పోస్ట్‌లు

జూన్ 14, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

కొలువు చేస్తూ చ‌దువు - హెచ్‌సీఎల్ శ్రీ‌కారం

చిత్రం
ఒక్కో ఐడియా ఒక్కో సంస్థ‌ను గ‌ట్టెక్కించేలా చేస్తే..ఇంకో ఐడియా ఇత‌ర కంపెనీల‌ను విస్తుపోయేలా చేస్తుంది. అలాంటి అద్భుత‌మైన ఆలోచ‌న‌కు కార్య‌రూపం క‌ల్పిస్తోంది ఐటీ దిగ్గ‌జ కంపెనీగా పేరొందిన హెచ్‌సీఎల్ ఐటీ కంపెనీ యాజ‌మాన్యం. ఇంట‌ర్మీడియ‌ట్ పూర్త‌యిన స్టూడెంట్స్ కోసం ప్ర‌త్యేకంగా ప‌రీక్ష నిర్వ‌హించి, ఇంట‌ర్వ్యూ ద్వారా శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న ఎంపిక చేసుకుంటుంది. ఆ త‌ర్వాత వారే త‌మ కంపెనీ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టు శిక్ష‌ణ ఇప్పిస్తుంది. ఫీజు 2 ల‌క్ష‌ల రూపాయ‌లు. ఎంపికైన వారికి బ్యాంక్ లోన్ స‌దుపాయం కూడా ఉంది. ఎంపికైన వారికి నెల నెలా స్ట‌యిఫండ్ కింద 10, 000 వేల రూపాయ‌లు ఇస్తుంది. హైద‌రాబాద్‌లోని హెచ్‌సిఎల్ టెక్నాల‌జీస్ టెక్ బీ అని ఈ ప్రోగ్రాంకు పేరు పెట్టింది. రెండేళ్ల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లోని త‌మ కంపెనీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంట‌ర్‌లో వీరికి బోధ‌న‌, ప్రాక్టిక‌ల్స్ ఉంటాయి. భోజ‌న వ‌స‌తి సౌక‌ర్యం కంపెనీ చూసుకుంటుంది. శిక్ష‌ణ అనంత‌రం త‌మ కంపెనీలోనే వీరికి వివిధ విభాగాల‌లో, వారు శిక్ష‌ణ లో చూపించిన ప్ర‌తిభ‌, పాట‌వాల ఆధారంగా దేశంలో కానీ ఇత‌ర దేశాల‌ల...

అమెజాన్ ఫ్లెక్స్ - చేసుకున్నొళ్ల‌కు చేసుకున్నంత

చిత్రం
అమెరికాకు చెందిన అమెజాన్ వినూత్న ఆలోచ‌న‌కు తెర లేపింది. లాజిస్టిక్ రంగంలో ఇప్ప‌టికే ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌లో ఉన్న ఈ కంపెనీ..త‌న క‌ష్ట‌మ‌ర్ల‌కు మ‌రింత మెరుగైన సేవ‌లు అందించాల‌ని సంక‌ల్పించింది. ఇందులో భాగంగా పార్శిళ్ల‌ను డోర్ డెలివ‌రీ చేసేందుకు శ్రీ‌కారం చుట్టింది. ఇందు కోసం స్టూడెంట్స్, గృహిణులు, రిటైర్డ్ ఉద్యోగుల‌కు పార్ట్ టైం జాబ్స్ ఇవ్వ‌నుంది. వీరిని ఎంపిక చేయ‌డం ద్వారా ర‌ద్దీ స‌మ‌యాల్లో మ‌రింత వేగంగా డెలివ‌రీలు చేయ‌డంతో పాటు ఉబెర్ మాదిరి పార్ట్ టైం కొలువులు ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని కంపెనీ భావిస్తోంది. ఈ కామ‌ర్స్ వ్యాపారంలో స్పీడ్ డెలివ‌రీ ముఖ్యం. దీనిపై అమెజాన్ స్పాట్ డిసిష‌న్ తీసుకుంది. వేగంగా పార్శిళ్ల‌ను అందించేందుకు ఈ కంపెనీ గ‌త కొన్నేళ్లుగా వ‌న్ - డే - డెలివ‌రీ - టూ -డే డెలివ‌రీ, నెక్ట్స్ డెలివ‌రీ వంటి విధానాల‌ను అమ‌లు చేస్తోంది. ప్రైమ్ నౌ ఆప్ష‌న్‌ను ప్ర‌వేశ పెట్టింది కొత్త క‌స్ట‌మ‌ర్ల కోసం. ఇందులో స‌భ్యులైతే క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ కూడా ఇస్తోంది అమెజాన్. దీని కోసం ప్ర‌త్యేకంగా ఆప్ త‌యారు చేసింది. దీనిని యూజ్ చేసుకుని కిరాణా సామాగ్రి ఆర్డ‌ర్ చేస్తే రెండు గం...

