పోస్ట్‌లు

జూన్ 18, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ధ‌న ప్ర‌వాహం - దొర‌బాబుల‌దే రాజ్యం - కార్పొరేట్ కంపెనీల‌దే ఆధిప‌త్యం

చిత్రం
ఇండియాలో ఎన్నిక‌లంటే ఆషామాషీ వ్య‌వ‌హారం కానే కాదు. మీడియా, మ‌నీ , పీపుల్స్ మేనేజ్‌మెంట్ ఆప‌రేటింగ్ సిస్టం అనే ప్ర‌క్రియ కొత్త‌గా మొద‌లైంది. ఒక్కో లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో స‌గ‌టున 75 కోట్ల నుండి 100 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వచ్చాయి. కొలువుతీరిన ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ‌ను తాము దైవాంశ సంభూతులుగా ఊహించుకుంటున్నారు. రెడ్ లైట్, బుగ్గ కారు, సెక్యూరిటీ, లెక్క‌నేంత నిధులు, ఆశించిన దానికంటే ఎక్కువ వ‌స‌తులు ఇంకేం దోచుకున్నోడికి దోచుకున్నంత‌. ఇదీ భార‌తీయ ప్ర‌జాస్వామ్య దేశం. ఇక్క‌డ ఎల‌క్ష‌న్స్ అంటేనే మ‌నీతో మేట‌ర్ సెటిల్ మెంట్ చేసుకోవ‌డం. గెలుపొందాక తిరిగి పిండు కోవ‌డం. ఇది మామూలై పోయింది. టికెట్ తెచ్చుకోవ‌డం ద‌గ్గ‌రి నుండి ఎన్నికలై పోయేంత వ‌ర‌కు మ‌నీతోనో ప‌ని. గ‌తంలో అభ్య‌ర్థులు ఇంటి ఇంటికి తిరిగి ప్ర‌చారం చేసేవారు. ఇప్పుడు ఆ సీన్ క‌నిపించడం లేదు. పోస్ట‌ర్లు, క్యాంపెయిన్లు, మీడియా మేనేజ్‌మెంట్, ప్రెస్ మీట్స్, డిజిట‌ల్, సోష‌ల్ మీడియాను వాడుకోవ‌డం ..సాధ్య‌మైనంత మేర‌కు ప‌బ్లిసిటీ వ‌చ్చేలా చూసుకోవ‌డం. గెలిచాక డోంట్ కేర్ అంటూ వెళ్లిపోవ‌డం. మ‌ళ్లీ క‌నిపిస్తే ఒట్టు..ఐదేళ్ల‌క...

దుమ్ము రేపిన ఇంగ్లండ్ ..దంచికొట్టిన మోర్గాన్

చిత్రం
ప్ర‌పంచ క్రికెట్ టోర్న‌మెంట్‌లో ఇంగ్లండ్ దూకుడుకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. మైదానంలోకి వ‌చ్చారంటే చాలు క్రికెట‌ర్లు ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల భ‌ర‌తం ప‌డుతున్నారు. ఎలాంటి బంతినైనా అవ‌లీల‌గా బౌండ‌రీ లైన్‌ను దాటించేస్తున్నారు. ఇంకే ముంది ప‌సికూన‌లైన ఆఫ్గ‌నిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు విధ్వంస‌క‌ర‌మైన ఇన్నింగ్స్ ఆడింది. భారీ స్కోర్ల‌ను సాధిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త క‌లిగిన టీంగా ఈ జ‌ట్టు పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ..ఈ టోర్నీలో బంగ్లా విండీస్‌కు ముచ్చెమ‌ట‌లు పోయిస్తే..తాజాగా ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ ఉతుకుడు స్టార్ట్ చేశాడు. అంద‌రూ సిక్స‌ర్లు కొట్టేందుకు నానా తంటాలు ప‌డుతుంటే మ‌నోడు బంతుల్ని పెవీలియ‌న్‌ను దాటించేస్తున్నాడు. ఇదే ఇత‌గాడి స్పెషాలిటీ.  ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 17 సిక్స‌ర్ల మోత మోగించాడు మోర్గాన్. ఏకంగా ప్ర‌పంచ రికార్డు న‌మోదు చేశాడు. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ర‌షీద్ ఖాన్ బౌలింగ్‌ను ఉతికేశాడు. క‌ల‌లో సైతం క‌ల‌వ‌రించేలా చేశాడు. ఇక బౌలింగ్ చేయాలంటేనే భ‌య‌ప‌డేలా దంచి కొట్టాడు. కేవ‌లం 71 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 148 ప‌రుగు...

