పోస్ట్‌లు

ఏప్రిల్ 13, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

మొబైల్ మార్కెట్లో మనోడే దిగ్గజం

చిత్రం
ప్రపంచ వ్యాపార రంగంలో భారతీయులు టాప్ పొజిషన్ లో వుంటున్నారు . ఇప్పటికే మొబైల్ తయారీ మార్కెట్ లో చైనా అందనంత దూరంలో ఉన్నది . ఇతర దేశాలకు దిమ్మ తిరిగేలా షాక్ లు ఇస్తూ కోలుకోలేకుండా చేస్తోంది . ఓ వైపు ఆపిల్ ఇంకో వైపు సాంసంగ్ మొబైల్స్ కు పోటీగా చైనా మొబైల్స్ ఇండియన్ మార్కెట్ ను ఆక్రమించేశాయి . దీంతో చైనాను నిలువరించేందుకు భారతీయ స్మార్ట్ ఫోన్ల తయారీదారులు నానా తంటాలు పడుతున్నారు . మైక్రో మాక్స్ , ఇంటెక్స్ ..తదితర కంపెనీలు మార్కెట్లో ఉన్నా ఆశించినంత అమ్మకాలు సాగడం లేదు . చైనా మొబైల్స్ కంపెనీలలో వివో ..ఒప్పో తో పాటు రెడ్ మీ స్మార్ట్ ఫోన్లు రికార్డ్ స్థాయిలో అమ్ముడవుతున్నాయి. తయారీలోనూ ..సెల్ఫీ క్లారిటీ ,,బ్యాటరీ ..ఎక్కువ ఫీచర్స్ ..ఉండడంతో ఈ మొబైల్స్ ను యూత్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు . దీంతో ఊహించని రీతిలో చైనా మొబైల్స్ కంపెనీలకు లెక్కించంలేనంత ఆదాయాం సమకూరుతోంది . ఓ వైపు వివో కంపెనీ ఏకంగా అత్యంత ఖరీదైన టోర్నమెంట్ ఐపిల్ టోర్నీని స్పాన్సర్ చేస్తోంది . దీనిపైనే ఏకంగా ఈ కంపెనీ కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. భారతీయ వ్యాపార రంగంలో తమ వాటాను కలిగి ఉన్న విదేశీ కంపెనీలకు కోలు...

హమ్మయ్య ..గెలిచారు ..నిలిచారు..!

చిత్రం
ఐపీఎల్ టోర్నమెంట్ లో ఎట్టకేలకు ఇండియన్ క్రికెట్ సారధి విరాట్ కోహ్లీ నేతృత్వంలోని బెంగుళూరు చాలెంజర్స్ జట్టు బోణీ చేసింది . పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది . ఏకంగా ఆరు మ్యాచుల్లో ఓటమి పాలై క్రికెట్ ఫాన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కున్న కోహ్లీ సేన సునాయాసంగా గెలుపు సాధించింది . కెప్టెన్ కోహ్లీ తో పాటు డివిలియర్స్ అద్భుత ప్రదర్శన ప్రదర్శించారు . అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో అత్యుత్తమమైన పనితీరు కనబరిచారు . వరుస ఓటములతో డీలా పడిన కోహ్లీ జట్టు మెరుగైన ఆట ఆడింది . మిగతా జట్లన్నీ గెలుస్తూ పాయింట్ల పట్టికలో ముందు వరుసలో చేరిపోతుంటే కోహ్లీ ఒక్కడే ఒంటరిగా మిగిలి పోయాడు . ఐపీఎల్ లో విజయం కోసం నానా తంటాలు పడ్డాడు . ఎటు చూకిస్నా విమర్శలే . కోహ్లీని తప్పించాలని క్రికెట్ ఫాన్స్ డిమాండ్ చేశారు . ఐపీఎల్ లో జట్టును గెలిపించలేని కెప్టెన్ ఇక ఇండియా జట్టును గెలిపిస్తాడని ..తక్షణమే మార్చాలంటూ నెటిజన్లు .. అభిమానులు డిమాండ్ చేశారు . దీంతో కోహ్లీ ఆట మైదానంలో తీవ్ర అసహనానికి గురయ్యాడు . ఎట్టకేలకు విజయం సాధించడంతో కోహ్లీ మోములో నవ్వు మెరిసింది . ఇక ఆట...