రేపే అస‌లైన పోరు - దాయాదుల మ‌ధ్య వార్

చిత్రం
తుపాకులు లేవు..తూటాలు లేవు..మార‌ణాయుధాలు లేవు..మిస్సైల్స్ అంత‌క‌న్నా లేవు..రాకెట్ లాంఛ‌ర్లు లేవు. కానీ రేపు యుద్ధం జ‌ర‌గ‌బోతోంది. అది ఆషామాషీ వార్ కాదు. దాయాదుల మ‌ధ్య రియ‌ల్ యుద్ధానికి వేదిక కాబోతోంది ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్. అన్ని జ‌ట్లు ఆడ‌డం ఒక ఎత్తైతే..పాకిస్తాన్, ఇండియా క్రికెట్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌డం మ‌రో ఎత్తు. ఎక్క‌డ‌లేని టెన్ష‌న్ వాతావ‌ర‌ణం, న‌రాలు తెగిపోయేంత ఉత్కంఠ‌..కోట్లాది అభిమానుల ఆరాటాలు, పోరాటాలు, ప్ర‌ద‌ర్శ‌న‌లు , లెక్క‌లేనంత బెట్టింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది. ఈ రెండు జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయంటే..చాలు కోట్లాది మంది టీవీల‌కు అతుక్కు పోతారు. ల‌క్ష‌లాది మంది త‌మ కొలువుల‌కు సెల‌వు పెడ‌తారు.  అందుకే ఆయా కంపెనీలు, హోట‌ళ్లు, రెస్టారెంట్లు, బార్లు, ప‌బ్‌లు..ఇత‌ర ప్రాంతాల్లో భారీ ఎత్తున మ్యాచ్ చూసేందుకు వీలు క‌ల్పించారు. అక్క‌డే టీవీల‌ను ఏర్పాటు చేసి ...చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యాచ్‌ల‌ను ప్ర‌సారం చేస్తున్న స్టార్ టీవీ గ్రూప్‌న‌కు ఈ ఒక్క మ్యాచ్ ద్వారా కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల ప‌రంగా చూస్తే 100 కోట్ల‌కు పైగా రెవిన్యూ రానుందని మార్కెట్ వ‌ర్గాల అంచ‌నా. మాంచెస్ట‌...