జాడ‌లేని వాన‌లు ..ఆందోళ‌న‌లో రైతులు ..నీటి కోసం యుద్ధాలు

చిత్రం
మృగ‌శిర కార్తె పోయినా ఇప్ప‌టి దాకా చినుక‌మ్మ జాడ‌లేదు. భూమినే న‌మ్ముకుని..మ‌ట్టితో నిత్యం స‌హ‌వాసం చేస్తూ..వ్య‌వ‌సాయ‌మే జీవ‌నాధారంగా బ‌తుకుతున్న తెలంగాణ‌లోని రైతుల ప‌రిస్థితి రెంటికి చెడ్డ రేవ‌డి అన్న చందంగా త‌యారైంది. ఆయా జాతీయ ర‌హ‌దారుల చుట్టూ కార్పొరేట్ కంపెనీల బోర్డులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ప్లాట్లు, ఫ్లాట్స్‌, విల్లాలు నిర్మిస్తూ సాగుకు బొంద పెడుతున్న‌రు. వ్య‌వసాయం దండుగ కాద‌ని పండుగ అంటూ ప్ర‌క‌టించిన స‌ర్కార్ ..నీళ్లు అందించేందుకు మిష‌న్ కాక‌తీయ‌ను ప్ర‌వేశ పెట్టింది. ఇప్ప‌టికే చెరువులు, కుంట‌ల‌ను పున‌రుద్ద‌రించింది.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జ‌లాశయాల‌న్నీ నీటితో క‌ళ‌క‌ళ‌లాడాల్సి ఉండ‌గా అన్నీ బోసిపోయి క‌నిపిస్తున్న‌వి. ఇదిగో వ‌స్తుంది ..అదిగో వ‌స్తుంది వాన అంటూ ఆశ‌లు రేపుతున్న వాతావ‌ర‌ణ శాఖ అధికారుల మాట‌లు నీటి మూట‌ల‌య్యాయి. గ‌త ఏడాది క‌నీసం ఓ నెల పాటు వ‌ర్షాలు కురిసాయి. ఇపుడు ఆ వానలు కూడా కురిసిన పాపాన పోలేదు. కేర‌ళ రాష్ట్రాన్ని రుతుప‌వ‌నాలు ఇంకా తాక‌నేలేదు. అక్క‌డి నుంచి మ‌న దాకా రావాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. చెన్నై, క‌ర్ణాట‌క‌, ...