రాజస్థాన్ రాయల్ విక్టరీ - బట్లర్ భారీ స్కోర్

చిత్రం
ఐపీఎల్ టోర్నమెంట్ లో రాజస్థాన్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది . స్వంత గడ్డపై ముంబై వాంఖేడ్ మైదానంలో ఫాన్స్ మద్దతు ఉన్న ముంబై జట్టును రాజస్థాన్ ఓడించింది . ఆరు వికెట్లను కోల్పోయి 188 పరుగుల టార్గెట్ ను ఈజీగా ఛేదించింది . మొదట రహానే ఆరు ఫోర్లు ఒక సిక్స్ తో 37 పరుగులు చేయగా ..జొస్ బట్లర్ చెలరేగి ఆడాడు . రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు . ఏకంగా కేవలం 43 బంతులు మాత్రమే ఆడిన బట్లర్ ఎనిమిది ఫోర్లు ..ఏడు సిక్సర్లతో 89 పరుగులు చేశాడు . వీరిద్దరూ మంచి శుభారంభం అందించారు . మైదానంలో బట్లర్ చెలరేగి ఆడుతూ ఉంటే ముంబై బౌలర్లు ఏమీ చేయలేక చతికిల పడ్డారు . ఆ తర్వాత వచ్చిన ఇండియన్ స్టార్ క్రికెటర్ సంజూ సాంసన్ 31 పరుగులు చేయడంతో సునాయాసంగా విజయం లభించింది. శాంసన్ అవుట్ కావడం ..త్వరత్వరగా రాజస్థాన్ వికెట్లు కోల్పోవడంతో గెలుస్తుందో లేదోనన్న ఉత్కంఠ నెలకొన్నది . ఈ సమయంలో రంగంలోకి దిగిన చివర్లో శ్రేయాస్‌ గోపాల్‌(13) ధాటిగా ఆడి ముంబయిని ఓడించాడు. ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు . అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు విక...

అంతటా శ్రీమన్నారాయణ ..స్వామి కృప కోసం నిరీక్షణ

చిత్రం
ఏపీలో ఏమో కానీ తెలంగాణ రాష్ట్రంలో వింత పరిస్థితి నెలకొంది . ఉద్యోగులు ..నిరుద్యోగులు తీవ్ర వత్తిళ్లకు లోనవుతున్నారు . భారీ ఎత్తున వేతనాలు ఉన్నా ఎక్కువగా అక్రమాలకు పాల్పడటం ..అవినీతి నిరోధక శాఖకు పట్టుబడటం ..అందులో రెవెన్యూ శాఖకే చెందిన ఉద్యోగులు ఉండడంతో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ శాఖాను ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు . ఈ విషయాన్ని లోక్ సభ ఎన్నికల సందర్బంగా తెలంగాణాలో జరిగిన సమావేశాల్లో స్పష్టం చేశారు . రెండు నెలలు ఓపిక పట్టండి ..నన్ను నమ్మండి ..అందరికి ఆమోదయోగ్యమైన కొత్తగా రెవెన్యూ చట్టాన్ని తీసుకు వస్తున్నామని వెల్లడించారు . ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూములకు సంబంధించిన అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు గాను ధరణిని రూపొందిస్తున్నామని చెప్పారు . ఎన్నికల సభ సందర్బంగా ఓ రైతు తాను ఎలా రెవెన్యూ అధికారుల నుండి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో సీఎం కు ఫిర్యాదు చేశారు . ఈ విషయంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు . తాము లేకపోతే ప్రభుత్వం నడవదని..పరిపాలన అంతా తమ చేతుల్లో ఉంటుందని ..నిన్నటి దాకా అటు పాలకులకు ..ఇటు ప్రజలకు చుక్కలు చూపించిన రెవెన్యూ శాఖకు కోలుకోలేని షాక్ ఇచ్చారు...