స్టాలిన్ ఆగ్ర‌హం ..దిగొచ్చిన రైల్వే యంత్రాంగం

చిత్రం
ఏదైనా సాధించాల‌న్నా..త‌మ దారికి తెచ్చు కోవాల‌న్నా..అనుకున్న ప‌ని కావాలంటే ..ప‌క్క‌నే వున్న త‌మిళుల‌ను చూసి నేర్చుకోవాలి. ఈ దేశంలో వారికి వున్నంత భాషాభిమానం..ప్రాంతీయ అభిమానం ఇంకెవ్వ‌రికి లేదంటే అతిశ‌యోక్తి కాదేమో. కేంద్రంలో థంబింగ్ మెజారిటీతో కొలువుతీరిన మోదీ, షా స‌ర్కార్ త‌మ‌కు తోచిన రీతిలో నిర్ణ‌యాలు తీసుకుంటూ వ‌స్తున్నారు. బిజిపేయేత‌ర రాష్ట్రాల‌లో పాగా వేసేందుకు పావులు క‌దుపుతున్నారు. అందులో భాగంగా ఆయా ప్రాంతాల‌కు సంబంధించిన క‌ల్చ‌ర్, సివిలైజేష‌న్ మీద దెబ్బ కొట్టాల‌ని చూస్తున్నారు. తాజాగా హిందీ భాష‌ను రెండో భాష‌గా త‌ప్ప‌నిస‌రిగా చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది కేంద్ర ప్ర‌భుత్వం. దీనిపై ప‌లు రాష్ట్రాలు భ‌గ్గుమ‌న్నాయి. ముఖ్యంగా త‌మిళ‌నాడుకు చెందిన స్టాలిన్ నిప్పులు చెరిగారు.  మీ పెత్త‌నం మామీద కాదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో కేంద్ర స‌ర్కార్ దిగొచ్చింది. రాష్ట్రాల‌ను సంప్ర‌దించాకే అమ‌లు చేస్తామ‌ని , ఆదేశాలు వెన‌క్కి తీసుకుంటున్నామ‌ని విద్యా శాఖ మంత్రి వివ‌ర‌ణ ఇచ్చు కోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక మ‌రో వివాదానికి తెర లేపింది ..రైల్వే శాఖ‌. త‌మిళుల‌కు భాషాభిమానం...

చెల‌రేగిన ఇంగ్లండ్ ..చేతులెత్తేసిన వెస్టిండీస్

చిత్రం
ప్ర‌పంచ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా వెస్టిండీస్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని న‌మ‌దు చేసుకుంది. సౌథాంప్ట‌న్‌లో జ‌రిగిన మ్యాచ్‌కు భారీ ఎత్తున అభిమానులు హాజ‌ర‌య్యారు. 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 94 బంతులు ఆడి 100 ప‌రుగులు చేసి చివ‌రి వ‌ర‌కు నాటౌట్‌గా నిలిచిన జో..రూట్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఇందులో 11 ఫోర్లున్నాయి. విండీస్ నిర్దేశించిన 219 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేవ‌లం 33.1 ఓవ‌ర్ల‌లో కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి సునాయ‌సంగా విజ‌యం సాధించింది. రూట్‌తో పాటు ఓపెనర్లు ఫ్లో 45 , క్రిస్ వోక్స్ 40 ప‌రుగులు చేసి గెలుపులో కీల‌క పాత్ర పోషించారు. రూట్ కు స‌పోర్ట్‌గా నిలిచారు.  అంత‌కు ముందు వెస్టిండీస్ జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ చేసింది. ఇంగ్లండ్ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో త‌క్కువ స్కోరు న‌మోదు చేసింది. ఆర్చ‌ర్ 30 ప‌రుగులిచ్చి 3 వికెట్లు తీయ‌గా వుడ్ 18 ప‌రుగులు ఇచ్చి 3 కీల‌క వికెట్లు తీశారు. వీరి ధాటికి విండీస్ బ్యాట్స్ మెన్స్ ఎక్కువ సేపు క్రీజులో నిలువ‌లేక పోయారు. 44.4 ఓవ‌ర్ల‌లోనే 212 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యారు. పూర‌న్ 78 బంతులు ఆడ...

