ టిక్ టాక్. ఇప్పటికే కోట్లాది మందిని కలిగిన పేస్ బుక్ ను టిక్ టాక్ నెట్టేసింది. సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌ ఎంతో పాపులర్‌ అయిందో అందరికి తెలిసిందే. తాజాగా ఇది మరోసారి రుజువైంది. గతేడాది ప్రపంచ వ్యాప్తంగా 700 మిలియన్లకు పైగా టిక్‌ టాక్‌ యాప్‌ డౌన్‌లోడ్‌లు జరిగాయి. ఈ విషయాన్ని ప్రముఖ మార్కెటింగ్ సంస్థ సెన్సార్‌ టవర్‌   వెల్లడించింది. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ను వెనక్కి నెట్టి వేసిందని పేర్కొంది. 2018లో డౌల్‌లోడ్స్‌ పరంగా నాలుగో స్థానంలో ఉన్న టిక్‌టాక్‌.. రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఫేస్‌బుక్‌ మేసెంజర్‌, ఫేస్‌బుక్‌ యాప్‌లను అధిగమించి రెండో స్థానంలో నిలిచిందని తెలిపింది. టిక్‌టాక్‌ యాప్‌ రెండో స్థానంలో నిలవడానికి ఇండియానే ప్రధాన కారణమని తెలిపింది. ఎందుకంటే ఆ యాప్‌ను తొలిసారి డౌన్‌లోడ్‌ చేసుకున్నవారిలో 45 శాతం భారత్‌ నుంచే ఉన్నట్టు పేర్కొంది. అయితే డౌన్‌లోడ్స్‌ పరంగా వాట్సాప్‌ యాప్‌ను టిక్‌టాక్‌ క్రాస్‌ చేయలేక పోయింది. దా...