ఐఐటీ కాలేజీల్లో టాప్ మద్రాస్ - ఎనిమిదో స్థానంలో హైదరాబాద్

చిత్రం
ఇండియాలో విద్యార్థుల జీవితకాలపు కల ఐఐటీ సీట్ సాధించాలని . ప్రపంచంలోనే ఇంజనీరింగ్ ..మేనేజ్ మెంట్ రంగాలలో అత్యున్నతమైన భోదన కలిగిన విద్యాలయాలుగా భారత్ లోని ఐఐటీలు పేరొందాయి. ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఈ కాలేజీల్లో సీట్ కోసం పోటీ పడతారు . హాజరు లక్షల్లో వుంటే సీట్లు మాత్రం అతి తక్కువగా ఉంటాయి . ఇందులో సీట్ కన్ ఫర్మ్ అయితే చాలు సమాజంలో ఎక్కడలేనంత గౌరవం . హోదా ..జీతం ..ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఛాన్స్ దొరుకుతుంది . ఇందులో సీట్ దక్కించు కోవడం ఒక ఎత్తు అయితే ఆయా పేరొందిన ఐటీ కంపెనీల్లో ప్లేస్ మెంట్ అందుకోవడం ఓ స్టేటస్ . ఒక్కోసారి ఐటి దిగ్గజాలు కోట్లాది రూపాయలు ఆఫర్ చేస్తాయి . అది ఆయా విద్యార్థుల అదృష్టం మీద ఆధార పడి ఉంటుంది . ప్రతి ఏటా ఇండియాలో ఇంజనీరుగా కాలేజీలు ..యూనివర్సిటీలు ..వాటి భోధన ..వసతుల కల్పన ..ఉపాధి ..తదితర వాటిపై రాంక్ లు ఇస్తాయి . 2019 -2020 సంవత్సరానికి వస్తే దేశంలో ఇంజనీరింగ్ విభాగంలో అత్యుత్తమమైన కాలేజీలను ..ఐఐటీలను ప్రకటించారు . ఈసారి ఊహించని రీతిలో టాప్ పొజిషన్ లోకి వచ్చి చేరాయి ఐఐఐటీలు . మొదటి 10 స్థానాలు ప్రకటించగా అందులో మొదటి స్థానంలో చెన్నై ఐఐటీ ...

ఊరుమ్మడి ఉత్సవం ..సీతారాముల కళ్యాణం

చిత్రం
తెలుగు వారి లోగిళ్లన్నీ ఇప్పుడు కళ్యాణ కాంతులతో కళకళ లాడుతున్నాయి . రేపే అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణోత్సవాలకు సిద్ధమవుతున్నాయి . పల్లెలు ..పట్టణాలు అన్నీ ముస్తాబవుతున్నాయి. ప్రతి ఇంటా రామాయణం ..పారాయణం నిత్యం జరుగుతోంది . ఊళ్లన్నీ ఇప్పుడు ఒకే స్వరాన్ని వినిపిస్తున్నాయి . పిల్లలు ..పెద్దలు ..మహిళలు ..ఊరి జనం మూకుమ్మడిగా ఒకే చోటకు చేరుకొని చేసే ఊరుమ్మడి వసుధైక పండుగ రాములోరి కళ్యాణం . ప్రతి ఇంట్లో శ్రీరాముడిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది . రాముడికి హనుమంతుడి తోడు ఉండటం ..ఆ అద్భుత గాధను ప్రజలకు తెలియ చెప్పడం . దేవాలయాలను సుందరంగా తీర్చి దిద్దడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములవుతారు . ప్రతి ఊరులో గుడి ఉంటుంది . అందులో తప్పక ఆంజనేయ స్వామి ఆలయం ఉండాల్సిందే . ఊరంతా పోగవుతారు కళ్యాణం జెరిగే కంటే ముందే భారీ ఎత్తున సీతను ..రాముడిని జనం ఊరి పెద్దల సహాయంతో అలంకరించడం చేస్తారు . ప్రభుత్వం లాంఛనంగా పట్టు వస్తారాలను .తలంబ్రాలను ..తాంబూలాలు ..మంగళ సూత్రాలను భద్రాచలం లోని ఆ భద్రాద్రిలో కొలువై వున్న స్వామి అమ్మవార్లకు బహుకరిస్తారు . తరాల నుంచి ఇలా అందచేయడం వస్తూనే ఉన్నది. ఈ దేశంలో గణపతి ఉత్స...