రిల‌య‌న్స్ ..రిల‌య‌బుల్ కంపెనీ..ఫోర్బ్స్ గ్లోబ‌ల్ లిస్టులో చోటు

చిత్రం
భార‌తీయ టెలికాం రంగంలో ప్ర‌థ‌మ స్థానంలో నిలిచి..ప్ర‌పంచాన్ని విస్మ‌య ప‌రిచిన కంపెనీగా ముఖేష్ అంబానే నేతృత్వంలోని రిల‌య‌న్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఫోర్బ్స్ ప్ర‌క‌టించిన గ్లోబ‌ల్ కంపెనీల జాబితాలో 71వ ర్యాంకును సాధించింది. త‌న‌కు ఇక ఎదురే లేదంటూ దూసుకెళుతోంది. ఇండియాలో టెలికాం సేవ‌లు అనే స‌రిక‌ల్లా భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ కంపెనీ ఠ‌క్కున గుర్తుకు వ‌స్తుంది. దివంగ‌త ప్ర‌ధాన‌మంత్రి రాజీవ్ గాంధీ హ‌యాంలో టెలికాం రంగం కొత్త పుంత‌లు తొక్కింది. సాంకేతిక ప‌రిజ్ఞానం భ‌విష్య‌త్‌ను శాసిస్తుంద‌ని ఆయ‌న ఏనాడో గుర్తించారు. అందుక‌నే టెలికాం వ్య‌వ‌స్థ‌కు జీవం పోశేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఆయ‌న పీఎంగా ఉన్న‌ప్పుడే శ్యాం పిట్రోడాను ఇక్క‌డికి పిలిపించారు. పిట్రోడా అంటేనే టెలికాం. ఆ రంగాన్ని ప‌రుగులు పెట్టించారు.  బీఎస్ఎన్ఎల్ ఒక బ్రాండ్‌గా ఎదిగింది. ల‌క్ష‌లాది మందికి నీడ‌నిచ్చింది. కోట్లాది మందిని క‌స్ట‌మ‌ర్స్‌గా మార్చుకుంది. కానీ ఇదే స‌మ‌యంలో ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న ప‌రిణామాలు ఒక్క‌సారిగా కుదుపున‌కు గురి చేశాయి. ప్రైవేట్ టెలికాం ఆప‌రేట‌ర్లు వెల్లువ‌లా ప్ర‌పంచాన్ని చుట్టు ముట్టారు. దీనిని ఆస‌ర...

ప్రియాంక‌ను వ‌రించిన అంత‌ర్జాతీయ పుర‌స్కారం

చిత్రం
బాలీవుడ్ బ్యూటీగా ..హాలీవుడ్ స్థాయిలో అద్భుత‌మైన న‌టిగా పేరొందిన ప్రియాంక చోప్రాకు అరుదైన పుర‌స్కారం ల‌భించింది. ఇప్ప‌టికే ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డుల‌ను ఈ న‌టిమ‌ణి పొందింది. తాజాగా మ‌రో గౌర‌వాన్ని ద‌క్కించుకుంది. ఐక్య‌రాజ్య స‌మితి ప్ర‌తి ఏటా అందించే యూనిసెఫ్ అమెరికా డానీ కేయి మాన‌వ‌తా పుర‌స్కారానికి ఎంపికైంది. బాల‌ల విద్య‌, సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నందుకు గాను ప్రియాంక చోప్రాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ ఏడాది ఆఖ‌రులో ఈ పుర‌స్కారాన్ని ప్ర‌దానం చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని స్పెష‌ల్‌గా ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకుని ఆనందం వ్య‌క్తం చేసింది. ఆమె ప్ర‌స్తుతం ది స్కై ఈజ్ పింక్ సినిమాలో న‌టిస్తోంది. సోనాలి బోస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు ఈ మూవీకి. అమెరికాకు చెందిన న‌టుడితో ప్రేమ‌లో ప‌డింది. అక్క‌డే ఎక్కువ‌గా ఉంటోంది ఈ తార‌. 1982 జూలై 18న జ‌న్మించిన ఈ సుంద‌రీమ‌ణి..న‌టిగా, గాయ‌కురాలిగా, ఫిల్మ్ ప్రొడ్యూస‌ర్‌గా వున్నారు. 2000 సంవ‌త్స‌రంలో నిర్వ‌హించిన అంత‌ర్జాతీయ అందాల పోటీలో మిస్ వ‌ర‌ల్డ్ గా ఎంపిక‌య్యారు. బాలీవుడ్‌లో ఎక్కువ పారితోష‌కం తీసుకునే న‌టీమ‌ణుల...