మోస్ట్ బిలీవ‌బుల్ బ్రాండ్ అమెజాన్

చిత్రం
ప్ర‌పంచ వ్యాప్తంగా ఈకామ‌ర్స్ బిజినెస్‌లో అమెరికా దిగ్గ‌జ కంపెనీ అమెజాన్ మోస్ట్ డిజైర‌బుల్, న‌మ్మ‌క‌మైన బ్రాండ్‌గా భార‌త్‌లో ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. ఆర్ీబీఆర్ సంస్థ ప్ర‌త్యేకంగా స‌ర్వే నిర్వ‌హించింది. రెండు, మూడు స్థానాల్లో మైక్రోసాఫ్ట్ ఇండియా, సోని ఇండియా కంపెనీలు నిలిచాయ‌ని వెల్ల‌డించింది. రాండ్ స్టాడ్ ఎంప్లాయ‌ర్ బ్రాండ్ రీసెర్చ్ 2019లో ఫైనాన్షియ‌ల్ హెల్త్, లేటెస్ట్ టెక్నాల‌జీల వాడ‌కం, మంచి కీర్తి ప్ర‌తిష్ట‌లున్న కంపెనీగా అమెజాన్ అత్య‌ధిక స్కోర్‌ను సంపాదించుకుంది. స‌త్య‌నాదేళ్ల సిఇఓగా వున్న మైక్రోసాఫ్ట్ ఇండియా ర‌న్న‌ర్ అప్ గా నిలిచింది. సోనీ కంపెనీకి ఇండియా, ఆసియాలోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా అద్భుత‌మైన బ్రాండ్ వాల్యూను స్వంతం చేసుకుంది. టెక్నాల‌జీ, గృహోప‌క‌ర‌ణాలతో పాటు ఎంట‌ర్ టైన్ మెంట్ రంగంలో త‌న‌దైన పాత్ర నిర్వ‌హిస్తోంది. మెర్సిడెస్ బెంజ్ కంపెనీ 4వ స్థానం సాధించ‌గా, ఐటీ బేస్డ్ ఐబీఎం 5వ స్థానంలో ఉండ‌గా క‌న్‌స్ట్ర‌క్ష‌న్ రంగంలో ప్ర‌థ‌మ స్థానంలో ఉన్న ఎల్ అండ్ టీ 6వ స్థానం పొందింది. నెస్లే కంపెనీ 7వ స్థానం , ఇన్ఫోసిస్ కంపెనీ 8వ స్థానంలో ఉండ‌గా సౌత్ కొరియాకు చెందిన శాంసం...

భ‌ళిరా బంగ్లాదేశ్..త‌ల‌వంచిన విండీస్ - భారీ టార్గెట్ ఛేజ్

చిత్రం
ప‌సి కూన‌లు పులులు అయ్యాయి. త‌మ ప్ర‌తాపాన్ని చూపించారు. క‌లిసి పోరాడితే విజ‌యం ఎందుకు రాదో చేసి చూపించారు బంగ్లాదేశ్ క్రికెట‌ర్లు. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా వెస్టిండీస్ జ‌ట్టుతో జ‌రిగిన హోరాహోరీ మ్యాచ్‌లో బంగ్లా త‌న ప‌వ‌ర్ ఏమిటో చూపించింది. ఇరు జ‌ట్లు స‌మ వుజ్జీలే. అండ‌ర్ డాగ్స్ గా ట్రీట్ చేసిన ఇత‌ర జ‌ట్ల‌కు తాము పిల్లులు కామంటూ..పులులమంటూ నిరూపించారు. వాట్ ఏ మ్యాచ్ ..వాట్ ఏ విక్ట‌రీ. ఎదురుగా కొండంత ల‌క్ష్యాన్ని వెస్టిండీస్ నిర్దేశించింది. క‌రేబియ‌న్ ఫేస‌ర్లు పేస్, బౌన్స్, షార్ట్, స్వింగ్‌ల‌తో విరుచుప‌డితే..బంతులు రాకెట్ కంటే వేగంగా వ‌స్తుంటే ..ఎంత ప‌వ‌ర్ ఫుల్ బ్యాట్స్‌మెన్స్ అయినా జ‌డుసు కోవాల్సిందే. కానీ బంగ్లా కూన‌లు అధైర్య ప‌డ‌లేదు. చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌తి బంతిని ఎదుర్కొన్నారు. టార్గెట్ ను ఛేదించేందుకు ట్రై చేశారు. కాక‌లు తీరిన విండీస్ బౌల‌ర్ల భ‌రతం ప‌ట్టారు బంగ్లా క్రికెట‌ర్లు. 22 గజాల పిచ్ పై బంతి రాకెట్ లా వ‌స్తున్నా త‌డుము కోలేదు. నిర్దాక్షిణ్యంగా దాడికి దిగారు. సంయ‌మ‌నం పాటిస్తూ..సీనియ‌ర్ ప్లేయ‌ర్ షీబ‌ల్ 99 బంతుల్లో 16 ఫోర్ల‌తో 12...