జుంబోటెయిల్ స్టార్ట‌ప్‌లో బిగ్ ఇన్వెస్ట్

చిత్రం
ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ రంగంలో ఎక్కువ‌గా అవుట్ సోర్సింగ్ ద్వారా ప‌నులు చేపుడుతున్న కంపెనీల‌న్నీ బెంగ‌ళూరు సిటీలోనే కొలువు తీరాయి. తాజాగా హైద‌రాబాద్, ఢిల్లీ, ముంబ‌యి, చెన్నై న‌గ‌రాలు చేరినా..బెంగ‌ళూరు మాత్రం త‌న హ‌వాను ఇంకా కొన‌సాగిస్తూనే వున్న‌ది. విదేశాల ఐటీ దిగ్గ‌జ కంపెనీల‌న్నీ ఇక్క‌డి సంస్థ‌ల‌తో ఎంఓయులు చేసుకుని ప‌నులు అప్ప‌గిస్తున్నాయి. లెక్క‌లేన‌న్ని ప్రాజెక్టుల‌తో ఐటీ క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ఇక్క‌డి ప్ర‌భుత్వం కూడా ఐటీ రంగానికి మ‌రిన్ని వెసలుబాట్లు క‌ల్పిస్తున్నాయి. దీంతో ఔత్సాహికులు, ఐడియాలు క‌లిగిన వాళ్లు, యువ‌తీ యువ‌కులు, ఏదో సాధించి తీరాల‌న్న ఉత్సాహవంతులు , అంకురాల‌ను ప్రారంభించే వారితో పాటు ఆంట్ర‌ప్రెన్యూర్స్‌కు హై లేవ‌ల్‌లో ప్ర‌యారిటీ ద‌క్కుతోంది.  దీంతో కంపెనీల‌న్నీ గంప గుత్త‌గా కాకుండా ఒక్కో కంపెనీ ఒక్కో స్ట్రాట‌జీతో ముందుకెళుతోంది. బిపిఓ, కేపీఓ రంగాల‌లో ఎక్కువ‌గా ఇక్క‌డ ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తుండ‌గా తాజాగా టెక్నాల‌జీలో వ‌చ్చిన మార్పుల‌కు అనుగుణంగా కొలువులు ద‌క్కుతున్నాయి. సైబ‌ర్ సెక్యూరిటీ, ఆటోమేష‌న్, మెషిన్ ల‌ర్నింగ్, ఎథిక‌ల్ హ్యాకింగ్, రోబోటిక్స్, సోలార్ టె...

విమాన ప్ర‌యాణికుల‌కు పండగే పండుగ

చిత్రం
ప్రైవేట్ విమాన‌యాన సంస్థ‌ల మ‌ధ్య పోటీ విహంగ ప్ర‌యాణికుల‌కు అద్భుత‌మైన అనుభూతిని మిగుల్చుతోంది. ఒక దానిని మించి మ‌రో సంస్థ ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తూ ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. నిన్నటి వ‌ర‌కు ఎయిర్ ఏషియా, ఎయిరిండియా, ట్రూజెట్, స్పైస్ జెట్, త‌దిత‌ర కంపెనీల‌న్నీ అతి త‌క్కువ ధ‌ర‌కే ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లే వారికి అనువుగా వుండేలా , అందుబాటు ధ‌ర‌ల్లో ప్ర‌క‌టించాయి. తాజాగా ఇండిగో టికెట్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించింది. ఎక్క‌డి నుంచి ఎక్క‌డికైనా వెళ్లేందుకు ఆయా రూట్ల‌లో టికెట్ల ప్రైసెస్ డిక్లేర్ చేసింది ఈ సంస్థ‌. ఆన్ లైన్ ద్వారా టికెట్ల‌ను విక్ర‌యిస్తున్న‌ట్లు ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌ను ఉప‌యోగించు కోవాల‌ని ఇండిగో యాజ‌మాన్యం కోరింది. త‌న అధికారిక వెబ్ సైట్‌లో ఇవి ల‌భ్య‌మ‌వుతాయ‌ని తెలిపింది. ఈనెల 26 నుండి సెప్టెంబ‌ర్ 28 తేదీ లోపు బుకింగ్ చేసుకున్న తేదీల్లో ప్ర‌యాణించ‌వ‌చ్చ‌ని సంస్థ నిర్వాహ‌కులు వెల్ల‌డించారు. ప్రారంభ టికెట్ ధ‌ర 999 రూపాయ‌ల నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని తెలిపింది. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రేట్ నిర్ణ‌యించారు. వివిధ ప్యాకేజీలు, స్కీంలు ప్ర‌వేశ పెట్టారు. ఒక మిలియ‌న్ సీట్ల‌ను ఈ సంద‌ర్భ...